1/23
హైదరాబాద్: మహా నగరంలోనే ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందిన హుస్సేన్సాగర్ తీరంలో మరో అందమైన పార్కు రూపుదిద్దుకుంది.
2/23
ఒకవైపు అమరుల స్మారకం, మరోవైపు శ్వేతసౌధాన్ని తలపించే సచివాలయం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
3/23
హుస్సేన్సాగర్ సుందరీకరణలో భాగంగా జలవిహార్ సమీపంలో 10 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.26.65 కోట్లతో హెచ్ఎండీఏ లేక్వ్యూ పార్కును అభివృద్ధి చేసింది. త్వరలోనే దీనిని ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్)లో వెల్లడించారు.
4/23
ఈ పార్కులో ఎలివేటెడ్ వాక్వేస్ను ఏర్పాటు చేశారు. ఈ వాక్వేలపై నడుస్తుంటే హుస్సేన్సాగర్ జలాశయంలో నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. ఒక్కొక్కటి 110 మీటర్ల చొప్పున 4 ఎలివేటెడ్ వాక్వేలు ఉన్నాయి. పార్కులో అన్ని వైపులా వెళ్లేలా వాక్వేలను ఏర్పాటు చేశారు.
5/23
అద్భుతమైన ఆర్కిటెక్చర్తో అభివృద్ధి చేసిన ఈ పార్కులో పెవిలియన్స్, పంచతత్వ వాక్వే, సెంట్రల్ పాత్వే, అండర్ పాస్లు ఉన్నాయి. జలాశయంపై 15 మీటర్ల పొడవైన డెక్ ఉంటుంది.
6/23
లేక్వ్యూ పార్కును పచ్చదనం ఉట్టిపడేలా అందమైన ల్యాండ్స్కేప్తో అభివృద్ధి చేశారు. ఆర్కిటెక్ డిౖజైన్లలో సుమారు 4 లక్షల మొక్కలను నాటినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. 25 ఏళ్ల వయసున్న 22 చెట్లను ఈ పార్కులో విజయవంతంగా ట్రాన్స్లొకేట్ చేశారు. మరో 40 అరుదైన మొక్కలను నాటారు.
7/23
పార్కు అభివృద్ధి కోసం రూ.22 కోట్లు ఖర్చు కాగా, ల్యాండ్స్కేప్, ఎలక్ట్రికల్ వర్క్స్ కోసం మరో రూ.4.65 కోట్లు వెచ్చించినట్లు అధికారులు తెలిపారు.
8/23
లేక్వ్యూపార్కు ఉదయం 5.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. పిల్లలకు రూ.10, పెద్దలకు రూ.50 చొప్పున ప్రవేశ రుసుం. వాకర్స్ నెలకు రూ.100 చొప్పున చెల్లించాలి.
9/23
10/23
11/23
12/23
13/23
14/23
15/23
16/23
17/23
18/23
19/23
20/23
21/23
22/23
23/23