Top Stories
ప్రధాన వార్తలు
పల్నాడు: ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. రెంటచింతల మండలం తుమ్మూరు కోటలో మొత్తం ఆరు పోలింగ్ బూతులను అధికారులు ఏర్పాటు చేశారు.203, 204, 206 పోలింగ్ బూత్ల్లో మూడు ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారు. 205 నెంబర్ బూత్లో ఈవీఎం స్వల్పంగా పగిలింది. దీంతో పాటు జెట్టిపాలెంలో 215 పోలింగ్ బూత్లో మరొక ఈవీఎంని టీడీపీ నేతలు పగలగొట్టారు. తుమ్మూరు కోటలో నాలుగు పోలింగ్ బూత్లో రెండు గంటల నుంచి పోలింగ్ నిలిచిపోయింది.ఓటమి భయంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద తెలుగు దేశం నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు.. పల్నాడు ఉద్రిక్తతలపై ఈసీ ప్రత్యేకంగా ఫోకస్ సారించింది.
టీడీపీ నైరాశ్యంలోకి వెళ్లి హింసను ప్రేరేపిస్తోంది: సజ్జల
సాక్షి, గుంటూరు: టీడీపీ ఓటమి నైరాశ్యంలోకి వెళ్లిపోయి హింసను రెచ్చగొట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుప్పం, మాచర్ల, తాడిపత్రి, చిత్తూరు, దర్శి నియోజకవర్గాల్లో టీడీపీ హింసాత్మక ఘటనలను ఈసీ దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు.‘‘ఓటమి భయంతో టీడీపీ దాడులకు దిగుతోంది. వైఎస్సార్సీపీ శ్రేణులు వీటిని పట్టించుకోకుండా సంయమనంతో, శాంతియుతంగా వ్యవహరించి పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేందుకు సహకరించాలి. ఓటు వేసేందుకు వచ్చిన మహిళలపై దుర్భాషలు ఆడుతూ.. బెదిరిస్తూ.. దాడులకు దిగుతున్నారు. అయినా చెదరని సంకల్పంతో మహిళలు భారీగా ఓటు వేసేందుకు తరలివస్తున్నారు’’ అని సజ్జల పేర్కొన్నారు.గంగాధర నెల్లూరు, విశాఖ వెస్ట్ నియోజకవర్గాల్లో బౌన్సర్లతో టీడీపీ నేతల హల్చల్పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల చరిత్రలో మొదటిసారిగా బౌన్సర్లను దించిన చరిత్ర టీడీపీది. పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం లేదా నెమ్మదిగా పనియచేయడం వల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లాం’’ అని సజ్జల తెలిపారు.‘‘ఎండ వేడిమి భరించలేక, క్యూలో నిలబడలేక వృద్ధులను ఇబ్బందులను పడుతున్నారన్నవిషయాన్ని ఈసీకి తెలిపాం. కొందరు సిబ్బంది నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నందున ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని సజ్జల చెప్పారు.
టీడీపీ నేతల దౌర్జన్యాలు.. ఏపీలో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం
ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్. ఓటమి భయంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద తెలుగు దేశం నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు.. పల్నాడు ఉద్రిక్తతలపై ఈసీ ప్రత్యేకంగా ఫోకస్ సారించింది.పల్నాడుమాచర్లలో ఘర్షణలను ప్రేరేపించింది టీడీపీనే: మల్లాది విష్ణుపోలీస్ అధికారులు ప్రేక్షకపాత్ర వహించారుకుప్పం, మాచర్ల, తాడిపత్రిలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారువైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేసి తిరిగి మాపైనే ఫిర్యాదులు పల్నాడుమాచర్లలో రెచ్చిపోయిన టీడీపీ నేతలువైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి కుమారుడిపై టీడీపీ నేతల దాడిపాల్వాయి గేట్లో టీడీపీ నేతలు ఓటర్లను అడ్డుకున్నారువిషయం తెలిసి పాల్వాయి గేట్ వద్దకు వెళ్లాం: గౌతంరెడ్డిపిన్నెల్లిపై టీడీపీ నేతలు దాడికి యత్నించారుఅడ్డుకున్న మాపై విచక్షణారహితంగా దాడి చేశారుటీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి సోదరుడు మాపై దాడి చేశారుదాడి జరిగినా కారంపూడి సీఐ స్పందించలేదు కృష్ణా:పోరంకిలో టీడీపీ గూండాల దాడిదొంగ ఓట్లు వేయడాన్ని గుర్తించిన వైఎస్సార్సీపీ శ్రేణులుప్రశ్నించిన జోగి రమేష్ అనుచరుడిపై కర్రలతో దాడిఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్పై టీడీపీ నేత దాడిఎమ్మెల్యేగా మాల, మాదిగ వర్గాలకు కొమ్ము కాస్తున్నారంటూ గొట్టి ముక్కల సుధాకర్ దూషించాడు: అన్నా బత్తుని శివకుమార్నా భార్య ఎదుటే అసభ్యంగా దూషించాడుబూత్లోకి వెళ్తుండగా తిడుతూనే ఉన్నాడునువ్వు అసలు కమ్మవాడివేనా అంటూ అసభ్యంగా మాట్లాడాడుపోలింగ్ బూత్ వద్ద మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించాడుపోలింగ్ బూత్ వద్ద దౌర్జన్యం చేస్తున్నట్లు ఓటర్లే చెప్పారుటీడీపీ, జనసేన నేతలు వేరే ప్రాంతాల నుంచి వాళ్ల మనుషులను దింపారువైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారు అనంతపురంతాడిపత్రి లో ఉద్రిక్తతవైఎస్సార్ సీపీ శ్రేణులపై జేసీ వర్గీయుల రాళ్ల దాడిమూడు వాహనాలు ధ్వంసంఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులుపల్నాడు: మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు వద్ద వైఎస్ఆర్సిపి అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై టీడీపీ దాడికర్రలు రాడ్లు మారణాయుధాలతో దాడికి దిగిన టీడీపీ కార్యకర్తలుపదిమంది వైఎస్ఆర్సిపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలుతలలు పగిలిపోవడంతో తీవ్ర రక్తస్రావంరోడ్డుపైన పడిపోయిన వైఎస్ఆర్సిపీ కార్యకర్తలుపిల్లలు రామకృష్ణారెడ్డి వాహన శ్రేణి పూర్తిగా ధ్వంసంపోలింగ్ బూత్ పరిశీలనకు వెళ్ళిన సమయంలో ఒక్కసారిగా పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి పై దాడి చేసిన టీడీపీ మూకలుకృష్ణాపెనమలూరు నియోజకవర్గం పోరంకి హై స్కూల్ పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను ప్రలోభపెడుతున్న టీడీపీటీడీపీకి ఓటు వెయ్యాలని పార్టీ గుర్తు చూపిస్తున్న కార్యకర్తలుటీడీపీ ప్రలోభాల పై నిలదీసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలుటీడీపీ పై పోలింగ్ అధికారులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలుప్రకాశంఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ 10 వాహనాల కాన్వాయ్ తో హల్చల్,ఎన్నికల నిబంధనలు కు విరుద్ధంగా కాన్వాయ్పట్టించుకోని పోలీసులు ,ఎన్నికల అధికారులుఎస్పీ సుమిత్ కి పిర్యాదు చేసిన బాలినేనిబాపట్ల పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలం పెదనక్కలపాలెంలో టీడీపీ అరాచకంబాపట్ల వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ కారుపై దాడిదాడి సమయంలో కారులో లేని నందిగం సురేష్ఏజెంట్లు మాత్రమే కారులో ఉండడంతో కారుపై దాడి చేసి నందిగం సురేష్ ను దుర్భాషలాడిన టీడీపీ కార్యకర్తలుఏజెంట్ల ను బెదిరించిన టీడీపీ కార్యకర్తలుమూడురోజుల క్రితమే యద్దన పూడి మండలం చింతపల్లిపాడులో సురేష్ పై దాడి చేసిన టీడీపీ శ్రేణులుకాకినాడగొల్లప్రోలు టౌన్ లో ఉద్రిక్తత.మహిళలను ఏడిపించిన జనసేన కార్యకర్తలుఅడ్డుకోబోయిన వైఎస్సార్సీపీ కార్యకర్తలువైఎస్సార్సీపీ కార్యకర్తలపై జనసేన కార్యకర్తలు దాడిపరిస్తితి ఉద్రిక్తంప్రకాశందర్శి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలుదర్శి మండలం బొట్లపాలెం ఘర్షణ, వైస్సార్సీపీ ,టీడీపీ కార్యకర్తలు కొట్లాట, పరిస్థితి ఉద్రిక్తంఏజెంట్ల తలెత్తిన వివాదంకిందపడిన ఈవీఎంవైస్సార్సీపీ కార్యకర్తలు పై టీడీపీ కార్యకర్తలు దాడిదేవవరంలోనూ ఘర్షణ, ఏజెంట్ ల మధ్య గొడవప్రకాశందర్శి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలుదర్శి మండలం బొట్లపాలెం ఘర్షణ, వైస్సార్సీపీ ,టీడీపీ కార్యకర్తలు కొట్లాట, పరిస్థితి ఉద్రిక్తంఏజెంట్ల తలెత్తిన వివాదంకిందపడిన ఈవీఎంవైస్సార్సీపీ కార్యకర్తలు పై టీడీపీ కార్యకర్తలు దాడిదేవవరంలోనూ ఘర్షణ, ఏజెంట్ ల మధ్య గొడవఅనంతపురంతాడిపత్రి లో ఎదురుపడ్డ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి - జేసీ ప్రభాకర్ రెడ్డితాడిపత్రి లో టీడీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అభ్యంతరంఅనుమతి లేకుండా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, టీడీపీ రౌడీషీటర్ పొట్టి రవిఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితాడిపత్రి పట్టణంలో జేసీ ఇరువర్గాల మొహరింపులాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులుపల్నాడుమాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ వద్ద టీడీపీ కార్యకర్తల దౌర్జన్యంపోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితాము లోపలికి వెళ్తామని టీడీపీ కార్యకర్తల ఆందోళనపోలింగ్ కేంద్రం గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నంఅడ్డుకున్న పోలీసులతో వాగ్వివాదంపోలీసులను నెట్టేసిన టీడీపీ కార్యకర్తలుఅనంతపురంగుత్తిలో టీడీపీ నేతల దౌర్జన్యంపోలింగ్ కేంద్రం లో ప్రచారం నిర్వహించిన టీడీపీ నేతలుప్రశ్నించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలుకర్నూలుకర్నూలు 17వ వార్డు టిడిపి పార్టీ కార్పోరేటర్ పద్మలతా రెడ్డి ప్రలోభాలు...పోలింగ్ కేంద్రం వద్ద చేరుకొని టిడిపికి ఓటు వేయాలని ఓటర్లను ప్రభావితం చేస్తున్న కార్పొరేటర్..ఎన్నికల నిబంధన ఉల్లంఘించి ప్రచారానికి పాల్పడుతున్న టిడిపి కార్పొరేటర్ పద్మలత రెడ్డిచిత్తూరుకుప్పం నియోజవర్గంలో దొంగ ఓటర్లుకుప్పం మున్సిపాలిటీ పాతపేట 163 పోలింగ్ బూత్ లో తన ఓటు వేరే ఎవరో దొంగ ఓటు వేశారని ఆవేదన వ్యక్తం చేసిన గాయత్రీ అనే ఓటర్మొదటి సారి ఓటు హక్కు వినయోగించుకోవాలని చూసిన యువతీ తన ఓటు వేరొకరు వేసేయడంతో కన్నీళ్లు పెట్టుకొన్న యువతీకృష్ణాబాపులపాడులో జనసేన,టీడీపీ నాయకులు ఓవర్ యాక్షన్.పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న జనసేన,టీడీపీ నాయకులు.జనసేన నాయకుడు చలమలశెట్టి రమేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేత గోసుల శివ భరత్ రెడ్డి.ఏలూరు దెందులూరు నియోజకవర్గం పెదవేగి గ్రామంలో టిడిపి నాయకుల దౌర్జన్యం.పోలింగ్ బూత్ నెంబర్ 54 లోకి ఒక్కసారిగా చొచ్చుకుని వెళ్ళే ప్రయత్నం చింతమనేని అనుచరులు.ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భయభ్రాంతులకు గురైన ఓటర్లువిధుల్లో ఉన్న పోలీసుల అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడిన టిడిపి నాయకులుపారా మిలిటరీ బలగాలు రంగ ప్రవేశం చేయటంతో సద్దుమణిగిన పరిస్థితులు.నంద్యాలనందికొట్కూరు పట్టణంలోని 46,47,48 పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నేత మాండ్రా శివనంద రెడ్డి హాల్ చల్ క్యూలైన్లో ఉన్న ఓటర్లపై ఒత్తిడి తెచ్చి ప్రలోభాల పర్వంక్యూలైన్లలో ఉన్న ఓటర్లను పక్కకు పిలిచి ఓటు వేయాలని భయబ్రాంతులకు గురి చేస్తున్న టీడీపీ నేత మాండ్రా శివానంద రెడ్డి,ఓటర్లను ప్రభావితం చేస్తున్న టీడీపీ శివానంద రెడ్డికి పోలీసుల వార్నింగ్ 100 మీటర్లు బయటఉండాలని సూచనపోలీసుల మాట లెక్క చేయకుండా నేను చీఫ్ ఎలక్షన్ ఏజంట్ అని బూత్ పరిశీలించి వెళ్తానని పోలీసులతో వాదించారు టీడీపీ నేత చిత్తూరు టీడీపీ గుండాల రౌడీయిజంమండికృష్ణాపురం పంచాయతీ లో టిడిపి గుండాల అరాచకంవైఎస్ఆర్సీపీ బూత్ ఏజెంట్స్ పై కత్తితో దాడి ఆపై పరారీ ఓటమి భయంతో నీచ రాజకీయాలకు తెరతీసిన చిత్తూరు టీడీపీ శ్రేణులువైఎస్సార్ జిల్లాబద్వేల్ టీడీపీ కార్యాలయం వద్ద కూటమి నాయకుల ఘర్షణ అగ్రహారం గ్రామానికి సంబంధించి ఓటర్లకు డబ్బు మేము పంచుతాము అంటే మేము పంచుతాము అంటూ గొడవ జనసేన నేత వేలును టీడీపీ నాయకుడు ఇరు వర్గాలు పోలీసుల అదుపులో
AP Elections 2024 Polling: ఏపీ పోలింగ్ డే అప్డేట్స్
AP Elections 2024 Polling Updatesఏపీ ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు..
టీడీపీ కుట్రలు.. పోలీసు అధికారులకు బెదిరింపులు: మనోహర్రెడ్డి
సాక్షి, గుంటూరు: నిరాశా నిస్పృహలతో టీడీపీ నేతలు రాష్ట్రవాప్తంగా పలుచోట్ల హింసకు, దౌర్జన్యాలకు దిగుతున్నారని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు.ప్రజాస్వామ్యంలో హింసకు,దౌర్జన్యాలకు తావులేకుండా ఓటర్ల ప్రశాంత వాతావరణంలో ఓటు వేసే పరిస్దితి ఉండాలని అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బాపట్లలో నందిగం సురేష్, ఎన్నికల ఏజంట్లు ప్రయాణిస్తున్న కారును టీడీపీ కార్యకర్తల ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురిచేశారని ధ్వజమెత్తారు.ఏబీ వెంకటేశ్వరరావు,రిటైర్డ్ డిజీ ఆర్పీ ఠాగూర్ మరికొందరు రిటైర్డ్ పోలీసు అధికారులతో కలసి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చుని రానుంది టీడీపీ ప్రభుత్వం అని.. అనుకూలంగా వ్యవహరించాలంటూ జిల్లాల్లోని పోలీసు అధికారులకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు. ఎన్నికల సంఘం తక్షణం విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.మంగళగిరిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓటు వేసే సందర్భంలో ఆయన భార్య కూడా పోలీంగ్ బూత్లోకి రావడం నిబంధనలకు విరుధ్దం అని, అలా ఆమెను పోలింగ్ సిబ్బంది ఎలా అనుమతిస్తారని మనోహర్రెడ్డి ప్రశ్నించారు.
సీఎం జగన్ గెలుస్తారనే నమ్మకం ఉంది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన సతీమణితో కలిసి హైదరాబాద్లోని నందినగర్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తనకు అనేకమంది మిత్రులు ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సోదరుడిలాంటివాడని, ఈ ఎన్నికల్లో ఆయన మంచి ఫలితాలు సాధిస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.కాగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ రెండో సారి అధికారంలో వస్తారంటూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ‘వైఎస్ జగన్ ఏపీలో రెండోసారి సీఎం అవుతారనే సమాచారం నాకు ఉంది. షర్మిల వంటి వ్యక్తులతో ఏదీ సాధ్యం కాదు. ఒకవేళ ఎవరైనా షర్మిల వంటి వారిని అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూసినా అవి ఫలించవు’ అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ పేర్కొన్నారు.2019 ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తాం..తెలంగాణ లోక్సభ ఎన్నికలపై స్పందిస్తూ.. గతంలో ఇంతకంటే అనేక సవాళ్లతో కూడిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లో సాధించిన సీట్ల కన్నా ఎక్కువ గెలుస్తామనే నమ్మకం ఉందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిపార్టీ తామే గెలుస్తామంటుంది కానీ ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు.పోలింగ్ స్టేషన్ల దగ్గర కరెంటు కోతలు లేకుండా జనరేటర్లు పెట్టి ముగ్గురు ముగ్గురు అధికారులతో తెలంగాణ ప్రభుత్వం కష్టపడుతుందని సెటైర్లు వేశారు. ఆరు గ్యారంటీల్లో తెలంగాణ ప్రభుత్వం ఒక గ్యారెంటీని సగం సగం అమలు చేసిందని విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తాను ముఖ్యమంత్రినని గుర్తించాలని, ఆయన ప్రభుత్వ పనితీరుపైన దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.ఎలాంటి వివక్ష లేకుండా నిధులను కేటాయించాలి..కరెంటు కోతలు నీటి కొరతల వంటి అసలైన సమస్యలపైన రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజా సమస్యలపైన ప్రభుత్వం పని చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామచంద్ర ప్రభువుకు చెప్పినట్టు రాజా ధర్మాన్ని పాటించాలి. అన్ని రాష్ట్రాల మధ్యన ఎలాంటి వివక్ష లేకుండా నిధులను కేటాయించడం లేదా ప్రాజెక్టులు కేటాయించడం చేయలేదు. భారతదేశం మొత్తం ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ప్రజలు ఎవరికి ఓటేస్తారో నాలుగో తేదీన తేలుతుంది. పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ ప్రజలని మోసం చేస్తుంటే.. వందరోజుల నుంచి ఇక్కడ రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారు. ఈరోజు కరెంటు కోతల పైన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చినట్టుగా ఉంది.తెలంగాణ తెచ్చిన నాయకుడికే ఓటు..ఇన్వర్టర్లు జనరేటర్లు, క్యాండిల్స్, పవర్ బ్యాంకులు, చార్జింగ్ లైట్, ఇవే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలని ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలు. ఎలాంటి ప్రభుత్వం కావాలో రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశం. మన ప్రభుత్వాలని మనం నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు ఈరోజు ఓటు వేయకుండా తర్వాత నిందిస్తే లాభం లేదు. దయచేసి అందరూ బయటకు వచ్చి ఓటు వేయండి. మంచి ప్రభుత్వాలను మంచి నాయకులను మీ సమస్యలకు ప్రాతినిధ్యం వహించే వారికి ఓటు వేయండి. తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణ తెచ్చిన పార్టీకి నాయకుడు కేసీఆర్ .తెలంగాణ కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం నేను ఓటు వేశాను
TS Lok Sabha Polling 2024 Updates: తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్ అప్డేట్స్..
తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్ అప్డేట్స్
Lok sabha elections 2024: కొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్
Updates బిహార్:బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఓటు హక్కు వినియోగించుకున్నారు.లాఖీసారాయ్ పోలింగ్ బూత్లో ఓటు వేశారు.#WATCH | Bihar Deputy CM Vijay Kumar Sinha casts his vote for the fourth phase of #LokSabhaElection2024 at a polling booth in Lakhisarai. pic.twitter.com/RgnqvmqvPX— ANI (@ANI) May 13, 2024 కొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్లోక్ సభ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంటవరకు 40.32% పోలింగ్ శాతం నమోదుఆంధ్రప్రదేశ్ - 40.26 %బీహార్ - 34.44%జమ్మూ-కాశ్మీర్- 23.57%జార్ఖండ్ - 43.80%మధ్యప్రదేశ్ - 48.52%మహారాష్ట్ర - 30.85%ఒడిస్సా - 39.30%తెలంగాణ - 40.38%ఉత్తరప్రదేశ్ - 39.68%పశ్చిమ బెంగాల్ - 51.87%ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన పోలింగ్ శాతం 36 శాతంఒడిస్సాలో 28 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన పోలింగ్ శాతం 39.30 బిహార్:నార్త్-ఈస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారుబెగుసారాయ్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు#WATCH | Bihar: Congress candidate from North-East Delhi, Kanhaiya Kumar casts his vote at a polling booth in Begusarai. The constituency sees the contest between sitting MP-BJP candidate Giriraj Singh and CPI candidate Awadhesh Rai.#LokSabhaElections2024 pic.twitter.com/78holvi5FH— ANI (@ANI) May 13, 2024 మధ్య ప్రదేశ్:మాజీ లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఇండోర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Madhya Pradesh: Former Lok Sabha Speaker Sumitra Mahajan casts her vote for the fourth phase of #LokSabhaElections2024 at a polling booth in Indore. pic.twitter.com/E8pffYvjnT— ANI (@ANI) May 13, 2024 ఉత్తర ప్రదేశ్కేంద్రమంత్రి లఖీంపూర్కేరీ బీజేపీ అభ్యర్థి అజయ్ మిశ్రా తేని ఓటు వేశారుబాన్వీర్పూర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు#WATCH | Uttar Pradesh: BJP candidate from Lakhimpur Kheri, Union Minister Ajay Mishra Teni casts his vote at Banveerpur Booth 202 for the #LokSabhaElections2024 Samajwadi Party's Utkarsh Verma and BSP's Anashay Kalra are contesting against him from here. pic.twitter.com/NnagzQ06R3— ANI (@ANI) May 13, 2024 నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోందిఉదయం 11 గంటల వరకు 24.87 శాతం పోలింగ్ నమోదైందిఆంధ్రప్రదేశ్- 23.10 శాతంతెలంగాణ- 24.31 శాతంబిహార్- 22.54 శాతంజమ్మూ కశ్మీర్- 14.94 శాతంజర్ఖండ్- 27. 40 శాతంమధ్యప్రదేశ్- 32.38 శాతంమహారాష్ట్ర- 17.51 శాతంఒడిశా- 23.28 శాతంఉత్తరప్రదేశ్- 27.12 శాతంపశ్చిమ బెంగాల్- 32.78 శాతం#LokSabhaElections2024 | 24.87% voter turnout recorded till 11 am, in the fourth phase of elections. Andhra Pradesh 23.10%Bihar 22.54Jammu And Kashmir 14.94% Jharkhand 27.40% Madhya Pradesh 32.38% Maharashtra 17.51% Odisha 23.28% Telangana 24.31% Uttar Pradesh 27.12%… pic.twitter.com/Awy60bMdeG— ANI (@ANI) May 13, 2024 జార్ఖండ్:జార్ఖండ్ సీఎం చంపయ్ సోరెన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.జిలింగోరా పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Jharkhand CM Champai Soren shows the indelible ink mark on his finger after voting at a polling booth in Jilingora, Saraikela Kharsawan District.#LokSabhaElections2024 pic.twitter.com/qw6nn60JBf— ANI (@ANI) May 13, 2024 పశ్చిమ బెంగాల్:దుర్గాపూర్: బెంగాల్ ఘర్షణ చోటుచేసుకుంది.బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.అక్కడే ఉన్న పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.#WATCH Durgapur, West Bengal: A clash broke out between BJP and TMC workers in Durgapur.#LokSabhaElections2024 pic.twitter.com/alSiQy6ldv— ANI (@ANI) May 13, 2024 ఢిల్లీ:నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోందిఓటువేయడానికి భారిగా ప్రజలు తరలివస్తున్నారుఉదయం 9 గంటల వరకు మొత్తం 10. 35 శాతం పోలింగ్ నమోదైందిఆంధ్రప్రదేశ్- 9.05 శాతంతెలంగాణ- 9.51 శాతంబిహార్- 10.18 శాతంజమ్మూ కశ్మీర్- 5.07 శాతంజర్ఖండ్- 11. 78 శాతంమధ్యప్రదేశ్- 14. 97 శాతంమహారాష్ట్ర- 6.45 శాతంఒడిశా- 9. 23 శాతంఉత్తరప్రదేశ్- 11. 67 శాతంపశ్చిమ బెంగాల్- 15. 24 శాతం#LokSabhaElections2024 | 10.35% voter turnout recorded till 9 am, in the fourth phase of elections.Andhra Pradesh 9.05%Bihar 10.18%Jammu And Kashmir 5.07%Jharkhand 11.78%Madhya Pradesh 14.97%Maharashtra 6.45%Odisha 9.23%Telangana 9.51%Uttar Pradesh 11.67%West Bengal… pic.twitter.com/tmtjV4Aluw— ANI (@ANI) May 13, 2024 ఉత్తర ప్రదేశ్:యూపీ మంత్రి జితిన్ ప్రసాదా ఓటు హక్కు వినియోగించకున్నారు.షహజాన్పూర్ పోలింగ్ కేంద్రంలో ఓటు చేశారు.#WATCH | Uttar Pradesh Minister Jitin Prasada casts his vote at a polling booth in ShahjahanpurINDIA Alliance has fielded SP's Jyotsna Gond here. She faces BJP's sitting MP & candidate Arun Kumar Sagar & BSP's Dod Ram Verma. #LokSabhaElections2024 pic.twitter.com/a933KBvJWW— ANI (@ANI) May 13, 2024 జమ్మూ కశ్మీర్:శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా, వైఎస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Srinagar, J&K: JKNC Chief Farooq Abdullah and JKNC Vice President Omar Abdullah show their inked fingers after casting their votes for the #LokSabhaElections2024 pic.twitter.com/arYMBqgxBm— ANI (@ANI) May 13, 2024 యూపీ:ఉన్నావ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాక్షి మహారాజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Uttar Pradesh: BJP MP and candidate from Unnao, Sakshi Maharaj casts his vote at a polling booth in the constituency.Samajwadi Party (SP) has fielded Annu Tandon and BSP has fielded Ashok Kumar Pandey here. #LokSabhaElections2024 pic.twitter.com/gW1oFBrui7— ANI (@ANI) May 13, 2024 జమ్మూ కశ్మీర్:శ్రీనగర్లో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోందిపెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు క్యూలైన్లలో నిల్చున్నారుLok Sabha elections 2024: Polling underway in SrinagarRead @ANI Story | https://t.co/gDgPtt9ffZ#JammuKashmir #Srinagar #LokSabhaElection2024 pic.twitter.com/2B9fFIibHg— ANI Digital (@ani_digital) May 13, 2024 తెలంగాణఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డిబర్కత్పూరా పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.నాలుగోవిడత పోలింగ్ కొనసాగుతోందిUnion Minister G Kishan Reddy casts his vote in Telangana's BarkatpuraRead @ANI Story | https://t.co/vmoYK3dewi#GKishanReddy #LokSabhaElection2024 #Telangana pic.twitter.com/Xiwl8pYjcJ— ANI Digital (@ani_digital) May 13, 2024 మధ్యప్రదేశ్మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఉజ్జయినిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Madhya Pradesh CM Mohan Yadav casts his vote at a polling station in Ujjain. #LokSabhaElections2024 pic.twitter.com/FxzdPbdYja— ANI (@ANI) May 13, 2024 ఢిల్లీ:కొనసాగుతున్న నాలుగో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్దేశవ్యాప్తంగా సాధారణ వాతావరణ పరిస్థితులు, హీట్ వేవ్ లేదని వెల్లడించిన ఐఎండిపోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లుపది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికలుఎన్నికల బరిలో 1717 మంది అభ్యర్థులుప్రతి పార్లమెంటులో సగటున 18 మంది అభ్యర్థులు1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న 17.7 కోట్ల మంది ఓటర్లు85 ఏళ్లు దాటిన ఓటర్లు12.49 లక్షల మంది, 19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లుఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, ఒడిశాలో 25 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలుతెలంగాణలో పోలింగ్ సమయం పెంపు; ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్న 19లక్షల మంది సిబ్బందిఎన్నికల ప్రక్రియలో 364 మంది అబ్జర్వర్లు1016 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 121 అంతర్జాతీయ సరిహద్దులలో నిఘాపోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు, షెడ్, టాయిలెట్స్, ర్యాంప్స్ ఏర్పాటు తెలంగాణఓటు హక్కు వినియోగించుకున్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ#WATCH | Telangana: AIMIM candidate from Hyderabad, Asaduddin Owaisi shows his inked finger after casting his vote at a polling booth in Hyderabad. #LokSabhaElections2024 pic.twitter.com/aEg4psMI8A— ANI (@ANI) May 13, 2024 తెలంగాణకేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సీఈఓ వికాస్ రాజ్కు ఫిర్యాధు చేసిన కాంగ్రెస్ఓటు వేసి మీడియాతో మాట్లాడుతూ మోడీ పేరును ప్రస్తావించినందుకు ఫిర్యాధుపోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందన్న కాంగ్రెస్కిషన్ రెడ్డి పై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని ECని కోరిన కాంగ్రెస్ మహారాష్ట్ర:కేంద్ర మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే ఓటు హక్కు వినియోగించుకున్నారు.జాల్నా పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Union Minister and BJP's candidate from Jalna Lok Sabha seat, Raosaheb Patil Danve casts his vote at a polling booth in Jalna, Maharashtra Danve is sitting MP from this seat. INDIA alliance has fielded Congress leader Kalyan Vaijinathrao Kale from this seat.… pic.twitter.com/cRvRTK4B8b— ANI (@ANI) May 13, 2024 జమ్మూ కశ్మీర్:పుల్వామా పోలింగ్ కేంద్రంలో బారులు తీరిన ఓటర్లు#WATCH | Jammu and Kashmir: Voters queue up outside a polling booth in PulwamaNational Conference (NC) has fielded Aga Syed Ruhullah Mehdi from the Srinagar Lok Sabha seat, PDP fielded Waheed-ur-Rehman Para, and J&K Apni Party’s fielded Mohammad Ashraf Mir.… pic.twitter.com/VSgGZs9Vki— ANI (@ANI) May 13, 2024 తెలంగాణ:త్రిపురా గవర్నర్ ఎన్ ఇంద్రసేనా రెడ్డి ఓటు వేశారు.హైదరాబాద్ సలీంనగర్ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ కొనసాగుతోంది#WATCH | Telangana: Tripura Governor N Indrasena Reddy, along with his family, casts his vote at a polling booth in Saleem Nagar, Hyderabad. #LokSabhaElections2024 pic.twitter.com/tdl5oYHbrs— ANI (@ANI) May 13, 2024 తెలంగాణ:ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులుహైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఓటు వేశారు.నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది#WATCH | Telangana: Former Vice President M Venkaiah Naidu and his wife Usha Naidu show the indelible ink mark on their fingers after casting their vote at a polling booth in Jubilee Hills, Hyderabad.#LokSabhaElections2024 pic.twitter.com/gUN3v2Ekf2— ANI (@ANI) May 13, 2024 ఢిల్లీ:ఓటు వేయటం ప్రజాస్వామ్య హక్కు: ప్రధాని మోదీకొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్Lok Sabha election: PM Modi calls for 'democracy duty' as voting begins in fourth phaseRead @ANI Story | https://t.co/6N8RRsDrTD#LokSabaElections2024 #PMModi #democracy pic.twitter.com/IhZJO6sRzR— ANI Digital (@ani_digital) May 13, 2024 తెలంగాణ: హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీ లత ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Telangana: BJP candidate from Hyderabad, Madhavi Latha casts her vote at a polling booth in the constituency.She faces sitting MP and AIMIM candidate Asaduddin Owaisi and BRS' Gaddam Srinivas Yadav here. #LokSabhaElections2024 pic.twitter.com/E7sMVEZOrj— ANI (@ANI) May 13, 2024 బిహార్:కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.లఖిసారి పోలింగ్ కేంద్రంలో ఓటు చేశారు.పోలింగ్ కేంద్రానికి ఓటర్లు తరలి వస్తున్నారు.#WATCH | Bihar: After casting his vote in Lakhisari, Union Minister and BJP candidate from Begusarai, Giriraj Singh says, "I want to appeal to the voters of Bihar that they must go out and vote. One vote can cause the fall of the Atal Bihari Vajpayee government and every vote can… pic.twitter.com/X6IiXHe8Qu— ANI (@ANI) May 13, 2024 యూపీ:ఉత్తరప్రదేశ్ మంత్రి సురేష్ ఖన్నా ఓటు హక్కు వినియోగించుకున్నారు.షహజాన్పూర్లో పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేయడానికి ప్రజలు తరలి వస్తున్నారు.ఓటర్లు క్యూలైన్లో నిల్చుంటున్నారు. #WATCH | Uttar Pradesh Minister Suresh Khanna casts his vote at a polling booth in Shahjahanpur. INDIA Alliance has fielded SP's Jyotsna Gond here. She faces BJP's sitting MP & candidate Arun Kumar Sagar & BSP's Dod Ram Verma. #LokSabhaElections2024 pic.twitter.com/fpFLtROJ11— ANI (@ANI) May 13, 2024 ఒడిశా:నాబారంగాపూర్లో ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు.#WATCH | Nabarangpur, Odisha: An eco-friendly polling station has been established at the Dandamunda village in Chandahandi Block of the Nabarangpur Lok Sabha constituency.BJP's Balabhadra Majhi, BJD's Pradeep Majhi and Congress' Bhujabala Majhi are contesting the… pic.twitter.com/tWfKsAon3B— ANI (@ANI) May 13, 2024 ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది.క్యూలైన్లో నిల్చున్న ఓటర్లుVoting for the fourth phase of #LokSabhaElections2024 begins. Polling being held in 96 constituencies across 10 states and Union Territories (UTs) today. 1717 candidates in fray. pic.twitter.com/GXFjsWMsdQ— ANI (@ANI) May 13, 2024 తెలంగాణతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన మాక్ పోలింగ్రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ17 పార్లమెంటు స్థానాలకు బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులుఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే ముగియనున్న పోలింగ్పోలింగ్ పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వంతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 525 మంది అభ్యర్థులు, 475మంది పురుషులు, 50 మంది మహిళా అభ్యర్థులుఎన్నికల విధుల్లో 2లక్షల 80వేల మంది సిబ్బంది విధుల నిర్వహణ160 కేంద్ర కంపెనీల CAPF బలగాలతో బందోబస్తుఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి 20వేల మంది పోలీస్ బలగాలురాష్ట్ర వ్యాప్తంగా 3కోట్ల 32లక్షల 32వేల మంది ఓటర్లుపురుష ఓటర్లు - 1కోటి 65లక్షల 28వేలు, 1కోటి 67లక్షల మహిళా ఓటర్లు18-19 ఏళ్ల వయసు కలిగిన యువ ఓటర్లు 9లక్షల 20వేలు, వికలాంగులు 5లక్షల 27వేలుతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 808 పోలింగ్ కేంద్రాలుఅత్యధికంగా మల్కాజ్గిరిలో 3226 పోలింగ్ కేంద్రాలు1లక్ష 9వేల 941 బ్యాలెట్ యూనిట్లు, 44906 కంట్రోల్ యూనిట్లుతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 9900 ఉన్నట్లు గుర్తించిన ఈసీజూన్ 4వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు#WATCH | Hyderabad, Telangana: Mock polling begins at the Jubilee Hills Public School polling booth nos. 163, 164 and 165 from Secundrabad Lok Sabha Constituency. BJP's G Kishan Reddy, Congress' Danam Nagender and BRS' T. Padma Rao Goud are contesting elections from here. G… pic.twitter.com/Q50qyruJ3B— ANI (@ANI) May 13, 2024 లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నాలుగో విడత పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. 1717 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రతి పార్లమెంటులో సగటున 18 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 17.7 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 85 ఏళ్లు దాటిన ఓటర్లు12.49 లక్షలు ఉండగా, 19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, ఒడిశాలో 25 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.తెలంగాణలో పోలింగ్ సమయం పెంచడంతో ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రక్రియలో 19 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో 364 మంది అబ్జర్వర్లను నియమించారు. 1016 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 121 అంతర్జాతీయ సరిహద్దులలో ఈసీ నిఘా ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు, షెడ్, టాయిలెట్స్, ర్యాంప్స్ ఏర్పాటు చేశారు.
ఓటేసిన సీఎం జగన్.. పోలింగ్ వేళ ఓటర్లకు సందేశం
వైఎస్సార్, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. ఉదయాన్నే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వస్థలం పులివెందులలో ఓటేశారు.కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల భాకరాపురం 138 పోలింగ్ బూత్లో సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ సమయంలో క్యూ నిల్చున్న ఓటర్లకు ఆయన అభివాదం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ఓటేయాలని కోరారాయన. మరోవైపు ఆయన సతీమణి వైఎస్ భారతి.. చిన్నారులు, అభిమానులతో ఫొటోలు దిగి సందడి చేశారు. అంతకు ముందు ఎక్స్ ఖాతాలోనూ ఆయన ఏపీ ఓటర్లకు పిలుపు ఇచ్చారు. అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి అని కోరారు. నా అవ్వాతాతలందరూ…నా అక్కచెల్లెమ్మలందరూ…నా అన్నదమ్ములందరూ…నా రైతన్నలందరూ…నా యువతీయువకులందరూ…నా ఎస్సీ…నా ఎస్టీ…నా బీసీ…నా మైనారిటీలందరూ…అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి!— YS Jagan Mohan Reddy (@ysjagan) May 13, 2024
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్రోబ్కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్తో, గ్లామ్డేస్ విభిన్నమైన నెక్లెస్లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
సినిమా
స్టేజీపై నటిస్తూ కన్నుమూసిన ప్రముఖ నటుడు
ప్రముఖ నటుడు సతీష్ జోషి చనిపోయారు. స్టేజీపై నటిస్తూ తుదిశ్వాస విడిచారు. మరాఠీలో పలు సీరియల్స్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఇప్పుడు ఇలా అకాల మరణం చెందడం అభిమానులు షాక్కి గురిచేసింది. సతీష్ మరణించిన విషయాన్ని ఈయన ఫ్రెండ్ రాజేశ్ దేశ్ పాండే సోషల్ మీడియాలో ధ్రువీకరించారు.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో నాగచైతన్య తల్లి!)'మా స్నేహితుడు సతీష్ జోషి.. మరణానికి ముందు రంగోత్సవ్లో వేదికపై నటించారు. ఉదయం 11 గంటలకు చనిపోయారు. అయితే తుదిశ్వాస విడవడానికి ముందు కూడా ఆయన ఎంతో ఎనర్జీతో కనిపించారు' అని రాజేశ్ తన సంతాపాన్ని తెలియజేశారు.మరాఠీ సీరియల్ 'భాగ్యలక్ష్మి'లో కీలక పాత్ర చేసిన సతీష్ జోషి.. బాగా పాపులర్ అయ్యారు. ఎప్పటికప్పుడు నాటకాల్లోనూ నటించేవారు. ఇప్పుడు ది క్రియేషన్ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా రామభూమిలో జరుగుతున్న వేడుకలో పాల్గొన్నారు. ఇందులోనే స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇస్తూ తుదిశ్వాస విడిచారు. (ఇదీ చదవండి: ముట్టుకుంటే రూ.20 లక్షలు.. ఫొటోకి రూ.25 లక్షలు)
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. అయితే ఓటింగ్ ఎఫెక్ట్ వల్లనో ఏమో గానీ గత కొన్ని వారాల నుంచి థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీస్ రిలీజ్ కాలేదు. ఈ వారం కూడా లెక్కప్రకారం విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రిలీజ్ కావాలి. కానీ మే 31కి వాయిదా పడింది. దీంతో 'రాజు యాదవ్' అనే చిన్న మూవీ మాత్రమే రిలీజ్ అవుతోంది. 'అపరిచితుడు' సినిమా రీ రిలీజ్ అవుతోంది. ఇవి తప్పితే థియేటర్లు కళకళలాడే మూవీస్ అయితే ఏం లేవు. ఓటీటీలో మాత్రం 20కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు రాబోతున్నాయి.(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్)ఓటీటీల్లోకి వస్తున్న వాటిలో 22కి పైగా సినిమాలు- వెబ్ సిరీసులు ఉన్నాయి. అయితే వీటిలో చోరుడు, గ్లాడ్జిల్లా X కాంగ్ అనే డబ్బింగ్ సినిమాలతో పాటు జర హట్కే జర బచ్కే, బస్తర్ అనే హిందీ సినిమాలు మాత్రమే ఉన్నంతలో కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. మిగతా వాటి టాక్ రిలీజైతే గానీ తెలియదు. మరి ఓవరాల్గా ఏయే మూవీస్ ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ లిస్టు (మే 13 నుంచి 19 వరకు)నెట్ఫ్లిక్స్ఆష్లే మ్యాడిసన్: సెక్స్, లైస్ & స్కాండల్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 15బ్లడ్ ఆఫ్ జ్యూష్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 15బ్రిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - మే 16మేడమ్ వెబ్ (ఇంగ్లీష్ సినిమా) - మే 16పవర్ (ఇంగ్లీష్ మూవీ) - మే 17ద 8 షో (కొరియన్ సిరీస్) - మే 17థెల్మా ద యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) - మే 17 అమెజాన్ ప్రైమ్ఔటర్ రేంజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 1699 (ఇంగ్లీష్ సిరీస్) - మే 17హాట్స్టార్క్రాష్ (కొరియన్ సిరీస్) - మే 13చోరుడు (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 14అంకుల్ సంషిక్ (కొరియన్ సిరీస్) - మే 15బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ సిరీస్) - మే 17 జీ5బస్తర్: ద నక్సల్ స్టోరీ (హిందీ మూవీ) - మే 17తళమై సెయలగమ్ (తమిళ సిరీస్) - మే 17జియో సినిమాడిమోన్ స్లేయర్ (జపనీస్ సిరీస్) - మే 13C.H.U.E.C.O సీజన్ 2 (స్పానిష్ సిరీస్) - మే 14జర హట్కే జర బచ్కే (హిందీ సినిమా) - మే 17 బుక్ మై షోగాడ్జిల్లా X కాంగ్: ద న్యూ ఎంపైర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 13 (ఆల్రెడీ స్ట్రీమింగ్) సోనీ లివ్లంపన్ (మరాఠీ సిరీస్) - మే 16ఆపిల్ ప్లస్ టీవీద బిగ్ సిగార్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 17ఎమ్ఎక్స్ ప్లేయర్ఎల్లా (హిందీ సినిమా) - మే 17(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా)
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ఎలా వైరల్ అవుతుందో చెప్పలేం. తాజాగా ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ఎన్టీఆర్ షర్ట్ నెట్టింట్లో వైరల్గా మారింది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు రాష్ట్రాల్లోనూ 42 లోక్ సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. హీరో ఎన్టీఆర్ ఉదయమే తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్లో ఓబుల్రెడ్డి స్కూల్లో భార్య ప్రణతి, తల్లి షాలిని కలిసి వెళ్లి, సామాన్యుడిలా క్యూలో నిలబడి మరీ ఓటు వేశారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు నెట్టింట్లో ట్రెండింగ్గా మారింది. దీనికి కారణంగా పోలింగ్కి ఆయన వేసుకొచ్చి చొక్కానే. ఆయన బ్లూ షర్ట్ ధరించి పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. దీంతో ఎన్టీఆర్ పరోక్షంగా వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తమకు మద్దతుగానే ఎన్టీఆర్ బ్లూషర్ట్ వేసుకొచ్చాడంటూ వైఎస్సార్సీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఫోటోని వైరల్ చేస్తున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ తన కుటుంబ పార్టీ అయిన టీడీపీతో పాటు ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. నందమూరి ఫ్యామిలీకి చంద్రబాబు చేసిన మోసాలను తెలుసుకొనే ఎన్టీఆర్ పార్టీకి దూరమైనట్లు తెలుస్తోంది. లోకేష్ కోసమే చంద్రబాబు నందమూరి ఫ్యామిలీ సభ్యులను పార్టీలో ఎదగకుండా చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ స్నేహితులు కొడాలి నాని, వంశీ వైఎస్సార్సీపీ పార్టీలో ఉన్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఈ ఎన్నికల్లో ప్రత్యేక్షంగా ఏ పార్టీకి మద్దతు ఇవ్వకపోయినా.. వైఎస్సార్సీపీకి అనుకూలంగానే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. View this post on Instagram A post shared by వై.యస్.ఆర్ కుటుంబం (@_ysrkutumbam)Superstar Jr NTR (@tarak9999) came out wearing BLUE Shirt to Vote Big Signal to his Fan. #VoteForFan pic.twitter.com/GJgmO5nlg7— Avesh Kumar Singh (@AveshKumarSingh) May 13, 2024
అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉదయం 7.30 గంటలకే తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. జూబ్లీహిల్స్లోని బీఎస్ఎన్ఎల్ సెంటర్ ఉదయం 7.30 గంటలకే ఓటేశాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నంద్యాల టూర్పై క్లారిటీ ఇచ్చాడు. నంద్యాల అంసెబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్తి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తన స్నేహితుడని.. అందుకే ఆయనకు మద్దతుగా నంద్యాల వెళ్లాలని చెప్పాడు. ‘శిల్పా రవి నాకు 15 ఏళ్లుగా మిత్రుడు. అతనికి మద్దతు ఇస్తానని గతంలో మాట ఇచ్చాను. రాజకీయాలతో సంబంధం లేకుండా స్నేహితుడిగా మాత్రమే శిల్పారవికి మద్దతుగా నంద్యాల వెళ్లాను. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను’అని బన్నీ అన్నారు.
ఫొటోలు
క్రీడలు
ఈ పిల్లాడు.. టీమిండియా నయా సూపర్స్టార్? గుర్తుపట్టారా?
రూ. 400 కోట్ల లాభం వస్తోంది.. చాలదా?: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్
ఐపీఎల్ ఫ్రాంఛైజీ యజమానులను ఉద్దేశించి టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు, కోచ్లే జట్టును ముందుకు నడిపిస్తారని.. ఈ విషయంలో ఓనర్ల జోక్యం అనవసమా అంటూ ఘాటుగా విమర్శించాడు.వ్యాపారవేత్తలు కేవలం లాభనష్టాల గురించే ఆలోచిస్తారని.. అయితే, మైదానంలోనే ఆటగాళ్లను కించపరిచేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికాడు. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన నేపథ్యంలో సెహ్వాగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో కేఎల రాహుల్ కెప్టెన్గా, బ్యాటర్గా విఫలమయ్యాడు. ఫలితంగా రైజర్స్ చేతిలో లక్నో చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో సంజీవ్ గోయెంకా మైదానంలోనే రాహుల్తో వాదనకు దిగాడు.అతడు సర్దిచెప్తున్నా వినిపించుకోకుండా ఆగ్రహం ప్రదర్శించాడు. అదే విధంగా కోచ్ జస్టిన్ లాంగర్ పట్ల కూడా ఇదే తరహాలో వ్యవహరించాడు గోయెంకా. ఈ విషయంపై స్పందించిన సెహ్వాగ్ క్రిక్బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘డ్రెస్సింగ్ రూం లేదంటే ప్రెస్ మీట్ సమయంలోనే ఓనర్లు ఆటగాళ్లతో మాట్లాడాలి. అది కూడా వాళ్లలో స్ఫూర్తి నింపేలా వ్యవహరించాలి గానీ.. ‘‘సమస్య ఏంటి? ఏం జరుగుతోంది?’’ అంటూ మైదానంలోనే ఇలా వ్యవహరించకూడదు.కోచ్లు, కెప్టెన్ జట్టును నడిపిస్తారు. కాబట్టి ఓనర్లు ఆటగాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే బెటర్. వాళ్లంతా వ్యాపారవేత్తలు. వాళ్లకు కేవలం లాభం, నష్టం గురించి మాత్రమే తెలుసు.అయినా ఇక్కడ వారికి ఎలాంటి లాస్ లేదు. 400 కోట్ల రూపాయల వరకు లాభం ఆర్జిస్తున్నారు. అంటే.. ఇక్కడ వాళ్లకు నష్టమేమీ ఉండదు కదా అని అంటున్నా! లాభాలు తీసుకోవడం తప్ప జట్టులో ఏం జరిగినా పట్టించుకునే అవసరం పెద్దగా లేదనే అనుకుంటున్నా. మీరేమైనా చెప్పాలనుకుంటే ఆటగాళ్లను మోటివేట్ చేసేలా ఉండాలి.ఐపీఎల్లో చాలా ఫ్రాంఛైజీలు ఉన్నాయి. ఆటగాడు ఓ జట్టును వీడితే మరో జట్టు అతడిని తీసుకుంటుంది. కీలకమైన ఆటగాడిని కోల్పోతే మీ విజయాల శాతం సున్నా అవుతుంది. నేను పంజాబ్ జట్టును వీడినపుడు వాళ్లు ఐదో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడూ కనీసం ఐదో స్థానంతో ముగించలేకపోయారు’’ అని సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
Obstructing field: జడ్డూ కావాలనే చేశాడా?.. సీఎస్కే కోచ్ స్పందన ఇదే!
రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’గా అవుటైన మూడో బ్యాటర్గా చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్-2024 నేపథ్యంలో చెపాక్ వేదికగా చెన్నై- రాజస్తాన్ ఆదివారం తలపడ్డాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి కేవలం 141 పరుగులు చేసింది.ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై ఐదు వికెట్లు నష్టపోయి 18.2 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఐదు వికెట్ల తేడాతో రాజస్తాన్ను ఓడించి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ ఇదిలా ఉంటే.. సీఎస్కే ఇన్నింగ్స్లో ఆరోస్థానంలో బ్యాటింగ్కు దిగిన జడ్డూ పరుగుల తీసే క్రమంలో.. ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నట్లుగా తేలడంతో ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ నిబంధన కింద అవుటయ్యాడు.అవేశ్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో జడేజా లేని రెండో పరుగుకు పరుగెత్తాడు. మరో ఎండ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్తో సమన్వయలోపం కారణంగా పరుగుకు ఆస్కారం లేకపోయినా క్రీజును వీడాడు. అయితే, వెంటనే ప్రమాదం పసిగట్టి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించగా.. రాజస్తాన్ వికెట్ కీపర్, కెప్టెన్ సంజూ శాంసన్ వికెట్లకు మీదకు వేసిన త్రోకు అడ్డుగా పరుగెత్తగా బంతి జడేజాకు తగిలింది.మైక్ హస్సీ స్పందనఈ నేపథ్యంలో రాయల్స్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్లు టీవీ అంపైర్కు నివేదించారు. రిప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ జడ్డూను ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ రూల్ కింద అవుట్గా ప్రకటించాడు. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ స్పందించాడు.‘‘నేను మరీ అంత దగ్గరగా గమనించలేకపోయాను. అయితే, అతడు స్ట్రెయిట్గా పరిగెత్తేక్రమంలో యాంగిల్ను మార్చుకోకుండానే ముందుకు సాగాడు.ఇరువైపులా వాదనలు ఉంటాయి. అయితే, అంపైర్దే తుదినిర్ణయం. నా అభిప్రాయం ప్రకారం.. నిబంధనలకు అనుగుణంగా ఇది సరైన నిర్ణయమే’’ అని మైక్ హస్సీ స్పష్టం చేశాడు.చదవండి: ఆర్సీబీ విజయం: అనుష్క శర్మ సెలబ్రేషన్స్.. కోహ్లి రియాక్షన్ వైరల్ Jaldi wahan se hatna tha 🫨#TATAIPL #CSKvRR #IPLonJioCinema pic.twitter.com/Op4HOISTdV— JioCinema (@JioCinema) May 12, 2024
RCB- Virushka: అనుష్క శర్మ సెలబ్రేషన్స్.. కోహ్లి రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024 ఆరంభంలో వరుస ఓటములతో చతికిల పడ్డ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అనూహ్య రీతిలో తిరిగి పుంజుకుంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో వరుసగా ఐదో గెలుపు నమోదు చేసి.. ప్లే ఆఫ్స్ రేసులో ఇంకా తాము ఉన్నామనే సంకేతాలు ఇచ్చింది.ఇక ఈ మ్యాచ్లో47 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దూసుకవచ్చింది. కాగా తప్పక గెలవాల్సిన మ్యాచ్లో విజయం సాధించడంతో ఆర్సీబీ సంబరాలు అంబరాన్నంటాయి.చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు విధించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. ఢిల్లీ 140 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆర్సీబీ ఆటగాళ్లతో ఆర్సీబీ అభిమానులు కూడా సంతోషంలో మునిగిపోయారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఇక ఇందులో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ హైలైట్గా నిలిచారు. ఆర్సీబీ గెలుపు ఖరారు కాగానే.. ఆమె పట్టరాని ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యారు.వావ్.. థాంక్ గాడ్!‘వావ్’ అంటూ దేవుడికి కృతజ్ఞతలు చెప్పినట్లుగా చేతులు జోడించి ఆర్సీబీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వైరల్గా మారాయి. ఇందుకు కోహ్లి కూడా తనదైన శైలిలో మజిల్స్ చూపిస్తూ బదులిచ్చాడు. కాగా ఓ యాడ్ సందర్భంగా అనుష్కను కలిసిన కోహ్లి ఆమెతో ప్రేమలో పడ్డాడు. 2017లో ఇటలీలో ఆమెను పెళ్లాడాడు.ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. అకాయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జన్మించాడు. లండన్లో తన ప్రసవం తర్వాత ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చిన అనుష్క.. ఇలా భర్తను చీర్ చేస్తూ ఆర్సీబీకి మద్దతుగా స్టేడియానికి వస్తున్నారు. ఇక ఢిల్లీతో మ్యాచ్లో ఓపెనింగ్ బ్యాటర్ కోహ్లి 13 బంతుల్లో 27 పరుగులు చేశాడు.ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: ఢిల్లీ.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 187/9 (20)👉ఢిల్లీ స్కోరు: 140 (19.1)👉ఫలితం: 47 పరుగుల తేడాతో ఢిల్లీపై ఆర్సీబీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కామెరాన్ గ్రీన్(24 బంతుల్లో 32 నాటౌట్.. ఒక వికెట్ (1/19)). Wrapped up in style ⚡️High fives 🙌 all around as #RCB make it FIVE 🖐️ in a row 🔥A comfortable 4️⃣7️⃣-run win at home 🥳Scorecard ▶️ https://t.co/AFDOfgLefa#TATAIPL | #RCBvDC pic.twitter.com/qhCm0AwUIE— IndianPremierLeague (@IPL) May 12, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });
బిజినెస్
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 54 పాయింట్లు నష్టపోయి 21,998కు చేరింది. సెన్సెక్స్ 232 పాయింట్లు పెరిగి 72,418 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.3 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 82.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.2 శాతం లాభపడింది. నాస్డాక్ 0.03 శాతం నష్టపోయింది.సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన మూడు దశల పోలింగ్లో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. సోమవారం ఫేజ్ 4 ఎన్నికల్లో భాగంగా 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్ జరుగుతుంది.అమెరికా కన్జూమర్ ద్రవ్యోల్బణ అంచనాలు (సోమవారం), జపాన్ మెషనరీ టూల్ ఆర్డర్ల డేటా, భారత రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు (మంగళవారం), యూరోజోన్ మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాలు (బుధవారం), విడుదల కానున్నాయి. జపాన్ క్యూ1 జీడీపీ, మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, ఈసీబీ ఆర్థిక స్థిరత్వ సమీక్ష, అమెరికా పారిశ్రామికోత్పత్తి, ఎగుమతి, దిగుమతుల డేటా(గురువారం) వెల్లడి కానున్నాయి. చైనా ఏప్రిల్ రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి, నిరుద్యోగ రేటు, యూరోజోన్ ఏప్రిల్ ద్రవ్యోల్బణ శుక్రవారం వెల్లడి కానున్నాయి. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు పరిశీలించనున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
గూగుల్కు ఓటింగ్ శోభ!
లోక్సభ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్ ఈరోజు ప్రారంభమైంది. దేశంలోని ప్రతి ఓటరు చూపుడు వేలు ఇంక్తో మెరిసే తరుణమిది. ఈ ప్రజాస్వామ్య పండుగ గూగుల్కు కొత్త శోభ తెచ్చింది. ఇంక్ అద్దిన వేలుతో సరికొత్త గూడుల్ను గూగుల్ సెర్చ్ పేజీపై ప్రదర్శిస్తోంది.దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో నాల్గవ దశ ఓటింగ్ ప్రారంభమైంది. అదనంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 175 స్థానాలు, ఒడిశాలోని 28 స్థానాలకు కూడా ఈరోజు పోలింగ్ జరగనుంది. 4వ దశ ఎన్నికలలో మొత్తం 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.సార్వత్రిక ఎన్నికలలో నాల్గవ దశ ఓటింగ్పై నేటి గూగుల్ డూడుల్ భారత్లోని యూజర్లకు మాత్రమే కనిపిస్తుంది. అంతకుముందు, ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 తేదీలలో జరిగిన మునుపటి దశల పోలింగ్ అప్పుడు కూడా ఇంక్డ్ ఫింగర్ ఐకాన్ లోగోతో గూగుల్ డూడుల్ మెరిసింది.ఈరోజు పోలింగ్ జరుగుతన్న మొత్తం 96 లోక్సభ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్లో 8, పశ్చిమ బెంగాల్లో 8, బీహార్లో 5, జార్ఖండ్లో 4, ఒడిశాలో 4, జమ్మూ కాశ్మీర్లో 1 ఉన్నాయి.
భారత్ ఎగుమతులు విస్తరించాయ్!
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ, మార్చితో ముగిసిన గత 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతులు విస్తరించాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం, 115 దేశాలకు భారత్ ఎగుమతులు పెరిగాయి. భారత్ మొత్తం ఎగుమతుల్లో 46.5 శాతం వెయిటేజ్ కలిగిన ఈ దేశాల్లో అమెరికా, యూఏఈ, నెథర్లాండ్స్, చైనా, బ్రిటన్, సౌదీ అరేబియా, సింగపూర్, బంగ్లాదేశ్, జర్మనీ, ఇటలీ ఉన్నాయి. కాగా మొత్తం ఎగుమతులు 2022–23తో పోలి్చతే 2023–24లో 3 శాతం పతనమై 437.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే సేవల రంగం ఎగుమతులు ఇదే కాలంలో 325.3 బిలియన్ డాలర్ల నుంచి 341.1 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఈ ప్రాతిపదిన మొత్తం ఎగుమతులు స్వల్పంగా 0.23 శాతం పెరిగి 776.4 బిలియన్ డాలర్ల నుంచి 778.2 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రపంచ వస్తు వాణిజ్యంలో భారత్ వాటా 2014లో 1.70 శాతం ఉంటే, 2023లో 1.82 శాతానికి ఎగశాయి. భారత్ ర్యాంక్ సైతం ఈ విషయంలో 19 నుంచి 17 శాతానికి మెరుగుపడింది.
పాక్షిక పెట్టుబడుల్లో మిలీనియల్స్
న్యూఢిల్లీ: ప్రత్యామ్నాయ పెట్టుబడులు యువ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయని డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ గ్రిప్ ఇన్వెస్ట్ తెలిపింది. పాక్షిక పెట్టుబడుల్లో (ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్) మిలీనియల్స్ ఇన్వెస్టర్ల సంఖ్య 60 శాతం ఉందని వెల్లడించింది. గ్రిప్ ఇన్వెస్ట్ వేదికగా 26,000 పైచిలుకు ఇన్వెస్టర్లు ఉన్నారు. ‘మిలీనియల్స్ తమ పెట్టుబడి పోర్ట్ఫోలియోలను వైవిధ్యపరిచే ప్రయత్నంలో భాగంగా ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఎక్కువగా చూస్తున్నారు. మొత్తం ఆర్డర్లలో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పెట్టుబడిదారుల నుండి వచి్చనవి 60 శాతం ఉన్నాయి. జెన్ ఎక్స్ కస్టమర్లు 20 శాతం మంది ఉన్నారు. 21 ఏళ్లున్న పెట్టుబడిదారులు పాక్షిక అధిక–దిగుబడి ఆస్తులను ఎంచుకుంటున్నారు. గ్రిప్ ఇన్వెస్ట్ ప్లాట్ఫామ్లోని 77 శాతం మంది కస్టమర్లు డూ–ఇట్–యువర్సెల్ఫ్ విధానాన్ని ఇష్టపడుతున్నారు. ఇన్వెస్టర్లు వ్యక్తిగత పరిశోధన ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెట్టుబడుల విషయంలో భారత్లోని మిలీనియల్స్ ఉత్సుకత చూపిస్తూనే జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తారు’ అని గ్రిప్ ఇన్వెస్ట్ వివరించింది. 1981–1996 మధ్య జని్మంచినవారిని మిలీనియల్స్గా, 1960 మధ్య కాలం నుంచి 1980 ప్రారంభంలో పుట్టినవారిని జెన్ ఎక్స్గా పరిగణిస్తారు.
వీడియోలు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతల దాడి
ఓటు హక్కు వినియోగించుకున్న యాంకర్ శ్యామల కుటుంబ సభ్యులు
పోలింగ్ బూతును పరిశీలించిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు
ఓటు హక్కు వినియోగించుకున్న వల్లభనేని వంశీ ఫ్యామిలీ
కుటుంబ సభ్యులతో తన ఓటు హక్కు వినియోగించుకున్న కొడాలి నాని
ఈసీ అధికారిక ప్రకటన ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ శాతం
సదుపాయాల విషయం లో అధికారులు అప్రమత్తం అవ్వాలి
మళ్ళీ గెలిచేది జగనే.. ఓటు హక్కు వినియోగించుకున్న తానేటి వనిత
ఓటరును చెంపదెబ్బ కొట్టడంపై స్పందించిన ఎమ్మేల్యే
అన్న రెండోసారి సీఎం గ్యారంటీ
ఫ్యామిలీ
మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా?
మామిడి పండ్లు తినడం వల్ల ముఖంపై మొటిమలు, గడ్డలు వస్తాయని చాలామంది చెబుతుంటారు. పాపం ఆ ఉద్దేశ్యంతోనే మామిపండు తినేందుకు భయపడుతుంటారు. నిజానికి మామిడి పండ్లకు మొటిమలకు సంబంధం ఉందా? వాటిని తినడం వల్ల వస్తాయా ? అంటే..వేసవిలో అందరూ మామిడి పండ్లంటే ఇష్టంగా తింటారు. పోషకాల రీత్యా మామిడిని పండ్లలో రారాజు అని పిలుస్తారు. నిజానికి ఈ మామిడి ఆగ్నేయాసియాలో ఉద్భవించింది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా సాగు చేసే సాధారణ పండుగా మారింది. ఈ మామిడి తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల విటమిన్లు, పోషకాలు అందుతాయి. దీనిలో బీటా కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుందని డెర్మటాలజీ నిపుణులు చెబుతున్నారు.ఈ బీటా కెరోటిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్, శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతుంది. అంతేగాక దీనిలో ఉండే పోషకాలన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మంటను తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాంటి మామిడి పండ్లను తింటే కొందరిలో మొటిములు ఎందుక వస్తాయంటే..? అధిక చక్కెర స్థాయి, గ్లైసెమిక్ సూచిక అని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను సూచించే స్కేల్. ఇక్కడ పండ్లు, బియ్యం, ఇతర కార్బ్ రిచ్ ఉత్పత్తులు, ముఖ్యంగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అత్యధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసీయేషన్ ప్రకారం..తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం బరువు తగ్గడానికి మెటిమలు తగ్గించడానికి 91% సహాయపడుతుందని వైద్యులు తెలిపారు. ఇక్కడ మొటిమలు రక్తంలోని చక్కెర స్థాయిలతో ముడిపడి ఉందని తెలిపారు. అందులోనూ ఈ మామిడిపండ్లను చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు తెగ ఇష్టంగా తింటారు. ఇది వారు యుక్త వయసుకు చేరుకునే సమయం..సరిగ్గా ఈ టైంలోనే వారిలో సెబమ్ ఉత్పత్తి అవుతుంటుంది. దీంతో వారిలో జిడ్డు చర్మం, మొటిమలు మొదలయ్యే దశ స్లోగా మొదలవుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఈ మామిడి పండ్లు కూడా వాళ్లుగా ఇష్టంగా తినడంతో పెద్దవాళ్లు మొటిమలకి, మామిడి పండ్లకి లింక్ చేసి..అవి తినడం వల్లనే వస్తున్నాయని అనేస్తారు. వాస్తవానికి అది అపోహ అని తేల్చి చెబుతున్నారు నిపుణులు. సముతల్యమైన ఆహారం తీసుకున్నవాళ్లు హాయిగా మామిడి పండ్లను తినవచ్చని చెబుతున్నారు. ఇక్కడ మొటిమలు చర్మ పరిస్థితికి ఒక లక్షణం అనేది గ్రహించాలి. ఇక్కడ చర్మాన్ని శుభ్రంగా ఉంచుకుని, మంచి పరిశుభ్రతను పాటిస్తూ.. మొటిమలను నిరోధించే క్రీమ్లను ఉపయోగిస్తే..ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతారు. పైగా చర్మం కూడా ప్రకాశవంతంగా అందంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: గురుద్వారా సేవా కార్యక్రమంలో మోదీ! ఏంటీ లంగర్ ..?)
గురుద్వారా సేవా కార్యక్రమంలో మోదీ! ఏంటీ లంగర్ .?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ బిహార్లోని పాట్నాలో పర్యటించారు.ఆ నేపథ్యంలో అక్కడ గురుద్వారాను సందర్శించారు. అక్కడ సిక్కులు ఎక్కుగా మట్లాడుకునే లంగర్ సేవాలో పాలు పంచుకున్నారు ప్రధాని మోదీ. అక్కడ ఆయనే స్వహస్తాలతో తయారు చేసిన భోజనాన్ని అక్కడ కమ్యూనిటీలకు వడ్డించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఏంటీ లంగర్ సేవా? ఏం చేస్తారంటే..ఇక్కడ హరిమందిర్ జీ పాట్నా సాహిబ్ గురుద్వారాలో సేవా స్ఫూర్తిని ప్రతిబింబించేలా లంగర్ సేవా అనే సమాజ సేవాలో పాల్గొన్నారు మోదీ. అక్కడ మోదీ సిక్కు మాదిరిగా నారింజరంగు తలపాగా ధరించి చక్కగా గరిటి తిప్పతూ వంటలు చేశారు. ఇక్కడ లంగర్ అంటే.. గురుద్వారాకి సంబంధించిన సాముహిక వంటగది. ఇక్కడ మనుషుల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఎలాంటి రుసుము తీసుకోకుండా బోజనం అందిస్తారు. ఇక్కడ గురుద్వారాను సందర్శించినప్పుడు సందర్శకులుకు సాంప్రదాయకంగా తీపి ప్రసాదంతో స్వాగతం పలుకుతారు. ఇది గురువు కృపకు ప్రతీక. సేవల సమయంలో హజరైన వారికి పూర్తి లంగర్తో కూడని భోజనంతో స్వాగతం పలుకుతారు. ఇది మతపరమైన భాగస్వామ్యం, ఆతిథ్య స్ఫూర్తిని సూచిస్తుంది. ఇక్కడ భోజనాలు చేసేవారంతా నేలపైనే కలిసి కూర్చొని.. సమానత్వాన్ని చాటుకుంటారు. ఈ వంటగదిని సిక్కు వాలంటీర్లు నిర్వహిస్తారు. వారంతా సమాజానికి నిస్వార్థంగా సేవ చేస్తారు. ఈ సంప్రదాయం సిక్కు మతంలోని సమానత్వం కలుపుగోలుతనం, నిస్వార్థ సేవలకు నిదర్శనంగా కనిపిస్తుంది. గురుపురబ్, బైసాఖి వంటి పండుగ సందర్భాల్లో కుటుంబాలు గురుద్వార వద్ద సమావేశమవుతాయి. ఇక్కడి వాతావరణం మతపరమైన స్ఫూర్తితో నిండి ఉంటుంది. ఈ సాముహిక అన్నసమారాధనలో అన్ని రకాల వయసుల వ్యక్తులు చురుకుగా పాల్గొంటారు. కాగా, ఈ పాట్నాలోని గురుద్వారా గురు గోవింద్ సింగ్ జన్మస్థలాన్ని జరుపుకోవడానికి నిర్మించిన సిక్కుల పవిత్రమైన ఐదు తఖత్లలో(దేవాలయాల్లో) ఒకటిగా చెబుతారు. (చదవండి: ఆ డ్రగ్తో ఎదుటివాళ్ల మైండ్ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చట!)
ఆ డ్రగ్తో ఎదుటివాళ్ల మైండ్ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చట!
మత్తుమందులకు బానిసై రోజంతో మత్తులో జోగుతుండే వ్యక్తులు గురించి విన్నాం. వారిని ఆ వ్యసనం నుంచి బయపడేసేందుకు నానాయాతన పడుతుంటారు సంబంధికులు. అందుకోసం డీ అడిక్షన్ సెంటర్లు కూడా వచ్చేశాయి. అయితే ఈ మత్తు మందులన్నీ వాళ్లంతటా వాళ్లు వొళ్లు తెలియకుండా ఊహ ప్రపంచంలో విహరించేందుకు వాడుతుంటారు కానీ ఈ కొత్త రకం డ్రగ్ మాత్రం ఏకంగా అవతలి వాళ్ల మైండ్ని కంట్రోల్ చేస్తుందట. కొందరూ దుండగలు ఈ డ్రగ్తో అమాయక ప్రజలను దోచుకోవడం, హత్యలు చేయడం వంటివి చేస్తున్నారు. ఇంతకీ ఏంటి కొత్త రకం డ్రగ్. ఎలా అవతల వాళ్ల మైండ్ని కంట్రోల్ చేయగలరు?ఈ డ్రగ్ పేరు స్కోపోలమైన అనే సింథటిక్ డ్రగ్. దీన్ని ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు. వికారం, నిలకడలేనితనం, కొన్ని ఆపరేషన్ల తర్వాత రోగులకు ఇచ్చే ఔషధాల్లోనూ దీన్ని కలుపుతారు. అయితే ఇది సహజంగా లభించేది కాదు. కొన్ని సహజ పదార్ధాలకు మరి కొన్ని రసాయనాలు కలపడం ద్వారా స్కోపోలమైన్ను కృత్రిమంగా తయారు చేస్తారు. ఘన, ద్రవ రూపాల్లో లభిస్తుంది. దీన్ని ఉమ్మెత్త పువ్వు నుంచి తయారు చేస్తారు. ఒకప్పుడు పిచ్చొళ్లను చేసేందుకు..ఒకప్పుడు దేశంలో, ప్రజల్నిపిచ్చోళ్లను చేసేందుకు ఉమ్మెత్త పువ్వుల్ని నూరి పాలలో కలిపేవారు. అందులో నుంచి కొంత భాగాన్ని తీసి దాన్ని ఉపయోగించి స్కోపోలమైన్ సింథటిక్ డ్రగ్గా తయారు చేస్తున్నారు. మెక్సికోలోని డ్రగ్ గ్యాంగులు దీన్నితయారు చేసి ప్రపంచం అంతటా సరఫరా చేసినట్లు నార్కోటిక్ కంట్రోల్ డిపార్ట్మెంట్ చీఫ్ కెమికల్ ఎగ్జామినర్ డాక్టర్ దులాల్ కృష్ణ సాహా వెల్లడించారు.ఎలా పని చేస్తుందంటే..రెండో ప్రపంచ యుద్ధంలో స్కోపోలమైన్ డ్రగ్ ఉపయోగించినట్లు ఇంటెలిజెన్సీ వర్గాల సమాచారం. ఆ సమయంలో దీన్ని ద్రవ రూపంలో ఇంజక్షన్గా ఇచ్చేవారు. స్కోపోలమైన్ను ఇప్పటికీ ఔషధంగా ఉపయోగిస్తున్నామని బంగబంధు షేక్ ముజిబ్ మెడికల్ యూనివర్సిటీలో ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ ఛైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ సౌదుర్ రహమాన్ చెప్పారు. దీంతో పాటు మరి కొన్ని డ్రగ్స్ వైద్యశాస్త్రంలో ఉపయోగిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో నిఘా వర్గాలు ఈ స్కోపోలమైన్ను ఉపయోగించి ప్రత్యర్థుల నుంచి నిజాలను రాబట్టేవారు. ఈ డ్రగ్ను ప్రయోగించిన తర్వాత శత్రువులు తమ మెదడు మీద నియంత్రణ కోల్పోయి ఎదుటి వ్యక్తులు చెప్పినట్లు చేసేవారు. ఎవరితోనైనా నిజాలు మాట్లాడించడానికి ఇది ఔషధంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ పౌడర్ను వాసన పీల్చేలా చేస్తే అది సైతాన్ శ్వాసగా మారుతుంది. అలాగే దీన్ని వికారం, ఇతర అనారోగ్యాలకు ఉపయోగిస్తే ఔషధం లాగా పని చేస్తుందని రహమాన్ వివరించారు.నేరాలలో ఎక్కువగామోసాలు, కిడ్నాపులు, ఇతర నేరాల కోసం స్కోపోలమైన్ను పౌడర్ రూపంలో ఉపయోగిస్తున్నారు. ఈ పౌడర్ను విజిటింగ్ కార్డు, క్లాత్, మొబైల్ స్క్రీన్ల ద్వారా ఇతరుల మీద ప్రయోగించడం చాలా తేలిక. ఈ పౌడర్ను ప్రయోగించాలనుకున్న వ్యక్తి మీద, అతడు శ్వాస తీసుకునే సమయంలో ముక్కుకు నాలుగు నుంచి ఆరు అంగుళాల దూరంలో ఉంచి ప్రయోగించినా.. అది బాధితుడి ముక్కులోకి చేరుతుంది. దీన్ని నోటి ద్వారా కూడా ఉపయోగించవచ్చు. ముక్కు ద్వారా ప్రయోగించాలని భావిస్తే నాలుగు అంగుళాల దూరంగా ఉండటం ముఖ్యం అని డాక్టర్ దులాల్ కృష్ణ సాహా చెప్పారు. ఇక్కడ ఈ డ్రగ్ని పీల్చిన పది నిముషాల నుంచి సదరు వ్యక్తి మీద ప్రభావం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కాసేపటికి మెదడు నియంత్రణ కోల్పోతుంది. మళ్లీ మాములు కావడానికి గంట నుంచి మూడు గంటలు పడుతుంది.(చదవండి: ఓటర్లకు స్ఫూర్తి ఆ వృద్ధ మహిళలు..! ఆ ఏజ్లోనూ..)
Celebrities With Their Mom's: మామ్స్తో సెలబ్రిటీలు, రెండు కళ్లూ చాలవు (ఫోటోలు)
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్లో వన్స్మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం పట్ల ఎన్నికల సంఘం సీరియస్.. తక్షణం దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడి అరెస్ట్
వాషింగ్టన్/ఒట్టావా: ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు తాజాగా మరో భారతీయుడిని అరెస్ట్చేశారు. బ్రాంప్టన్ సిటీలో నివసించే 22 ఏళ్ల అమన్దీప్ సింగ్ను హత్య, హత్యకు కుట్ర నేరాల కింద అరెస్ట్చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఉదంతంలో గత వారమే ముగ్గురు భారతీయులను అక్కడి పోలీసులు అరెస్ట్చేశారు. అమన్దీప్ను ఒంటారియాలో మే 11న అరెస్ట్చేసినట్లు రాయల్ కెనడియన్ పోలీసులు ఆదివారం ప్రకటించారు. బ్రిటిష్ కొలంబియాలో 2023 జూన్ 18వ తేదీన గురునానక్ గురుద్వారా వద్ద 45 ఏళ్ల నిజ్జర్ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెల్సిందే. నిజ్జర్ను చంపిన ఇద్దరు షూటర్లలో అమన్దీప్ ఒకడని గ్లోబల్ న్యూస్ ఒక కథనం వెలువర్చింది.
మాట్లాడాలని పిలిపించి స్నేహితుడి హత్య
దొడ్డబళ్లాపురం: బార్లో ఉన్న స్నేహితుడిని మాట్లాడాలని తీసికెళ్లి మరో మిత్రుడు తన సహచరులతో కలిసి దారుణంగా హత్య చేసిన సంఘటన దొడ్డ గ్రామీణ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దొడ్డ తాలూకా హుస్కూరు గ్రామం నివాసి శశికుమార్ కుమారుడు హేమంత్గౌడ (27) హత్యకు గురైన యువకుడు. రౌడీషీటర్ నరసింహమూర్తి తన సహచరులతో కలిసి హత్యకు పాల్పడ్డ నిందితుడు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో హేమంత్గౌడ తన స్నేహితులతో కలిసి బాశెట్టిహళ్లి వద్ద ఉన్న జేపీ బార్లో పార్టీ చేసుకుంటుండగా నిందితుడు నరసింహమూర్తి ఫోన్ చేసి మాట్లాడాలని బయటకు రమ్మని పిలిచాడు.హేమంత్ బార్లో నుండి బయటకు రాగానే నరసింహమూర్తితో వచ్చిన సుమారు 10 మంది సహచరులు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. గాయపడ్డ హేమంత్ను టెంపోలో వేసుకుని ఊరంతా తిప్పారు. చావుబతుకుల మధ్య పోరాడుతున్న హేమంత్ను చూసి పైశాచికానందం పొందారు. హేమంత్పై దాడి జరగగానే పక్కనే ఉన్న స్నేహితులు వెంటనే హేమంత్ తండ్రికి సమాచారం ఇచ్చారు. హేమంత్ తండ్రి, కుటుంబ సభ్యులు బార్ వద్ద వచ్చి చూడగా హేమంత్ జాడ లేదు.హేమంత్ ఊపిరి ఆగిపోయే వరకూ టెంపోలో ఊరంతా తిప్పిన నరసింహమూర్తి చివరకు శవాన్ని బెంగళూరు రోడ్డులో ఉన్న నవోదయ పాఠశాల వద్ద రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు. మృతుడు హేమంత్ రియల్ ఎస్టేట్, సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. నిందితుడు నరసింహమూర్తి పేకాట క్లబ్బులు నడుపుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటాడు. దీంతో అతడిపై పోలీసులు రౌడీషిట్ తెరిచారు. అయితే మృతుడు, హతుడు ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య ఎందుకు శత్రుత్వం పెరిగిందనేది తెలీడంలేదు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు అందరూ పరారీలో ఉన్నారు.
హైకోర్టు లాయర్ చైత్రా ఆత్మహత్య
యశవంతపుర: కేఏఎస్ అధికారి భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. సంజయనగర పోలీసుస్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న కేఏఎస్ అధికారి శివకుమార్ భార్య చైత్రా హైకోర్టు వకీలు. శుక్రవారం రాత్రి ఇంటిలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియటంలేదు. మృతురాలి సోదరుడు ఇచ్చి ఫిర్యాదు ఆధారంగా సంజయనగర పోలీసులు కేసునమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.మృతిపై అనుమానాలుచైత్ర భర్త శివకుమార్ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థలో సబ్ డివిజనల్ అధికారిగా ఉన్నారు. చైత్రతో ఆయనకు 2016లో వివాహమైంది, వారికి ఐదేళ్ల కుమార్తె ఉంది. శుక్రవారం రాత్రి ఆయన డ్యూటీ నుంచి ఇంటికి రాగా, భార్య అచేతనంగా పడి ఉంది. దీంతో వెంటనే స్థానిక సంజయనగర పోలీసులకు కాల్ చేశారు. చైత్ర హైకోర్టు లాయరుగా పనిచేస్తూ ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందింది. ఆమె షటిల్ బ్యాడ్మింటన్ వంటి ఆటల్లోనూ ప్రావీణ్యురాలు. ఆమె మృతిని నమ్మలేకపోతున్నట్లు బంధుమిత్రులు తెలిపారు. ఎంతో చలాకీగా ఉండేదని, ఆత్మహత్య చేసుకుందంటే నమ్మశక్యంగా లేదని అనుమానాలను వ్యక్తం చేశారు. పోలీసులు కేసు విచారణ చేపట్టారు.
అమెరికాలో ఖమ్మం యువకుడు మృతి
ఖమ్మం సహకారనగర్: బీటెక్ పూర్తిచేశాక బహుళజాతి కంపెనీలో ఉద్యోగం వచ్చినా కాదను కున్న యువకుడు ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఇటీవలే కోర్సు పూర్తికాగా, కుమారుడు పట్టా స్వీకరించడాన్ని కళ్లారా చూసేందుకు తల్లి దండ్రులూ అమెరికా వెళ్లారు. పట్టా స్వీకరించిన సంతోషంలో స్నేహితులతో కలిసి విహారయాత్ర కు వెళ్లిన ఆ యువకుడు అక్కడి జలపాతంలో మునిగి మృతి చెందగా.. కొడుకు మృతదేహంతో స్వస్థలానికి వెళ్లాలని తెలిసిన ఆ తల్లిదండ్రుల రోదనకు అంతు లేకుండా పోయింది. ఈ విషాద ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంలోని మాంటిస్సోరి పాఠశాలల డైరెక్టర్ లక్కిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఏకైక కుమారుడు రాకేశ్ (24) రెండేళ్ల క్రితం బీటెక్ పూర్తిచేయగా అమెజా న్లో ఉద్యోగం వచ్చింది. అయినా ఎంఎస్ చదవా లనే లక్ష్యంతో అమెరికా వెళ్లాడు. అక్కడ అరిజోనా యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పూర్తిచేసిన ఆయన వారం క్రితం పట్టా స్వీకరించారు. కుమారుడు పట్టా స్వీకరించడాన్ని కళ్లారా చూసేందుకు చంద్రశేఖర్రెడ్డి దంపతులు అమెరికా వెళ్లి ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అయితే, ఎంఎస్ విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా అమెరికాలోని ప్రసిద్ధ ఫాసిల్ క్రీక్ జలపాతం వద్దకు రాకేశ్, ఆయన స్నేహితులు ఈనెల 8వ తేదీన వెళ్లారు.జలపాతం వద్ద సరదాగా గడుపుతుండగా రాకేశ్తో పాటు మరో యువకుడు ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగిపోయారు. గాలింపు చర్యలు చేపట్టగా మరుసటిరోజు 25 అడుగుల లోతులో మృతదే హాలు లభించాయి. రాకేశ్తో పాటు మృతి చెందిన మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.