Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CM YS Jagan Election campaign Schedule For Kurnool
నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..

సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఈ నెల 9న ఎన్నికల ప్రచారాన్ని 3 నియోజకవర్గాల్లో నిర్వహిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ బుధవారం తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు కర్నూలు సిటీలోని వైఎస్సార్‌ సర్కిల్‌లో ఎస్వీ కాంప్లెక్స్‌ రోడ్‌లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనంతపురం పార్లమెంట్‌ పరిధిలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం కొల్లపురమ్మ టెంపుల్‌ రోడ్‌లో జరిగే సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట నియోజకవర్గంలోని కోడూరు రోడ్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొననున్నారు.

నల్లజర్లలో హోం మంత్రి తానేటి వనిత ఉన్న ఇంటిపై టీడీపీ గూండాలతో కలిసి దాడి చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రాజు , టీడీపీ గూండాల దాడిలో గాయపడిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  సతీమణి రమాదేవి, మాజీ ఎంపీపీ చౌడేశ్వరి
ఓటమి భయంతో.. బూతులు.. దాడులు.. కుట్రలు

ఓటమి తప్పదన్న నిరాశానిస్పృహలు టీడీపీ కూటమిని ఏ స్థాయికి దిగజారుస్తున్నాయంటే... చంద్రబాబు స్థాయి మరిచి, సిగ్గెగ్గులు వదిలి ‘అమ్మ మొగుడు.. అమ్మమ్మ మొగుడు’ అంటూ అడ్డూఅదుపూ లేకుండా పిచ్చిపట్టినట్లు అరుస్తున్నాడు. వృద్ధుల ఇంటికి పింఛను రాకుండా వారిని మండటెండల్లో రోడ్లమీదికి తేవటమే కాదు..భూములు లాక్కున్నారంటూ పచ్చి అబద్ధాలతో చెలరేగుతున్నాడు. రైతులు, విద్యార్థులు, మహిళల ఖాతాల్లో పడాల్సిన నిధులను కుట్రతో అడ్డుకోవటమే కాదు... బాబు, దత్తపుత్రుడు కలిసి కిరాయి గూండాలతో దాడులు చేయిస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య కావచ్చు... హోంమంత్రి తానేటి వనిత కావచ్చు... ప్రచారానికి వెళుతున్న మహిళా నేతలపై దాడులకు తెగబడుతున్నారు. ఎన్ని చేసినా.. ఇది నారాసురుడికి క్లయిమాక్సే.సాక్షి, అమరావతి/వెల్దుర్తి/ముప్పాళ్ల/సాక్షి, నరసరావుపేట: రూ.కోట్ల కట్టలు వెదజల్లుతున్నా.. అక్రమ మద్యాన్ని ఏరులై పారిస్తున్నా.. కళ్ల ముందు మరోసారి ఘోర పరాజయం స్పష్టంగా కనిపిస్తుండటంతో కూటమి నేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లో ఫ్రస్టేషన్‌ (నిరాశ, నిస్పృహ) తార స్థాయికి చేరుకుంది. చివరకు అధికార పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మహిళలపై సైతం దాడులు చేసే స్థాయికి దిగజారిపోవడం వారిద్దరినీ ఆవరించిన నైరాశ్యాన్ని రుజువు చేస్తోంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి నీ అమ్మ మొగుడు..! నీ అమ్మమ్మ మొగుడు..! అంటూ ఈ నెల 6న అనకాపల్లి సభలో చంద్రబాబు బూతు పురాణం లంకించుకోవడంతో మహిళలంతా నివ్వెరపోయారు. అంతకుముందు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సభలో.. జగన్‌ను చంపితే ఏమవుతుందంటూ టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొట్టారు. ఒకపక్క ముఖ్యమంత్రి జగన్‌ తన ఐదేళ్ల పాలనలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, మార్పులను ప్రజలకు వివరిస్తూ, వారినుంచే జవాబులు రాబడుతూ ప్రచారం నిర్వహిస్తుండగా మరోపక్క కూటమి నేతలు చంద్రబాబు, పవన్‌ దాడులు, దుర్భాషలనే నమ్ముకోవడం వారి వ్యక్తిత్వాలకు ప్రతీకగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ సైతం బాబు శైలిని అనుకరిస్తూ వ్యక్తిత్వహననం, దుర్భాషలకు దిగడం తెలిసిందే. దీంతో టీడీపీ, జనసేన రౌడీ మూకలు పేట్రేగుతూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలపై ఇనుపరాడ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు దిగుతూ హత్యాయత్నాలకు పాల్పడుతున్నాయి. నల్లజర్లలో ‘ముళ్లపూడి’, మాచర్లలో ‘జూలకంటి’ గూండాయిజం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో మంగళవారం రాత్రి ప్రచారం ముగించుకుని పార్టీ నేత వెల్లంకి సుబ్రమణ్యం ఇంట్లో భోజనం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, హోంమంత్రి తానేటి వనితపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రాజు, జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు నేతృత్వంలో టీడీపీ గూండాలు దాడి చేసి హత్యాయత్నానికి తెగబడ్డారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం సిరిగిరి­పాడులో బుధవారం ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. పలువురు మహిళలు సైతం గాయ­పడ్డారు. ఏడు హత్య కేసుల్లో నిందితుడైన మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహా్మరెడ్డి టీడీపీ గూండాలను దాడులకు పురిగొల్పారు. పచ్చి అవకాశవాదం.. ఎన్నికల్లో సీఎం జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీని ఒంటరిగా ఎదుర్కోనే సత్తాలేక జనసేనతో జట్టు కట్టి బీజేపీతో కాళ్ల బేరానికి దిగిన చంద్రబాబు దాడులు, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయకుండా దగా చేయడం, ఇప్పుడు మళ్లీ జత కట్టటాన్ని ప్రజలు పచ్చి అవకాశవాదంగా గుర్తించారు. మళ్లీ కూటమి ముసుగులో చంద్రబాబు మోసం చేస్తారనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. దీంతో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల ప్రచారానికి జనస్పందన కరువైంది. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షాను రప్పించినా ప్రయోజనం కానరాకపోవడంతో ఓటర్లపై ధనా్రస్తాన్ని ఎక్కుపెట్టారు. నోట్ల కట్టలతో ప్రైవేట్‌ సైన్యాలు విదేశాల్లోని తన సామాజిక వర్గానికి చెందిన ఆరు వేల మంది ఎన్నారైలను రప్పించిన చంద్రబాబు వారిని గ్రామాల్లో మోహరించి నోట్ల కట్టలు వెదజల్లుతున్నారు. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ, విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, నరసరావుపేట లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు, అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌ తదితరుల ద్వారా నోట్ల కట్టలతో ప్రైవేట్‌ సైన్యాలను సమాయత్తం చేశారు. ఎన్నికల అధికారులకు భారీ ఎత్తున పట్టుబడుతున్న కోట్ల కట్టలన్నీ టీడీపీ నేతలవే కావడం గమనార్హం. కర్ణాటక, గోవా, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, తెలంగాణ నుంచి భారీ ఎత్తున మద్యాన్ని తరలించి ఏరులై పారిస్తున్నారు. ఎన్నికల అధికారులు సీజ్‌ చేస్తున్న మద్యం డంపులే అందుకు నిదర్శనం. కోట్ల కట్టలను వెదజల్లుతున్నా.. మద్యాన్ని ఏరులై పారిస్తున్నా.. ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం, ఘోర పరాజయం కళ్ల ముందు కానరావడంతో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఫ్రస్టేషన్‌ తారస్థాయికి చేరుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను వెంటాడి, వేటాడి రక్తపుటేరులు పారించి భయోత్పాతం సృష్టించడం ద్వారా ఉనికి చాటుకోవాలని ఎత్తు వేశారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన గూండాలను దాడులు, హత్యాకాండకు పురిగొలిపారు. ‘ఫ్యాన్‌’కి ఓటేశాడని..!పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు హోం ఓటింగ్‌ ప్రక్రియలో భాగంగా పరిమి పెద్దభూషయ్య అనే వృద్ధుడు వైఎస్సార్‌సీపీకి ఓటు వేసేందుకు సుముఖత చూపటాన్ని జీర్ణించుకోలేక బెదిరిస్తూ వాదనకు దిగాయి. తనకు కులాలతో పనిలేదని, మంచి చేసిన పార్టీకే ఓటు వేస్తానని పెద్దభూషయ్య తేల్చి చెప్పడంతో వాగ్వాదం నెలకొంది. టీడీపీ సానుభూతిపరుడు రావిపాటి నాగేశ్వరరావు కర్రతో దాడి చేయడంతో వైఎస్సార్‌ సీపీకి చెందిన కానాల పుల్లారెడ్డి తలకు తీవ్ర గాయమైంది. వైఎస్సార్‌ సీపీకి చెందిన షేక్‌ దమ్మాలపాటి బాజికి కూడా ఘటనలో గాయాలయ్యాయి. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.మాచర్ల ఘటనపై ఈసీ సీరియస్‌మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణితో పాటు పలువురు మహిళలపై టీడీపీ మూకలు దాడులకు తెగబడిన ఘటనను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. మాచర్ల టౌన్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ పి.శరత్‌బాబు, వెల్దుర్తి ఎస్సై వంగా శ్రీహరి, కారంపూడి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ చిన్న మల్లయ్యను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురూ తక్షణమే విధుల నుంచి రిలీవ్‌ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దౌర్జన్యాలు.. హత్యాయత్నాలు⇒ నంద్యాల జిల్లా బనగానపల్లె మార్కెట్‌ వద్ద మంగళవారం ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి భార్య కాటసాని జయమ్మపై దాడికి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్‌రెడ్డి గూండాలను పురిగొల్పారు. ఈ విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్న ఆమె తనయుడు ఓబుళరెడ్డిపై కూడా టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కోనేటి దుర్గ, సయ్యద్‌ అబ్బాస్, ఇంతియాజ్, ఖాజా హుస్సేన్, జమీర్, గుర్రప్ప తీవ్రంగా గాయపడ్డారు. ⇒ అనంతపురం నియోజకవర్గంలో గత నెల 30న ఎన్నికల ప్రచారం నిమితం బైక్‌పై వెళ్తున్నవైఎస్సార్‌సీపీ నాయకుడు గుజ్జుల నగే­ష్‌పై టీడీపీ గూండాలు కళ్లల్లో కారం చల్లి కర్రలు, ఇనుపరాడ్లతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ⇒ శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పిచ్చిరెడ్డికొట్టాల గ్రామంలో గత నెల 27న ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా‹Ùరెడ్డి, సోదరుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డి వాహనాలపై టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత నేతృత్వంలో టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ నేత కురుబ ముత్యాలు వాహనంతోపాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ⇒ ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో మిట్టమీదిపల్లి, మాల్యవంతునిపాడు గ్రామాల మధ్య వైఎస్సార్‌సీపీకి చెందిన మూడు ప్రచార రథాలపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. డ్రైవర్లు వీరాంజనేయులు, ఆంథోని, రాజును రాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. ⇒ శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఇదే రీతిలో టీడీపీ, జనసేన రౌడీ మూకలు వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడుతూ భయోత్పాతం సృష్టిస్తున్నాయి. మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే సతీమణిపై దాడిఎన్నికల వేళ టీడీపీ అరాచకాలు ఏ స్థాయికి దిగజారాయంటే ఇప్పటివరకు పల్నాడు ప్రాంతంలో మహిళలు, పిల్లలపై దాడులు చేసిన సంస్కృతి లేదు. అలాంటిది మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహా్మరెడ్డి ప్రోద్బలంతో పచ్చమూకలు బరి తెగించాయి. ఎన్నికల ప్రచారం చేస్తున్న మాచర్ల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాదేవితోపాటు పలువురు మహిళలపై బుధవారం రాళ్లు, సీసాలతో దాడులకు దిగి హత్నాయత్నానికి పాల్పడ్డాయి. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో ఇంటింటి ప్రచారం చేస్తున్న రమాదేవిపై టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుర్రి పున్నారెడ్డి కుమారుడు శివారెడ్డి, కల్లం రామాంజిరెడ్డి తమ అనుచరులతో కలసి రాళ్ల దాడికి పాల్పడ్డారు. పీఆర్కే సతీమణి రమాదేవి, మాజీ ఎంపీపీ దాసరి చౌడేశ్వరి, కౌన్సిలర్‌ గట్ల అరుణ కుమారి, కో ఆప్షన్‌ సభ్యురాలు అన్నెం అనంతరావమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. మాజీ ఎంపీపీ చౌడేశ్వరికి చెందిన స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేశారు. అడ్డుకునే యత్నం చేసిన ఎస్‌ఐ శ్రీహరిపై సైతం పచ్చమూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ప్రశాంత వాతావరణంలో ప్రచారం చేస్తున్న మహిళలపై దాడులకు దిగటాన్ని ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలో గెలవలేక టీడీపీ హింసకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. ఏడుగురి హత్య కేసులో నిందితుడైన జూలకంటి బ్రహా్మరెడ్డిని చంద్రబాబు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించడంతో ఫ్యాక్షన్‌ రాజకీయాలు తిరిగి మొదలయ్యాయని పేర్కొంటున్నారు. ఓటమి భయంతోనే మహిళలపై టీడీపీ దాడులుఎన్నికల్లో ఓటమి భయం­తోనే టీడీపీ అధినేత చంద్రబాబు మహిళలపై దాడులు చేయిస్తున్నాడని వైఎస్సార్‌సీపీ మహిళా విభా­గం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దళిత మహిళ.. అందులోనూ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపై దాడి చేయడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో బొండా ఉమా మహిళలపై దాడులకు పురిగొల్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌ రాజకీయ పదవుల్లో మహిళలకు పెద్ద పీట వేసి.. దళితులకు రాజ్యాధికారం కల్పించారన్నారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల అభివృద్ధికి కృషి చేశారని వివరించారు. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సీఎం జగన్‌పై కక్ష కట్టాయన్నారు. విద్యార్థులకు విద్యా దీవెన, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం తదితర పథకాలను రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని మండిపడ్డారు. మహిళలపై దాడులు చేస్తున్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మరోసారి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

బుధవారం వేములవాడ సభలో ప్రధాని మోదీ అభివాదం. చిత్రంలో బండి సంజయ్‌
‘ఆర్‌ఆర్‌’ ట్యాక్స్‌ వెయ్యికోట్లు!: ప్రధాని మోదీ

సాక్షి, వరంగల్‌/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/ వేములవాడ: ‘‘కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే అభివృద్ధి పూర్తిగా ఆగి, ప్రభుత్వ ఖజానా ఖాళీగా మారింది, కాంగ్రెస్‌ వాళ్లు.. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరిట ప్రజలను దోపిడీ చేస్తున్నారు. అందులో సగం హైదరాబాద్‌లోని ‘ఆర్‌’కు వెళ్తే.. రెండో సగం మరో ‘ఆర్‌’ కోసం ఢిల్లీకి వెళ్తుంది. ఈ ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌.. ట్రిపుల్‌ ఆర్‌ సినిమా రూ.వెయ్యికోట్ల వసూళ్లను అనతికాలంలోనే దాటడం ఇక్కడి అవినీతికి నిదర్శనం..’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎంత అబద్ధాల కోరు అన్నది తెలంగాణ ప్రజలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదన్నారు. రైతుల రుణమాఫీపై కాంగ్రెస్‌ చేతులెత్తేయబోతోందని.. లోక్‌సభ ఎన్నికల వరకు ఆగి మోసగిస్తుందని వ్యాఖ్యానించారు. బుధవారం వేములవాడ, వరంగల్‌లలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ అమరుల కుటుంబాలకు పెన్షన్‌ ఇస్తామని, 250 గజాల భూమి ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పింది. ఇవ్వలేదు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి, మోసం చేసింది. తెలంగాణలో విద్యుత్‌ కోతలు పెరిగాయి. ప్రజలకు గంట గడవడం కష్టమవుతోంది. అలాంటి నమ్మక ద్రోహి కాంగ్రెస్‌ ప్రజలకు ఎలా మేలు చేస్తుంది? ఒక్కసారి ఆలోచించాలి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ప్రజలు కాంగ్రెస్‌ను అధికారమిస్తే.. కుటుంబానికే పెద్దపీట వేసి, జాతి ప్రయోజనాలకు గంగలో ముంచింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును అవమానించింది. అదే పీవీని బీజేపీ సర్కారు భారతరత్నతో గౌరవించింది. బీసీలకు కోత వేసి ముస్లింలకు ఇస్తుంది కాంగ్రెస్‌ దృష్టిలో రాజ్యాంగానికి విలువ లేదు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని అంబేడ్కర్‌ స్పష్టంగా చెప్పారు. కానీ కాంగ్రెస్‌ కర్ణాటకలో బీసీల రిజర్వేషన్లు కత్తిరించి ముస్లింలకు ఇచ్చింది. ఉమ్మడి ఏపీలో అదే ప్రయత్నం జరిగినా హైకోర్టు నిలిపివేసింది. దీన్ని కాంగ్రెస్‌ సహించలేకపోతోంది. అందుకే చట్టం చేసి అయినా.. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల రిజర్వేషన్లు తొలగించి ముస్లింలకు ఇవ్వాలనుకుంటోంది. బీఆర్‌ఎస్‌ కూడా బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది. కేవలం ముస్లింల కోసం ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించింది. 2014లో అధికారంలోకి వస్తే దళితుడ్ని సీఎం చేస్తామని మోసం చేసింది. దళిత బంధు పేరిట మోసం చేసింది. కాళేశ్వరం కుంభకోణానికి పాల్పడింది. ఎస్సీ వర్గీకరణ చేస్తాం.. మాదిగ సోదరులకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో కాంగ్రెస్‌ వెనుకడుగు వేస్తోంది. ఎస్సీ వర్గీకరణ కోసం నా చిన్న తమ్ముడు మంద కృష్ణ చాలాకాలం నుంచి పోరాడుతున్నారు. ఇప్పటివరకు న్యాయం జరగలేదు. నేను వారికి న్యాయం చేస్తానని వాగ్దానం చేశాను. అమలు చేసి చూపిస్తా. కాంగ్రెస్‌ సీట్లను భూతద్దంలో చూసుకోవాల్సిందే.. ప్రపంచమంతా అస్థిరత, అశాంతి, విపత్తులు నెలకొని ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దేశ కార్యభారాన్ని, శక్తిని తప్పుడు చేతుల్లో పెట్టొద్దు. పదేళ్ల క్రితం వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏరకమైన పాపాలు చేసిందో అందరికీ తెలుసు. నాలుగు రోజులకో కుంభకోణం, అవినీతి బయటపడుతుండేవి. దేశంలోని పెద్ద పట్టణాల్లో బాంబు పేలుళ్లు సంభవించేవి. ఇప్పుడు ఎన్టీయే విజయరథం వేగంగా ప్రయాణం చేస్తోంది. ఇప్పటివరకు జరిగిన మూడు దశల పోలింగ్‌లో ముందు నిలిచింది. కాంగ్రెస్‌ ఎక్కడెక్కడ సీట్లు గెలుస్తుందా అని భూతద్దం పెట్టి చూసే పరిస్థితి ఏర్పడింది. నాలుగో దశ పూర్తయ్యే సరికి భూతద్దంతోనూ దొరకవు. మైక్రోస్కోప్‌ కావాల్సి వస్తుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ తోడు దొంగలే! బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ రెండూ తోడుదొంగలే. పైకి తిట్టుకున్నా అవినీతి అనే వారధి వారిని తెరవెనుక కలుపుతోంది. అందుకే ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్‌ నేతను, కాళేశ్వరం అవినీతిలో బీఆర్‌ఎస్‌ నేతలను రెండు పార్టీలు పరస్పరం కాపాడుకుంటున్నాయి. హైదరాబాద్‌లో ఎంఐఎం విషయంలో బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ మధ్య అవగాహన ఉంది. కానీ బీజేపీ రంగంలోకి దిగేసరికి వారిలో ఆందోళన మొదలైంది. కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌లకు కుటుంబ రాజకీయాలే తొలి ప్రాధాన్యం. బీజేపీకి దేశమే తొలిప్రాధాన్యం. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల అడ్రస్‌ గల్లంతే. తెలంగాణ ప్రజలంతా ఏకమై మే 13న ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలి..’’ అని మోదీ పిలుపునిచ్చారు. ఓరుగల్లు సభలో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. చర్మం రంగును బట్టి యోగ్యత ఉంటుందా..? మేం 2014లో తొలిసారి అధికారంలోకి రాగానే దళితుడైన రాంనాథ్‌ గోవింద్‌ను రాష్ట్రపతిని చేశాం. 2019లో ఆదివాసీ మహిళ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిని చేశాం. కాంగ్రెస్‌ ఈ ఇద్దరిని వ్యతిరేకించింది. ముఖ్యంగా ద్రౌపదీ ముర్మును కాంగ్రెస్‌ ఎందుకు అంతగా వ్యతిరేకించిందా? అని ఎంతగా ఆలోచించినా ఇన్నాళ్లూ అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది. ద్రౌపదీ ముర్ము గారి చర్మం రంగు నలుపు. ఇక్కడున్న రాజ కుమారుడి (రాహుల్‌ గాం«దీ)కి అమెరికాలో ఓ ఫ్రెండ్‌ ఫిలాసఫర్, మార్గదర్శి (శ్యామ్‌ పిట్రోడా) ఉన్నారు. చర్మం రంగు నల్లగా ఉన్నవాళ్లందరూ ఆఫ్రికన్లలా ఉంటారని ఆయన ఈ మధ్య అన్నారు. చర్మం రంగును బట్టి ద్రౌపదీ ముర్ము గారిని కూడా ఆఫ్రికన్‌ అని ఆయన భావించారు. అందుకే ఓడించాలని చెప్పి రాజకుమారుడికి బోధించారు. నలుపు చర్మం ఈ దేశంలో చాలా మందికి ఉంటుంది. శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపే. మరి అలాంటిది చర్మం రంగును బట్టి యోగ్యతను నిర్ధారిస్తారా? ఇందుకే ఆ రాజ కుమారుడి మీద నాకు కోపం వస్తోంది. నన్ను తిడితే నాకు కోపం రాదు. కానీ నా దేశ ప్రజలను చర్మం రంగు పేరిట రాజ కుమారుడి మార్గదర్శకుడు లండన్‌లో కూర్చొని , అమెరికాలో కూర్చొని తిట్టడం నాకు కోపం తెప్పిస్తోంది. రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రధాని మోదీ వేములవాడకు చేరుకున్నారు. నేరుగా శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. కోడె మొక్కు చెల్లించుకున్నారు. తర్వాత ప్రత్యేక కాన్వాయ్‌లో ప్రజలకు అభివాదం చేస్తూ.. బాలానగర్‌లోని సభాస్థలికి చేరుకున్నారు. సభ ముగిశాక హెలికాప్టర్‌లో వరంగల్‌ పయనమయ్యారు. ‘ఒక్కొక్కరి పొలంలో పది మీటర్లు..’ కాంగ్రెస్‌పై మోదీ సెటైర్‌ లెక్క! ‘‘ఈసారి ఇండియా కూటమి ఐదు సంవత్సరాల్లో ఐదుగురు ప్రధానులను తీసుకొస్తామని చెప్తోంది. ఇదీ అందరికీ స్పష్టంగా అర్థం కావాలంటే మరో పద్ధతిలో చెబుతా. పది మంది రైతులు తమ పొలాల్లో బోరు వేయించాలనుకున్నారు. ఒక నిపుణుడిని పిలుచుకొచ్చారు. ఆ నిపుణుడు మొత్తం పరిశీలించి, 100 మీటర్లు తవ్వితే నీళ్లు పడతాయని చెప్పారు. అప్పుడు ఈ రైతులు.. ఒకరి పొలంలో పది మీటర్లు, పక్క పొలంలో పది మీటర్లు, ఆ పక్కవాడి పొలంలో పది మీటర్లు.. ఇలా పది మంది పొలాల్లో తవ్వితే 100 మీటర్లు అయిపోతుందనుకున్నారు. అలా చేస్తే నీళ్లు వస్తాయా? ఇండియా కూటమి అంతే. పార్టీకో ప్రధాని ఉంటే దేశం భవిష్యత్‌ ఏమవుతుంది?’’ రుణమాఫీపై చేతులెత్తేస్తారు! ‘‘కాంగ్రెస్‌ అతిపెద్ద నాయకురాలు (సోనియా) పుట్టినరోజు డిసెంబర్‌ 9న రైతుల రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఇప్పుడు ఆగస్టు 15 వరకు వాయిదా వేసి ఆ వాగ్దానాన్ని వెనక్కి తోశారు. లోక్‌సభ ఎన్నికలు అయ్యేదాకా ఆగి ఆ తర్వాత చేతులెత్తేయబోతున్నారు. ఇది మిమ్మల్ని మోసం చేయడమే.. మీ మనోభావాలను దెబ్బతీయడమే.. వాళ్లు ఒకవైపు వేములవాడ రాజన్న మీద ఒట్టు పెడుతున్నారు. మరోవైపు సనాతన ధర్మాన్ని తిడుతున్నారు. సనాతన ధర్మాన్ని తిడుతూ, ఒట్లు పెట్టేవారిని ఎవరు నమ్ముతారు..’’ – మోదీ

Several key leaders of the coalition are on the brink of defeat
కూటమి ప్రముఖుల ఎదురీత

సాక్షి, అమరావతి : ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తాలేక గుంపుగా వస్తున్న టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలోని ప్రముఖ నేతలు తమ సొంత స్థానాల్లో ఎదురీదుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం సంగతి ఎలా ఉన్నా సొంత నియోజకవర్గాల్లోనే వీళ్లంతా ఓటమి బాటలో పయనిస్తుండడం ఆసక్తికరంగా మారింది. పైకి వీరంతా గంభీరంగా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నా గెలిచే పరిస్థితిలేదని పలు సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఎప్పుడూలేని విధంగా కుప్పం ప్రజలు వణికిస్తున్నారు.ఈసారి ఆయన గెలవడం కష్టమనే పరిస్థితి నెలకొనడంతో టీడీపీ అక్కడ ప్రత్యేకంగా దృష్టిసారించినా పెద్దగా మార్పురాలేదని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో కుప్పం మున్సిపాల్టీని చేజార్చుకోవడంతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల్లోనూ చంద్రబాబు తొలిసారి భంగపడడంతోనే ఆయన ఓటమికి బీజంపడింది. దీంతో కుప్పంలో గెలవడమే తప్ప ఎప్పుడూ నియోజకవర్గాన్ని పట్టించుకోని చంద్రబాబు నియోజకవర్గం చుట్టూ తిరగక తప్పలేదు. ఇప్పుడు ఆయన సతీమణి భువనేశ్వరి కూడా అక్కడే మకాం వేసి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు.గతంలో జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ ఆమె ఇలా ప్రచారం చేసిన దాఖలాల్లేవు. శాంతిపురం మండలంలో ఈసారి చంద్రబాబుకు గట్టి షాక్‌ తగిలే పరిస్థితి ఉంది. బెంగుళూరు నుంచి 200 మంది ఐటీ ప్రొఫెషనల్స్‌ని రెండునెలలుగా కుప్పంలో ఉంచి పనిచేయిస్తున్నా గెలుస్తామనే నమ్మకం చంద్రబాబులో కనిపించడంలేదు. సీఎంగా చేసినప్పుడు కూడా కుప్పం గురించి ఆయన పట్టించుకోలేదనేది స్థానికుల నిశ్చితాభిప్రాయం. ఆయన్ను కుప్పం ప్రజలు ఎనిమిదిసార్లు గెలిపించినా చంద్రబాబు కుప్పంను రెవెన్యూ డివిజన్‌గా చేయలేకపోయారు. వైఎస్‌ జగన్‌ వచ్చాక కుప్పం రెవెన్యూ డివిజన్, పోలీసు సబ్‌డివిజన్‌ ఏర్పాటుచేశారు. ఇన్నాళ్లూ కనీసం కుప్పంలో సొంత ఇల్లు కూడా చంద్రబాబు కట్టుకోలేదు. కేవలం తనకు ఓట్లేసే మిషన్లుగా అక్కడి జనాన్ని ఆయన చూశారు. దీన్నిబట్టే ఆయనకు కుప్పంపై ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని అక్కడి ప్రజలు గమనించారు.మరోవైపు.. అభివృద్ధితోపాటు ప్రజలకు ఎలాంటి భేదాలు లేకుండా సంక్షేమ పథకాలు అందడంతో వైఎస్‌ జగన్‌పట్ల ఆదరణ కనిపిస్తోంది. దీంతో కుప్పంలో చంద్రబాబును ఓటమి భయం వెంటాడుతోంది. ఇవే తన చివరి ఎన్నికలు కాబట్టి తనను గెలిపించాలంటూ ఆయన అభ్యర్థిస్తుండడాన్ని బట్టి ఆయన్ను ఓటమి భయం వెంటాడుతోందని స్పష్టమవుతోంది. పిఠాపురంలో పవన్‌కు నాన్‌లోకల్‌ గండంజనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా పిఠాపురంలో గెలుపునకు చాలా దూరంలో ఉన్నారు. ఒక్కసారి తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఆయన దీనంగా ప్రాథేయపడుతున్నా జనం మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. సినిమా స్టార్‌ కాబట్టి చూడ్డానికి రావడం తప్ప ఓటు వేస్తారా లేదా అనే దానిపై జనసేన నాయకులకే నమ్మకం కలగడంలేదు.నాన్‌ లోకల్‌ కావడం, కేవలం కులం ఓట్ల ప్రాతిపదికనే పవన్‌ అక్కడ పోటీచేస్తుండడం ఆయనకు పెద్ద మైనస్‌ పాయింట్లుగా మారాయి. పవన్‌ తమ ఎమ్మెల్యే అయితే ఆయన్ను కలవడం కుదరదని, తమకు ఏమైనా సమస్య వస్తే వెళ్లి చెప్పుకునే అవకాశం ఉండదనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ఆయన పూర్తిస్థాయి రాజకీయ నేత కాకపోవడంతో ఎంతవరకూ నమ్మవచ్చనే అనుమానాలూ జనంలో ఉన్నాయి.అయితే, జబర్దస్త్‌ షో ఆర్టిస్టులు, సినిమా వాళ్లు, పలువురు మెగా ఫ్యామిలీ హీరోలు పిఠాపురంలో ఆయనకు అనుకూలంగా ప్రచారం చేస్తూ హడావుడి చేయడం అక్కడి జనానికి వినోదం పంచుతోంది. టీడీపీ ఇన్‌ఛార్జి వర్మ పైకి పవన్‌ కోసం పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నా, లోపాయకారీగా టీడీపీ కేడర్‌ను సైలెంట్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎంత హంగామా చేసినా జనంలో మాత్రం పవన్‌ గెలుపునకు దోహదపడే అంశాలు కనిపించడంలేదు. ఈసారి బాలయ్యకూ నిరాశే..హిందూపురంలో నందమూరి బాలకృష్ణ కూడా ఈసారి గట్టెక్కడం కష్టంగా మారింది. మైనారిటీలు ఎక్కువగా ఉండ­డంతో వారు ఈసారి బాలయ్యకు ఝలక్‌ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు.. కూటమి రెబల్‌ అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామి టీడీపీ ఓట్లను భారీ సంఖ్యలో చీల్చే అవకాశం ఉంది. అలాగే, టీడీపీ కేడర్, ద్వితీయశ్రేణి నేతల్లోనూ బాలకృష్ణ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాలకృష్ణ వల్ల ఉపయోగం లేకుండాపోయిందని బాధపడుతున్నారు. ఆయన ఇక్కడ ఎవరికీ అందుబాటులో ఉండకపోవడం, ఎప్పుడూ నందమూరి కుటుంబాన్ని గెలిపించడమే తప్ప వారిక్కడ లేకుండా తమపై పెత్తనం చేయడంపై వారిలో అసహనం కనిపిస్తోంది. దీనికితోడు వైఎస్సార్‌సీపీ బీసీ అభ్యర్థిని నిలబెట్టడంతో ఆ ఓట్లలోనూ భారీ చీలిక తప్పదంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాలకృష్ణ కంచుకోట బద్దలవుతుందని గట్టిగా వినిపిస్తోంది.ఓటమి అంచున ఉత్తరాంధ్ర ముఖ్యనేతలు..ఉత్తరాంధ్రలో టీడీపీ ముఖ్య నేతలైన గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, అయ్యన్న­పాత్రుడు, అశోక్‌­గజపతిరాజు కుమార్తె అదితిలు సైతం ఈ ఎన్నికల్లో గెలవడం కష్టంగా మారింది. » తరచూ నియోజకవర్గాలు మార్చే నేతగా ముద్రపడిన గంటా శ్రీనివాసరావును భీమిలి జనం నమ్మడంలేదు. 2014 ఎన్నికల్లో గెలిపిస్తే భూ కుంభకోణాలతో జనాన్ని భయభ్రాంతులకు గురిచేయడాన్ని వారింకా మరచిపోలేదు. గంటా గెలిస్తే తమ భూములు ప్రమాదంలో పడతాయనే ఆందోళన ఉంది. అలాగే, గెలిచినా నియోజక­వర్గాన్ని పట్టించుకోరనే వాదనా ఉంది. వీటికి­తోడు విశాఖను పరిపాలనా రాజధా­నిగా చేసే విషయంలో ఆయన వైఖరిపైనా వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో గంటా గెలవడం సాధ్యంకాదని చెబుతున్నారు. » నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్న­పాత్రుడు కూడా ఎదురీదుతున్నారు. వివాదాలు, నోటి దురుసుతనంతో ఆయన ప్రజల ఆదరణ కోల్పోయారు. » ఎవరూ పోటీచేయడానికి ముందు రాకపో­వ­డం­తో చీపురుపల్లి బరిలో నిలుచున్న కళా వెంక­ట్రావుకు గెలుపు ఆశలేలేవని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. మంత్రి బొత్స సత్య­నారాయణను ఎదురొడ్డి కళా నిలబడడం అసా«­ద్యమని ఆదిలోనే తేలిపోయింది. ఆయ­న మొక్కుబడిగానే ప్రచారం చేస్తున్నారు. » ఇక విజయనగరంలో అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి సెంటిమెంటునే నమ్ముకుని తనను గెలిపించాలని కోరుతున్నా స్థానికంగా అంత స్పందన రావడంలేదు. ఆమె గెలిచినా కోటకే పరిమితమవుతారని అందుబాటులో ఉండరనే అభిప్రాయం నెలకొంది. టీడీపీ రెబల్‌గా మీసాల గీత ఉండడం, ఆమె చీల్చే ఓట్లు గణనీయంగా ఉండే అవకాశం ఉండ­డంతో అదితికి ఓటమి తప్పదంటున్నారు. » అనకాపల్లిలో జనసేన తరఫున కొణతాల రామకృష్ణ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఆయన ప్రజలకు దూరమై చాలాకాలం కావడంతో ఇప్పుడు గెలిచి ఏం చేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. » రాజమండ్రి రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, డోన్‌లో కోట్ల సూర్యప్రకాశరెడ్డి గెలుపు అవకాశాలకు దూరంగానే ఉన్నారు. » మంగళగిరిలో చంద్రబాబు తనయుడు లోకేశ్‌ ఎంత ప్రయత్నిస్తున్నా గెలుపు ఊపు రావడంలేదు. తాయిలాలపైనే నమ్మకం పెట్టుకున్నా అది కూడా నెరవేరే సూచనలు కనిపించడంలేదు. రెండోసారి మంగళగిరి ప్రజలు ఆయన్ను తిరస్కరిస్తారనే వాతావరణం కనిపిస్తోంది.సీఎం రమేష్, సుజనా, కిరణ్, పురందేశ్వరి, నాదెండ్ల..పొత్తులో సీట్లు దక్కించుకుని బీజేపీ తరఫున అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట ఎంపీ స్థానాల నుంచి పోటీచేస్తున్న సీఎం రమేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలకు గెలుపుపై ఆశలు వదిలేసుకున్నారు. విజయవాడ వెస్ట్‌ అసెంబ్లీ నుంచి బీజేపీ తరఫున సుజనా చౌదరి, తెనాలి నుంచి జనసేన తరఫున నాదెండ్ల మనోహర్‌ పరిస్థితి కూడా అలాగే ఉంది. ధనబలం, కులబలంతో గెలవొచ్చని వారు బరిలోకి దిగినా అందుకు అవకాశాలు లేకపోవడంతో వారికి కళ్లెదుటే ఓటమి సాక్షాత్కరిస్తోంది.

 Daily Horoscope: Rasi Phalalu On 09-05-2024 In Telugu
Horoscope Today: ఈ రాశి వారికి వ్యతిరేకులు సైతం అనుకూలురుగా మారవచ్చు

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.పాడ్యమి ఉ.7.10 వర కు, తదుపరి విదియ, నక్షత్రం: కృత్తిక ప.1.07 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: తె.4.15 నుండి 6.20 వరకుు, దుర్ముహూర్తం: ఉ.9.47 నుండి 10.38 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు, అమృత ఘడియలు: ప.10.46 నుండి 12.10 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.34, సూర్యాస్తమయం: 6.17. మేషం: మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు.వృషభం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.మిథునం: రుణాలు సైతం చేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. అనారోగ్యం. సోదరులతో విభేదాలు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తులు సమకూరతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు విస్తరించే యత్నాలు సఫలం. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు.సింహం: నూతన ఉద్యోగప్రాప్తి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊరట లభిస్తుంది.కన్య: ఇంటాబయటా వ్యతిరేకత. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆథ్యాత్మిక చింతన. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగానే ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.తుల: వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు.వృశ్చికం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. పనులు చకచకా సాగుతాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు తప్పకపోవచ్చు.మకరం: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.కుంభం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు అనివార్యం కావచ్చు.మీనం: వ్యతిరేకులు సైతం అనుకూలురుగా మారవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.

Sakshi Guest Column On AP CM Jagan Govt Welfare To Poor Students
బీద పిల్లల గురించి ఆలోచించండి!

ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ వాళ్లు గ్రామీణ విద్యా వ్యవస్థను ప్రాంతీయ భాషామయం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీలలో ఇంగ్లిష్‌ను క్రమంగా తీసేసి ప్రాంతీయ భాషను, ముఖ్యంగా హిందీని రుద్దుతున్నారు. కానీ పెట్టుబడిదారుల యూనివర్సిటీల్లో ఇంగ్లిష్‌ భాష, విదేశీ సిలబస్‌ ద్వారా చదువు చెప్పి తిరిగి దేశ నాయకత్వాన్ని మొత్తం వారి చేతికి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది. జగన్‌ ప్రభుత్వం విద్యా సమానత్వం కోసం అన్ని రకాల కుట్రలకూ వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసి స్కూలు విద్యను మార్చింది. తెలుగుకు ప్రాధాన్యమంటూ ఇంగ్లిష్‌ మీడియం తీసివేస్తే పూర్తిగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీలు. జాగ్రత్తగా ఆలోచించి ఓటెయ్యకపోతే, బీద పిల్లల భవిష్యత్‌ అంధకారమౌతుంది.దేశంలో ఎన్నికలు మొదటిసారి ఓబీసీల (వెనుకబడిన తరగతుల) చుట్టూ తిరుగు తున్నాయి. ఓబీసీల్లో అన్ని శూద్ర కులాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని శూద్ర వ్యవసాయ కులాలు రిజర్వేషన్లలో లేకపోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఉండొచ్చు. ఉదాహరణకు రెడ్డి, కమ్మ, కోస్తా కాపు కులాలు రిజర్వేషన్లలో లేవు. కర్ణాటకలో, తమిళనాడులో అన్ని శూద్ర కులాలు రిజర్వేషన్లలో ఉన్నాయి. లింగాయత్, వక్కళిగ, నాయకర్‌ (పెరియార్‌ కులం) కులాలు కూడా ఆ రాష్ట్రాల్లో రిజర్వేషన్లలో ఉన్నాయి.చారిత్రకంగా వర్ణ వ్యవస్థలో నాలుగవ వర్ణం శూద్రులు. వేద కాలంలో వారు బానిసలు. తరువాత వ్యవసాయ, కుటీర పరిశ్రమ, పశుపోషణ వంటి అన్ని ఉత్పత్తి పనులు చేసి దేశాన్ని ఈ స్థితికి తెచ్చింది ఈ కులాలే. క్రమంగా వీరి నుండి విడగొట్టబడి అంటరాని వారుగా అణగదొక్కబడ్డవారు దళితులు. వీరు కాక అరణ్య జీవనం నుండి అందరిలో కలిసే ప్రయత్నం చేస్తున్నవారు ఆదివాసులు.ఇంగ్లిష్‌ మీడియం వంటి సమాన విద్యే ఈ కుల వ్యవస్థను కూల్చుతుందని మనకు ఈమధ్య కాలంలోనే అర్థమవుతోంది. అందుకు మంచి ఉదాహరణ ఈ సంవత్సరం 10వ తరగతిలో ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకున్నవారు ఆంధ్రలో 91 శాతం పాస్‌ అయితే, తెలంగాణలో 93 శాతం పాసయ్యారు. తెలుగు మీడియంలో చదువుకున్నవారు 80 శాతంగానే పాసయ్యారు.రిజర్వేషన్ల మాటేమిటి?అయితే 2024 ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడం, అందులో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లను క్రమంగా ఎత్తివేసే సవరణ చెయ్యడం గురించి చర్చ జరుగుతోంది. ఈ భయం బీజేపీ బయట ఉన్న వారికే కాదు, బీజేపీలో ఉన్నవారికి కూడా ఉన్నది. అయితే మరి మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే ఆయన బీసీ అని చెబుతున్నారు కనుక ఎలా తీసేస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది? ఆరెస్సెస్‌ 1950లో రాజ్యాంగాన్ని డాక్టర్‌ అంబేడ్కర్‌ ఆనాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌కు అందించి అమలు చేసిన నాటి నుండి ఎస్సీ, ఎస్టీలకు అందులో పొందుపర్చిన రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకతతో ఉంది. అంతకంటే ముఖ్యంగా 1955లో కాకా కాలేల్‌కర్‌ బీసీ రిజర్వేషన్‌ రిపోర్టును ఆనాటి నెహ్రూ ప్రభుత్వం తిరస్కరించినప్పుడు ఆరెస్సెస్‌ మంచి పని జరిగింది అనే ధోరణిలో ఉంది.అయితే 1990లో వీపీ సింగ్‌ ప్రభుత్వం బీపీ మండల్‌ రిపోర్టును అమలు చేసినప్పుడు ఆరెస్సెస్‌/బీజేపీ వ్యతిరేకించాయి. ఆనాడు కాంగ్రెస్‌ కూడా వ్యతిరేకించింది. కాంగ్రెస్‌లో ఉన్న బీసీ నాయకులు కొంతమందైనా బీసీ రిజర్వేషన్లను సపోర్టు చేశారు. కానీ బీజేపీలో ఉన్న బీసీల్లో ఒక్క ఉమాభారతి తప్ప వేరే ఏ ఒక్క బీసీ లీడర్‌ కూడా బీసీ రిజర్వేషన్లను సపోర్టు చెయ్యలేదు. నరేంద్ర మోదీ ఆనాడు రిజర్వే షన్లను సపోర్టు చెయ్యలేదు. ఆయన బీసీ అని కూడా ఎవ్వరికీ తెలియదు. గుజరాత్‌ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే ఆయన బీసీగా ప్రచారం ప్రారంభించారు.2014 ఎన్నికలకు ముందు ఆ ప్రచారాన్ని బాగా పెంచారు. ప్రధానంగా ఆనాడు బీసీల ఓట్లతో ఆయన గెలిచారు. అందుకు ఫలితంగా ఆయనగానీ, బీజేపీ/ఆరెస్సెస్‌ ప్రభుత్వంగానీ గత పదేండ్లలో బీసీలకు ఏమి ఇచ్చారు? మొత్తం శూద్ర సమాజం బతికేది వ్యవసాయ రంగం మీద. దాన్ని మొత్తంగా గుజరాత్‌–ముంబయి బడా పెట్టుబడిదారులకు అప్పగించేందుకు ఘోరమైన వ్యవసాయ వ్యతిరేక చట్టాలు తెచ్చారు. శూద్ర/బీసీలు ఇంతో అంతో బతికేది వ్యవసాయ ఉత్పత్తి, వ్యవసాయ మార్కెట్ల మీద. వాటిని బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని చట్టాలు చేస్తే శూద్ర/బీసీ రైతులు ఎంత పోరాటం చేశారో వ్యవసాయదారులందరికీ తెలుసు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లల స్కాలర్‌షిప్‌లు మొత్తం తగ్గించివేశారు. వీరు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీలలో ఇంగ్లిష్‌ను క్రమంగా తీసేసి ప్రాంతీయ భాషను ముఖ్యంగా సెంట్రల్‌ యూనివర్సిటీల్లో హిందీని రుద్దుతున్నారు. కానీ పెట్టుబడిదారుల యూనివర్సిటీల్లో కేవలం ఇంగ్లిష్‌ భాష, విదేశీ సిలబస్‌ ద్వారా చదువు చెప్పి తిరిగి దేశ నాయ కత్వాన్ని మొత్తం వారి చేతికి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది.చాలా విచిత్రంగా ఈ ఎన్నికల్లో ముస్లిం రిజర్వేషన్లను తీసేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామంటున్నారు. మోదీ, అమిత్‌ షా ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. అసలు ముస్లింలకు రిజర్వేషన్లు యూపీ ఎస్సీలో ఉన్నాయా? కొన్ని రాష్ట్రాల్లో 4 శాతం లేదా అంతకంటే తక్కువ ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక రంగాన్ని ప్రైవేటీకరిస్తూ, బీసీ, ఎస్సీ, ఎస్టీల పిల్లల్ని ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకోవడాన్ని వ్యతి రేకిస్తూ ముస్లింలకు తగ్గించేది ఎక్కడ? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చేది ఎక్కడ?ప్రధానమంత్రి బీసీని అని చెబుతూ నా సిద్ధాంతం ‘సనాతన ధర్మం’ అంటే ‘వర్ణధర్మం’ అంటున్నారు. బీసీలు శూద్ర వర్ణం వారు కదా! సనాతన ధర్మం వారిని దైవ పాదాల నుండి పుట్టించింది కదా! అయినా మళ్ళీ ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా శూద్రులందరినీ ఏ దేవుని పాదాల్లో పుట్టిస్తారు? ఈ రాజ్యాంగం ఆ పాదాల, తొడల, భుజాల, తల పుట్టుకను రద్దు చేసి అందరి పుట్టుకను సమానం చేసింది. బీసీ ప్రధానమంత్రి చిన్నప్పుడు చాయ్‌ అమ్మి ఉండవచ్చు. కానీ మట్టి మోసి, మనుషుల మలాన్ని ఎత్తివేసే పనులు చేసే పిల్లల్ని కనీసం చాయ్‌ వ్యాపారంలోకి కూడా రానియ్యలేదే! దళితులు చాయ్‌ చేస్తే ఈ దేశంలో పై కులాలు ఇప్పటికీ తాగడం లేదే! మానవ మను గడకు మూలం వ్యవసాయం; ఆ పని చేసేవారంతా శూద్ర బీసీలు. వారికి బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, ఖత్రీలు, కాయస్తులతో సమాన విద్య, సమాన పని హక్కు కల్పించే ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా మళ్ళీ సనాతన ధర్మాన్ని స్థాపించడం సాధ్యం కాదు. ఇక్కడే బీసీలు జాగ్రత్తగా ఆలోచించాలి. మే 5న ఆంధ్రప్రదేశ్‌ బహిరంగ సభలో అమిత్‌ షా మాట్లాడుతూ, తమ ప్రభుత్వం రాగానే తెలుగుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెలుగుకు ప్రాధాన్యమంటే, ఇంగ్లిషు మీడియం తీసేయడమా? మరి అమిత్‌ షా తన కొడుకు జయ్‌ షాను గుజరాతీ మీడియంలో ఎందుకు చదివించలేదు? అదే అమిత్‌ షా... ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్లో మరాఠీ/గుజరాతీ మీడియం ఎందుకు పెట్టించలేదు? ఆంధ్రప్రదేశ్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వెయ్యకపోతే, బీద పిల్లల భవిష్యత్‌ అంధకార మౌతుంది.ఓటు వేసే ముందు... జగన్‌ ప్రభుత్వం విద్యా సమానత్వం కోసం అన్ని రకాల కుట్రలకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసి స్కూలు విద్యను మార్చింది. ఇంగ్లిష్‌ మీడియం తీసివేస్తే పూర్తిగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీలు. అమిత్‌ షా ప్రకటన చాలా ప్రమాదకర హెచ్చరిక. ఈ మధ్య కాలంలోనే మోదీ తమ ఎంపీ అభ్యర్థులందరికీ ఉత్తరాలు రాస్తూ అమిత్‌ షాను ఆకాశానికి ఎత్తారు. మోదీ తరువాత అమిత్‌ షానే ప్రధానమంత్రి అనే డైరెక్షన్‌ ఇచ్చారు. ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంగ్లిష్‌ విద్య రానియ్యకూడదనే పట్టుదలతో ఉన్న వ్యక్తి.ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో గ్రామీణ విద్యా వ్యవస్థను ప్రాంతీయ భాషామయం చేశారు. కానీ పెద్ద పెట్టుబడిదారులు వారి పిల్లల్ని ఇంగ్లిష్‌ తప్ప మరో భాష రాకుండా చూసుకుంటున్నారు. వీరి నేతృత్వంలో రేపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నడిస్తే, సమస్త భవిష్యత్‌ దెబ్బతింటుంది. గుజరాత్‌లో ఎప్పుడైనా ఆంధ్ర పాలకుల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నడవగా చూశామా! ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి ఓటు వేసే ముందు మొత్తం ప్రజలు ఆలోచించాల్సింది ఇదే.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

South Indians look like Africans says Sam Pitroda
శామ్‌ పిట్రోడా మరో దుమారం

న్యూఢిల్లీ: అమెరికాలో అమల్లో ఉన్న వారసత్వ పన్ను తనకు బాగా నచి్చందని, అది న్యాయంగా ఉందని వ్యాఖ్యానించి రాజకీయ వివాదానికి తెరతీసిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు శామ్‌ పిట్రోడా ఆ గొడవ సద్దుమణగ ముందే మరో దుమారం సృష్టించారు. దక్షిణ భారతదేశ ప్రజలు అఫ్రికన్లలా ఉంటారని ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పిట్రోడాను సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తప్పుపట్టారు. తాజాగా ఓ పత్రికకు ఇచి్చన ఇంటర్వ్యూలో శామ్‌ పిట్రోడా మాట్లాడుతూ... భారత్‌ విభిన్నమైన దేశం అని అభివరి్ణస్తూ కొన్ని పోలికలను ప్రస్తావించారు. అవే ఆయనను ఇప్పుడు ఇరకాటంలోకి నెట్టేశాయి. ‘‘మనది లౌకిక దేశం. బ్రిటిష్‌ పాలకులపై మన స్వాతంత్య్ర సమరయోధులు సాగించిన పోరాటాల వల్ల భారత్‌ లౌకిక దేశంగా ఆవిర్భవించింది. ప్రపంచవ్యాప్తంగా మనది ఉత్తమమైన ప్రజాస్వామ్య దేశం. 75 ఏళ్లుగా ప్రజలు సంతోషకరమైన వాతావరణంలో కలిసిమెలిసి జీవిస్తున్నారు. అక్కడక్కడా జరిగిన చిన్నపాటి గొడవలను పక్కనపెడితే ఇక్కడెంతో వైవిధ్యం, భిన్నత్వం కనిపిస్తాయి. భారత్‌లో ఈశాన్య ప్రాంతాల ప్రజలు చైనీయుల్లా, పశి్చమ ప్రాంతాల జనం అరబ్బుల్లాగా, ఉత్తరాది ప్రజలు శ్వేతజాతీయుల్లాగా, దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారు. అది పెద్ద విషయం కాదు. ఏది ఎలా ఉన్నప్పటికీ మనమంతా సోదర సోదరీమణులం. దేశంలోని విభిన్నమైన భాషలు, మతాలు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను మనం పరస్పరం గౌరవించుకుంటున్నాం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన మూలాల్లోనే ఉన్నాయి’’ అని శామ్‌ పిట్రోడా చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. మరోవైపు పిట్రోడా వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్‌ వివరణ ఇచ్చింది. పిట్రోడా రాజీనామా.. ఆమోదించిన అధిష్టానం తన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీయడంతో శామ్‌ పిట్రోడా ఇండియన్‌ ఓవర్‌సీస్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్‌ అధిష్టానం వెంటనే ఆమోదించింది. రాజీనామా చేయాలన్నది పిట్రోడా సొంత నిర్ణయమని కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ చెప్పారు.

chandrababu naidu shades in elections
నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!

సాక్షి, అమరావతి: చంద్రబాబుకు అధికారమే పరమావధి. ఇందుకోసం ఎవరినైనా వెన్ను­పో­టు పొడుస్తారు.. విమర్శిస్తారు.. వ్యతిరేకిస్తారు. విలువలు, సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చేస్తా­రు. మళ్లీ అవసరమైతే తాను తిట్టినవారి ఒళ్లోనే చేరతారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2019 ఫిబ్రవరి 10న ప్రధాని నరేంద్ర మోదీ గుంటూరులో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. తాజాగా బుధవారం ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ రోడ్‌ షో నిర్వహించిన విజయవాడ రోడ్డుపైనే నాడు టీడీపీ నేతలు ప్రధానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ నేత­లు నల్ల జెండాలు ఎగరవేస్తూ ‘గో బ్యాక్‌ మోదీ’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనకు నాలుగైదు రోజుల ముందు చంద్రబాబు విజయవాడ బెంజి సర్కిల్‌లో నల్లచొక్కా తొడుక్కొని ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఘటనకు ఆరు నె­లలు ముందే బీజేపీని వ్యతిరేకించి టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ మళ్లీ ఇప్పుడు 2024 ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు అదే బీజేపీతో పొత్తు పెట్టుకొని తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరిపోవడం గమనార్హం. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డిఅయినా కరుస్తారనడానికి ఈ ఉదంతం ఒక నిదర్శనం. నాడు ఎన్నికల ముందు బాబు డ్రామా.. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ కూడా చేరింది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ చేరి మంత్రి పదవులు కూడా తీసుకుంది. అయినప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరంకు నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రైల్వే జోన్‌ ఇలా ఏ ముఖ్యమైన హామీని సాధించలేకపోయింది. ఇలా అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగింది. రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వనందుకు తప్పుకుంటున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కూడా బీజేపీ ప్రత్యేక హోదాపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. అయినప్పటికీ చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో చేరారు. అప్పట్లో ‘నరేంద్ర మోదీ కరుడుకట్టిన ఉగ్రవాది. మంచివాడు కాదు. భార్యనే చూసుకోనివాడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు’ అంటూ చంద్రబాబు వ్యక్తిగతంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనికి తానేమీ తక్కువ తినలేదన్నట్టు ప్రధాని మోదీ సైతం ‘చంద్రబాబు చేస్తున్నది అమరా­వతి నిర్మాణం కాదు.. అద్భుతమైన అమరావతి నిర్మాణమంటూ వ్యక్తిగత అభివృద్ధిలో బిజీ అయిపోయారు’ అంటూ విమర్శించారు. అంతేకాకుండా ‘పోలవరం ప్రాజెక్టును డబ్బులు డ్రా చేసిపెట్టే ఏటీఎం లాగానే చంద్రబాబు వాడుకుంటున్నారు’ అని తీవ్ర విమర్శలు చేశారు. నాడు ప్రధాని మోదీపై చంద్రబాబు వ్యక్తిగతంగా దారుణమైన విమర్శలు చేసి.. ఇప్పుడు అధికారమే పరమావధిగా పొత్తు పెట్టు­కోవడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మోదీని ఉద్దేశించి చంద్రబాబు విమర్శలు.. దేశ రక్షణ రంగంలో అతిపెద్ద కుంభకోణంగా పేర్కొంటున్న రూ.59,000 కోట్ల రఫెల్‌ ఒప్పందం, అందుకు సంబంధించిన నివేదికలు, ఇందులో నేరుగా ప్రధాని కార్యాలయ ప్రమేయం ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి. దానిపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వ విధ్వంసక నిర్ణయాలను తెలియజేస్తోంది. మోదీ జీ మీరు దేశాన్ని మోసం చేసినప్పుడు సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేరు. 2019 ఫిబ్రవరి 8న తన ట్విట్టర్‌లో మీకూ, బ్రిటిష్‌ వాళ్లకూ తేడా ఏమిటి? వాళ్లే నయం. కాటన్‌ దొర ఇచి్చన నీళ్లయినా తాగుతున్నాం. మేం మీ బానిసలమా? రాజధానిని 50 ఏళ్లకు నిరి్మస్తారా? నాలాంటి సీనియర్‌ నాయకుడు నల్ల చొక్కా వేసుకున్నారంటే వీళ్లు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ప్రజలు అర్ధం చేసుకోవాలి. 2002లో మోదీ, నిన్న అమిత్‌షా రాజకీయాల్లోకి వచ్చారు. నేను 1978లోనే ఎమ్మెల్యేనయ్యా. ప్రధాని మోదీని సార్‌ అంటూ గౌరవిస్తే అమరావతికి మట్టి, నీరు ముఖాన కొట్టిపోతారా? –2019 ఫిబ్రవరి 2న శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రం కోసం 29 సార్లు తలవంచుకొని ఢిల్లీ వెళ్లా. కేంద్రం ముందు చేయి చాచా. ఎలాంటి కనికరం లేదు. ప్రజలుగా మీరు చెప్పండి. 2018 జూన్‌ 9న నెల్లూరు సభలో బీజేపీకి ఒకటే చెబుతున్నా.. టీడీపీతో పెట్టుకుంటే ఖబడ్డార్‌.. మీ కుట్రలు ఏ రాష్ట్రంలోనైనా చెల్లుతాయోమో.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సాగవు. 2018లో శృంగవరపుకోటలో నేను ఎవరికీ భయపడేది లేదు. నరేంద్ర మోదీ, ఎన్డీఏ ప్రభుత్వం ఇబ్బందులు పెడితే భయపడే పిరికి పందను కాను. ఒక్కో రాష్ట్రంలో నాయకత్వాన్ని బలహీనపరచడానికి ఇష్టమొచ్చినట్టు ఆడుకోవడం వీళ్లకు అలవాటైంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలను చూశాను. ఎప్పుడు భయపడలేదు. భయమనేది నా జీవితంలో లేదు. 2018 మార్చి 6న విజయవాడలో విభజన హామీలను నాలుగు బడ్జెట్‌లలో పట్టించుకోలేదు. చివరి బడ్జెట్‌లోనూ ఏపీ పేరు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయలేదు. –2018 మార్చి 7న వివిధ సందర్భాల్లో మోదీ చంద్రబాబునుద్దేశించి చేసిన విమర్శలు.. » అమరావతి నుంచి పోలవరం వరకు తన ఆస్తులు పెంచుకోవడం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సొంత ఆస్తులు పెంచు­కునే ఆశ నాకు లేదు. ళీ ఎన్టీఆర్‌ ఏపీకి కాంగ్రెస్‌ నుంచి విముక్తి కావాలనుకున్నారు. అందువల్లే టీడీపీ ఆవిర్భవించింది. కానీ, ఈ రోజు కాంగ్రెస్‌ వారసత్వపు అహంకారాన్ని ఎదుర్కొవాల్సిన చంద్రబాబు అదే వంశపారంపర్య కుటుంబం ముందు మోకరిల్లారు. అప్పట్లో ఏపీని అవమానించిన కాంగ్రెస్‌ను దుష్టకాంగ్రెస్‌ అని ఎన్టీఆర్‌ అన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి (చంద్రబాబు) అదే కాంగ్రెస్‌తో దోస్తీ కట్టారు. » చంద్రబాబుకు ఏమైంది? ఆయన నా కంటే చాలా సీనియర్‌నని మళ్లీ మళ్లీ నాకు గుర్తు చేస్తుంటారు. ఇందులో వివాదం ఏముంది? మీరు (చంద్రబాబు) సీనియర్‌. అందువల్లే గౌరవమిచ్చే విషయంలో ఎప్పుడూ తక్కువ చేయలేదు. కానీ, మీరు సీనియర్‌.. కూటములు మార్చడంలో.. కొత్త కూటములు కట్టడంలో.. మీ సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో.. ఈ రోజు ఎవరిని తిడతారో.. రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో. నేనైతే ఈ విషయాల్లో సీనియర్‌ను కానే కాదు. చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. కూలిపోతున్న తన పార్టీ నిర్మాణం. –2019 ఫిబ్రవరి 10న గుంటూరులో ప్రధాని మోదీ » కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందించినప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి మాత్రం ఈ ప్రభుత్వానికి లేదు. ఎప్పుటికప్పుడు ప్రాజెక్టు ఖర్చు అంచనాలు పెంచుతూ, ఎక్కువ నిధులు పొందుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్న నాయకుల (చంద్రబాబు)కు ఒక ఏటీఎం లాంటిది. అందులో నుంచి డబ్బులు తీసేసుకోవడమే. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచడం ద్వారా ఎవరికి మేలు చేయాలని యూటర్న్‌ బాబు అనుకుంటున్నారో మీ అందరికీ తెలుసు. » ప్రజలు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించేవారైతే.. ఇక్కడి యూటర్న్‌ బాబు మాత్రం తన కుటుంబం మొదట, ఆ తర్వాత తన అనుయాయులు అన్నట్టు పాలన సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హెరిటేజ్‌ (సంస్కృతి) మంచి పాలనతో అభివృద్ధి చెందాలని. కానీ యూటర్న్‌ బాబు నైజం మాత్రం తన సొంత హెరిటేజ్‌ (చంద్రబాబు కుటుంబీకుల వ్యాపార సంస్థ పేరు) కంపెనీ బాగుంటే చాలన్న తీరు. – 2019 ఏప్రిల్‌ 1న రాజమండ్రి ఎన్నికల సభలో ప్రధాని మోదీ

Sai Pallavi special poster is released from Tandel Movie
ప్రేమ కబుర్లు

మొబైల్‌లో ప్రేమ కబుర్లు చెబుతున్నారు సాయి పల్లవి. ‘లవ్‌స్టోరీ’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్‌’. ఈ రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌ లవ్‌స్టోరీ ఫిల్మ్‌కు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్యభామ పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారని తెలిసింది. కాగా నేడు (మే 9) సాయి పల్లవి బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘తండేల్‌’ సినిమాలోని ఆమె కొత్త ఫొటోను బుధవారం విడుదల చేశారు మేకర్స్‌. సత్యభామ ఎవరితోనో ఫోన్‌లో నవ్వుతూ మాట్లాడుతున్నట్లు ఫొటోలో కనిపిస్తోంది. బహుశా రాజుతో ప్రేమ కబుర్లు చెబుతుందేమో! ఇక ఈ పాత్ర తాలూకు వీడియోను నేడు విడుదల చేయనున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూ΄÷ందుతున్న ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all