Top Stories
ప్రధాన వార్తలు
May 16th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 16th AP Elections 2024 News Political Updates10:25 AM, May 16th, 2024ఎన్నికల హింసపై గవర్నర్కు ఫిర్యాదుఏపీలో ఎన్నికల హింసపై గవర్నర్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదుఇవాళ సాయంత్రం రాజ్భవన్ వెళ్లనున్న వైఎస్సార్సీపీ బృందంమంత్రి బొత్స నేతృత్వంలో గవర్నర్ అబ్దుల్ నజీర్కు కలవనున్న వైఎస్సార్సీపీ బృందంపోలింగ్ సందర్భంగా టీడీపీ అరాచకాలపై, పోలీసులు వ్యవహరించిన తీరును గవర్నర్కు వివరించే అవకాశంహింసకు బాధ్యులైన వాళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్న వైఎస్సార్సీపీ నేతలు 9:40 AM, May 16th, 2024రాష్ట్రంలో డీబీటీ పథకాలకు నిధుల విడుదల..డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభంనిన్న ఒక్కరోజే ఆసరాకు రూ.1480,జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్మెంట్కు రూ.502 కోట్లు విడుదలమిగిలిన పథకలకూ విడుదల కానున్న నిధులురెండు మూడు రోజుల్లో నిధుల విడుదలను పూర్తిచేయనున్న ప్రభుత్వంటీడీపీ ఫిర్యాదులతో పోలింగ్కు ముందు డీబీటీ కింద నిధుల విడుదలను అడ్డుకున్న ఎన్నికల సంఘంఇదిగో అదిగో అంటూ పోలింగ్ సమయం వచ్చేంతవరకూ అనుమతిపై ఎటూ తేల్చని ఎన్నికల సంఘంఎన్నికల సంఘం తీరుపై హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వంఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో హైకోర్టు ఆగ్రహంసమయం ముగిసిపోవడంతో పోలింగ్కు ముందు విడుదల కాని నిధులుపోలింగ్ ముగిసిన తర్వాత నిధుల విడుదల ప్రారంభం 9:00 AM, May 16th, 2024అనంతలో సెక్షన్ 144 కొనసాగింపు..అనంతపురం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగింపుఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ వినోద్ కుమార్ఎన్నికల సందర్భంగా అనంతలో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చ మూకలు దాడులు చేశారు. 8:20 AM, May 16th, 2024ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటువిజయవాడఫిరాయింపు ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటుఅనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్న శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుటీడీపీలో చేరిన జాంగా కృష్ణ మూర్తివైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి అనర్హుడిగా ప్రకటించిన శాసన మండలి చైర్మన్ 7:45 AM, May 16th, 2024వైఎస్సార్సీపీ అనుకూల వర్గాలే టార్గెట్.. మహిళలపై పచ్చ మూకల దాష్టీకాలునర్సీపట్నంలో దుశ్శాసన పర్వం ఒంటరి మహిళను జుట్టు పట్టుకొని ఈడ్చి కాళ్లతో తన్నిన అయ్యన్న అనుచరులుకృష్ణా జిల్లాలో దమనకాండమహిళను ట్రాక్టర్తో తొక్కి చంపడానికి ప్రయత్నించిన టీడీపీ నేతమహిళలపై హత్యాయత్నాలు చేస్తున్నా ఏమీ పట్టనట్లు ఈసీ నిర్లిప్తత గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు చేష్టలుడిగి చూస్తున్న అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపు దాకా కొనసాగించేలా చంద్రబాబు పన్నాగం.. రాష్ట్రవ్యాప్తంగా దాడులకు పురిగొల్పుతూ భయానక వాతావరణం రాజకీయ ప్రత్యర్థులపై గ్రామాల్లో విచ్చలవిడిగా దాడులు.. కౌంటింగ్కు వైఎస్సార్సీపీ ఏజెంట్లను దూరంగా ఉంచడమే లక్ష్యం 7:20 AM, May 16th, 2024నేడు విజయవాడకు సీఎం జగన్ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయవాడకు రానున్నారు.ఈ సందర్భంగా బెంజి సర్కిల్లో ఉన్న ఐ-ప్యాక్ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. సుమారు అర గంట పాటు ఐ-ప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ కానున్నారు. 7:00 AM, May 16th, 2024నేడు ఈసీఐని కలవనున్న ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాఎన్నికల అనంతరం జరిగిన హింసపై సీఎస్, డీజీపీని నివేదిక కోరిన ఈసీఐఈసీఐకి వాస్తవ పరిస్థితులు వివరించనున్న సీఎస్, డీజీపీఎన్నికల పోలింగ్కు కొద్దీ రోజులు ముందే డీజీపీ, ఐజీ, ఎస్పీలను మార్చిన ఎన్నికల కమిషన్అకస్మాత్తుగా పోలీస్ అధికారులను మార్చడంతో పెరిగిన హింసాత్మక ఘటనలుపల్నాడు ఎస్పీ, ఐజీ, డీజీపీని పోలింగ్కు ముందు మార్చిన ఈసీఐఈసీ ఆకస్మిక నిర్ణయాలతో హింస పెరిగిందని భావిస్తున్న అధికారులు 6:50 AM, May 16th, 2024ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదుటీడీపీ నేతలతో కుమ్మక్కై తెర వెనుక కథ నడిపినట్లు దీపక్ మిశ్రాపై సీఈవో, డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదుపోలింగ్ రోజు కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై దీపక్ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్సీపీపోలింగ్కు 3 రోజుల ముందు టీడీపీ నేత విష్ణువర్థన్ ఇచ్చిన పార్టీకి దీపక్ మిశ్రా హాజరైనట్లు గుర్తింపుఆ తర్వాత నుంచి పోలీస్ అధికారుల మార్పులపై అనుమానాలుమాచర్ల,గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్ఐల మార్పులుచివరికి సీఎం జగన్పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా దీపక్ మిశ్రా జోక్యం చేసుకున్నారని వైఎస్సార్సీపీ ఫిర్యాదుఈ కేసులో ఏ2 నిందితుడిని అరెస్ట్చేయొద్దని విచారణ అధికారిపై దీపక్ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్సీపీఆధారాలతో సహా డీజీపీ, ఈసీలకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ 6:40 AM, May 16th, 2024రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతోనే దాడులకు తెగబడ్డారు: సజ్జల రామకృష్ణారెడ్డిటీడీపీ అరాచక శక్తులు పోలింగ్ సరిగ్గా జరగకుండా చేయాలని చూశాయిరిగ్గింగ్ చేయాలనీ, మా వారిని అడ్డుకోవాలనీ చూశారుటీడీపీ నేతలు చేసిన అరాచకాలపై ఈసీ, డీజీపీలకు ఫిర్యాదు చేశాంఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరిందిపురంధేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారువారు కోరిన అధికారులను వేశారుమొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారువిష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారువిష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషిఅలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసిందిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరసపెట్టి ట్రాన్సఫర్ చేశారుఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారుప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారుఅక్కడే ఎక్కువ హింస చెలరేగిందిజరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయిమంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారుఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదువెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలిఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలిసంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందికౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోందికచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోందిసీఎస్, డీజీపిని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణంపోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాంపురంధేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాంపోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉందిలేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్ గా నియమించటం ఏంటి?ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారురిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?ఓటర్లు తమ బాధ్యతగా తీసుకుని పోలింగులో పాల్గొన్నారు. 6:30 AM, May 16th, 2024మైదుకూరులో టీడీపీ గుండాల దాడివిశ్వనాథ పురానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త భూమిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డిపై హత్యాయత్నం ఎన్నికల రోజు పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చున్నాడని కోపంతో ఓబుల్ రెడ్డిపై దాడి చేసిన టీడీపీ గూండాలుదాడిలో తీవ్ర గాయాలు.. మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఆసుపత్రిలో ఓబుల్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి
దుశ్శాసన పర్వం.. అయ్యన్న అనుచరుల అరాచకం
రాత్రి వేళ జుత్తు పట్టుకొని లాక్కొచ్చారు.. కాళ్లతో తన్నుకుంటూ.. తాకరాని చోట తాకుతూ.. దుస్తులు చింపేశారు. అడ్డు వచ్చిన వారిని గాయపరిచారు. ఫోన్లు, ఒంటిపైనున్న బంగారు వస్తువులు లాక్కెళ్లారు. నర్సీపట్నంలో ఒంటరి మహిళపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచరులు జరిపిన దాష్టీకమిది. వలంటీర్గా సేవలందించడమే ఆమె చేసిన పాపమట.. వలంటీర్ వ్యవస్థను ఎన్నికల ప్రక్రియకు దూరం చేయడంతో రాజీనామా చేయడమే ఆమె తప్పట.. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున పనిచేయడమే ఆమె దోషమట.. అందుకే దుశ్శాశనుల్లా ఆమెను ఈడ్చుకొచ్చారు. వివస్త్రను చేశారు. ఈ ఘటనతో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంది. గాంధీ గారి దేశంలో గజానికో గాంధారి కొడుకు తయారయ్యాడని.. వారికి అడ్డుకట్ట వేసేందుకు దశ ‘దిశ’ నిర్దేశించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నా.. ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నవారన్నా ఎందుకంత కక్ష, కార్పణ్యం అని ప్రశ్నిస్తోంది.విశాఖ సిటీ : వలంటీర్లంటే వారికి ఒళ్లు మంట. సేవలతో ప్రజలకు దగ్గరవుతున్నారని, సీఎం జగన్ ప్రతినిధులుగా ప్రజలు వారిని ప్రేమిస్తున్నారని ద్వేషం. వారి వల్ల రాజకీయంగా తాము బలహీనపడుతున్నామని కడుపు మంట. అందులో మహిళా వలంటీరంటే మరింత చులకన. అందుకే నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో పూర్వ వలంటీర్ పొలమూరి రాజకుమారిపై మంగళవారం రాత్రి అయ్యన్నపాత్రుడి అనుచరులు కీచకపర్వానికి తెగబడ్డారు. రాజకుమారికి భర్త లేడు. 13 ఏళ్ల కుమారుడితో ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వలంటీర్గా చేరారు. సీఎం వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా మనసారా సేవలందించారు. చంద్రబాబు అండ్ కో ఫిర్యాదులతో వలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరం పెట్టమన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మనస్తాపం చెంది రాజీనామా చేశారు. ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషించారు. పోలింగ్ రోజున ఓటర్లకు స్లిప్లు రాసిచ్చి వైఎస్సార్సీపీకి అనుకూలంగా పని చేయడం టీడీపీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడి అనుచరులకు మింగుడు పడలేదు. అదే గ్రామానికి చెందిన టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ అనుచరులు రెడ్డి రాజేష్, రెడ్డి సత్యనారాయణ, కామిరెడ్డి శివ, సుకల రాజే‹Ùతో పాటు మరికొందరు రాజకుమారిని టార్గెట్ చేశారు. తప్పిన ప్రాణాపాయం పోలింగ్ మరుసటి రోజు మంగళవారం రాత్రి రాజకుమారి పడుకునేందుకు తన 13 ఏళ్ల కుమారుడిని వెంట పెట్టుకొని అదే గ్రామంలో ఉన్న అమ్మ వాళ్ల ఇంటికి వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో టీడీపీ మూకలు రెడ్డి రాజేష్ రెడ్డి సత్యసాయి, కామిరెడ్డి శివ, సుకల రాజేష్ పెట్ట గంగాధర్, అల్లు రాజు, వానపల్లి రాజేష్, సొర్ల రఘు, నందిపల్లి బోయిల నాయుడు వారి ఇంటి మీదకు ఎగబడ్డారు. రాజకుమారిపై దాడి చేశారు. వారి చర్యలను ఆమె సెల్ఫోన్లో చిత్రీకరించేందుకు ప్రయతి్నంచడంతో ఆమె చేతిలో ఉన్న మొబైల్ను లొక్కొని జుట్టు పట్టుకొని బయటకు లాక్కొచ్చారు. ఛాతి మీద చేయి వేసి విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. ఆమె ఒంటి మీద బట్టలను చించేసి వివస్త్రను చేశారు. మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు. రాజకుమారిపై దాడిని అడ్డుకోవడానికి స్థానిక యువకులు, మహిళలు ప్రయత్నించారు. టీడీపీ నేతలు వారిపై కూడా దాడి చేసి గాయపరిచారు. దీంతో ఒమ్మి గోవింద, గజ్జల గోపీచంద్, వియ్యపు వరహాలు, గుమ్మిడి సీతమ్మలకు కూడా గాయాలయ్యాయి. రాజకుమారిని రక్షించడానికి ప్రయత్నించిన వృద్ధురాలు సీతమ్మ చెంపపై గట్టిగా కొట్టి ఆమె బంగారు చెవి దుద్దులు లాక్కొని వెళ్లిపోయారు. ఒంటరిగా ఉంటే చంపేసే వారని, అమ్మ వాళ్ల ఇంటి వద్ద ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డానని రాజకుమారి చెప్పారు. ఈ ఘటనపై ఆమె నర్సీపట్నం రూరల్ పోసులకు ఫిర్యాదు చేసి, తనకు రక్షణ కల్పించాలని కోరారు. పోలీసులు దాడికి పాల్పడిన వారిపై 324, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశ ముగింపునకు వచ్చినా టాప్-4 బెర్తులపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరగా.. మిగిలిన రెండు స్థానాల కోసం ఆసక్తికర పోటీ నడుస్తోంది.ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఈ రేసులో ముందుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కూడా ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.చెన్నై ఇప్పటికి 13 మ్యాచ్లు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లు(నెట్ రన్రేటు 0.528) సాధించగా.. పన్నెండు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లతో ఉన్న సన్రైజర్స్ నెట్ రన్రేటు (0.406) పరంగా కాస్త వెనుకబడి ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.అతిపెద్ద సానుకూలాంశంఅయితే, రైజర్స్కు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉండటం.. అది కూడా సొంతగడ్డపై జరుగనుండటం అతిపెద్ద సానుకూలాంశం. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లలో ఏదో ఒకటి గెలిచినా 16 పాయింట్లతో కనీసం నాలుగో స్థానం ఖరారు చేసుకుంటుంది.మరోవైపు.. ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లే ఉన్నాయి. మిగిలింది ఇంకొక్క మ్యాచ్. అది కూడా సీఎస్కే(మే 18)తో! ఈ మ్యాచ్లో చెన్నైని కచ్చితంగా ఓడిస్తేనే ఆర్సీబీకి అవకాశం ఉంటుంది. లేదంటే ఇంటికి వెళ్లడమే తరువాయి!చెన్నై పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. ఓడితే ఇంటికే లేదంటే సన్రైజర్స్ మ్యాచ్ల ఫలితం తేలేవరకు వేచి చూడాలి. ఈ సమీకరణల నేపథ్యంలో ఎలా చూసినా సన్రైజర్స్ సీఎస్కే, ఆర్సీబీ కంటే ఓ మెట్టు పైనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.రెండు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి?అయితే, టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి ప్లే ఆఫ్స్ చేరదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకుంటూ.. చెన్నై సూపర్ కింగ్స్తో పాటు ఆర్సీబీ టాప్-4లో అడుగుపెడుతుందని జోస్యం చెప్పాడు.‘‘తదుపరి రెండు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఐపీఎల్లో ఏదైనా జరగొచ్చు కదా! ఒకవేళ హైదరాబాద్ రెండు మ్యాచ్లూ ఓడి.. ఆర్సీబీ చెన్నై మీద గెలిస్తే.. అప్పుడు రెండు జట్ల ఖాతాలో 14 పాయింట్లే ఉంటాయి.రన్రేటు పరంగా సన్రైజర్స్ కంటే ఈ రెండు జట్లు మెరుగ్గానే ఉంటాయి. అందుకే నా టాప్ 4.. కేకేఆర్, రాజస్తాన్, చెన్నై, బెంగళూరు’’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.భగ్గుమంటున్న ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్కాగా భజ్జీ వ్యాఖ్యలపై సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు భగ్గుమంటున్నారు. విధ్వంసకర బ్యాటింగ్తో సొంతగడ్డపై చెలరేగే ప్యాట్ కమిన్స్ బృందాన్ని తక్కువ అంచనా వేయడమే గాకుండా.. అపశకునపు మాటలు మాట్లాడటం సరికాదంటూ ఫైర్ అవుతున్నారు. ఇక సన్రైజర్స్ గురువారం నాటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్ను అంటారా?.. గంభీర్ ఫైర్ Ready to put on a show this evening 🧡💙#PlayWithFire #SRHvGT pic.twitter.com/o07Or5fu12— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024
గాయపడిన ఐశ్వర్య రాయ్.. అయినా అక్కడికి ప్రయాణం
ప్రతి సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు కొత్త కళ తెచ్చేది బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్. ఫ్రాన్స్లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 25 వరకు కొనసాగుతున్న ఈ వేడుకులలో భారత్ తరపున పాల్గొనేందుకు తాజాగా ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్య బచ్చన్తో కలిసి కేన్స్కు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో ఆమె కనిపించారు. కానీ, తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి ఉండటంతో చాలా మంది అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఆమె చేతికి తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది. ఐశ్వర్యకు ఏమైందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఆమె గాయం గురించి పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశారు. ఒక అభిమాని ఇలా అన్నాడు, 'OMG ఆమె గాయపడిన చేతులతో కేన్స్లో ఎలా నడుస్తుంది. కేన్స్ రెడ్ కార్పెట్పై ఐశ్వర్య నడుస్తూ ఉంటే ఆ కార్యక్రమానికే అందం వస్తుంది. కానీ, ఈసారి ఆ రెడ్ కార్పెట్పై ఆమె నడవగలదా అంటూ వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కేన్స్లో ఆమె లుక్ కోసం ఎదురు చూస్తున్నామని మరొకరు తెలిపారు. ఐశ్వర్య చేతికి అయిన గాయానాకి గల కారణాలు మాత్రం తెలియలేదు.ఐశ్వర్య రాయ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2002లో తొలిసారి మెరిసింది. ఆ సమయంలో భారీ బంగారు ఆభరణాలతో నీతా లుల్లా డిజైన్ చేసిన చీరలో రెడ్ కార్పెట్ మీద మొదటిసారి కనిపించింది. అదె సంవత్సరంలో ఆమె నటించిన దేవదాస్ సినిమా ఆ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. షారూఖ్ ఖాన్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీతో ఆమె కేన్స్లో పాల్గొంది. అప్పటి నుంచి దాదాపు ప్రతి సంవత్సరం ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో ఆమె రెడ్ కార్పెట్పై తన అందంతో కట్టిపడేస్తుంది.ఐశ్వర్యతో పాటు అదితి రావు హైదరీ, శోబితా ధూళిపాళ, కియారా అద్వానీ కూడా కేన్స్లో కనిపించనున్నారు. ఊర్వశి రౌతేలా ఇప్పటికే కేన్స్లో పింక్ లుక్లో కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)
స్లోవేక్ ప్రధానిపై హత్యాయత్నం ఎందుకు జరిగిందంటే..
ప్రేగ్: స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59)పై జరిగిన హత్యాయత్నాన్ని ప్రపంచ దేశాల అధినేతలు ముక్తకంఠంతో ఖండించారు. అయితే ఆయనకు సర్జరీ విజయవంతంగా పూర్తైందని, ప్రాణాపాయ స్థితి తప్పిందని ఆ దేశ ఉప ప్రధాని, పర్యావరణ శాఖ మంత్రి టోమస్ తరాబా మీడియాకు తెలిపారు.దేశ రాజధాని బ్రటిస్లావాకు దాదాపు 140 కిలోమీటర్ల దూరంలోని హాండ్లోవా పట్టణంలో నిన్న మధ్యాహ్నాం ఫికో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. సమావేశ ముగిశాక బయటకు వచ్చిన ఆయన.. అక్కడ బారికేడ్ల వద్ద ఉన్న కొందరు వృద్ధులతో కరచలనం చేశారు. ఈలోపు ఓ వృద్ధుడు ఆయనపై కాల్పులు జరుపుతూ మెరుపు దాడికి దిగాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బందిని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. Assassination attempt on #Slovakia PM Robert Fico caught on camera. Considered as close to @KremlinRussia_E he opposed #Ukraine bid for @NATO. He is battling for life in hospital. pic.twitter.com/YsZHRZHVcu— Neeraj Rajput (@neeraj_rajput) May 15, 2024 Assassination attempt on #Slovakia PM Robert Fico caught on camera. Considered as close to @KremlinRussia_E he opposed #Ukraine bid for @NATO. He is battling for life in hospital. pic.twitter.com/YsZHRZHVcu— Neeraj Rajput (@neeraj_rajput) May 15, 2024 ఆ వెంటనే ఆలస్యం చేయకుండా ప్రధాని ఫికోను అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. బన్స్కా బైస్ట్రికాలోని ఓ ఆసుపత్రిలో ఫికోను సర్జరీ జరిగింది. మొత్తం ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయని, ప్రధాని కడుపులో బుల్లెట్లు దిగి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. Assassination attempt on #Slovakia PM Robert Fico caught on camera. Considered as close to @KremlinRussia_E he opposed #Ukraine bid for @NATO. He is battling for life in hospital. pic.twitter.com/YsZHRZHVcu— Neeraj Rajput (@neeraj_rajput) May 15, 2024ఇక కాల్పులకు సంబంధించి స్పాట్లోనే నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మీడియా సంస్థల కథనం ప్రకారం.. నిందితుడ్ని జురాజ్ సింటులా(71)గా నిర్ధారించారు. అయితే దాడికి ఎందుకు పాల్పడ్డాడనేదానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. గత నెలలో జరిగిన స్లోవేకియా అధ్యక్ష ఎన్నికలు, ఇతరత్ర రాజకీయ కారణాలు హత్యాయత్నానికి కారణాలై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాబర్ట్ ఫికో గురించి.. 1964 చెకోస్లోవేకియాలో రాబర్ట్ ఫికో జన్మించారు.ఫికోకు భార్యా, కొడుకు ఉన్నారు. ఫికో రష్యా అనుకూలవాది. ఉక్రెయిన్ యుద్ధం నుంచి పుతిన్కు మద్దతు ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం నాలుగో దఫా ప్రధాని పీఠంపై కొనసాగుతున్నారు.కమ్యూనిస్ట్ భావజాలానికి ఆకర్షితుడై.. 1992లో డెమొక్రటిక్ లెఫ్ట్ పార్టీ తరఫున తొలిసారి పార్లమెంట్కు ఎన్నికయ్యాడు. 1990లో.. యూరోపియన్ మానవ హక్కుల సంఘాలకు స్లోవేకియా తరఫున ప్రాతినిధ్యం వహించారు. 1999లో.. స్మెర్(Direction – Social Democracy) పార్టీని నెలకొల్పారు. అప్పటి నుంచి ఆ పార్టీకి ఆయనే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. 2006 నుంచి 2010 దాకా, ఆపై 2012 నుంచి 2016, 2016 నుంచి 2018 ప్రధానిగా పని చేశారు. 2014లో అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేసి ఓడారు.ఈయన హయాంలోనే స్లోవేకియా నాటోతో పాటు యూరోపియన్ యూనియన్లో సభ్య దేశంగా మారింది. అధికారంలో ఉండగా.. పత్రికా స్వేచ్ఛను అణగదొక్కారనే విమర్శ ఒకటి ఫికోపై బలంగా వినిపిస్తుంది. జర్నలిస్టులపై దాడులు చేసేందుకు క్రిమినల్ గ్యాంగ్లను సైతం ప్రొత్సహించారనే అభియోగాలు ఆయనపై నమోదు అయ్యాయి కూడా. అధికారం కోసం సిద్ధాంతాలు మార్చుకునే అవకాశవాదంటూ ప్రతిపక్షాలు ఆయన్ని విమర్శిస్తుంటాయి. స్లోవేకియా ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ జాన్ కుసియాక్తో పాటు అతనికి కాబోయే భార్య హత్య కేసు దుమారం రేపడంతో.. 2018లో ఫికో ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది. ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో కొనసాగిన ఫికో.. కిందటి ఏడాది జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో రష్యా అనుకూలవాదం, అమెరికా వ్యతిరేక నినాదాలతో జనంలోకి వెళ్లి ఘన విజయం సాధించారు. ఆ సమయంలో తాను అధికారంలోకి వస్తే.. ఉక్రెయిన్కు మిలిటరీ సాయం అందించడం ఆపేస్తానని చెబుతూ.. ఈ యుద్ధ సంక్షోభానికి నాటో, అమెరికాకే కారణమంటూ విమర్శలు గుప్పించారు. రాజకీయ హింస స్లోవేకియాకు కొత్తేం కాదు. అందుకే ఆ దేశ ప్రజలకు ప్రధానిపై జరిగిన దాడి పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయలేదు.
యూకే పార్లమెంట్ బరిలో తెలుగు బిడ్డ
సాక్షి, సిద్దిపేట: యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ బిడ్డ నిలిచారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. నార్త్ బెడ్ఫోర్డ్షైర్ లేబర్ పార్టీ నుంచి ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ జన్మించారు. తల్లిదండ్రులు హనుమంతరావు, నిర్మలాదేవి. బ్రిటన్లోని ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ చేశారు. కష్టపడేత త్వం కలిగిన ఉదయ్ అంచెలంచెలుగా ఎదిగారు. ప్రపంచం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావా న్ని ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్ ట్యాంక్ని నెలకొల్పారు. మంచి వక్తగా పేరు సంపాదించా రు. సర్వే ఫలితాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఉదయ్ గెలిచే సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నా రు. తెలుగు బిడ్డ బ్రిటన్లో ఎంపీగా పోటీ చేస్తుండటం.. విజయం సాధిస్తారనే అంచనాలు ఉండటంతో తల్లి నిర్మలా దేవి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు బిడ్డ ఆ స్థాయికి ఎదగడంతో శనిగరం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
క్యాన్సర్తో నరేష్ గోయల్ భార్య కన్నుమూత
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ భార్య అనితా గోయల్ క్యాన్సర్తో పోరాడుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. ఆమె 2015 నుంచి సంస్థలో నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.అనితా గోయల్ కొన్నేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా గురువారం ఉదయం ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనిత 1979లో మార్కెటింగ్ అనలిస్ట్గా కంపెనీలో చేరారు. ఆమె మార్కెటింగ్ అండ్ సేల్స్ హెడ్గా ఎదిగిన తర్వాత నరేష్ గోయల్తో పరిచయం ఏర్పడింది. వారు కలిసిన తొమ్మిదేళ్ల తర్వాత వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.మనీలాండరింగ్ కేసులో 2023లో జైలుకెళ్లిన ఆమె భర్త నరేష్గోయల్కు వైద్యకారణాల వల్ల బాంబే హైకోర్టు సోమవారం బెయిల్ ఇచ్చింది. భర్త జైల్లోనుంచి బయటకు వచ్చిన కొద్దిరోజులకే భార్య మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నిండుకుంది.
‘రైజ్ ఏ చైల్డ్’..! కొత్త తల్లులకు పెద్ద బాలశిక్ష..
పాపాయి నిద్రపుచ్చినంతసేపు కూడా పడుకోలేదు. భుజానికెత్తుకుని తిప్పి తిప్పి నిద్రపుచ్చి ఇలా మంచం మీద పెట్టానో లేదో వెంటనే లేచేసింది. ఈ బిడ్డతో నేనేం చేయను’ చంటిబిడ్డను పెంచే ప్రతి తల్లి నుంచి వినవచ్చే మాటే ఇది. ఆ తల్లి వెలిబుచ్చిన నిస్సహాయతలో అగాధం వంటి ఆవేదన దాగి ఉంటుంది. ఈపాట్లన్నీ పడిపాపాయిని ఆరు నెలలు పెంచేసరికి మెటర్నిటీ లీవ్ అయిపోతుంది.అప్పుడు మరో ప్రశ్న... ‘బిడ్డను కేర్ టేకర్ చేతిలో పెట్టి ఉద్యోగానికి వెళ్లవచ్చా. చక్కగా చూసుకోగలిగిన ఆయాలు దొరికితే బావుణ్ను’. బిడ్డకు ఘనాహారం ఎప్పుడు ఇవ్వాలో డాక్టర్లు చెబుతారు, కానీ ఎలా తినిపించాలనేది మాత్రం బిడ్డను పెంచిన అనుభవం ఉన్న తల్లులే చెప్పాలి. పిల్లల్ని పెంచడంలో ఎదురయ్యే ఇలాంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వెలిసిందో గ్రామం. దాని పేరే ‘రైజ్ ఏ చైల్డ్’. ఎక్కడ ఉందీ గ్రామం. ఈ గ్రామం అడ్రస్ చెప్పాలంటే కేరాఫ్ డిజిటల్ మీడియా అని చెప్పాలి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల్లేవు, నగరాల్లో అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలే. పసిబిడ్డ అమ్మమ్మ, నానమ్మల చేతిలో పెరిగే అవకాశాలు తగ్గిపోయిన ఈ కాలంలో బిడ్డ సంరక్షణలో తల్లులకు ఎదురయ్యే సందేహాలను డిజిటల్ మాధ్యమం ద్వారా ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. వివిధ ్రపాంతాల్లో ఉన్న తల్లులు ఇందులో జాయిన్ అయ్యారు. ‘క్వశ్చన్స్ అరౌండ్ బ్రెస్ట్ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఇండియన్ మదర్స్, బేబీ లెడ్ వీనింగ్, గుడ్ షెడ్యూల్ ఫర్ బేబీస్, క్లాత్ డయాపరింగ్ ఇండియా, ఫస్ట్ ఫార్టీ డేస్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్’ వంటి పది గ్రూప్లను ఒక గొడుగు కిందకు తీసుకువస్తూ ‘రైజ్ ఏ చైల్డ్’ పేరుతో ఒక వర్చువల్ విలేజ్కి రూప కల్పన చేసింది రోహిణి అనే మహిళ.‘‘నిజానికి నాకెదురైన సమస్యలే ఈ వర్చువల్ విలేజ్ రూపకల్పనకు నాంది. గర్భధారణ, ప్రసవం 30 ఏళ్లలోపు జరగాలని వైద్యులు సూచిస్తుంటారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఉన్నత చదువులు, ఉద్యోగాలలో స్థిరపడిన తరవాతనే పెళ్లి. దాంతో పిల్లలను కనే వయసు దాటిపోతోంది. నేను 32 ఏళ్ల వయసులో గర్భం దాల్చాను. డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నప్పటికీ రోజువారీ ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారం కోసం మళ్లీ డాక్టర్ చెకప్ వరకు ఆగలేం.అప్పటికీ రోజూ ఫోన్ చేసి అమ్మ, అత్తగారిని అడిగి తెలుసుకుంటున్నప్పటికీ నేను సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నానా లేదా అనే సందేహం. పాత తరం వారి అనుభవంతోపాటు కొత్తతరంలో అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలను కూడా తెలుసుకోవాలని చేసిన ప్రయత్నంలో సోషల్ మీడియాలో ఇన్ని వేదికలున్నాయని తెలిసింది. ఆ గ్రూప్ల అడ్మిన్లందరితో మాట్లాడి అన్నింటినీ ‘రైజ్ ఏ చైల్డ్’ గొడుగు కిందకు తీసుకువచ్చాను. గర్భిణులకు, కొత్త తల్లులకు ఇది ఒక వరంగా మారింది. ఇది మనదేశంలో ఉన్న వాళ్లకే కాదు, విదేశాల్లో ఉన్న మనవాళ్లకు కూడా ఉపయోగపడుతోంది. నిజానికి మనకంటే వాళ్లకే ఎక్కువగా ఉపయోగపడుతోంది.ఎందుకంటే ఐర్లాండ్లో ఉన్న ఒక మహిళ అక్కడి వైద్యవిధానాలు, వైద్యుల సూచనను యథాతథంగా పాటించింది. కానీ ఆ పద్ధతులుపాపాయికి సౌకర్యంగా అనిపించడం లేదని తెలిసి ‘రైజ్ ఏ చైల్డ్’లో చేరింది. చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఒకరు తమ సమస్యనుపోస్ట్ చేసిన తర్వాత ఆలాంటి సమస్యను ఎదుర్కొని బయటపడిన వాళ్లు తాము ఆ సమస్య ఎలా పరిష్కరించుకున్నారో అనుభవపూర్వకంగా తెలియచేస్తారు’’ అని వివరించింది రోహిణి. రైజ్ ఏ చైల్డ్ మొత్తానికి కొత్త తల్లులకు పెద్దబాలశిక్ష అయింది. "ఇందులో ఒకరు తమ సమస్యను పోస్ట్ చేసిన తర్వాత ఆలాంటి సమస్యను ఎదుర్కొని బయటపడిన వాళ్లు తాము ఆ సమస్య ఎలా పరిష్కరించుకున్నారో అనుభవపూర్వకంగా తెలియచేస్తారు".
‘హలో అప్పారావ్.. ఏంటి పరిస్థితి!’
హలో.. అప్పారావ్!.. నేను రాజుబాబుని మాట్లాడుతున్నాను. ఏంటి పరిస్థితి? మీ దగ్గర ఎవరు గెలుస్తారు? ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తుందనుకుంటున్నారు? అవతల పార్టీ అభ్యర్థికి ఎన్ని పడుంటాయ్? అయితే మన పార్టీ కేండిడేట్ గెలుపు గ్యారంటీ అన్న మాట! అది సరే.. స్టేట్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారు? నీకున్న సమాచారం ఓ సారి చెప్పు!’ అని అడిగే సరికి ఆ రాజుబాబు తనకు తెలిసినవి కొన్ని, తెలియనివి మరికొన్నింటిని జోడించి అక్కడ వాళ్లు గెలుస్తున్నారు.. ఇక్కడ వీళ్లు గెలుస్తున్నారంటూ టకటకా చెప్పేస్తున్నాడు. మధ్యమధ్యలో అప్పారావుకొచ్చిన డౌట్లను నివృత్తి చేస్తూ ఫలితాలను ముందే ప్రకటిస్తున్నాడు. ఇలాంటి అప్పారావులు, రాజుబాబుల్లాంటి వారు చాలామంది ఈ పనిమీదే ఉన్నారు. ఎక్కడ చూసినా ఇలాంటి చర్చలే సాగిస్తున్నారు. పోలింగ్ ముగిశాక అభ్యర్థులు, పార్టీల గెలుపోటములపైనే అందరి దృష్టి ఉంది. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ కనిపిస్తోంది. సాక్షి, విశాఖపట్నం: అంతేకాదు.. ఎక్కడెక్కడో ఉన్న వారు సైతం తమ స్నేహితులు, బంధువులకు ఫోన్లు చేసి ఎన్నికల ఫలితాలెలా ఉంటాయన్న దానిపైనే మాట్లాడుకుంటున్నారు. సాధారణ ప్రజలకంటే ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, ముఖ్య కార్యకర్తలు వీటిపైనే చర్చించుకుంటున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులకు ఎన్ని ఓట్లు పోలై ఉంటాయి? వాటిలో గెలుపు అంశాలు ఎంతవరకు ఉంటాయన్న దానిపై బేరీజు వేస్తున్నారు. మహిళలు, పురుషులు, వృద్ధులు, యువతీ యువకులు ఎవరికి వేశారోనని ఆరా తీస్తున్నారు. దానిని బట్టి ఫలానా అభ్యరి్థ/పార్టీ గెలుస్తుందని, లేదా ఓటమి పాలవుతారని అంచనాకొస్తున్నారు. ఇలా కూడికలు, తీసివేతల్లో నిమగ్నమై ఉన్నారు. లెక్కలు, అంచనాల్లో తలమునకలై ఉన్నారు. మరోవైపు టీవీల్లోను, సోషల్ మీడియాలోను, యూట్యూబ్ ఛానల్స్లోనూ ఇప్పటికే అనధికారికంగా ఎగ్జిట్ పోల్స్ పేరిట ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయన్నది జోస్యం చెప్పేస్తున్నారు. ఆయా పార్టీల శ్రేణులు, రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారు వీటిని ఎక్కువగా వీక్షిస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఈ ఎన్నికల్లో తమదే శాస్త్రీయమైన సర్వే అని చెప్పుకుంటూ తమ అభిమాన పారీ్టకి అనుకూలంగా ఫలితాలను ఇస్తున్నారు. మరికొందరైతే అధికార వైఎస్సార్సీపీకి అనుకూల ఫలితాలనే కూటమికి వస్తున్నట్టు తారుమారుగా చూపిస్తున్నారు. ఇలా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్లో వ(ఇ)స్తున్న అనధికార అంచనా ఫలితాలు జనాన్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. దీంతో తమ నమ్మకస్తులకు ఫోన్లు చేసి సందేహ నివృత్తి చేసుకుని ఒకింత ఊరట చెందుతున్నారు. వ్యతిరేక ఫలితాలు వస్తాయన్న సంగతి తెలిస్తే ఆందోళనకు గురవుతున్నారు. టీవీలు, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్న సొంత అంచనాల ఫలితాలతో ఇప్పటికే బెట్టింగులకు దిగిన వారు మరింత టెన్షన్ పడుతున్నారు. బెట్టింగులపై కూటమిలో బెరుకు.. మరోవైపు పోలింగ్కు ముందు కూటమి అభ్యర్థులదే గెలుపంటూ పందాల కోసం హడావుడి చేసిన వారు ఇప్పుడు వెనక్కి తగ్గారు. తొలుత 1:2,3 బెట్టింగులకు సిద్ధమన్న వారిప్పుడు 1:1కి కూడా ముందుకు రావడం లేదు. ఏదోలా తామే అధికారంలోకి వస్తామని బీరాలు పలుకుతున్నా.. పందాల దగ్గరకు వచ్చేసరికి పలాయనం చిత్తగిస్తున్నారు. మొత్తమ్మీద అసలు ఫలితాలు వెలువడే జూన్ నాలుగో తేదీ వరకు ఇలాంటి ఊహాగానాలకు తెరపడే అవకాశం లేదు.
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్రోబ్కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్తో, గ్లామ్డేస్ విభిన్నమైన నెక్లెస్లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- Yadadri: ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి
- ఆ ఇద్దరి నామినేషన్లు రద్దు చేయాల్సిందే.. బీజేపీ డిమాండ్
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- పెంపుడు కుక్క పెట్టిన గొడవ.. నడిరోడ్డుపైనే చితకబాదారు
- ‘హలో అప్పారావ్.. ఏంటి పరిస్థితి!’
- సన్నీ లియోన్ బర్త్డేను ఎందుకు జరుపుకున్నారో చెప్పిన యువకులు
- అందుకే ఓడిపోయాం!.. వరుస వైఫల్యాలు.. ఇకనైనా: సంజూ
- తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్కు కుంభవృష్టి హెచ్చరిక!
- సందీప్ లమిచానే శిక్ష రద్దు.. వరల్డ్కప్ జట్టులో చోటు?
- ఏపీలో ఓటేసుకునే స్వేచ్ఛ కూడా లేదా?
సినిమా
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ నెల 20న జూనియర్ బర్త్ డే కావడంతో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా దేవర నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పారు. మే 19న ఫియర్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది.దేవర అప్డేట్తో పాటు చేతిలో గొడ్డలి పట్టుకుని ఉన్న పోస్టర్ను పంచుకున్నారు. ఫియర్ సాంగ్ అంటూ పోస్టర్తోనే ఆసక్తి పెంచేశారు మేకర్స్. ఎన్టీఆర్ పుట్టినరోజుకు కంటే ఒకరోజు ముందుగానే సాంగ్ రిలీజ్ కానుంది. దీంతో జూనియర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. అనిరుధ్ కోలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలకు పని చేస్తున్నారు. రజనీకాంత్ జైలర్ మూవీకి సైతం ఆయన పనిచేశారు.ALL SET for the mighty storm 🌊#DevaraFirstSingle ~ #FearSong will unleash tsunami of madness that will sweep through every coast on May 19th 💥An @anirudhofficial Musical 🎶 #DevaraMan of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN… pic.twitter.com/mRfxMps4FA— Devara (@DevaraMovie) May 15, 2024
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలీవుడ్ భామ జాన్వీకపూర్. త్వరలోనే మిస్టర్ అండ్ మిసెస్ మాహీ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా మారిపోయింది ముద్దుగుమ్మ. తాజాగా బుధవారం ఈ సినిమా నుంచి దేఖా తెను అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రెస్మీట్లో పాల్గొన్న జాన్వీకి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మిమ్మల్ని చేసుకునేవారికి ఎలా ఉండాలో చెప్పగలరా? అని అడిగారు. అయితే దీనికి జాన్వీ కపూర్ ఆసక్తికర సమాధానమిచ్చింది. అదేంటో మీరు చూసేయండి.జాన్వీ కపూర్ మాట్లాడుతూ..' నా కలలను తనవిగా భావించేవాడు. నాకు అండగా నిలిచేవాడు. ఎల్లప్పుడు నాకు సంతోషాన్ని ఇచ్చేవాడు. నన్ను ఎప్పుడు నవ్విస్తూ ఉండేవాడు. నేను ఏడ్చినప్పుడు నా పక్కనే ఉండి ధైర్యం చెప్పేవాడు. అలాంటి లక్షణాలున్న వ్యక్తి కావాలి' అంటూ తన మనసులోని మాటను బయటపెట్టేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.కాగా.. బాలీవుడ్ భామ తన స్నేహితుడు శిఖర్ పహారియాతో డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు జంటగా చాలాసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతే కాకుండా తన పెళ్లి కూడా తిరుమలలోనే జరుగుతుందని ఇప్పటికే వెల్లడించారు. చాలా సింపుల్గా శ్రీవారి ఆలయంలో పెళ్లి చేసుకుంటానని తెలిపింది. మరోవైపు జాన్వీకపూర్ దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆ తర్వాత రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చే మూవీలో నటించనున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
గతేడాది రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన నటి రేణు దేశాయ్. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి అభిమానులను మెప్పించారు. గుంటూరులోని స్టువర్టుపురం గజదొంగ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా రేణు దేశాయ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం.రేణు దేశాయ్ తన ఇన్స్టాలో క్యూఆర్ కోడ్ను షేర్ చేస్తూ విరాళాలు కావాలంటూ అభ్యర్థించింది. అయితే ఇంత త్వరగా స్పందించి విరాళం అందించి.. మానవత్వం చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. నా వంతుగా నేను కూడా సాయం చేస్తున్నప్పటికీ.. మిగిలిన అమౌంట్ కోసం నా ఫాలోవర్స్ను అడుగున్నానని రాసుకొచ్చింది. ప్రతిసారీ నా డబ్బును ఇవ్వలేను.. ఎందుకంటే నా దగ్గర కూడా కొంత మాత్రమే డబ్బులు మిగిలి ఉన్నాయని పేర్కొంది. అయితే ఎవరైనా ఆమె అకౌంట్ను హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేశారా? అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ వీడియోను పంచుకుంది.రేణు దేశాయ్ మాట్లాడుతూ.. 'ఫుడ్ పాయిజన్ తో కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాగాలేదు. అందుకే వీడియో చేయలేదు. అయితే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టింది నేనే. నా అకౌంట్ను ఎవరూ హ్యాక్ చేయలేదు. నేను కూడా రెగ్యులర్గా డొనేట్ చేస్తూనే ఉంటాను. కానీ అప్పుడప్పుడు నాకు కూడా లిమిట్ ఉంటుంది. డొనేషన్స్కి నా డబ్బులంతా ఇచ్చేస్తే నాకోసం.. నా పిల్లల కోసం కావాలి కదా. నా వరకు సాయం చేశాక.. ఏదైనా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్ను అడుగుతున్నా. యానిమల్స్, చిన్నపిల్లల కోసం కూడా నేను విరాళాలు ఇస్తున్నా. అదే నా ఫైనల్ టార్గెట్ కూడా. త్వరలోనే వాటికోసం ఓ షెల్టర్ కూడా నిర్మిస్తాను. అప్పుడు నేనే మిమ్మల్ని అధికారికంగా విరాళాలు సేకరిస్తా. నా రిక్సెస్ట్కు స్పందించి రూ.3500 పంపించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ' అంటూ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai)
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన త్రిష కనిపంచనుంది. వీరిద్దరు గతంలో స్టాలిన్ చిత్రంలో జంటగా నటించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీలో మరో సీనియర్ నటిని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం.విశ్వంభరలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి కోసం దర్శకుడు వశిష్ట సంప్రదించినట్లు సమాచారం. ఈ పాత్ర కోసం ముందుగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతిని సంప్రదించారట. కానీ ఆమె నో చెప్పినట్లు టాక్. అయితే అదే పాత్ర కోసం మరో సీనియర్ నటి ఖుష్బూని సంపద్రించగా కథ నచ్చడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో స్టాలిన్ చిత్రంలో కూడా ఖుష్బు నటించారు. మరోవైపు ఈ చిత్రంలో త్రిష ద్విపాత్రాభినయం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ చిత్రంలో త్రిషతో పాటు సురభి, ఇషా చావ్లా కూడా నటిస్తున్నారు. వచ్చే సంక్రాతి పండుగ కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్పై దాదాపు రూ.200కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇదే నిజమైతే చిరంజీవి కెరీర్లో ఇది భారీ బడ్జెట్ చిత్రంగా నిలుస్తుంది. ఇందులో త్రిషతో పాటు సురభి, ఇషా చావ్లా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే సంక్రాతి పండుగ కానుకగా జనవరి 10న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు.
ఫొటోలు
శృతి శర్మ : ‘హీరామండి’లో మెరిసిన ‘ఏజెంట్’ హీరోయిన్
సీఎం జగన్కు వేద పండితుల ఆశీర్వచనం (ఫొటోలు)
రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’ సినిమా టీజర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియంలో ఫుల్ జోష్లో SRH, GT ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
తిరుపతి గంగమ్మ జాతర తొలి రోజు బైరాగి వేషంతో భక్తుల సందడి (ఫొటోలు)
క్రీడలు
IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశ ముగింపునకు వచ్చినా టాప్-4 బెర్తులపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరగా.. మిగిలిన రెండు స్థానాల కోసం ఆసక్తికర పోటీ నడుస్తోంది.ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఈ రేసులో ముందుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కూడా ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.చెన్నై ఇప్పటికి 13 మ్యాచ్లు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లు(నెట్ రన్రేటు 0.528) సాధించగా.. పన్నెండు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లతో ఉన్న సన్రైజర్స్ నెట్ రన్రేటు (0.406) పరంగా కాస్త వెనుకబడి ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.అతిపెద్ద సానుకూలాంశంఅయితే, రైజర్స్కు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉండటం.. అది కూడా సొంతగడ్డపై జరుగనుండటం అతిపెద్ద సానుకూలాంశం. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లలో ఏదో ఒకటి గెలిచినా 16 పాయింట్లతో కనీసం నాలుగో స్థానం ఖరారు చేసుకుంటుంది.మరోవైపు.. ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లే ఉన్నాయి. మిగిలింది ఇంకొక్క మ్యాచ్. అది కూడా సీఎస్కే(మే 18)తో! ఈ మ్యాచ్లో చెన్నైని కచ్చితంగా ఓడిస్తేనే ఆర్సీబీకి అవకాశం ఉంటుంది. లేదంటే ఇంటికి వెళ్లడమే తరువాయి!చెన్నై పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. ఓడితే ఇంటికే లేదంటే సన్రైజర్స్ మ్యాచ్ల ఫలితం తేలేవరకు వేచి చూడాలి. ఈ సమీకరణల నేపథ్యంలో ఎలా చూసినా సన్రైజర్స్ సీఎస్కే, ఆర్సీబీ కంటే ఓ మెట్టు పైనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.రెండు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి?అయితే, టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి ప్లే ఆఫ్స్ చేరదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకుంటూ.. చెన్నై సూపర్ కింగ్స్తో పాటు ఆర్సీబీ టాప్-4లో అడుగుపెడుతుందని జోస్యం చెప్పాడు.‘‘తదుపరి రెండు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఐపీఎల్లో ఏదైనా జరగొచ్చు కదా! ఒకవేళ హైదరాబాద్ రెండు మ్యాచ్లూ ఓడి.. ఆర్సీబీ చెన్నై మీద గెలిస్తే.. అప్పుడు రెండు జట్ల ఖాతాలో 14 పాయింట్లే ఉంటాయి.రన్రేటు పరంగా సన్రైజర్స్ కంటే ఈ రెండు జట్లు మెరుగ్గానే ఉంటాయి. అందుకే నా టాప్ 4.. కేకేఆర్, రాజస్తాన్, చెన్నై, బెంగళూరు’’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.భగ్గుమంటున్న ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్కాగా భజ్జీ వ్యాఖ్యలపై సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు భగ్గుమంటున్నారు. విధ్వంసకర బ్యాటింగ్తో సొంతగడ్డపై చెలరేగే ప్యాట్ కమిన్స్ బృందాన్ని తక్కువ అంచనా వేయడమే గాకుండా.. అపశకునపు మాటలు మాట్లాడటం సరికాదంటూ ఫైర్ అవుతున్నారు. ఇక సన్రైజర్స్ గురువారం నాటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్ను అంటారా?.. గంభీర్ ఫైర్ Ready to put on a show this evening 🧡💙#PlayWithFire #SRHvGT pic.twitter.com/o07Or5fu12— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం!
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–13తో నూర్ మొహమ్మద్–తాన్ వీ కియోంగ్ (మలేసియా) జంటపై విజయం సాధించింది.పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. భారత రైజింగ్ స్టార్, ప్రపంచ 84వ ర్యాంకర్ మైస్నం మిరాబా లువాంగ్ వరుస గేముల్లో ప్రణయ్ను ఓడించి తన కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకున్నాడు.55 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో మిరాబా 21–19, 21–18తో ప్రణయ్ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. భారత్కే చెందిన కిరణ్ జార్జి, సతీశ్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. కిరణ్ 15–21, 21–13, 17–21తో మాడ్స్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో... సతీశ్ 13–21, 17–21తో జేసన్ గుణవన్ (హాంకాంగ్) చేతిలో పరాజయం పాలయ్యారు.అష్మిత మినహా...మహిళల సింగిల్స్లో భారత్ నుంచి ఐదుగురు బరిలోకి దిగగా... అష్మిత మినహా మిగతా నలుగురు ఉన్నతి హుడా, సామియా, మాళవిక, ఆకర్షి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. అష్మిత 19–21, 21–15, 21–14తో ఎస్తర్ నురిమి (ఇండోనేసియా) పై గెలిచింది. ఉన్నతి 21–14, 14–21, 19–21తో లియాన్ టాన్ (బెల్జియం) చేతిలో, సామియా 13–21, 13–21తో గావో ఫాంగ్ జి (చైనా) చేతిలో ... మాళవిక 11–21, 10–21తో హాన్ యువె (చైనా) చేతిలో, ఆకర్షి 13–21, 8–21తో బుసానన్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యారు.
సందీప్ లమిచానే శిక్ష రద్దు.. వరల్డ్కప్ జట్టులో చోటు?
క్రిమినల్ కేసు నుంచి నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లమిచానేకు హైకోర్టు లో పెద్ద ఊరట లభించింది. ఓ మహిళపై లైంగిక దాడి కేసులో ఖాట్మండు జిల్లా కోర్టు విధించిన 8 ఏళ్ల జైలు శిక్షను పటాన్ హైకోర్టు రద్దు చేసింది.నేపాల్ మాజీ కెప్టెన్ లమిచానే 2022 ఆగస్టు 21న ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఖాట్మండు కోర్టు అతనికి రూ. 3 లక్షలు జరిమానా, మరో రూ. 2 లక్షలు బాధితురాలికి పరిహారంతో పాటు 8 ఏళ్లు జైలు శిక్షను ఖరారు చేసింది.బెయిల్పై బయటికి వచ్చిన లమిచానే కేసును బుధవారం విచారించిన హైకోర్టు కింది కోర్టు శిక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. 23 ఏళ్ల లమిచానే నేపాల్ తరఫున 51 వన్డేలు ఆడి 112 వికెట్లు, 52 టి20లు ఆడి 98 వికెట్లు తీశాడు. వరల్డ్కప్ జట్టులోఇక సందీప్ లమిచానే నిర్దోషిగా తేలడంతో అతడు టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే నేపాల్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం మే 25 వరకు జట్టులో మార్పులు చేర్పులకు అవకాశం ఉంది.టీ20 ప్రపంచకప్-2024 కోసం నేపాల్ ప్రకటించిన జట్టురోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సా, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, ప్రతిస్ జిసి, సందీప్ జోరా, అబినాష్ బోహారా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ.
అందుకే ఓడిపోయాం!.. వరుస వైఫల్యాలు.. ఇకనైనా: సంజూ
ఐపీఎల్-2024లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరినా వరుస పరాజయాలతో అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది రాజస్తాన్ రాయల్స్. ఆరంభం నుంచి అదరగొట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం పోటీ పడిన సంజూ శాంసన్ సేన.. తాజా ఓటమితో రెండోస్థానం కూడా నిలబెట్టుకోలేని స్థితికి చేరింది.పంజాబ్ కింగ్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ ఐదు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా నామమాత్రపు స్కోరుకు పరిమితమై చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ సంజూ శాంసన్ ఓటమిపై స్పందించాడు.అందుకే ఓడిపోయాం‘‘మేము ఇంకొన్ని పరుగులు చేయాల్సింది. 10- 15 పరుగులు వెనుకబడి ఉన్నాం. మేము గనుక మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే ఈ వికెట్ మీద 160 కంటే ఎక్కువ పరుగులే రాబట్టగలిగేవాళ్లం.తక్కువ స్కోరుకు పరిమితమైపోయినపుడే మ్యాచ్ దాదాపుగా మా చేజారిపోయింది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థిని కట్టడి చేయడం కోసం నేను ఏకంగా ఐదుగురు నాణ్యమైన బౌలర్లను బరిలోకి దింపాను.వైఫల్యాలు అంగీకరించకతప్పదుకానీ ఫలితం లేకుండాపోయింది. గత నాలుగు మ్యాచ్లలో మేము ఓడిపోయాం. మా వైఫల్యాలను అంగీకరించకతప్పదు. జట్టులోని లోపాల గురించి చర్చించుకోవాల్సి ఉంది. మేము చేస్తున్న పొరపాట్లు ఏమిటో తెలుసుకోవాలి.ఇక ముందు మరింత జాగ్రత్తగా ఉండాలి. పట్టుదలగా పోరాడాలి. ఈరోజు మేము మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పి ఉంటే ఫలితం వేరేలా ఉండేది’’ అని సంజూ శాంసన్ విచారం వ్యక్తం చేశాడు.ఇకనైనారానున్న మ్యాచ్లలోనైనా ఇలాంటి తప్పిదాలు పునరావృతం చేయకుండా ఉండాలంటూ జట్టును ఉద్దేశించి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశాడు. కాగా ఇప్పటి వరకు ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన రాజస్తాన్ ఎనిమిదింట గెలిచి 16 పాయింట్లతో ఇప్పటికే ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించింది.అయితే, గత నాలుగు మ్యాచ్లలో మాత్రం వరుసగా ఓడిపోతోంది. మరోవైపు పట్టికలో మూడో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తమకు మిగిలిన ఒక మ్యాచ్ గెలిస్తే 16 పాయింట్లు సాధిస్తుంది. రాజస్తాన్(0.273) కంటే నెట్ రన్రేటు పరంగా చెన్నై మెరుగైన స్థితిలో ఉంది.రెండో స్థానం కోసం పోటీమరోవైపు నాలుగో స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్కు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. రెండింటిలో గెలిస్తే ఆ జట్టు ఖాతాలో మొత్తం 18 పాయింట్లు అవుతాయి. కాబట్టి రాజస్తాన్ తమకు మిగిలిన మరో మ్యాచ్ భారీ తేడాతో గెలిస్తేనే రెండో స్థానం కోసం పోటీ పడే అవకాశం ఉంటుంది. లేదంటే మిగతా జట్ల మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.రాజస్తాన్ వర్సెస్ పంజాబ్ స్కోర్లు:👉వేదిక: బర్సపరా క్రికెట్ స్టేడియం.. గువాహటి👉టాస్: రాజస్తాన్.. బ్యాటింగ్👉రాజస్తాన్ స్కోరు: 144/9 (20)👉పంజాబ్ స్కోరు: 145/5 (18.5)👉ఫలితం: రాజస్తాన్పై ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సామ్ కరన్(పంజాబ్ కెప్టెన్.. 2/24, 41 బంతుల్లో 63 నాటౌట్).చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్ను అంటారా?.. గంభీర్ ఫైర్ A successful outing in Guwahati thanks to a successful chase from the Punjab Kings ❤️Captain Sam Curran remains unbeaten to complete a 5-wicket win 👏👏Scorecard ▶️ https://t.co/IKSsmcpSsa#TATAIPL | #RRvPBKS pic.twitter.com/MArpGY4ELY— IndianPremierLeague (@IPL) May 15, 2024
బిజినెస్
ఎస్బీఐ కస్టమర్లకు గుడ్న్యూస్..
ముంబై: ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. టైల్ స్థిర డిపాజిట్లకు (రూ.2 కోట్ల వరకూ ఎఫ్డీలు) సంబంధించి కొన్ని కాల పరిమితులపై వడ్డీరేట్లను పెంచింది. 2023 డిసెంబర్ తర్వాత బ్యాంక్ ఎఫ్డీలపై వడ్డీరేటు పెంచడం ఇదే తొలిసారి. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, ఈ రేట్లు మే 15 నుంచి అమల్లోకి వస్తాయి. 46 రోజుల నుంచి 179 రోజులు, 180 నుంచి 210 రోజులు, 211 రోజుల నుంచి ఏడాది లోపు కాలపరిమితుల డిపాజిట్ రేట్లు 25 నుంచి 75 బేసిస్ పాయింట్ల శ్రేణిలో (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరిగాయి. కాగా, సీనియర్ సిటిజన్లకు ఆయా కాలపరిమితులపై (టేబుల్లో పేర్కొన్న రేట్ల కన్నా అదనంగా) పేర్కొన్న డిపాజిట్ రేట్లకు అదనంగా మరో 50 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు లభిస్తుంది. దీర్ఘకాలిక (ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్య) డిపాజిట్పై ఏకంగా 1% వరకూ అదనపు వడ్డీరేటు లభిస్తుంది. తాజా రేట్లు ఇలా... కాల పరిమితి వడ్డీ(%) 7–45 రోజులు 3.546–179 రోజులు 5.5 180–210 రోజులు 6.0 211 రోజులు– ఏడాది 6.25 ఏడాది–రెండేళ్లు 6.80 రెండేళ్లు–మూడేళ్లు 7.00 మూడేళ్లు– ఐదేళ్లు 6.75ఐదేళ్లు– పదేళ్లు 6.50
ఎయిరిండియా–విస్తారా విలీన ప్రక్రియలో పురోగతి
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ విమానయాన సంస్థలు ఎయిరిండియా, విస్తారా విలీన ప్ర క్రియ వేగం పుంజుకుంటోంది. ఇందులో భాగంగా ఇ రు సంస్థలకు చెందిన 7 వేల మంది ఉద్యోగుల ఫిట్ మెంట్ (ప్రస్తుత ఉద్యోగులను విలీన సంస్థలో వారికి అప్పగించే బాధ్యతలు) ప్రక్రియ జూన్ కల్లా పూర్తి కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం రెండు సంస్థల ఉద్యోగులతో దాదాపు గంటన్నర పా టు సమావేశం అయిన సందర్భంగా ఈ విషయాలు వి వరించినట్లు పేర్కొన్నాయి. ఇరు కంపెనీల్లో ప్రస్తుతం 23,500 మంది పైగా సిబ్బంది ఉన్నారు. ఎయిరిండియాను 2022 జనవరిలో టాటా గ్రూప్ టేకోవర్ చేసింది. సింగపూర్ ఎయిర్లైన్స్తో తమకు జాయింట్ వెంచరుగా ఉన్న విస్తారను, ఎయిరిండియాను విలీనం చేయనున్నట్లు 2022 నవంబర్లో ప్రకటించింది. ఈ డీల్ పూర్తయితే ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్ కు 25.1% వాటా ఉంటుంది. అలాగే ఎయిరిండియా అతి పెద్ద విమానయాన సంస్థల్లో ఒకటిగా నిలుస్తుంది.
ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడులు డౌన్
న్యూఢిల్లీ: ఎన్నికల ముందు మార్కెట్లలో ఒడిదుడుకులు పెరగడం, లార్జ్ క్యాప్ ఫండ్స్లోకి పెట్టుబడుల ప్రవాహం తగ్గడం తదితర అంశాల కారణంగా ఏప్రిల్లో ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్లోకి ఇన్వెస్ట్మెంట్లు క్షీణించాయి. మార్చితో పోలిస్తే 16 శాతం తగ్గి రూ. 18,917 కోట్లకు పరిమితమయ్యాయి. ప్రవాహం కొంత తగ్గినప్పటికీ 2021 మార్చి నుంచి చూస్తే వరుసగా 38వ నెల కూడా ఈక్విటీ ఫండ్స్లోకి నికరంగా పెట్టుబడుల రాక కొనసాగినట్లు మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) గణాంకాల్లో వెల్లడైంది. మరోవైపు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్) రూపంలో పెట్టుబడులు ఏప్రిల్లో కీలకమైన రూ. 20,000 కోట్ల మార్కును దాటి ఆల్–టైమ్ గరిష్ట స్థాయి రూ. 20,371 కోట్లకు చేరాయి. అంతక్రితం నెలలో ఇవి రూ. 19,271 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం మీద మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ నుంచి మార్చిలో రూ. 1.6 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరగ్గా, ఏప్రిల్లో రూ. 2.4 లక్షల కోట్లు వచ్చాయి. డెట్ స్కీముల్లోకి అత్యధికంగా రూ. 1.9 లక్షల కోట్లు వచ్చాయి. యాంఫీ గణాంకాల్లో మరిన్ని విశేషాలు.. → ఈక్విటీ, డెట్ కేటగిరీల్లోకి పెట్టుబడులు ప్రవా హం పటిష్టంగా ఉండటంతో నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 57.26 లక్షల కోట్లకు పెరిగింది. మార్చి ఆఖరు నాటికి ఇది రూ. 53.54 లక్షల కోట్లుగా ఉంది. → ఈక్విటీ ఆధారిత స్కీముల్లోకి ఏప్రిల్లో రూ. 18,917 కోట్లు వచ్చాయి. మార్చిలో ఇది రూ. 22,633 కోట్లుగా, ఫిబ్రవరిలో రూ. 26,866 కోట్లుగా నమోదైంది. → గత నెల ఓపెన్ ఎండెడ్ స్కీముల విభాగంలో తొమ్మిది స్కీముల ద్వారా ఫండ్ సంస్థలు రూ. 1,532 కోట్లు సమీకరించాయి. → లార్జ్ క్యాప్ ఫండ్స్లోకి పెట్టుబడులు మార్చిలో రూ. 2,128 కోట్లు రాగా ఏప్రిల్లో ఏకంగా రూ. 357 కోట్లకు పడిపోయాయి. స్మాల్ క్యాప్ కేటగిరీలోకి రూ. 2,208 కోట్లు వచ్చాయి. అంతక్రితం నెలలో రూ. 94 కోట్ల ఇన్వెస్ట్మెంట్లను మదుపరులు వెనక్కి తీసుకున్నారు. సెక్టోరల్, థీమాటిక్ ఫండ్స్లోకి రూ. 5,166 కోట్లు, మలీ్ట–క్యాప్ కేటగిరీలోకి రూ. 2,724 కోట్లు వచ్చాయి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల నుంచి రూ. 144 కోట్ల ఉపసంహరణ జరిగింది. → హైబ్రిడ్ ఫండ్స్లోకి చెప్పకోతగ్గ స్థాయిలోకి రూ. 19,863 కోట్లు రాగా, డెట్ ఆధారిత స్కీముల విషయానికొస్తే లిక్విడ్ ఫండ్స్లోకి రూ. 1.02 లక్షల కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్లోకి రూ. 34,000 కోట్లు, ఓవర్నైట్ ఫండ్స్లోకి రూ. 21,000 కోట్లు వచ్చాయి. → మ్యుచువల్ ఫండ్స్ ఫోలియోల సంఖ్య ఆల్టైమ్ గరిష్ట స్థాయి 18.14 కోట్లకు చేరింది.
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం ఫ్లాట్గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 22,210 వద్దకు చేరింది. సెన్సెక్స్ 66 పాయింట్లు దిగజారి 73,038 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో పవర్గ్రిడ్, భారతీఎయిర్టెల్, ఎం అండ్ ఎం, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ అండ్ టీ, విప్రో, ఎస్బీఐ, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, సన్ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్యూఎల్, నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, మారుతీసుజుకీ, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ కంపెనీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
వీడియోలు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం..
పల్నాడు దాడుల వెనక పోలీసుల నిర్లక్ష్యం...
నేడు ఢిల్లీకి ఏపీ సీఎస్, డీజీపీ..
జంగా కృష్ణ మూర్తిపై అనర్హత వేటు
ప్రారంభమైన ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు
ఎల్లో టెర్రరిజం..బాబు, పురందేశ్వరి కుట్ర దీనికోసమేనా ?
నీ శకం ముగిసింది బాబు..
చంద్రబాబు ఏమైనా హీరోనా ?..అంబటి మురళి మాస్ ర్యాగింగ్
ఏపీ పోలీస్ అబ్జర్వర్ పై మెరుగు నాగార్జున ఫైర్
ఘనంగా ప్రారంభమైన గంగమ్మ జాతర
ఫ్యామిలీ
‘రైజ్ ఏ చైల్డ్’..! కొత్త తల్లులకు పెద్ద బాలశిక్ష..
పాపాయి నిద్రపుచ్చినంతసేపు కూడా పడుకోలేదు. భుజానికెత్తుకుని తిప్పి తిప్పి నిద్రపుచ్చి ఇలా మంచం మీద పెట్టానో లేదో వెంటనే లేచేసింది. ఈ బిడ్డతో నేనేం చేయను’ చంటిబిడ్డను పెంచే ప్రతి తల్లి నుంచి వినవచ్చే మాటే ఇది. ఆ తల్లి వెలిబుచ్చిన నిస్సహాయతలో అగాధం వంటి ఆవేదన దాగి ఉంటుంది. ఈపాట్లన్నీ పడిపాపాయిని ఆరు నెలలు పెంచేసరికి మెటర్నిటీ లీవ్ అయిపోతుంది.అప్పుడు మరో ప్రశ్న... ‘బిడ్డను కేర్ టేకర్ చేతిలో పెట్టి ఉద్యోగానికి వెళ్లవచ్చా. చక్కగా చూసుకోగలిగిన ఆయాలు దొరికితే బావుణ్ను’. బిడ్డకు ఘనాహారం ఎప్పుడు ఇవ్వాలో డాక్టర్లు చెబుతారు, కానీ ఎలా తినిపించాలనేది మాత్రం బిడ్డను పెంచిన అనుభవం ఉన్న తల్లులే చెప్పాలి. పిల్లల్ని పెంచడంలో ఎదురయ్యే ఇలాంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వెలిసిందో గ్రామం. దాని పేరే ‘రైజ్ ఏ చైల్డ్’. ఎక్కడ ఉందీ గ్రామం. ఈ గ్రామం అడ్రస్ చెప్పాలంటే కేరాఫ్ డిజిటల్ మీడియా అని చెప్పాలి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల్లేవు, నగరాల్లో అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలే. పసిబిడ్డ అమ్మమ్మ, నానమ్మల చేతిలో పెరిగే అవకాశాలు తగ్గిపోయిన ఈ కాలంలో బిడ్డ సంరక్షణలో తల్లులకు ఎదురయ్యే సందేహాలను డిజిటల్ మాధ్యమం ద్వారా ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. వివిధ ్రపాంతాల్లో ఉన్న తల్లులు ఇందులో జాయిన్ అయ్యారు. ‘క్వశ్చన్స్ అరౌండ్ బ్రెస్ట్ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఇండియన్ మదర్స్, బేబీ లెడ్ వీనింగ్, గుడ్ షెడ్యూల్ ఫర్ బేబీస్, క్లాత్ డయాపరింగ్ ఇండియా, ఫస్ట్ ఫార్టీ డేస్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్’ వంటి పది గ్రూప్లను ఒక గొడుగు కిందకు తీసుకువస్తూ ‘రైజ్ ఏ చైల్డ్’ పేరుతో ఒక వర్చువల్ విలేజ్కి రూప కల్పన చేసింది రోహిణి అనే మహిళ.‘‘నిజానికి నాకెదురైన సమస్యలే ఈ వర్చువల్ విలేజ్ రూపకల్పనకు నాంది. గర్భధారణ, ప్రసవం 30 ఏళ్లలోపు జరగాలని వైద్యులు సూచిస్తుంటారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఉన్నత చదువులు, ఉద్యోగాలలో స్థిరపడిన తరవాతనే పెళ్లి. దాంతో పిల్లలను కనే వయసు దాటిపోతోంది. నేను 32 ఏళ్ల వయసులో గర్భం దాల్చాను. డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నప్పటికీ రోజువారీ ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారం కోసం మళ్లీ డాక్టర్ చెకప్ వరకు ఆగలేం.అప్పటికీ రోజూ ఫోన్ చేసి అమ్మ, అత్తగారిని అడిగి తెలుసుకుంటున్నప్పటికీ నేను సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నానా లేదా అనే సందేహం. పాత తరం వారి అనుభవంతోపాటు కొత్తతరంలో అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలను కూడా తెలుసుకోవాలని చేసిన ప్రయత్నంలో సోషల్ మీడియాలో ఇన్ని వేదికలున్నాయని తెలిసింది. ఆ గ్రూప్ల అడ్మిన్లందరితో మాట్లాడి అన్నింటినీ ‘రైజ్ ఏ చైల్డ్’ గొడుగు కిందకు తీసుకువచ్చాను. గర్భిణులకు, కొత్త తల్లులకు ఇది ఒక వరంగా మారింది. ఇది మనదేశంలో ఉన్న వాళ్లకే కాదు, విదేశాల్లో ఉన్న మనవాళ్లకు కూడా ఉపయోగపడుతోంది. నిజానికి మనకంటే వాళ్లకే ఎక్కువగా ఉపయోగపడుతోంది.ఎందుకంటే ఐర్లాండ్లో ఉన్న ఒక మహిళ అక్కడి వైద్యవిధానాలు, వైద్యుల సూచనను యథాతథంగా పాటించింది. కానీ ఆ పద్ధతులుపాపాయికి సౌకర్యంగా అనిపించడం లేదని తెలిసి ‘రైజ్ ఏ చైల్డ్’లో చేరింది. చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఒకరు తమ సమస్యనుపోస్ట్ చేసిన తర్వాత ఆలాంటి సమస్యను ఎదుర్కొని బయటపడిన వాళ్లు తాము ఆ సమస్య ఎలా పరిష్కరించుకున్నారో అనుభవపూర్వకంగా తెలియచేస్తారు’’ అని వివరించింది రోహిణి. రైజ్ ఏ చైల్డ్ మొత్తానికి కొత్త తల్లులకు పెద్దబాలశిక్ష అయింది. "ఇందులో ఒకరు తమ సమస్యను పోస్ట్ చేసిన తర్వాత ఆలాంటి సమస్యను ఎదుర్కొని బయటపడిన వాళ్లు తాము ఆ సమస్య ఎలా పరిష్కరించుకున్నారో అనుభవపూర్వకంగా తెలియచేస్తారు".
అమ్మ చెప్పిన మాటే.. ఇప్పుడీ స్థాయికి!
ప్రీతిక మెహతాను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ‘గ్లోబల్ షార్పర్’గా గుర్తించింది. చండీగఢ్కు చెందిన ప్రీతిక బహుముఖ ప్రజ్ఞాశాలి. గణిత మేధావి, డేటా సైంటిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్గా పేరు తెచ్చుకున్న ప్రీతిక ‘బటర్నట్ ఏఐ’తో ఎంటర్ప్రెన్యూర్గా కూడా రాణిస్తోంది. మరోవైపు మోటివేషనల్ స్పీకర్గా ఎంతోమందికి ధైర్యాన్ని ఇస్తోంది. మార్గనిర్దేశం చేస్తోంది.లెక్కలు అంటే చాలామంది పిల్లలకు భయం. అయితే చిన్నప్పటి నుంచి ప్రీతికకు లెక్కలు అంటే చెప్పలేనంత ఇష్టం. బొమ్మలు వేయడం అంటే కూడా ఇష్టం. పద్నాలుగు సంవత్సరాల వయసులో కోడింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఒక ప్రొడక్ట్ స్టార్టప్లో తొలి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ఆసక్తి పెరిగింది. దాంతో ఉద్యోగాన్ని వదులుకొని న్యూయార్క్లోని స్టేట్ యూనివర్శిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మాస్టర్స్ చేసింది.ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ఖర్చుల కోసం ఒక రెస్టారెంట్లో పనిచేసేది. గ్రాడ్యుయేషన్ సెర్మనీకి ప్రీతిక తల్లి అమెరికాకు వచ్చింది. తల్లిని తన ప్రొఫెసర్కు పరిచయం చేసింది. ‘మీ అమ్మాయి బ్రైట్ స్టూడెంట్. క్లాస్రూమ్లో లోతైన ప్రశ్నలు అడిగేది. మీ కూతురికి మంచి భవిష్యత్ ఉంది’ అంటూ ఆ ప్రొఫెసర్ ప్రీతికపై ప్రశంసల వర్షం కురిపించాడు.ప్రొఫెసర్ మాటలు విన్న తరువాత ప్రీతికకు తన మీద ఉన్న నమ్మకం రెట్టింపు అయింది. ‘యస్. నేను సాధించగలను’ అనుకుంది. బోస్టన్లోని ‘బాంక్ ఆఫ్ అమెరికా’లో పనిచేసే అవకాశం ప్రీతికకు వచ్చింది. అయితే సొంతంగా ఏదైనా సాధించాలనే లక్ష్యంతో అధిక వేతనంతో కూడిన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ప్రీతిక నిర్ణయం కుటుంబ సభ్యులతో సహా చాలామందికి నచ్చలేదు.‘బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగ జీవితం బాగున్నప్పటికీ నాలో ఉన్న అన్ని టాలెంట్స్ను ఉపయోగించుకునే అవకాశం దొరకలేదు’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది ప్రీతిక. అమెరికా నుంచి వచ్చిన తరువాత పిల్లలకు కోడింగ్ నేర్పించడానికి ‘కిడ్డీకోడర్స్’ను స్టార్ట్ చేసి పన్నెండు దేశాలకు వెళ్లింది. ఆ తరువాత సాక్సోహో.కామ్తో మెన్స్ ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.‘మెన్స్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు ఉన్నాయని రిసెర్చ్ ద్వారా తెలుసుకున్నాను. ఈ స్పేస్లో గ్లోబల్ స్టార్టప్ నిర్మించవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాక్సోహో మొదలు పెట్టాను’ అంటుంది ప్రీతిక.తనకు పట్టు ఉన్న డేటా, ఏఐ సబ్జెక్ట్లతో కస్టమర్ల వ్యక్తిగత అనుభవాలతో కంపెనీని బిల్డ్ చేసింది. యూఎస్లో చదువుకునే రోజుల్లోపార్ట్టైమ్ ఉద్యోగిగా ఒక ఇటాలియన్ రెస్టారెంట్లో పనిచేసింది. అది కస్టమర్–ఫేసింగ్ జాబ్ కావడం వల్ల ఎన్నో విషయాలపై అవగాహన వచ్చింది. ఆ జ్ఞానం ‘సాక్సోహో’కు ఉపయోగపడింది. డైరెక్ట్–టు–కన్జ్యూమర్ ఫ్యాషన్ బ్రాండ్ ‘సాక్సోహో’ తో ఎంటర్ప్రెన్యూర్గా విజయకేతనం ఎగరేసింది ప్రీతిక. ‘మనపై మనకు ఉన్న నమ్మకమే శక్తి. దానితో ఎన్ని విజయాలైనా సాధించవచ్చు’ అంటుంది ప్రీతిక మెహతా.మార్గనిర్దేశం..‘ఉన్నత స్థానానికి చేరుకున్న మహిళలకు తమ స్థాయిని కా΄ాడుకోవడానికి రెట్టింపు కష్టపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో లక్ష్యసాధనకు సంబంధించి అమ్మాయిలకు మార్గనిర్దేశం చేయడానికి వారికి సమయం దొరకదు’ అంటున్న ప్రీతిక ఎంటర్ప్రెన్యూర్గా ఎంత బిజీగా ఉన్నప్పటికి లక్ష్యసాధన విషయంలో అమ్మాయిలకు మార్గనిర్దేశం చేయడానికి ఎన్నో సమావేశాల్లోపాల్గొంది. ఎంటర్ప్రెన్యూర్గానే కాదు మోటివేషనల్ స్పీకర్గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ‘థింక్. లెర్న్. డిసైడ్ విత్ యువర్ ఓన్ హెడ్ అండ్ హార్ట్’ అనేది ఎన్నో సమావేశాలలో ప్రీతిక నుంచి వినిపించే మాట.అమ్మ చెప్పిన మాట..చదువుకునే రోజుల్లో ఎందరో విజేతల కథలు నాకు స్ఫూర్తి ఇచ్చాయి. అదే సమయంలో ‘ప్రతి రంగంలో పురుషులతో పోల్చితే మహిళా విజేతలు ఎందుకు తక్కువగా ఉన్నారు?’ అని ఆలోచించేదాన్ని. ఈ ఆలోచనలతోనే నా వంతుగా ఏదైనా సాధించాలనే పట్టుదల పెరిగింది. చిన్నప్పుడు స్కూల్ మార్చమని ఇంట్లో గొడవ చేశాను. దీనికి కారణం క్లాసులో 80 మంది స్టూడెంట్స్ ఉండడం. ‘ఇంత మంది మధ్య నేను టాపర్గా ఎలా ఉండగలను’ అన్నాను.‘ఇరవైమందిలో ఎలాగైతే టాపర్గా నిలిచావో 80 మందిలో కూడా టాపర్గా నిలవాలి’ అని అమ్మ చెప్పింది. వందమందిలో రాణించగలిగినప్పుడు వెయ్యిమందిలో కూడా రాణించగలం అనే సత్యం బోధపడింది. మనలో సామర్థ్యం ఉన్నప్పుడు సంఖ్య ముఖ్యం కాదు. ఒకవైపు భవిష్యత్ లక్ష్యాలు. మరోవైపు ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలు.‘ఈ డ్రెస్తో బయటికి వెళతావా?’ ‘అబ్బాయిలా పొడుగ్గా పెరుగుతున్నావేమిటి?’... ఇలాంటి నాన్సెన్స్ మైండ్సెట్ కామెంట్స్ చిరాకు కలిగించేవి కానీ నా భవిష్యత్ లక్ష్యాలను నీరుగార్చలేకపోయాయి. మన దేశంలోనే కాదు అమెరికాలోనూ వృత్తిజీవితంలో లింగవివక్షతను ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అయితే అలాంటి వాటికి చిన్నబుచ్చుకోకుండా టాలెంట్తోనే సమాధానం చె΄్పాను.– ప్రీతిక మెహతా
వడాపావ్ మంత్రం: పద్మాసని విజయరహస్యం
ఇంటి పనులతోనే సమయం సరిపోవడం లేదనే కంప్లైంట్ గృహిణుల నోట తరచూ వినిపిస్తుంటుంది. కొందరు మాత్రం కొద్దిపాటి ఖాళీ సమయాన్ని కూడాసద్వినియోగం చేసుకుంటూ తమని తాము తీర్చిదిద్దుకుంటారు. అలాంటి కొందరిలో పద్మాసని దరూరి ఒకరు. హైదరాబాద్ మాదాపూర్లో ఉంటున్న 53 ఏళ్ల పద్మాసని దరూరి గృహిణిగా ఉంటూ సంస్కృతంతో పాటు అనేక భాషల మీద పట్టు సాధించారు.భర్త ఉద్యోగరీత్యా పుణెలో ఉండటంతో అక్కడి స్థానిక వంటకాలను నేర్చుకున్నారు. పిల్లలు ఉద్యోగాలు చేసే సమయానికి వచ్చేసరికి నగరవాసులకు ‘పావ్ మంత్ర’ పేరుతో మహారాష్ట్రియన్ వంటకాలను పరిచయం చేస్తూ ఎంట్రప్రెన్యూర్గా ఎదిగారు. లోనూ ‘పంచసత్వ’ పేరుతో సౌత్ ఇండియన్ క్యుజిన్ను ్రపారంభిస్తున్నారు.గృహిణిగా ఉంటూనే వ్యాపారవేత్తగా ఎదిగిన పద్మాసని దరూరిని పలకరిస్తే ఇలా ఎన్నో కబుర్లు మన ముందుంచారు.‘‘మనలో అభిరుచి ఉండాలే గానీ ఎక్కడ ఉన్నా దానిని వృద్ధిలోకి తీసుకురావచ్చు. మా వారి ఉద్యోగ రీత్యా పుణేలో ఉండేవాళ్లం. గృహిణిగా ఇల్లు, పిల్లల పనులు ఎప్పుడూ ఉండేవే. పిల్లలు హై స్కూల్కి వచ్చాక నేను వేదాంత అకాడమీలో చేరి మూడు నెలల్లో సంస్కృతాన్ని నేర్చుకున్నాను. మన పురాణేతిహాసాలు చదువుతూ సబ్జెక్ట్పై పట్టు సాధించగలిగాను. కార్పొరేట్ కంపెనీలలో పని చేసేవారి ఆసక్తిని బట్టి, అక్కడకు వెళ్లి సంస్కృతం క్లాసులు తీసుకునేదాన్ని. రామాయణ, మహా భారతాల గురించి క్షుణ్ణంగా వివరించేదాన్ని. వేదాంత అకాడమీలో నేర్చుకున్న విషయాలను ఇంటికి వచ్చి పిల్లలకు చెబుతుండేదాన్ని. దీంతో వారు స్కూల్లో చదువుకున్న విషయాలే కాకుండా మన వేదాల గురించి, పురాణాల గురించీ కూడా తెలుసుకోగలిగారు.వివిధ రకాల భాషలుసంస్కృతంతో పాటు హిందీ, ఇంగ్లిష్, మరాఠీ.. ఇలా రకరకాల భాషలను ఆసక్తితో నేర్చుకున్నాను. వీటితోపాటు దేశంలోని అన్ని రకాల ్రపాచీన సంస్కృతుల గురించి తెలుసుకోవడం, వాటిని ఆచరించడం చేస్తుండేదాన్ని. ఈ క్రమంలో అన్ని రకాల వంటకాల తయారీని ఇష్టంగా చేసేదాన్ని. వాటిని మా ఇంట్లో వారికే కాదు మా చుట్టుపక్కల వారికీ రుచి చూపించేదాన్ని. అందరూ మెచ్చుకునేవారు. మా అబ్బాయిలిద్దరూ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తయ్యాక నాకు మరింత వెసులుబాటు దొరికింది. నా వంటకాల రుచితో బిజినెస్ చేయాలనే ఆలోచన వచ్చింది. రుచిగా.. పావ్ మంత్రతరచూ ఇంట్లో బిజినెస్ ఆలోచనల గురించి చర్చ జరుగుతున్నప్పుడు నేను, మా పెద్దబ్బాయి కలిసి ఒక ఫుడ్ స్టార్టప్ ్రపారంభించాలనుకున్నాం. మా స్టార్టప్కి వాత్సల్య అనే పేరు అనుకున్నాం. పుణెలో స్థానిక ఫుడ్ వడాపావ్. అక్కడ స్ట్రీట్ఫుడ్గా దీనికి పేరుంది. హైదరాబాద్ వాసులకు ఈ వడాపావ్ రుచిని కొత్తగా అందించాలనుకున్నాను. పుణెలో వడాపావ్ టేస్ట్, మన దగ్గర టేస్ట్కి భిన్నంగా ఉంటుంది. ఏ పనైనా ఒకసారి మొదలుపెడితే దాంట్లో నూటికి నూరు శాతం దృష్టి పెట్టాల్సిందే అనుకొని వ్యాపారంలోకి దిగాను. పావ్కి విభిన్నమైన రుచిని తెప్పించడం కోసం రకరకాల ప్రయోగాలు చేసి, విజయవంతమయ్యాం. మా పిల్లలు వామన్, కేశవ్ లు తమ పూర్తి సహకారాన్ని నాకు అందించారు. దాంతో ‘పావ్మంత్ర’ పేరుతో ఫుడ్ బిజినెస్ను కరోనా సెకండ్ వేవ్లో మాదాపూర్లో ్రపారంభించాం. మా స్టార్టప్కి మహారాష్ట్ర, ఫార్సీ ఆంబియన్స్ వచ్చేలా ΄్లాన్ చేశాం. కొద్ది రోజుల్లోనే నోటి మాట ద్వారానే అందరికీ తెలియడంతో మంచి పేరు వచ్చింది. నేను కన్న కల రెండున్నరేళ్లలోనే సాకారం అయ్యింది. ఈ నెలలో పుణెలో ‘పంచసత్వ’ పేరుతో సౌత్ ఇండియన్ క్యుజిన్ను అందించబోతున్నాను. గృహిణిగా ఇంటి పనులు, వంట పనులు చేసుకుంటూ ఉన్న నేను 53 ఏళ్ల వయసులో ఇలా బిజినెస్ ఉమెన్గా ఎదుగుతానని అస్సలు ఊహించలేదు. నా అభిరుచికి మేరకు ఒక్కో ప్రయత్నం చేస్తూ ప్రయాణిస్తున్నాను. ఈ ప్రయాణంలో నా పిల్లలు తోడయ్యారు. తొంభై ఏళ్ల వయసున్న నా తల్లిదండ్రులూ నా ఆసక్తిని, అభిరుచిని గౌరవిస్తూ తమ ఆశీస్సులను అందిస్తున్నారు. అమ్మనాన్నలను చూసుకుంటూ, భర్త, పిల్లల బాగోగులను గమనిస్తూ, నన్ను నేనుగా మెరుగుపరుచుకోవడానికి చేసిన ప్రయత్నం ఎప్పుడూ నాకు మంచి ఫలితాలను ఇస్తూ వచ్చింది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరింతగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాను’ అంటూ వివరించారు పద్మాసని. – నిర్మలారెడ్డి
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
రోజుకో కొత్త సిండ్రోమ్లు వచ్చేస్తున్నాయి. టెక్నాలజీకి తగ్గట్టుగా కొత్త కొత్త వ్యాధులు వచ్చేస్తున్నాయి. మనుషుల పిచ్చి అపోహాలు, నమ్మకాలే వ్యాధుల రూపంలో సిండ్రోమ్లుగా బయటకొస్తున్నాయి. అలాంటి సరికొత్త సిండ్రోమ్ ఒకటి ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. దానిపేరే 'ఇడియట్ సిండ్రోమ్'. ఏంటీ సిండ్రోమ్? ఎందువల్ల వస్తుందంటే..?'ఇడియట్' అంటే "ఇంటర్నేట్ డెరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్ర్స్టక్షన్ ట్రీట్మెంట్". ఈ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు అందుబాటులో ఉన్న ఆన్లైన్ హెల్త్ సమాచారానికి ప్రాధాన్యత ఇచ్చి స్వీయ చికిత్స తీసుకుంటారు. అనారోగ్యాన్ని నిర్థారించుకోవడానికి పూర్తిగా ఆన్లైన్ వనరులనే ఆశ్రయిస్తారు. ఈ పరిస్థితిని "ఇడియట్ సిండ్రోమ్"అని పిలుస్తారు. ఈ సిండ్రోమ్ ఉన్న రోగులు ఇంటర్నెట్ సర్చ్ల ఆధారంగా వ్యాధులను స్వయంగా నిర్థారణ చేసుకుంటారు. ఆఖరికి డాక్లర్లు సూచించిన చికిత్సలను కూడా పక్కన పెట్టేసి వారు ఆన్లైన్ ద్వారా తెలుసుకున్న చికిత్సను స్వయంగా చేసుకోవడం, ఆ మందులనే వాడడం వంటివి చేస్తారు. ఇక్కడ ఈ వ్యక్తులు రోగ నిర్థారణ కోసం వెబ్ శోధనే సరియైనదని భావించడమే ప్రమాదం. డబ్ల్యూహెచ్ఓ దీన్ని 'ఇన్ఫోడెమిక్' అని పిలుస్తుంది. ఈ విధమైన తీరు రాను రాను మరింత తీవ్రమై వైద్య నిపుణలపై అమనమ్మకానికి దారితీస్తుంది. రోగులు ఇక్కడ ఆరోగ్య సమాచారాన్ని ఆన్లైన్ వంటి సాంకేతికతో తెలుసుకోవడం వరకు మంచిదే తప్పులేదు. అదే సాయంతో తనకు తానుగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ప్రమాదకరం అని వైద్యుల చెబుతున్నారు. ఆరోగ్యానికి ఎలా ప్రమాదమంటే..ఈ విధానం ముదిరిపోతే వారి దృష్టిలో ఆన్లైన్ హెల్త్ సమాచారమే తిరుగలేనిదిగా కనిపిస్తుంది. నిరంతరం ఆన్లైన్ సెర్చ్లకే పరిమితమైపోతారు. దీంతో విపరీతమైన, ఆందోళనకు, ఒత్తిడికి గురవ్వుతారు.ఒకవేళ్ల అది ఇచ్చిన సమాచారాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అసలుకే మోసం వచ్చి ఆరోగ్యాన్ని చేజేతులారా నాశనం చేసుకునే ప్రమాదం ఉంది. ఈ వైఖరి వైద్య సహాయాన్ని నిరాకరించే స్థితికి తీసుకొస్తుంది. అప్పటి వరకు వాడుతున్న మందులను కూడా ఆపేయడం లేదా వేనే వాటిని వాడేలా చేస్తుంది. దీంతో ఆయా వ్యక్తులు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని, లేనిపోని అనారోగ్యల బారినపడతారు.ఇక్కడ వెబ్ అనేది ఒక సాధనం. దీని ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై అవగాహన ఏర్పరుచుకోండి తప్పులేదు. శృతిమించితేనే ప్రమాదం. రోగ నిర్థారణ, చికిత్సల సలహాల కోసం వైద్య నిపుణులను సంప్రదించడమే ఉత్తమం అని గ్రహించండి. (చదవండి: ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?)
న్యూస్ పాడ్కాస్ట్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో వన్స్మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
క్రైమ్
పెంపుడు కుక్క పెట్టిన గొడవ.. నడిరోడ్డుపైనే చితకబాదారు
వెంగళరావునగర్: పెంపుడు కుక్క అరచిందని పెద్ద గొడవే జరిగింది. ఓ కుటుంబాన్ని రోడ్డు మీదకు తెచ్చి చితకబాదారు కొందరు. తన తమ్ముడితో పాటు మరదలును, కుక్కను హత్య చేయబోయారంటూ ఓ వ్యక్తి మధురానగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రహమత్ నగర్ లో నివాసం ఉండే ఎన్. శ్రీనాధ్, అతని భార్య స్వప్నలు ఈ నెల 8వ తేదీనాడు ఉదయం పోస్టల్ బ్యాలెట్ వేయడానికి తన పెంపుడు కుక్కతో పాటు ఇంటి నుంచి బయలుదేరాడు. అదే సమయంలో ఇంటి పక్కన ఉన్న వ్యక్తి వారి కుక్క రోడ్డుపై ఉన్నారు. ఆ సమయంలో వీరి కుక్క వారిని చూసి మొరిగింది. దాంతో ధనుంజయ్ అనే వ్యక్తి భార్య భర్తలను దుర్భాషలాడాడు. ఈ విషయంపై నాడు మధురానగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తిరిగి ఈ నెల 14వ తేదీ సాయంత్రం శ్రీనాధ్ కుక్కతో బయటకు రాగా ధనుంజయ్ అనే వ్యక్తితో పాటు నలుగురు వ్యక్తులు వచ్చి శ్రీనాధ్ ను, అతని భార్య స్వప్నతో పాటుగా మేనల్లుడు, కోడలును, కుక్కను సైతం చంపుతామని బెదిరిస్తూ తీవ్రంగా కర్రలతో, రాడ్లతో కొట్టారు. దాంతో శ్రీనాథ్ అపస్మారకస్థితికి వెళ్లాడు. మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో శ్రీనాథ్ సోదరుడు ఎన్.మధు మధురానగర్ పీఎస్ లో ఎల్. మధుతో పాటు మరో నలుగురిపై హత్యయత్నం కేసు పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఓటు వేసేందుకు వచ్చి మృత్యువాత
‘అర్ధరాత్రి.. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్క సారిగా దఢేల్ మని పే..ద్ద శబ్ధం.. కళ్లు తెరిచి చూసేలోగా మంటలు.. నిప్పు రవ్వలు మీద పడి అంటుకుంటున్న దుస్తులు.. కేకలు, అరుపులు.. కాపాడండని ఆర్తనాదాలు.. కిటికీ అద్దాలు పగులగొట్టి కొందరు.. డోర్ తెరుచుకుని మరికొందరు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోగా.. ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు అక్కడికక్కడే క్షణాల్లో కాలి బూడిదయ్యారు.. అంతా కలలోలాగా జరిగింది. నిజంగా కల అయితే బాగుండు’ అని ఆ ప్రమాదం నుంచి బయట పడిన వారుఅంటున్నారు. వారింకా షాక్ నుంచి తేరుకోలేదు.చినగంజాం/చిలకలూరిపేట : ప్రైవేట్ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఓటు వేసేందుకు వచ్చి తిరిగి వెళ్తున్న చినగంజాం, చీరాల వాసులు నలుగురు, రెండు వాహనాల డ్రైవర్లు మృత్యువాత పడ్డారు. మరో మహిళ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇంకో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఓటేసేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో ఉంటున్న చాలా మందికి పర్చూరు నియోజకవర్గంలో ఓట్లు ఉన్నాయి. దీంతో పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి, ఆదివారం రాత్రి వారిని పర్చూరుకు తరలించారు. ఇందులో భాగంగా చినగంజాంకు చెందిన ఓటర్లు సైతం హైదరాబాద్ నుంచి వచ్చారు. వీరంతా సోమవారం ఓట్లు వేసి, మంగళవారం రాత్రి ఏలూరు సాంబశివరావు ఏర్పాటు చేసిన బస్సుల్లో హైదరాబాద్కు తిరిగి పయనమయ్యారు. చినగంజాంకు చెందిన 42 మంది చీరాలకు చెందిన ట్రావెల్స్ బస్సు (ఏపీ 27 టీటీ 6577)లో రాత్రి 11 గంటలకు బయలు దేరారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ బస్సు.. పల్నాడు జిల్లా ఈవూరుపాలెం వద్ద ఎదురుగా కంకర మట్టి లోడుతో వస్తున్న టిప్పర్ (ఆర్జే 23 జీసీ 2452)ను ఆయిల్ ట్యాంక్ వద్ద బలంగా ఢీకొట్టింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అటు టిప్పర్, ఇటు బస్సుకు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా బస్సులో బ్యాటరీ ఫెయిల్ అవడంతో చీకటి అలముకొంది. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు తప్పించుకొని వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో బస్సు డోర్ వద్ద ఉన్న చినగంజాంకు చెందిన యువకుడు సింగోతు సాయి కేకలు వేస్తూ ప్రయాణికులను నిద్ర లేపాడు. చాలా మంది ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ డోర్ ద్వారా బయటకు రాగా, మరికొంత మంది కిటికీ అద్దాలను పగులగొట్టి, అత్యవసర ద్వారాన్ని తెరచుకొని బయటకు దూకేశారు. అప్పటికే మంటలు అంటుకొని కొందరు ప్రయాణికులు హృదయ విదారకంగా కేకలు పెట్టారు. ఈ లోగా మంటలు భారీగా చెలరేగి బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణికులు నలుగురు బస్సులోనే కాలి బూడిదయ్యారు. ఒకే కుటుంబంలో ముగ్గురు..ఉప్పుగుండూరి కాశీ బ్రహ్మేశ్వరరావు, అతని భార్య లక్ష్మీ బస్సు వెనుక భాగంలో కూర్చొన్నారు. వీరు వృద్ధులు కావడంతో త్వరగా బయట పడలేకపోయారు. పైగా మనవరాలు ఖ్యాతి సాయి నిద్రలో ఉండటంతో ఆ పాపను లేపి.. బయటకు రాలేకపోయారు. అంతలోనే మంటలు చుట్టు ముట్టడంతో తప్పించుకోలేని స్థితిలో ఆహుతై ప్రాణాలు విడిచారు. వృద్ధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి భావన హైదరాబాద్లో, చిన్నమ్మాయి పూజ ఒంగోలులో ఉంటున్నారు. ఓటు వేసేందుకని పెద్ద కుమార్తెతో కలిసి నీలాయపాలెం వచ్చారు. అనంతరం ఒంగోలుకు వెళ్లి చిన్న కుమార్తె కూతురు ఖ్యాతి సాయిని వెంట తీసుకుని చినగంజాం నుంచి టీడీపీ వారు ఏర్పాటు చేసిన బస్సులో హైదరాబాద్ బయలు దేరారు. పిల్లల చదువుల నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్న దావులూరి శ్రీను కూడా ఓటు వేసేందుకే వచ్చారు. 20 మంది క్షతగాత్రులు చినగంజాం వాసులేదుర్ఘటనలో గాయపడిన 30 మందిని చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలాలకు చెందిన 108 వాహనాల ద్వారా చిలకలూరిపేట ఏరియా ఆçస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం ఎన్.కీర్తి, కె.వెంకటరావు, సీహెచ్.శంకర్రావు, ఎన్.రాజ్యలక్ష్మి, ఎస్.కళావతి, డి.భువన, సీహెచ్.ఆదిలక్ష్మి, పి.లక్ష్మి, కె.లిప్సికను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. మరో 20 మందికి ప్రా«థమిక చికిత్స చేసి ఇంటికి పంపించారు. క్షతగాత్రుల్లో 20 మందికి పైగా చినగంజాం మండల వాసులే. మృతి చెందిన పాప పెద్దమ్మ భావన తన వారిని రక్షించుకునే క్రమంలో తీవ్ర గాయాలపాలైంది. శరీరం బాగా కాలిపోవడంతో గుంటూరులో చికిత్స పొందుతోంది. కడవకుదురుకు చెందిన తాటి రాజీ (సాఫ్ట్వేర్), గొల్లపూడి ఉదయభాను(సాఫ్ట్వేర్), చినగంజాంకు చెందిన తాటి సాయిలక్ష్మి (సాఫ్ట్వేర్), మమత (కోచింగ్), అడివీధిపాలెంకు చెందిన రాయని బాలాజీ (ఫొటోగ్రాఫర్), పెదసింగు నాగరాజు, పెదసింగు తిరుపతమ్మ, పెదసింగు నాగరాజు కుమారుడు ఈశ్వరసాయి, కుమార్తె జస్వంతి, బొమ్మిడి మాలతి, గొనసపూడికి చెందిన కందిమళ్ల తేజీ, యలమల ఆకాష్, నీలాయపాలెంకు చెందిన దంపతులు అంజిబాబు, సామినేని సింధూజ, చినగంజాం అంబేడ్కర్ నగర్కు చెందిన బొలిమెర సుధాకర్, మేడికొండ చినఅంకయ్య, అతని భార్య సౌజన్య, కుమార్తె అక్షయ, బడుగు సంజన తదితరులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. మృతుల వివరాలివీ..ఈ దుర్ఘటనలో చీరాలలోని పేరాలకు చెందిన బస్సు డ్రైవర్ షేక్ మస్తాన్ షరీఫ్ (47), టిప్పర్ డ్రైవర్ మధ్యప్రదేశ్కు చెందిన హరిసింగ్ (39), బస్సులో ప్రయాణిస్తున్న చినగంజాం మండలం నీలాయపాలెం గ్రామానికి చెందిన దంపతులు ఉప్పుగుండూరు కాశీబ్రహ్మేశ్వరరావు (65), ఉప్పుగుండూరు లక్ష్మీ(55), వీరి మనవరాలు ఒంగోలు పట్టణానికి చెందిన బొప్పిరాజు ఖ్యాతి సాయి (9), చినగంజాం మండలం గోనెపూడి గ్రామానికి చెందిన దావులూరి శ్రీనివాసరావు (54) సజీవ దహనమయ్యారు. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోయాయి. ప్రమాదం జరిగిందిలా..చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం డొంక సమీపానికి బస్సు రాగానే, అదే సమయంలో పసుమర్రు వైపు నుంచి గ్రావెల్తో కూడిన టిప్పర్ ( చీరాల వైపు వెళుతూ) ఎదురుగా వస్తోంది. ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో రోడ్డు మార్జిన్ కనిపించక వేగంగా వస్తున్న బస్సు అదుపు తప్పి టిప్పర్ను ఢీకొంది. టిప్పర్ డ్రైవర్ రోడ్డు మార్జిన్ దిగినప్పటికీ, బస్సు వేగంగా వెళ్లి టిప్పర్ లారీకి ఉన్న డీజిల్ ట్యాంకును ఢీకొట్టింది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో రూరల్ సీఐ పి.శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ జి.రవికృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా∙స్థలం వద్దే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి : పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు సీఎం జగన్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి రజినిరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, పోలీస్ ఏడీజీ శంఖబ్రత బాగ్చి, గుంటూరు ఎస్పీ తుషార్ డూడి, నరసరావుపేట డీఎస్పీ వర్మ, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబీకులను పరామర్శించి ప్రభుత్వం నుంచి తగు సహాయం అందేలా చూస్తామని మంత్రి రజిని హామీ ఇచ్చారు. ప్రమాద ఘటనపై నరసరావుపేట డీఎస్పీ వీఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ.. బస్సు అతివేగమే ప్రమాదానికి ప్రాథమిక కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్ ద్వారా శాంపిల్స్ సేకరిస్తున్నామని, డ్రైవర్లు మద్యం సేవించారా లేదా అనే విషయం ల్యాబ్ రిపోర్టుల తర్వాత తెలుస్తుందని చెప్పారు. చిట్టితల్లికి అప్పుడే నూరేళ్లు నిండాయిఒంగోలు టౌన్: ఒంగోలులోని సత్యనారాయణపురంలో ఉంటున్న సుబ్బారావు, పూజ దంపతుల గారాల పట్టి, ఏకైక పుత్రిక ఖ్యాతి సాయి. పెద్దయ్యాక పెద్ద డాక్టరై మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఆ పాపకు ఖ్యాతి అని పేరు పెట్టుకున్నారు. ప్రాణంగా పెంచుకున్నారు. చిట్టి తల్లిని చూసి మురిసిపోయారు. స్కూలులో మీ పాపే ఫస్ట్ అని టీచర్లు చెప్పిన మాటలు విని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. పాపకు మంచి చదువులు చదివించుకోవచ్చని దర్శి మండలం వీరాయపాలెం నుంచి ఒంగోలుకు వచ్చి ఉంటున్నారు. నగరంలోని లంబాడిడొంకలో ఒక స్కానింగ్ సెంటర్లో సుబ్బారావు పీఆర్ఓగా, పూజ రిసెప్షనిస్టుగా పని చేస్తున్నారు. ఇద్దరి సంపాదనతో ఖ్యాతిని బాగా చదివించుకోవాలని కలలు కన్నారు. అయితే విధి వక్రీకరించింది. కన్నకూతురు కాలి బూడిదైందన్న వార్త విన్న ఆ దంపతుల గుండె పగిలిపోయింది. గుండెలవిసేలా రోధించారు. స్కూలుకు సెలవులు కావడంతో అవ్వా తాతల వెంట హైదరాబాద్కు పంపారు. ఖ్యాతి ఇక లేదన్న వార్త విని చుట్టుపక్కల వారంతా కంట నీరు పెట్టుకున్నారు. పాప తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.
రెచ్చిపోతున్న పచ్చమూక పల్నాడులో ఆగని విధ్వంసం
సాక్షి, నరసరావుపేట: ఎన్నికలు ముగిసి మూడు రోజులైనా పల్నాడు జిల్లాలో టీడీపీ మూకల విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఓటమి ఖాయమని తేలిపోవడంతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ మూకలు బుధవారం దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ దాడుల నుంచి తప్పించుకొని గ్రామాలు వదిలివెళ్లిపోయిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఇంకా ఇళ్లకు పూర్తిగా చేరుకోలేదు. తెలిసిన వారి ఇళ్లల్లో దూరప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. కుటుంబంలోని మహిళలు, పిల్లల బాగోగుల గురించి వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పోలీసులు రక్షణ కల్పిస్తే గ్రామాలకు తిరిగిరావాలని చూస్తున్నారు. మరోవైపు మాచర్ల, గురజాల, నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేశ్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. టీడీపీ మూక స్వైరవిహారం.. మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో గ్రామం వదిలి వెళ్లిన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఇంకా గ్రామాలకు చేరలేదు. పోలీస్ పికెటింగ్ ఉన్నా మళ్లీ టీడీపీ మూకలు దాడులు చేస్తాయనే అభద్రతాభావంతో గ్రామానికి దూరంగా ఉంటున్నారు. పల్నాడు జిల్లాలో పలు ప్రాంతాల్లో టీడీపీ మూకలు విధ్వంసకాండ కొనసాగిస్తుండటంతో పోలీసులు జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి 144 సెక్షన్ విధించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల్లో దుకాణాలను మూసివేయించారు. చివరకు కొన్నిచోట్ల మెడికల్, కూరగాయలు, పాల దుకాణాలు, టీస్టాల్స్ను కూడా తెరవలేదు. బహిరంగ ప్రదేశాల్లో నలుగురికి మించి గుమిగూడకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. అయినప్పటికీ టీడీపీ నేతల దాడులు ఆగడం లేదు. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా స్వైరవిహారం చేస్తున్నారు. తమకు ఓటు వేయని వారిపై దాడులు కొనసాగిస్తున్నారు. గ్రామానికి తిరిగిరాగానే పచ్చ మూకల దాడి.. గురజాల నియోజకవర్గంలో టీడీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోంది. పల్లెల్లో టీడీపీ ఫ్యాక్షన్ చిచ్చురేపుతోంది. దాచేపల్లి మండలం మాదినపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త దొండేటి ఆదిరెడ్డిపై టీడీపీ నేతలు కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పోలింగ్ రోజునే ఆదిరెడ్డితో టీడీపీ నాయకులు వాగి్వవాదానికి దిగారు. పోలింగ్ ముగిశాక గ్రామంలో పరిస్థితి బాగోలేకపోవటంతో రెండు రోజులపాటు వేరే గ్రామంలో ఉన్న బంధువుల ఇంటిలో ఆయన తలదాచుకున్నాడు. బుధవారం ఉదయం మాదినపాడు చేరుకున్న వెంటనే 30 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు కర్రలు, ఇనుపరాడ్లతో ఆదిరెడ్డిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తలకు బలమైన గాయాలు కావడంతో సొమ్మసిల్లిపడిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకుని ఆదిరెడ్డిని పిడుగురాళ్లలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తీసుకెళ్లారు. ఆదిరెడ్డి తలలో నరాలు తెగి రక్తప్రసరణ నిలిచిపోయిందని.. రెండు మేజర్ సర్జరీలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం.. నాదెండ్ల మండలం అప్పాపురంలో వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన మాజీ మండల ఉపాధ్యక్షుడు కోవెలమూడి సాంబశివరావుపై కర్రలు, కత్తులతో దాడికి తెగబడ్డారు. పోలింగ్ రోజు పన్నెండో బూత్లో ఎస్సీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో బారులు తీరి రాత్రి 7 గంటల వరకు ఓట్లేశారు. వీరికి సాంబశివరావు అండగా ఉన్నాడు. ఇది మనసులో పెట్టుకున్న టీడీపీ నేతలు ఆయనపై దాడికి దిగారు. మరికొంతమందిపై కూడా దాడి చేసేందుకు కారులో వెంటపడ్డారు. అలాగే పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణç³ల్లిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులు వెంకయ్య, విజయేంద్రబాబుల ఇళ్లపై దాడి చేశారు. వారిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో గురజాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్.. పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులతో పోలీసులు కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేసి వారిని ఇంటికే పరిమితం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను హౌస్ అరెస్ట్లో ఉంచారు. మరోవైపు అల్లర్లకు కారణమైన టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై జిల్లావ్యాప్తంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందు జాగ్రత్తగా నేరస్వభావం ఉన్న వారిని బైండోవర్ చేశారు. దీంతో వందలాది మంది గ్రామాలను వదిలి వేరే ప్రాంతాలకు మకాం మార్చారు.
పరిచయం పెంచుకొని.. పాపను విడిచి
రాయగడ: రైలులో ప్రయాణించిన ఒక మహిళ పక్కనే తనతో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికురాలితో మాటామాటా కలిపి పరిచయం పెంచుకొని, చివరకు గమ్యం స్థానం చేరేసరికి పాపను విడిచి పరారైంది. మునిగుడలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని చంద్రపూర్ ప్రాంతానికి చెందిన అనంత్ క్రొటింగ్ అనే మహిళ మంగవారం ఏదో పనిమీద రాయగడ వచ్చారు. పనులు ముగించుకున్న అనంతరం తిరిగి తన స్వగ్రామానికి వెళ్లేందుకు రాయగడలో ట్రైన్ ఎక్కింది. జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చుంది. పక్కనే మరో మహిళ చంటి పాపతో ప్రయాణం చేస్తోంది. కొద్దిదూరం ప్రయాణం చేసిన తర్వాత వారి మధ్య మాటామాటా కలిసి పరిచయం పెరిగింది. అనంతరం మునిగడు రైల్వేస్టేషన్లో ఇద్దరు మహిళలు దిగారు. ఇంతలో పాపను కాసేపు ఎత్తుకోండి టాయ్లెట్స్కు వెళ్లి వస్తానని చెప్పి పాపను క్రొటింగ్ అనే మహిళకు అప్పగించింది. పాపను ఎత్తుకున్న క్రొటింగ్ గంటలు తరబడినా ఎదురుచూసిన వాళ్ల అమ్మ రాలేదు. దీంతో కావాలనే పాపను విడిచిపెట్టాలని నిర్ణయించకున్నారని అర్థం చేసుకొని మునిగుడ పోలీసుస్టేషన్ను ఆశ్రయించింది. వెంటనే ఐఐసీ సౌదామిని బెహర వెంటనే స్పందించి జిల్లా శిశుసంరక్షణ కేంద్రం వారికి సమాచారం అందించారు. ప్రస్తుతం పాప శిశు సంరక్షణ కేంద్రంలో సురక్షితంగా ఉంది. అయితే పాపను ఎత్తుకుని ప్రయాణించిన మహిళ ఎవరు, ఎక్కడి నుంచి ప్రయాణించింది, పాపను విడిచిపెట్టి వెళ్లడంపై సమగ్ర దర్యాప్తు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. రైల్వేస్టేషన్లో ఉన్న సీసీ కెమేరాల ఆధారంగా ఆ మహిళను గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు.