Top Stories
ప్రధాన వార్తలు
ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
దివంగత సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబాన్ని చూసి అధికార పార్టీ బీజేపీ భయపడుతోందని సమాజ్వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్ అన్నారు. బీజేపీ నేతలు ఎస్పీకి వ్యతిరేకంగా ఎంత ఎక్కువ మాట్లాడితే.. లోక్సభ ఎన్నికల్లో విజయం అదే స్థాయిలో ఉంటుందని తెలిపారు.సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తరుణంలో శివపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. మూడో దశ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని మొత్తం 10 స్థానాల్లో ఎస్పీ, ఇండియా కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.యూపీలో మొదటి రెండు దశల్లో జరిగిన లోక్సభ ఎన్నికలలో పేలవమైన ఓటింగ్పై శివపాల్ యాదవ్ మాట్లాడుతూ.. మా ఓటర్లు కూలీలు, రైతులు. వారు, ఎండని వేడిని పట్టించుకోరు. ఓటర్లు వారి ఓటు హక్కును ఉపయోగిస్తున్నారు. కానీ బీజేపీ ఓటర్లు బయటకు రావడం లేదు. అందుకే బీజేపీ నేతల్లో ఆందోళన నెలకొందని అన్నారు. శివపాల్ యాదవ్కు వృద్ధాప్యం వచ్చిందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ నేత శివపాల్ యాదవ్ స్పందించారు. నేను రోజుకు 40 సమావేశాలు నిర్వహిస్తున్నాను. యోగి మాత్రం రోజుకు నాలుగైదు సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారని తెలిపారు.యూపీలో 10లోక్సభ స్థానాలకు మే 7న మూడో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మెయిన్పురి, ఫిరోజాబాద్, సంభాల్, బుదౌన్ స్థానాలు ఉన్నాయి. ఈ దశలో ఓటింగ్కు వెళ్లే చాలా స్థానాలను ఎస్పీ కంచుకోటలుగా కొనసాగుతున్నాయి.
అదుపుతప్పిన అమిత్ షా హెలికాప్టర్.. నేలను తాకబోయి...
పాట్నా: కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్షాకు పెద్ద ప్రమాదం తప్పింది. షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా అదుపుతప్పి నియంత్రణ కోల్పోయింది. బిహార్లోని బెగుసరాయ్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లినపుడు సోమవారం(ఏప్రిల్29) ఈ ఘటన జరిగింది.ప్రచారం ముగించుకుని అమిత్ షా హెలికాప్టర్ ఎక్కారు. హెలికాప్టర్ గాల్లోకి లేచే సమయంలో ఊగిసలాడి కుడివైపుకు వెళ్లింది. ఒక దశలో కిందకు వచ్చి నేలను తాకే దాకా వెళ్లింది. ఇంతలో అప్రమత్తమైన హెలికాప్టర్ను పైలట్ నియంత్రణలోకి తీసుకోవడంతో సరైన దిశలో ప్రయాణించింది. ఈ దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.— Dr. Abhishek Verma (@AbhishekVermaX) April 29, 2024
కుల్దీప్ యాదవ్ ఫైటింగ్ నాక్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2024లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్ల దాటికి ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఆఖరిలో స్పిన్నర్ కుల్దీప్ కీలక ఇన్నింగ్స్ ఆడడటంతో ఢిల్లీ.. 150 ప్లస్ మార్క్ను దాటగల్గింది. 26 బంతులు ఎదుర్కొన్న కుల్దీప్.. 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 35 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఢిల్లీ ఇన్నింగ్స్లో కుల్దీప్దే టాప్ స్కోర్ కావడం విశేషం. కెప్టెన్ పంత్ రిషబ్ పంత్ 27 పరుగులతో పర్వాలేదన్పించాడు.ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో చెలరేగగా.. వైభవ్ ఆరోరా, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు స్టార్క్, నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా కేకేఆర్ బౌలర్లు ఎక్స్ట్రాస్ రూపంలో ఏకంగా 13 పరుగులు సమర్పించుకున్నారు.
సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 30వ తేదీన(మంగళవారం) మూడు నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొంటారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. సీఎం జగన్ రేపు(మంగళవారం) పాల్గొనే ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ను విడుదల చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరుధిలో కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు నియోజకవర్గంలో మైదుకూరు 4 రోడ్ల జంక్షన్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు.
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఐపీఎల్-2024లో కోల్కతా నైట్రైడర్స్ మరో అద్భుత విజయం సాధించింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయభేరి మోగించింది.154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కేవలం 3 వికెట్లు కోల్పోయి 16.3 ఓవర్లలోనే చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్లతో 68 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(33), వెంకటేశ్ అయ్యర్(26) నాటౌట్గా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టగా.. విలియమ్స్ఒక్క వికెట్ సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో టెయిలాండర్ కుల్దీప్ యాదవ్(35) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో చెలరేగగా.. వైభవ్ ఆరోరా, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు స్టార్క్, నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా కేకేఆర్ బౌలర్లు ఎక్స్ట్రాస్ రూపంలో ఏకంగా 13 పరుగులు సమర్పించుకున్నారు.
అజిత్కి జోడీగా...
కోలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా నిలిచిన వార్తల్లో అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సిమ్రాన్, మీనా పేర్లు వినిపిస్తున్నాయి.ఈ ఇద్దరూ అతిథి పాత్రల్లో కాదు.. అజిత్ సరసన హీరోయిన్లుగా నటిస్తారని టాక్. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో అజిత్ మూడు పాత్రల్లో కనిపిస్తారట. మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, శ్రీలీల, సిమ్రాన్, మీనాతో అజిత్ జతకడతారని చెన్నై కోడంబాక్కమ్ అంటోంది. ఈ వార్త నిజమైతే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సిమ్రాన్, మీనా అజిత్తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది. ‘అవళ్ వరువాళా (1998), వాలి’ (1999) వంటి విజయవంతమైన చిత్రాల్లో అజిత్ సరసన నటించారు సిమ్రాన్.అలాగే అజిత్కి జోడీగా ‘సిటిజెన్ (2001), విలన్’ (2002) వంటి చిత్రాల్లో నటించారు మీనా. ఇప్పుడు మళ్లీ ఈ హీరో సరసన సిమ్రాన్, మీనా నటిస్తే దాదాపు రెండు దశాబ్దాలకు ఈ కాంబినేషన్ కుదిరినట్లు అవుతుంది. మేలో ఈ చిత్రం షూటింగ్ని ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. సో... అజిత్ సరసన శ్రీలీల, సిమ్రాన్, మీనా నటించనున్నారా? అనేది త్వరలో తెలిసి΄ోతుంది. మహేశ్బాబు సినిమాలో...మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు సిమ్రాన్ని ఎంపిక చేశారని సమాచారం. గతంలో ‘యువరాజు’ (2000) చిత్రంలో మహేశ్బాబు–సిమ్రాన్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. అయితే హీరో–హీరోయిన్గా కాదని, సిమ్రాన్ది అతిథి పాత్ర అని భోగట్టా. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను రాజమౌళి ప్రకటించనున్నారట. మరి.. సిమ్రాన్ ఈప్రాజెక్ట్లో ఉన్నారా? లేదా అనే ప్రశ్నకు అప్పుడు సమాధానం దొరుకుతుంది.
ఎండుతున్న జలకళ
అనుకున్నంతా అయింది. విశ్లేషకులు భయపడుతున్నట్టే జరిగింది. మొన్న మార్చిలోనే దేశంలోని ప్రధాన జలాశయాలన్నీ అయిదేళ్ళలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి అడుగంటినట్టు వార్తలు వచ్చి నప్పుడు వేసవిలో ఇంకెంత గడ్డుగా ఉంటుందో అని భయపడ్డారు. సరిగ్గా అప్పుడనుకున్నట్టే ఇప్పుడు దేశం నీటికొరత సంక్షోభంలోకి జారిపోతోంది. ఏప్రిల్ 25 నాటికి దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటిమట్టం ఆందోళనకర స్థాయికి పడిపోయినట్టు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా లెక్కలు వెల్లడించాయి. ముఖ్యంగా, దక్షిణాదిలో పదేళ్ళలో ఎప్పుడూ లేనంత కనిష్ఠస్థాయికి జలాశ యాల్లో నీటి నిల్వలు పడిపోయాయి. సాగునీటికీ, తాగునీటికీ, జలవిద్యుత్ ఉత్పత్తికీ తిప్పలు తప్పేలా లేవు. ఆ సవాళ్ళకు సంసిద్ధం కావాల్సిన అవసరాన్ని గణాంకాలు గుర్తు చేస్తున్నాయి.దేశం మొత్తం మీద రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యంలో కేవలం 30 శాతం వరకే ప్రస్తుతం నీళ్ళున్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇది గత ఏడాది కన్నా తక్కువ. అందుకే ఇప్పుడింతగా ఆందోళన. వర్షాకాలంలో 2018 తర్వాత అతి తక్కువ వర్షాలు పడింది గత ఏడాదే. దానికి తోడు ఎల్నినో వాతావరణ పరిస్థితి వల్ల గత వందేళ్ళ పైచిలుకులో ఎన్నడూ లేనంతగా నిరుడు ఆగస్టు గడిచి పోయింది. వర్షాలు కురిసినా, కొన్నిచోట్ల అతివృష్టి, మరికొన్నిచోట్ల అనావృష్టి. ఇవన్నీ కలిసి దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. దీర్ఘకాలంగా వర్షాలు కొరవడడంతో నీటి నిల్వలు తగ్గి, అనేక ప్రాంతాలు గొంతు తడుపుకొనేందుకు నోళ్ళు తెరుస్తున్నాయి. హెచ్చిన ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాడ్పులు సైతం నీటిమట్టాలు వేగంగా పడిపోవడానికి కారణమయ్యాయి. దేశంలో తూర్పు ప్రాంతంలోని అస్సామ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో నీటి నిల్వలు కొంత మెరుగ్గా ఉన్నాయి కానీ, మిగతా ప్రాంతాల్లో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ప్రధానంగా తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో ఈ ప్రభావం అమితంగా కనిపిస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు తెలుగు రాష్ట్రాలకూ తిప్పలు తప్పడం లేదు. దక్షిణాదిలో దాదాపు 42 జలాశయాలను సీడబ్ల్యూసీ పర్యవేక్షిస్తుంటుంది. గత ఏడాది ఇదే సమయానికి వాటిలో 29 శాతం దాకా నీళ్ళున్నాయి. దశాబ్ద కాలపు సగటు గమనిస్తే, ఈ సమయానికి కనీసం 23 శాతమన్నా నీళ్ళుండేవి. కానీ, ఈ ఏడాది కేవలం 17 శాతానికి తగ్గిపోయాయి. దాన్నిబట్టి ప్రస్తుత గడ్డు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గుజరాత్, మహారాష్ట్రలున్న పశ్చిమ భారతావనిలోనూ అదే పరిస్థితి. అక్కడ సీడబ్ల్యూసీ పర్యవేక్షించే 49 రిజర్వాయర్లలో పదేళ్ళ సగటు 32.1 శాతం కాగా, నిరుడు నీటినిల్వలు 38 శాతం ఉండేవి. కానీ, ఈసారి అది 31.7 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది మధ్య, ఉత్తర భారతావనుల్లోనూ జలాశయాల్లో నీళ్ళు అంతంత మాత్రమే. అక్కడ చారిత్రక సగటు నిల్వలతో పోలిస్తే, ఈసారి బాగా తక్కువగా ఉన్నాయట. మొత్తం మీద దేశంలోని ప్రధాన నదీపరివాహక ప్రాంతాల రీత్యా చూస్తే... నర్మద, బ్రహ్మపుత్ర, తాపీ నదీపరివాహక ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం సాధారణ నిల్వస్థాయుల కన్నా మెరుగ్గా ఉంది. అయితే, కావేరీ నదీ పరివాహక ప్రాంతం, అలాగే మహానది, పెన్నా నదులకు మధ్యన తూర్పు దిశగా ప్రవహించే పలు నదీ క్షేత్రాలు తీవ్రమైన లోటును ఎదుర్కొంటున్నాయి. ఎండలు ముదిరి, వేసవి తీవ్రత హెచ్చనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత గడ్డుగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ఇవన్నీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. బెంగళూరు కొద్ది వారాలుగా తీవ్ర నీటి ఎద్దడి సమస్యలో కూరుకుపోయింది. విషయం జాతీయ వార్తగా పరిణమించింది. ఇక, తమిళనాట పలు ప్రాంతాల్లో నెర్రెలు విచ్చిన భూములు, ఎండిన జలాశయాలు, తాగునీటి కొరతతో బిందెడు నీళ్ళ కోసం ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతున్న దృశ్యాలు ప్రత్యక్షమవుతున్నాయి. సహజంగానే నిత్యజీవితంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలనూ ఈ నీటి నిల్వల కొరత బాధిస్తోంది. తగిన నీటి వసతి లేక వివిధ రకాల పంటలు, తోటలు దెబ్బతింటున్నాయి. ఇవాళ్టికీ భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం కీలకం. జలాశయాల్లో తగ్గిన నీటితో అది పెను సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఇప్పటికీ మన దేశంలోని సేద్యపు భూముల్లో దాదాపు సగం వర్షపు నీటిపైనే ఆధారపడ్డాయి. రానున్న వర్షాకాలంలో సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదవుతుందని అంచనా వెలువడింది. ఫలితంగా, ఋతుపవనాలు ఇప్పుడున్న చిక్కులను తొలగిస్తాయన్నది ఆశ. నిజానికి, దేశంలో జలవిద్యుదుత్పత్తి సైతం తగ్గుతూ వస్తోంది. విద్యుచ్ఛక్తి గిరాకీ విపరీతంగా ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో హైడ్రోపవర్ జనరేషన్ 17 శాతం పడిపోయింది. ఆ మాటకొస్తే, తగ్గుతున్న జలాశయాల నిల్వలు, పెరుగుతున్న ప్రజల నీటి అవసరాల రీత్యా గత కొన్ని దశాబ్దాలుగా ఆసియాలో, ప్రధానంగా చైనా, భారత్లలో జలవిద్యుదుత్పత్తి తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో జలసంరక్షణ కీలకం. ప్రభుత్వాలు, పాలకులు తక్షణం స్పందించి, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కష్టం. గృహవినియోగం మొదలు వ్యవసాయ పద్ధతులు, పారిశ్రామిక కార్యకలాపాల దాకా అన్ని స్థాయుల్లోనూ నీటి వృథాను తగ్గించి, ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టుకోవడం ముఖ్యం. నీటి నిల్వ, పంపిణీలు సమర్థంగా సాగేలా చూడాలి. సుస్థిర వ్యవసాయ విధానాలు, పంటల వైవి ధ్యంతో నీటి వినియోగాన్ని తగ్గించాలి. ఎప్పుడైనా వర్షాలు లేక, దుర్భిక్షం నెలకొన్నా తట్టుకొనే సామర్థ్యం పెంపొందించుకోవాలి. నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత నుంచి వర్షపునీటి నిల్వల దాకా అన్నిటిపై ప్రజా చైతన్యం కలిగించాలి. గడ్డుకాలం కొనసాగితే, భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సత్వరమే మేలుకోవాలి.
పశ్చిమాసియా ఘర్షణ ఆర్థికానికి చేటే!
భారీ ఆర్థిక వ్యవస్థల కంటే భారత్ మెరుగైన వృద్ధి రేటు నమోదు చేయగల సమయంలో ఇరాన్ , ఇజ్రాయెల్ల మధ్య ఘర్షణ మొదలైంది. గల్ఫ్ ముడిచమురుపై భారత్ ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో రవాణాలో వచ్చే ఇబ్బంది ఏదైనా మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. పైగా యుద్ధం ముదిరితే ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు కొండెక్కుతాయి. అత్యధిక లాభాలనిచ్చే యూరోపియన్ మార్కెట్లకు భారత్ తన సరుకులు రవాణా చేయడం కూడా కష్టమవుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటి అంటే... పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం నుంచి మన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోగలదా అన్నది!పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలు భారత్ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. తీవ్రత, నష్టం ఏమిటన్నవి ఇంకా అంచనా వేయాల్సే ఉన్నా ఈ ఆర్థిక సంవత్సరంలో బాహ్య పరిణామాలు మన ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ముప్పు కాగలవని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఉక్రెయిన్ , రష్యా మధ్య 2022లో యుద్ధం మొదలైన తరువాత పలు దేశాల్లో పరిస్థితులు మారినట్లే పశ్చిమాసియా పరిణామాలు కూడా అంతర్జాతీయంగానే కాకుండా, స్థానికంగానూ కలకలం సృష్టించనున్నాయి. పరిస్థితి సద్దు మణగకుంటే... లేదా మరింత దిగజారితే ఇప్పటికే ఎదురవుతున్న పలు సవాళ్లను తట్టుకోవడం కష్టమని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం ఇక్కడ ప్రస్తావనార్హం. అంతేకాదు... కొన్ని అసందిగ్ధ పరిస్థితులు ఎదు ర్కోవాల్సి రావచ్చు అని కూడా ఆమె సూచనప్రాయంగా తెలిపారు. సప్లై చెయిన్ లో వచ్చే ఇబ్బందుల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశముందని అంటున్నారు కేంద్ర మంత్రి. ఆర్థిక పరిపుష్టి మార్గంలో కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయన్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వ్యాఖ్యలు అర్థం చేసుకోదగ్గవే. ప్రపంచంలోని భారీ ఆర్థిక వ్యవస్థల కంటే భారత్ మెరుగైన వృద్ధి రేటు నమోదు చేయగల సమయంలో ఇరాన్ , ఇజ్రాయెల్ల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ(స్థూల జాతీయోత్పత్తి) 7 శాతం కంటే ఎక్కువ ఉండవచ్చునని ప్రభుత్వం ఉత్సాహంగా ఉన్న వేళ అంతర్జా తీయ సంస్థలు కూడా తమ అంచనాలను సవరించుకుంటున్న విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (అంత ర్జాతీయ ద్రవ్యనిధి – ఐఎంఎఫ్) ఇటీవలే భారత్ జీడీపీ వృద్ధిరేటును 6.5 నుంచి 6.8 శాతానికి సవరించింది. ప్రపంచ బ్యాంకు కూడా 6.4 నుంచి 6.6 శాతానికీ, ‘స్టాండర్డ్ అండ్ పూర్ గ్లోబల్’ 6.4 నుంచి 6.8 శాతానికీ ఈ ఆర్థిక సంవత్సరపు భారత జీడీపీ రేటును సవరించాయి. అయితే ఈ అద్భుతమైన పురోగతిని అంతర్జాతీయ అంశాలు నిరాశా పూరితం చేసే అవకాశం ఉంది. రానున్న వారాల్లో పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితులు ఒక దశ దాటాయంటే మాత్రం ఇప్పటివరకూ హెచ్చరికలు అనుకుంటున్న పలు ఘటనలు వాస్తవం కావచ్చు. ఒకవేళ ఇరాన్ తన హోర్ముజ్ జలసంధి ద్వారా ముడిచమురు, సహజవాయువు రవాణాలను నిలిపివేసిందని అనుకుందాం. పెర్షియన్ , ఒమాన్ గల్ఫ్లను కలిపే ఈ సన్నటి రవాణా మార్గాన్ని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గంగా యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ గుర్తించింది. పర్షియన్ గల్ఫ్ నుంచి రవాణా అయ్యే ముడిచమురులో 80 శాతం ఈ జలసంధి ద్వారానే ఖండాలు మారుతుంది. భారత దేశం కూడా ఈ ప్రాంతపు ముడిచమురుపై ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో రవాణాలో వచ్చే ఇబ్బంది ఏదైనా మనపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. భారత్ ఉపయోగించే ముడిచమురులో 30 శాతం వరకూ రష్యా నుంచే వస్తున్నా మిగిలిన మొత్తం సౌదీ అరేబియా, పశ్చిమాసియా, యూఏఈ వంటి దేశాల నుంచే వస్తూండటం గమనార్హం. హోర్ముజ్ జలసంధి ఎంత కీలకమో దీనిద్వారా అర్థం చేసుకోవచ్చు. రెండో అంశం... పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగితే సూయిజ్ కాలువను కూడా మూసివేసే అవకాశం ఉంది. ఆసియా నుంచి ఎర్ర సముద్రం మీదుగా ఈ కాలువకు వెళ్లే మార్గం బాబ్ ఎల్–మందేబ్ అనే చిన్న కాలువ దగ్గరి నుంచి మొదలవుతుంది. యెమెన్ కేంద్రంగా పనిచేసే హౌతీ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్న ప్రాంతమిదే. వీరంతా హమాస్కు మద్దతుగా ఉన్నవారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రవాణా కొంత ‘కేప్ ఆఫ్ గుడ్హోప్’ (దక్షిణాఫ్రికా) మీదుగా మళ్లింది. ఫలితంగా రవాణ ఖర్చులు పెరిగిపోవడమే కాదు... సమయం కూడా ఎక్కువవుతోంది. పరిస్థితి ముదిరితే అత్య ధిక లాభాలనిచ్చే యూరోపియన్ మార్కెట్లకు భారత్ తన సరుకులు రవాణా చేయడం కష్టమవుతుంది. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఎగుమతులు స్తంభించిపోతే వాణిజ్య ప్రవాహాలు తీవ్రస్థాయిలో ప్రభావితమవుతాయి.మూడో ప్రమాదం ఇంకోటి ఉంది. యుద్ధం ముదిరితే ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు కొండెక్కుతాయి. బారెల్కు 75–80 డాలర్ల అత్యంత తక్కువ శ్రేణి ధరలు ఇప్పటికే లేకుండాపోయాయి. ప్రస్తుతం బ్రెంట్ ముడిచమురు ధరలు 87 నుంచి 89 డాలర్ల మధ్య ఉన్నాయి. ఇప్పటికైతే ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య ఘర్షణ ఈ ధరల మీద పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఇంకొంచెం తీవ్రమైతే అవి పెరగడం ఖాయం.ముడిచమురు ధరలు పెరిగితే ఏమవుతుందో మనందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వ ఖర్చులు పెరిగిపోతాయి. కరెంట్ అకౌంట్పై ఒత్తిడి పెరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు పెట్రోలు, డీజిళ్ల ధరలు పెంచాలని చమురు కంపెనీలు ఇప్పటికే కోరుతూండటం గమనార్హం. ఇది బహుశా ఎన్నికల తరువాతే జరగవచ్చు. అయినా, ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం పడటం ఖాయం. ముడి చమురుకు మనం పెట్టే ఖర్చు మాటెలా ఉన్నా... పశ్చిమాసియా మీద అలుముకున్న యుద్ధమేఘాలు తొలగకపోతే మన వ్యూహా త్మక అవసరాల కోసం స్థిరంగా చమురు అందుబాటులో ఉండటమూ అత్యంత కీలకమే. మన దేశ చమురు అవసరాల్లో 80 శాతం దిగు మతులతోనే తీరుతున్నాయన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి.ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటి అంటే?... పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం నుంచి మన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోగలదా? అన్నది. ప్రస్తుతం మన చేతుల్లో ఏమీ లేదు కానీ... మనకు మిత్రదేశాలే అయిన ఇజ్రాయెల్, ఇరాన్ లకు నిగ్రహం పాటించమని కోరడం మాత్రం చేయదగ్గ పనే. ముడిచమురు విషయానికి వస్తే ఇటీవలి కాలంలో వేర్వేరు మార్గాల ద్వారా కొను గోలు చేయడం కొంచెం ఎక్కువైంది. అలాగని గల్ఫ్ నుంచి వచ్చే లోటు మొత్తం భర్తీ అవుతుందని కాదు. కానీ ఈ మార్గాల గుండా వచ్చే ఇతర సరుకుల విషయంలో మాత్రం ప్రత్యామ్నాయాలు వెత కడం అసాధ్యం. కానీ ఈ ప్రవాహానికి ఆటంకాలు ఎదురుకావొచ్చు. ఇలాంటి పరిణామాలే ఎదురైతే రానూ పోనూ సరుకుల ఖర్చులు తడిసి మోపెడవుతాయి.ఘర్షణ తాలూకు ఇతర ప్రభావాలను ఇప్పుడే అంచనా వేయ లేము. కానీ ఉదాహరణకు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు వేర్వేరు లోహాల ధరలు అమాంతం పెరిగాయి. సన్ ఫ్లవర్ నూనెలు దొరక్కుండా పోయాయి. ఇలాగే పశ్చిమాసియాలో యుద్ధం లాంటి వాతావరణం ఏదైనా ఏర్పడితే భారత ఆర్థిక వ్యవస్థపై అనూహ్య పరిణామాలు తప్పకుండా ఉంటాయి. నిజానికి ప్రపంచీకరణ నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం ఏ దేశానికీ సాధ్యం కాదు. అందుకే... పశ్చిమాసియా ప్రాంతంలో అత్యంత త్వరగా శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని మాత్రమే ఎవరైనా కోరుకోగలిగేది!సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
మేమంతా ‘సిద్ధం’ బస్సు యాత్ర ముగింపు సభలో జగన్ మోహన్ రెడ్డి చెప్పిన ఒకమాట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మధ్య తరగతిని ఆలో చనలో పడేసింది. ‘ఈ సభ నుంచి మీరు మీ ఇళ్ళకు వెళ్ళాక, మీ కుటుంబ సభ్యులు అందరూ: పిల్లలూ, అవ్వా తాతలతో సహా కలిసి కూర్చుని ఎవరికి ఓటు వేయాలో చర్చించుకోండి...’ అన్నారు. ఈ మాట విన్నాక, ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడ్డారు. ఇన్నాళ్ళూ ‘నా వల్ల మేలు జరిగితే నాకు ఓటు వేయండి’ అని చెప్పిన సీఎం, ఇప్పుడు అదే మాటను మీ కుటుంబంలో అందరూ ఒక మాట అనుకొని ఒక నిర్ణయానికి రండి, అని దీన్ని ఒక ‘హోమ్లీ ఎఫైర్’గా మార్చారు. ఓటర్లు పోలింగ్ బూత్ లోకి వెళ్ళడానికి ఇంకా మూడు వారాలు సమయం ఉండగా ఆయన ఇటువంటి కొత్త పనిని వాళ్లకు అప్పగించారు. వినడానికి ఇది సాదాసీదాగా ఉన్నప్పటికీ, ‘పిల్లలూ, అవ్వాతాతలతో సహా కలిసి కూర్చుని...’ అని అనడం ద్వారా జగన్ దీన్ని ఒక ఇంట్లో మూడు తరాలు కలిసి కూర్చుని చేసే నిర్ణయంగా మార్చారు. జగన్ చెప్పాడు– ‘కొన్ని కొంచెం మాత్రం పెంచి ఇంతకు ముందు ఇచ్చినవన్నీ మళ్ళీ ఇస్తాడంట...’ అనేది వారి చర్చలో కీలకం అవుతుంది. అయితే వారి ‘నిర్ణయం’ ఏమిటి? అనే విషయం వద్దకు వచ్చేసరికి మూడు తరాల్లో కూడా యువతరం (ఎమర్జింగ్ జెనరేషన్) ఏమనుకుంటున్నది అనేది ప్రధానం అవుతున్నది. ఏప్రిల్ చివరి వారంలో వైఎస్సార్సీపీకి ఉన్న అదృశ్యశక్తి ఏమిటో విశాఖ జిల్లా భీమిలి ‘సోషల్ మీడియా వారియర్స్’ సదస్సులో దృశ్యమానం అయింది. ఇన్నాళ్ళూ జగన్ కోసం స్వచ్ఛందంగా పనిచేసిన అదృశ్య ‘కేడర్’ ఇది. స్వచ్ఛందంగా ‘సోషల్ మీడియా వారియర్స్’ ఈ పార్టీని ఇలా ‘ఓన్’ చేసుకోవడానికి మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి– తమ సామాజిక వర్గాల వారు చిన్నదో పెద్దదో ఏదో ఒక రాజకీయ పద వితో ఈ ప్రభుత్వంలో గుర్తింపును పొందడం. రెండు – సంస్కరణల వల్ల పరిపాలన వ్యవస్థ వారి సమీపానికి రావడం. మూడు – మొదటి ఐదేళ్లలోనే ‘రియాల్టీ’గా కనిపిస్తున్న 2019 ఎన్ని కల వాగ్దానాలు. వీటిని మించి విభజిత ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా రూపాంతర (ట్రాన్స్ ఫార్మింగ్) దశలో ఉన్నప్పుడు, తమ కొత్త రాష్ట్రం ఎలా ఉండాలి? అనే భావన, దాన్ని వాస్తవం చేసే నాయకుడు ఎవరు? ప్రభుత్వం ఏది? అనే విషయంలో యువత ఇప్పుడు పూర్తి స్పష్టతతో ఉంది. ఎన్నికలు అనేసరికి తమ పార్టీల ప్రాధా న్యతల ఎంపికలో ‘కన్ఫ్యూజన్’కు గురి అవు తున్నది ఎవరు? వాటిని నిజాయతీగా అర్థం చేసుకుంటున్నది ఎవరు? అనేది వాళ్లకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఎన్నికల ముందు ‘సీట్ల’ కోసం జరిగిన కొందరి పార్టీల మార్పు, నిరు పేదలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇచ్చే ప్రయత్నాలను పబ్లిగ్గా అవహేళన చేస్తున్న తీరు, వారి దృష్టిని దాటిపోయేవి కాదు. అందుకే, కేవలం పార్టీ పట్ల రాజకీయ అభిమానం ఉంచు కోవవడమే కాకుండా, నాయకుడి పట్ల యువత దాన్ని బహిరంగంగా వ్యక్తం చేసే తీరులో మునుపు ఎన్నడూ మనం చూడని వ్యక్తీకరణ ఒక ‘హై వోల్టేజ్’ దేహభాషగా స్పష్టంగా కనిపిస్తున్నది.ఈ కసి వెనుక ఉన్న కారణాల కోసం చూసి నప్పుడు రెండు ప్రధాన అంశాలు కనిపిస్తాయి. మొదటిది – ప్రభుత్వం నుంచి అందే మేలు ఏదైనా నిర్ణయాధికారం స్థానిక ఆధిపత్య వర్గాల చేతిలో నుంచి ఇప్పుడు అది సాంకేతికం అయింది. ఊళ్ళోని గ్రామ సచివాలయాల సిబ్బంది, ‘వలంటీర్ల’ వద్దకు ‘ఆన్లైన్’లో అది చేరువయింది. దాన్ని ఆక్షేపిస్తూ ఏదో వంకతో ఆ సేవలను ఆపాలనే వర్గాల నైజం కూడా అర్థమైంది. జరుగుతున్న ‘యుద్ధం’లో నిర్లక్ష్యిత, లేదా వర్ధమాన సమాజాల్లోని యువత ఇది తమ నిశ్శబ్ద విజయం అనుకొంటున్నారు.రెండవది – ‘గడచిన ఇరవై ఏళ్లుగా చిన్న‘బ్యాగ్’ భుజాన వేసుకుని కాళ్ళకు చక్రాలు కట్టుకుని, దేశంలో ఎక్కడ పని దొరికితే అక్కడికి జీవిక వెతుక్కుంటూ వెళ్ళాము. ఇక ముందు మాకు ఈ తిరుగుడు తగ్గాలి. దిగువ మధ్య తరగతి, మధ్యతరగతి వర్గాల్లో కుటుంబం అంతా కనీసం సమీపంగా కలిసి జీవించే పరిస్థితి రావాలి’ అనేది వారి ఆకాంక్ష. ఇప్పుడు ఉన్న ఈ– ‘ఫీల్ గుడ్’ వాతావరణంతో పాటుగా, వేగవంతమైన అభివృద్ధి కోసం ఇప్పటికే సిద్ధమైన ‘లాజిస్టిక్స్’, వాటికి తోడుగా విస్తరిస్తున్న మౌలిక వసతుల వల్ల ఇక ముందు ఉపాధి అవకాశాలు ఇక్కడే మెరుగవుతాయని కొత్త పార్టీ ప్రణాళిక చూశాక వాళ్ళు బలంగా నమ్ముతున్నారు.జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
పోరాటాల పురిటి గడ్డగా పేరొందిన పంజాబ్లో ఎన్నికల పోరు ఎప్పుడూ హై ఓల్టేజ్లో ఉంటుంది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)లను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊడ్చిపారేసిన ఆమ్ ఆద్మీ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ దుమ్ము రేపే ప్రయత్నంలో ఉంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భాగస్వాములైన ఆప్, కాంగ్రెస్ పంజాబ్లో మాత్రం విడిగా పోటీ చేస్తూ పరస్పరం తలపడుతుండటం విశేషం. గత లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కొల్లగొట్టిన కాంగ్రెస్ ఈసారీ సత్తా చాటాలని చూస్తోంది. అకాలీ–బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమికి ఆ ఎన్నికల్లో అంతంత ఫలితాలే వచ్చాయి. రైతు ఉద్యమం నేపథ్యంలో బీజేపీకి అకాలీ కటీఫ్తో పంజాబ్లో ఈసారి పారీ్టలన్నీ ఒంటరి పోరాటమే చేస్తున్నాయి... స్టేట్స్కాన్పంజాబ్ ఎన్నికల్లో కొన్నేళ్లుగా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 13 చోట్లా ఒంటరి పోరాటం చేసి ఏకంగా 8 స్థానాలు చేజిక్కించుకుంది. అకాలీదళ్ 10, బీజేపీ మూడు చోట్ల పోటీపడ్డా చెరో రెండు సీట్లతో సరిపెట్టుకున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా 4 సీట్లు కొల్లగొట్టిన కేజ్రీవాల్ పార్టీ అన్నిచోట్లా పోటీ చేసి ఒక్క స్థానానికే పరిమితమైంది. ఆ తర్వాత పంజాబ్లో రాజకీయాలు సమూలంగా మారిపోయాయి. 2020లో మోదీ సర్కారు వ్యవసాయ సంస్కరణ చట్టాలపై వ్యతిరేకంగా పంజాబ్లో వ్యతిరేకత తారస్థాయిలో వ్యక్తమైంది. ఆ దెబ్బకు 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్ కుదేలయ్యాయి. సరికొత్త రాజకీయాల వాగ్దానంతో ఆప్ అధికారాన్ని తన్నుకుపోయింది. బీజేపీకి మళ్లీ ‘రైతు’ గండం... హస్తినతో పాటు దేశాన్నీ కుదిపేసిన సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమ సారథులు పంజాబ్ రైతులే. వారి ఆగ్రహ ప్రభావం ఎక్కడ తమపై పడుతుందోననే ఆందోళనతో అకాలీదళ్ 2020లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నా లాభం లేకపోయింది. సుర్జీత్ సింగ్ బర్నాలా, ప్రకాశ్ సింగ్ బాదల్ వంటి దిగ్గజాల సారథ్యంలో వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు పంజాబ్లో ఎదురీదుతోంది. తాజాగా మరోసారి రైతులు ‘చలో ఢిల్లీ’ అంటూ ఆందోళనల బాట పట్టడం పంజాబ్లో బీజేపీకి విషమ పరీక్షగా మారింది. ప్రచారంలోనూ కమలనాథులకు రైతుల నుంచి నిరసనల సెగ బాగానే తగులుతోంది. అభివృద్ధి నినాదం, మోదీ ఫ్యాక్టర్తోనే తదితరాలనే నమ్ముకుని బీజేపీ ఒంటరి పోరాటం చేస్తోంది. కెపె్టన్ అమరీందర్ తన పంజాబ్ లోక్ కాంగ్రెస్ను 2022లో బీజేపీలో విలీనం చేశారు. కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్కు గురైన ఆయన భార్య ప్రణీత్ కౌర్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం విశేషం. లూధియానా కాంగ్రెస్ ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టూ కూడా బీజేపీలో చేరి పార్టీ టికెట్పై అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.కలి‘విడి‘గా కాంగ్రెస్, ఆప్... పంజాబ్లో నవ్జోత్సింగ్ సిద్ధూ, కెప్టెన్ అమరీందర్ సింగ్ వర్గ పోరు కాంగ్రెస్ను తీవ్రంగా దెబ్బతీసింది. సిద్ధూకు పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టిన అధిష్ఠానం పార్టీ వీర విధేయుడైన కెపె్టన్కు పొమ్మనకుండా పొగబెట్టింది. దాంతో ఆయన వేరుకుంపటి పెట్టుకున్నారు. పర్యవసానంగా రెండేళ్లకే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు తల బొప్పికట్టింది. 117 సీట్లకు ఏకంగా 92 చోట్ల గెలిచి ఆప్ ప్రభంజనం సృష్టించింది. ఢిల్లీ ఆవలా దుమ్ము రేపగలమని నిరూపించింది. ఆప్ నేత భగవంత్ మాన్ సీఎం అయ్యారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమితో జట్టుకట్టిన ఆప్ పంజాబ్లో మాత్రం పొత్తుకు ససేమిరా అంది. దాంతో కాంగ్రెస్, ఆప్ విడిగానే పోటీ చేస్తున్నాయి. గతంలో రైతుల పోరాటానికి దన్నుగా నిలిచిన ఆ పార్టీలకు ఎన్నికల ముందు మళ్లీ రైతులు ఆందోళనలకు దిగడం కలిసి రానుంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి రైతుల డిమాండ్లను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చేర్చడం విశేషం. 6 న్యాయాలు, 25 గ్యాంరటీలనూ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. కార్పొరేట్లతో బీజేపీ కుమ్మక్కు, అధిక ధరలు, నిరుద్యోగం వంటి అంశాలనూ గట్టిగా ప్రచారం చేస్తోంది.కేజ్రీవాల్ అరెస్టు ఆప్కు ప్లస్సా, మైనస్సా! ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో లోక్సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయడం సంచలనంగా మారింది. బీజేపీ కక్షగట్టి విపక్ష నేతలను జైల్లో పెడుతోందంటూ ఇండియా కూటమి దేశవ్యాప్తంగా మూకుమ్మడి ఆందోళనలకు దిగింది. తొలుత కాస్త తడబడ్డ ఆప్ నేతలు ప్రచారంలో జోరు పెంచారు. ‘జైల్ కా జవాబ్ ఓట్ సే’ (జైల్లో పెట్టినందుకు ఓటుతో జవాబిద్దాం) నినాదంతో దూసుకెళ్తున్నారు. కేజ్రీవాల్ భార్య సునీత ప్రచార బరిలో దిగడంతో ఆప్ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. ఏమైనా ఎన్నికల ముంగిట అధినేత అందుబాటులో లేకపోవడం ఆప్కు ఇబ్బందికరమేనని కొందరంటుండగా, ఆప్కు సానుభూతి కలిసొస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.సర్వేల సంగతేంటి.. పంజాబ్ రైతుల తాజా ఆందోళనలు బీజేపీపై ప్రభావం చూపవచ్చని సర్వేలు అంచనా వేస్తున్నాయి. 13 సీట్లలో ఆప్, కాంగ్రెస్లకే చెరో సగం దక్కవచ్చని లెక్కలేస్తున్నాయి. బీజేపీకి 2, అకాలీదళ్కు ఒక సీటు రావచ్చని కొన్ని సర్వేలు అంటున్నాయి.చిన్న రాష్ట్రమే అయినా ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్ రూపంలో పంజాబ్ ఏకంగా ఇద్దరు ప్రధానులను అందించింది. వారి జన్మస్థలాలు దేశ విభజనతో ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్లోకి వెళ్లిపోయాయి. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీష్ జన్మస్థలమేమో మన పంజాబ్లో ఉండటం విశేషం.కేజ్రీవాల్ను జైల్లో పెట్టినా ఆయన సిద్ధాంతాలను అరెస్టు చేయగలరా!? దేశవ్యాప్తంగా ఆయనకు మద్దతు పలుకుతున్న లక్షలాది కేజ్రీవాల్లను ఏ జైల్లో పెడతారు? కేజ్రీవాల్ వ్యక్తి కాదు, భావజాలం. మోదీ సర్కారు వేధింపులను ఇండియా కూటమి కలిసికట్టుగా ఎదుర్కొంటుంది. బీజేపీ భారతీయ జుమ్లా పార్టీగా మారింది. – ఎన్నికల ర్యాలీలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ – సాక్షి, నేషనల్ డెస్క్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- T20 WC: సచినే ఓపెనర్గా రాలేదు.. నువ్వెందుకు కోహ్లి?
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
సినిమా
స్టార్ హీరోయిన్పై నెటిజన్స్ ఆగ్రహం.. ఎందుకంటే?
బాలీవుడ్ భామ కాజోల్ బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. అజయ్ దేవగణ్ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు ఓ కూతురు కూడా ఉన్నారు. ప్రస్తుతం దో పట్టి అనే చిత్రంలో కనిపించనుంది. అయితే తాజాగా ఓ రెస్టారెంట్కు వెళ్లిన కాజోల్ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. దీంతో ఆమె వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలసుకుందాం.ఇటీవల ముంబయి జుహూలోని ఓ రెస్టారెంట్కు కాజోల్ తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్లింది. అదే సమయంలో ఆమెకు వీరాభిమాని అయిన హోటల్ వెయిటర్ కాజోల్ను చూశాడు. ఆమె వద్ద నుంచి బిల్ తీసుకునే సమయంలో భావోద్వాగానికి గురయ్యాడు. తన అభిమాన నటిని చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.అయితే అతని తీరుపై కాజోల్ మండిపడింది. నాటకాలు ఆపి.. ముందు బిల్ తీస్కో అంటూ ర్యాష్గా మాట్లాడింది. అంతే కాకుండా ఇలాంటి వారిని వెయిటర్గా నియమించడంపై ఏకంగా మేనేజర్కు ఫిర్యాదు చేసింది. దీంతో కాజోల్ వ్యవహరించిన తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ అభిమాని అయినందుకు కనీసం అతనికి కృతజ్ఞతలు కూడా చెప్పలేకపోయారంటూ మండిపడుతున్నారు. కాజోల్ తీరుపై వెయిటర్ సోదరుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
స్టార్ హీరోకు కూతుర్ని.. నన్నే రూమ్కు వస్తావా అన్నాడు: వరలక్ష్మీ శరత్ కుమార్
కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ వరుస సినిమాలతో ట్రెండింగ్లో కొననసాగుతుంది. ఇండస్ట్రీలో ఒక ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందడమే కాకుండా అందుకు తగ్గట్లుగా.. తన మాట కూడా చాలా స్ట్రైట్గా ఉంటుంది. తప్పు చేస్తే ఎదుట ఉన్నది ఎంతటివారైనా సరే ముక్కు సూటిగా హెచ్చరిస్తుంది. తాజాగా ఆమె నటించిన లేడీ ఓరియెంటేడ్ సినిమా 'శబరి' మే 3న విడుదల కానుంది.సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా తన గతంలో జరిగిన ఒక సంఘటన గురించి పంచుకుంది. 'ఒక అమ్మాయి ఇండస్ట్రీలో రాణించడం అంత సులభం కాదు. నాన్నకు ఇష్టం లేకున్నా నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. నేను హీరోయిన్గా పేరుపొందుతున్న రోజుల్లో తమళనాడుకు చెందిన ఒక టీవీ ఛానల్ అధినేత నా ఇంటికి వచ్చాడు. ఒక ప్రాజెక్ట్లో నటించాలని కోరాడు.. అందుకు నేను కూడా ఒప్పుకున్నాను. కానీ, కొంత సమయం తర్వాత మనం మళ్లీ బయట కలుద్దామా..? అన్నాడు. ఎందుకు సార్ అని నేను అడిగిన వెంటనే.. ఏదైనా మాట్లాడుకుందాం రూమ్ బుక్ చేస్తాను కలుద్దాం అన్నాడు. ఒక స్టార్ హీరో కుటుంబానికి చెందిన నన్నే ఇలా అడిగితే మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంటి అని అతని మీద కేసు పెట్టాను. ఈ సంఘటన సుమారు ఆరేళ్ల క్రితం జరిగింది. ఇలాంటి వ్యక్తుల ఆటకట్టించాలని నేను 'సేవ్ శక్తి ఫౌండేషన్' స్థాపించాను.' అని ఆమె చెప్పింది.స్టార్ హీరో కూతురిని అయనంత మాత్రాన నాకు అవకాశాలు రాలేదు.. నన్ను కూడా చాలా సినిమాల్లో నుంచి తొలగించారు. కొంతమంది కమిట్మెంట్ అడగడం వల్ల చాలా సినిమాలను వదులుకోవాల్సి కూడా వచ్చిందని వరలక్ష్మీ తెలిపింది. సేవ్ శక్తి ఫౌండేషన్ ద్వారా చాలామంది ఆడబిడ్డలను రక్షించామని ఆమె చెప్పింది. ఎలాంటి ఆపద అయినా సరే తమ ఫౌండేషన్లోకి వచ్చి సాయం అడిగితే తప్పకుండా జరుగుతుందని ఆమె పేర్కొంది.
రియల్ స్టోరీతో వస్తోన్న క్రేజీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ భామ ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం గంగూభాయి కతియావాడి. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ముంబయిలో వేశ్యవాటిక నేపథ్యంలో వచ్చిన గంగూభాయి కతియావాడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.తాజాగా అలాంటి కథతోనే సరికొత్త వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సంజయ్. ఏకంగా ఆరుగురు హీరోయిన్లతో ఈ సిరీస్ను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ క్రేజీ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేందుకు సిద్ధమైంది. హీరామండి: ది డైమండ్ బజార్ పేరుతో వస్తోన్న వెబ్ సిరీస్ మే 1వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో సందడి చేయనుంది.ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదికరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్లో మల్లికాజాన్గా మనీషా కొయిరాలా, ఫరీదాన్గా సోనాక్షి సిన్హా, బిబ్బోజాన్గా అదితి రావు హైదరీ, అలంజేబ్గా షర్మిన్ సెగల్, వహీదాగా సంజీదా షేక్, లజ్జోగా రిచా చద్దా నటించారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో పాకిస్తాన్లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. పాక్లోని రెడ్-లైట్ ఏరియాలో నివసించే మహిళల పోరాటాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
శ్రుతి హాసన్తో బ్రేకప్.. సారీ అంటూ క్లారిటీ ఇచ్చిన బాయ్ఫ్రెండ్
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తన బాయ్ఫ్రెండ్కు బ్రేకప్ చెప్పినట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తన బాయ్ఫ్రెండ్ శాంతాను హజారికా రియాక్ట్ అయ్యాడు. గత కొద్దిరోజులుగా జంట డేటింగ్లో ఉన్నారు. కానీ, శృతి, శాంతాను ఇద్దరూ తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో ఒకరినొకరు ఫాలో అవడం మానేశారు. దీంతో వీళ్ల బ్రేకప్ వార్తలు బయటకొచ్చాయి.ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ 'శాంతాను హజారికా'తో శ్రుతి హాసన్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని ఆమె కొంత కాలం క్రితం క్లారిటీ ఇచ్చింది. అయితే బ్రేకప్ వార్తలు వైరల్ అయిన తర్వాత శ్రుతి హాసన్ నుంచి ఎలాంటి రియాక్షన్ అయితే రాలేదు.కానీ, శాంతాను హజారికా తాజాగా తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు. "నన్ను క్షమించండి, నేను దానిపై వ్యాఖ్యానించదలచుకోలేదు" అని శాంతను బాంబే టైమ్స్తో అన్నాడు. వారిద్దరూ స్నేహపూర్వకంగానే విడిపోయారని ఖచ్చితమైన సమాచారం ఉందంటూ కథనాలు వస్తున్నాయి. "వ్యక్తిగత విభేదాలు ఉన్నందున, వారు స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు" అని అంతర్గత వ్యక్తి పేర్కొన్నట్లు ఆ పత్రిక తెలిపింది.శ్రుతి విడిపోవడం గురించి రియాక్ట్ కాలేదు. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో "ఇది ఒక క్రేజీ రైడ్.., నా గురించే కాకుండా ఇతర వ్యక్తుల గురించి చాలా నేర్చుకున్నాను" అని షేర్ చేసింది. ఆపై బాయ్ఫ్రెండ్తో ఉన్న పోటోలు, పోస్ట్లను కూడా ఆమె తొలగించింది. శాంతనుకు ముందు లండన్ బేస్డ్ మైకేల్ కోర్సల్తో ప్రేమలో పడింది శృతి.. అతడి కొంతకాలం డేటింగ్ అనంతరం సడన్గా బ్రేకప్ అంటూ ట్విస్ట్ ఇచ్చింది. మళ్లీ ఈ లవ్ స్టోరీకి కూడా ఫుల్స్టాప్ పడినట్లు అయింది.
ఫొటోలు
బిజినెస్
బ్యాంకుల్లో రుణవృద్ధి తగ్గుతుందన్న ప్రముఖ సంస్థ
భారతీయ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్, లాభాల విషయంలో ఆశించిన వృద్ధి నమోదవుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ తెలిపింది. అయితే అనుకున్న మేరకు డిపాజిట్లు రావని, దాంతో రుణ వృద్ధి తగ్గుతుందని సంస్థ అంచనా వేసింది.ఆసియా-పసిఫిక్ 2క్యూ 2024 బ్యాంకింగ్ అప్డేట్ కార్యక్రమంలో ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ నికితా ఆనంద్ మాట్లాడారు. ‘గతేడాదిలో 16 శాతం వృద్ధి నమోదుచేసిన రిటైల్ డిపాజిట్లు ఈ ఏడాది 14 శాతానికి పరిమితం కానున్నాయి. ప్రతి బ్యాంకులో రుణం-డిపాజిట్ల నిష్పత్తిలో తేడా ఉండనుంది. లోన్వృద్ధి డిప్లాజిట్ల కంటే 2-3 శాతం ఎక్కువగా ఉండనుంది. ఈ ఏడాదిలో బ్యాంకులు తమ రుణ వృద్ధిని తగ్గించి, డిపాజిట్ల పెంపునకు కృషి చేయాలి. అలా చేయకపోతే బ్యాంకులు నిధులు పొందడానికి కొంత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది’ అని చెప్పారు. సాధారణంగా రుణ వృద్ధిలో ప్రైవేట్ రంగ బ్యాంకులు 17-18 శాతం వృద్ధి నమోదుచేస్తాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సరాసరి 12-14 శాతం మేరకు రుణ వృద్ధి ఉంటుంది.
హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
దేశవ్యాప్తంగా బంగారం ధరలు దిగొచ్చాయి. కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. పసిడి ధరలు ఈరోజు (ఏప్రిల్ 29) మోస్తరుగా తగ్గాయి. నిన్నటి రోజున స్థిరంగా బంగారం ధరలు ఈరోజు తగ్గి ఉపశమనం కలిగించాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.66,550 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ. 72,600 లకు తగ్గింది.ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.66,700 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.330 తగ్గి రూ.72,750 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.300 క్షీణించి రూ.66,550 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.72,600 వద్దకు దిగొచ్చింది.అలాగే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,400 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.320 తగ్గి రూ.73,530గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 క్షీణించి రూ.66,550 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.72,600 లకు తగ్గింది.ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.87,500గా ఉంది.
ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
సాఫ్ట్వేర్ దిగ్గజం అజీమ్ ప్రేమ్జీ కుటుంబం వివిధ విభాగాల్లో దాదాపు రూ.83వేలకోట్లు(10 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టింది. తాజాగా ప్రేమ్జీఇన్వెస్ట్ ఆఫీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల్లో పెట్టుబడులను పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు సంస్థతో సంబంధం ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు మీడియాకు తెలియజేశారు.ప్రైవేట్ ఈక్విటీ రంగంలో ఏఐ సాధనాలను ఉపయోగించిన మొట్టమొదటి అతిపెద్ద భారతీయ అసెట్ మేనేజ్మెంట్ సంస్థగా ప్రేమ్జీఇన్వెస్ట్ నిలిచింది. కంపెనీ ప్రస్తుతం ఏఐ క్వాంట్ మోడల్పై పని చేస్తోందని మేనేజింగ్ పార్ట్నర్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ టీకే కురియన్ తెలిపారు. అధికరాబడుల కోసం ఏఐటూల్స్ను వినియోగిస్తూ ఆయా కంపెనీల్లో తన పెట్టుబడులను సైతం పెంచుకోవాలనుకుంటుందని ఆయన చెప్పారు.బ్లాక్రాక్ ఇంక్., సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ కార్ప్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడి సంస్థలు మార్కెట్లోని డేటా స్ట్రీమ్లను విశ్లేషించడానికి ఏఐపై ఆధారపడుతున్నాయి. దాంతోపాటు ఈ రంగంలో మరింత పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాయి. అందులో భాగంగానే ప్రేమ్జీఇన్వెస్ట్ మూడేళ్ల క్రితం ఏఐ ఇన్వెస్ట్మెంట్ సాధనాలను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. దానికోసం ఏఐ ఇంజినీర్లను నియమించుకుంది. అదే సమయంలో ఏఐ ఇన్వెస్ట్మెంట్ టూల్స్ తయారుచేసే సంస్థలకు మద్దతుగా నిలవడం మొదలుపెట్టినట్లు తెలిసింది.ఇదీ చదవండి: నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ కంపెనీల్లో పెట్టుబడి అవకాశాలను గుర్తించడానికి 600 పారామీటర్లను విశ్లేషించేందుకు ఏఐ సహాయం చేస్తోందని కురియన్ అన్నారు. ఈ కసరత్తు వల్ల తోటివారి కంటే ముందంజలో ఉండేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. కోహెసిటీ ఇంక్-డేటా మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ, లండన్లోని ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ కంపెనీ-హోలిస్టిక్ ఏఐ, ఇకిగాయ్, ఫిక్సిస్ వంటి ప్రముఖ కంపెనీలకు ప్రేమ్జీఇన్వెస్ట్ సేవలందిస్తోందని తెలిసింది. దేశంలో అధికంగా పోగవుతున్న కోర్టు కేసులను వేగంగా పరిష్కరించడానికి ఉపయోగపడే ఏఐను అభివృద్ధి చేసేందుకు సంస్థ సహకరిస్తుందని కురియన్ అన్నారు.
లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 22,497కు చేరింది. సెన్సెక్స్ 298 పాయింట్లు దిగజారి 74,021 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 88.2 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.67 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.02 శాతం లాభపడింది. నాస్డాక్ 2 శాతం ఎగబాకింది.ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలు ఉండనున్నాయి. దాంతోపాటు బుధవారం వడ్డీరేట్లపై వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎంపిక చేసిన షేర్లు, రంగాల్లో కదలికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మే 1న సెలవు కావడంతో, మార్కెట్లు ఈవారం 4 రోజులే పనిచేయనున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
వీడియోలు
పోయేకాలం వచ్చినప్పుడు విలన్లకి హీరో ఎప్పుడూ బచ్చానే..!
ఇదొక్కటి చాలు.. చంద్రబాబు మోసాలు చెప్పడానికి
జనసేన రెబల్స్ కు గాజుగ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ కు భారీ షాక్..!
అయ్యా చంద్రబాబు నువ్వు పుడింగి అయితే..బాబు ను ఏకిపారేసిన సీఎం జగన్
మరో రెండు వారాల్లో కురుక్షేత్రం..!
యాదవుల కోసం ప్రత్యేక జీవో..!
పొన్నూరు చేరుకున్న సీఎం జగన్
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ పొన్నూరు (గుంటూరు జిల్లా)
ఒకరి గురించి ఒకరు భజన ఈ భజన బ్యాచ్ మనకు అవసరమా
మెగా ఫ్యామిలీపై రామానుజం సంచలన విషయాలు..!