Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CM YS Jagan Powerful Speech At Machilipatnam
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్‌

సాక్షి, కృష్ణా: ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. ఎవరి భూములపై వారికే హక్కులు కల్పించడమే ఈ యాక్ట్‌ ఉద్ధేశమని తెలిపారు. భూ వివాదాలు పెరిగి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని.. వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ.. సంస్కరణ తీసుకురావాలనేది మీ బిడ్డ ఆలోచన అని సీఎం జగన్‌ తెలిపారు. సర్వేలన్నీ పూర్తి చేసి రికార్డులన్నీ అప్‌డేట్‌ చేస్తున్నామని, రైతన్నలకు భూ హక్కు పత్రాలను పదిలంగా అందిస్తామని స్పష్టం చేశారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన భారీ‌ బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ యాక్ట్‌ గొప్పదని టీడీపీ నేత పయ్యావులే అసెంబ్లీలో చెప్పాడని ప్రస్తావించారు. మంచి సంస్కరణను ఆపేందుకు బాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంటికొచ్చే పెన్షన్‌ను అడ్డుకుంది చంద్రబాబేనని దుయ్యబట్టారు. బాబు తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రల వల్లే పెన్షర్లు అగచాట్లు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌ గోయింగ్‌ స్కీమ్స్‌ను కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నాడని, లబ్దిదారులకు డబ్బులు వెళ్లకుండా కుట్రలు పన్నుతున్నాడని నిప్పులు చెరిగారు.సీఎం జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్‌జగన్‌కు ఓటేస్తే..పథకాలు కొనసాగింపు, ఇంటింటా అభివృద్ధిపొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లే తలపెట్టడమేచంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది.పేదల శత్రువులంతా ఒక్కటయ్యారుచంద్రబాబువి అన్నీ అబద్ధాలు, మోసాలు, కుట్రలే14 ఏళ్లో చంద్రబాబు ఒక్క మంచిపనైననా చేశాడా?చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?ఎన్నికలు వచ్చేసరికి బాబు దుష్ప్రచారాలు మొదలు పెట్టాడు2 లక్షల కోట్ల డ్రగ్స్‌ తీసుకొచ్చామని దుష్ప్రచారం చేశాడుఆ డ్రగ్స్‌ తీసుకొచ్చింది వదినమ్మ బంధువులేనని తేలింది.తమ వారేనని బయటకు రావడంతో బాబు కూటమి గప్‌చుప్‌59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం130 సార్లు బటన్‌ నొక్కి వివిధ పథకాల ద్వారా మంచి చేశాంపేదలకు నేరుగా రూ. 2 లక్షల 70 వేల కోట్లు అందించాం2 లక్షల 31 వేలకుపైగా ఉద్యోగాలిచ్చాంనాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాంప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాంప్రభుత్వ బడుల్లో 3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులుప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్‌ బోధనవిద్యార్థులకు బైలింగువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌, బైజూస్‌ కంటెంట్‌బడులు తెరిచే నాటికే విద్యాకానుక, గోరుముద్దఉన్నత చదువుల కోసం విద్యా దీవెన, వసతి దీవెనవిద్యారంగంలో మేం చేసిన అభివృద్ధి బాబు హయాంలో జరిగిందా?అక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ, చేయూతఅక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తంఅక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాంగతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్‌ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమ పథకాలుపెట్టుబడి సాయంతో రైతులకు అండగా నిలబడ్డాంరైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాంసకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నాంవిత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాంజగనన్న చేదోడు ద్వారా చిరు వ్యాపారులకు ఆర్ధిక సాయంమత్స్యకార భరోసా, లా నేస్తం, వాహనమిత్ర ద్వారా ఆదుకున్నాంగతంలో ఎప్పుడైనా ఇంత మంచి కార్యక్రమాలూ చూశారామచిలీపట్నంలో మెడికల్‌ కాలేజ్‌ నిర్మాణం పూర్తి చేశాంబందర్‌లో రూ. 350 కోట్ల ఫిషింగ్‌ హార్బర్‌మచిలీపట్నం అభివృద్ధికి బాటలు వేసింది మీ బిడ్డ జగనే.రూ.5100 కోట్లతో పోర్టు నిర్మాణం జరుగుతుందిమచిలీపట్నంలో మెడికల్‌ కాలేజ్‌ నిర్మాణం పూర్తి చేశాంబందర్‌లో రూ. 350 కోట్ల ఫిషింగ్‌ హార్బర్‌గతంలో ఇంత మంచి ఎప్పుడైనా మీరు చూశారా?

Perni Nani Slams PV Ramesh Tweet On Land Titling Act
చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా పీవీ రమేష్..?

సాక్షి, కృష్ణా: చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా అంటూ రిటైర్డ్‌ ఐఏఎస్‌ పీవీ రమేష్‌పై‌ మాజీ మంత్రి పేర్నినాని ధ్వజమెత్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి పచ్చ మీడియా సరిపోవన్నట్లు మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను కూడా చంద్రబాబు జత కట్టుకుంటున్నారని మంపడిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విపరీతమైన విషం చిమ్మి కుట్రతో అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు.మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వల్ల తన పొలం మ్యుటేషన్‌ జరగట్లేదని చేసిన ట్వీట్‌ను ప్రస్తావించారు. పెద్ద పెద్ద చదువులు చదువున్న మీరు ఇంత అసహ్యంగా, దిగజారి మీరు ప్రవర్తించాలా?  అని ప్రశ్నించారు. పీవీ రమేష్‌ది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామమమని తెలిపారు. ఈ గ్రామంలో తన తండ్రి పేరుపై ఉన్న పొలం తన పేరుపైకి మార్చడం లేదంటూ అన్యాయంగా, కిరాతకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రమేష్‌ తండ్రి సుబ్బారావు మాస్టారుతో పాటు అదే గ్రామంలో ఉన్న ఇతర ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల కుటుంబాలు, స్థానికులు మొత్తం కలిసి 25 ఎకరాల భూమిని కొని చెరువును తవ్వారని చెప్పారు.25 మంది కలిసి 70 ఎకరాలు కొని దానిలో ఒక చెరువు తవ్వి లీజుకు ఇస్తూ వస్తున్నారన్నారు పేర్ని నాని. ఏడాది క్రితం రమేష్‌ తండ్రి సుబ్బారావు మరణించారని, ఆయన మరణించిన తర్వాత రమేష్‌ మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేశారని, అప్పటి నుంచీ విచారణలు జరుగుతున్నాయని చెప్పారు. గాలంకి నాగేంద్ర అనే వ్యక్తి కూడా ఈ చెరువులో భాగస్వామి. ఆయనకు, రమేష్‌కు కోర్టులో కేసులు నడుస్తున్నాయని తెలిపారు.వివాదాల వల్లే..ఆ చెరువులో వీళ్లకి సంబంధించిన పొలం ఎంతో కొంత ఉంది.దీనికోసమే జనవరి నెలలో జాయింట్‌ కలెక్టర్, ఆర్డీవోలు అక్కడ విచారణ నిర్వహించారు. ఆ విచారణకు అందరు రైతుల్ని ఒరిజినల్‌ డాక్యుమెంట్లు తీసుకుని రమ్మని చెప్పారు. అయితే పీవీ రమేష్‌ మాత్రం తన గుమస్తాకు ఫోటోస్టాట్‌ కాపీలిచ్చి పంపారట. ఫోటోస్టాట్‌ కాదు..ఒరిజినల్స్‌ పంపండి అని చెప్పారు. ఆయన రాడు..సరే గుమస్తాను పంపినా ఒరిజినల్స్‌ కావాలి కదా?క్కడ ఉన్న వివాదాన్ని తీర్చడం కోసమే మూడు నెలలుగా ఆ చెరువును అధికారులు ఎండబెడుతున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సరిహద్దులు ఫిక్స్‌ చేసి ఎవరి భూమి వారికి ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.ఇంత కథ నడుస్తుంటే ఇంత విషం చిమ్మడం ధర్మమా పీవీ రమేష్‌?మీ వివాదానికి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధం ఏమిటి?అక్కడున్న రైతులందరికీ, మీకు తగాదా ఉండటం ఏంటి? అక్కడున్న ల్యాండ్‌ కన్నా మీరు అదనంగా లీజు పొందుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.ఎవరి పొలం ఎక్కడో కూడా తెలియని పరిస్థితి. చెరువు పూర్తిగా ఎండిపోయిన తర్వాత కదా కొలతలు వేసి ఎవరి హద్దు ఏంటో చెప్పేది?.ఎటువంటి వివాదం లేకపోతే, అది వ్యవసాయ భూమి అయి హద్దులు క్లియర్‌గా ఉంటే..ప్రభుత్వాన్ని విమర్శించినా ఒక అర్ధం ఉంది.  ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు మీ పొలానికి సంబంధం ఏంటి?చంద్రబాబు పంచన చేరి ఐఏఎస్‌ చదువుకుని పచ్చిగా రాజకీయాల కోసం దిగజారడం అవసరమా? చంద్రబాబు కోసం మీరు ఏ డాన్స్‌ కట్టమంటే ఆ డాన్స్‌ కడుతున్నారు. ఏ ట్వీట్‌ చేయమంటే ఆ ట్వీట్‌ చేస్తున్నారు. చంద్రబాబుకు అధికారం సంపాదించడం కోసం మీరు ఇలా తప్పుడు ప్రకటనలు చేసి జగన్‌గారి ప్రభుత్వంపై విషం చిమ్మడం దుర్మార్గమైన చర్య. మీరు విన్నకోట గ్రామం రండి.. అక్కడేం జరుగుతుందో చూడండి.మీ కోసమే.. ఆ వివాదం తేల్చడం కోసమే మూడు నెలలుగా వీఆర్వోలను కాపలా పెట్టి మరీ చెరువును కాళీ చేయిస్తున్నారు.పోలింగ్‌ అయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని రైతులకు, మీ గుమస్తాకి కూడా సమాచారం అందించారు. ఆ చెరువు మధ్యలోనే ఆవుల దొడ్డి కింద ఓ 3.5 ఎకరాల వివాదాస్పద భూమి కూడా ఉంది. మీతో ఉన్న ఆ 25 మంది రైతులు కూడా ఆ ఆవుల దొడ్డి భూమి మాదంటే మాది అని క్లెయిమ్‌ చేస్తున్నారు.ఇలాంటి చరిత్ర కలిగిన భూమిని మీ నాన్నగారు మీకు అప్పజెప్పారు.ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వల్ల నాకు మ్యుటేషన్‌ అవ్వడం లేదని ఇంతగా దిగజారడం అవసరమా? ’ అని మండిపడ్డారు పేర్ని నాని. 

Mumbai win Toss to bowl vs Sun Risers Hyderabad
ఎస్ఆర్‌హెచ్‌తో ముంబై కీల‌క పోరు.. కొత్త ప్లేయ‌ర్ ఎంట్రీ

ఐపీఎల్‌-2024లో మ‌రో ఆస‌క్తిక‌ర స‌మ‌రానికి రంగం సిద్ద‌మైంది. వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు చెరో మార్పుతో బ‌రిలోకి దిగాయి. ముంబై ఇండియ‌న్స్ త‌రపున అన్షుల్ కాంబోజ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. మ‌రోవైపు ఎస్ఆర్‌హెచ్ తుది జ‌ట్టులోకి మ‌యాంక్ అగ‌ర్వాల్ వ‌చ్చాడు.ఈ మ్యాచ్ ముంబై ఇండియ‌న్స్‌కు చాలా కీల‌కం. ఈమ్యాచ్‌లో ముంబై ఓట‌మి పాలైతే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మిస్తోంది.తుది జ‌ట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్‌), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార 

PV Ramesh Mis Lead Tweet On Land Titling ACT TDP Yellow Media
ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ట్వీట్‌.. అడ్డంగా బుక్కైన పీవీ రమేష్‌

నిజం బయటకు వచ్చే లోపు అబద్దం ఊరంతా చుట్టేసి వస్తుందన్న సామేత టీడీపీ, పచ్చమీడియాకు సరిగ్గా సరిపోతుంది. భూయజమానులకు రక్షణ కల్పించే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ విషయంలో టీడీపీ ఆడుతున్న డ్రామానే ఇందుకు నిదర్శనం. గతంలో ఇదే చట్టంపై ఎంతో గొప్పగా కితాబిచ్చిన టీడీపీ.. ఇప్పుడు  దుష్ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది.ఇంకా అమలులోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను అడ్డుపెట్టుకుని సీఎం జగన్‌ను దెబ్బతీసేందుకు టీడీపీ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం రాష్ట్రంలో అమలైతే తమ ఉనికే ప్రమాదమని భావిస్తున్న ప్రతిపక్ష కూటమి.. తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టింది. దీనికితోడు తమ బ్యాండ్‌ బాజా బ్యాచ్‌ని సైతం బరిలోకి దించింది. తమ అనుకూల వ్యక్తులతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్ చేసిన ట్వీట్‌యే ఉదాహరణ. కానీ పాపం అడ్డంగా దొరికిపోతానని గుర్తించలేదేమో.IAS అధికారిగా పని చేసిన పీవీ రమేష్‌.. ఇవ్వాళ ఉదయం ఓ ట్వీట్‌ వేశారు. అత్యంత కీలకమైన ఎన్నికల వేళ.. ప్రభుత్వం మీద, అధికారంలో ఉన్న వైఎస్సార్‌సిపి మీద బురద జల్లేలా ఈ ట్వీట్‌ ఉంది. దీని పూర్వపరాలు ఏంటంటే.. లాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌కు తానే బాధితుడినని చెప్పుకుంటూ పీవీ రమేష్‌ తెరమీదకి వచ్చేశారు. ఆయన తన భూమికి సంబంధించిన కొన్ని వివరాలను పేర్కొన్నారు. పీవీ రమేష్‌ ట్వీట్‌ చేయగానే.. వెంటనే టిడిపి నేతలు రంగంలోకి దిగారు. చంద్రబాబు సుపుత్రుడు లోకేష్‌ ఓ అడుగు ముందుకేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. సరే, పీవీ రమేష్‌ చేసిన ఆరోపణల్లో ఎంత నిజముందన్న విషయంపై కాస్తా తీగ లాగితే డొంక అంతా కదిలింది. పీవీ రమేష్‌ తనది అని చెప్పుకుంటున్న భూమి గురించి వివరాలు సేకరించగా... అది గత మూడేళ్లుగా కోర్టులో నడుస్తోన్న కేసు గురించి తెలిసింది. హైకోర్టులో WRIT PETITION No.31186 of 2022గా దాఖలైన పిటిషన్‌లో న్యాయస్థానం ఈ భూమిపై విచారణ జరపాలని కూడా ఆదేశించింది. సర్వే నంబర్లు 61, 62, 66, 486/1, 487/1, 489/1 and 490/1 , విన్నకోట గ్రామం, గుడ్లవల్లేరు మండలం, కృష్ణా జిల్లాలోని ఈ భూముల్లో.. కొందరు ప్రైవేటు వ్యక్తులు.. కొంత ప్రభుత్వ భూమిని, అలాగే కొన్ని అసైన్డ్‌ భూములను కబ్జా చేసి చేపల చెరువులను నిర్మించారని తేల్చింది. 2021లో రిట్‌ పిటిషన్‌ 10556 కింద దాఖలు కాగా..  అప్పట్లోనే కోర్టు స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా.. చేపల చెరువులను నిర్మించారని, పైగా ఈ భూముల్లో ప్రభుత్వ భూములున్నాయని తప్పు పట్టింది. 2021లో దాఖలైన రిట్‌ పిటిషన్‌ 3582 ద్వారా తెలిసింది ఏంటంటే.. తక్షణం భూములు ఆక్రమించిన వారిపై ఇంకా చర్యలు చేపట్టలేదని తేలింది. ఆ భూముల్లో ఏర్పాటైన ఆక్వా చెరువులు అన్నీ అనధికారమైనవని, అక్రమంగా నిర్మించినవని తేల్చింది. ఈ భూముల్లోకి ఎవరిని అనుమతించవద్దని కోర్టు సూచించింది. ప్రభుత్వం తరపున ఒక జాయింట్‌ సర్వే నిర్వహించాలని కోర్టు సూచిస్తే... ఈ వాస్తవాలన్నింటిని దాచి పెట్టి పీవీ రమేష్‌ నంగనాచిలా తనకు అన్యాయం జరిగిందంటూ ట్వీట్‌ చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతెందుకు పీవీ రమేష్‌ ట్వీట్ పెట్టడంలోనూ నాలుక మడతేశారు. ఉదయం 9.37కు ట్వీట్‌ చేసిన పీవీ రమేష్‌.. దాన్ని వెంటనే 10.23గంటలకు ఎడిట్‌ చేసేశారు.  తొలుత ట్వీట్ చేసినప్పుడు నేరుగా ఈ యాక్టుకు తాను ప్రత్యక్ష బాధితుడిని అని చెప్పుకున్నారు. అయితే ఇంతలో ఎవరైనా ప్రశ్నించారేమో.. అసలు అమలులో లేని చట్టానికి మీరు ఎలా బాధితుడు అయ్యారని?!. వెంటనే ట్వీట్‌ను ఎడిట్ చేసేశారు. ఎడిట్ చేసి ట్వీట్‌లో ''చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి.’’ అనే లైన్‌ జత చేశారు.ఇక ఈ ట్వీట్‌పై పీవీ రమేష్‌ను నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. సార్‌ మీరంటే ఎంతో గౌరవం ఉంది, కానీ నిజంగా ‘ప్యాకేజ్‌ మెటీరియల్’‌ కాకపోతే భూమి టైటిల్‌ వివాదం గురించిన పూర్తి వరాలు పెట్టి మీ నిజాయితీని నిరూపించుకోండి అంటూ సూచించారు. మరికొందరు మీ కేసుకు, ఈ చట్టానికి సంబంధం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. మీ‘ భూముల మ్యూటేషన్‌ దరఖాస్తును తహసీల్దార్ సరదాగా ఏమీ తిరస్కరించి ఉండరు. ఏదో వివాదం ఉండే ఉంటుంది. అది బయటకు వస్తే అసలు విషయం ఏమిటన్నది తేలుతుంది’ అంటూ మరో నెటిజన్‌ పేర్కొన్నాడు. ‘ఇంకా చట్టం అమలులోకి రాలేదు. మరి అమలులో లేని చట్టానికి మరి పీవీ రమేష్ ప్రత్యక్ష బాధితుడిగా ఎలా మారారు’ అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.చంద్రబాబు దుర్మార్గమైన కుట్రలు చేస్తున్నాడు: పేర్ని నానితాజాగా ఈ వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. బాబు చెప్పినట్లు.. పీవీ రమేష్ ఆడుతున్నారని మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల తన భూమి మ్యూటేషన్ జరగలేదని మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్  చేస్తున్న ప్రచారంపై వివరణ ఇచ్చారు.‘పీవీ రమేష్ తండ్రి సుబ్బారావు మాస్టారు.. కొందరు రైతులతో కలిసి ఉమ్మడిగా భూమి లీజుకిచ్చారు. 70 ఎరనాల పొలాన్ని 25 ఏళ్ల క్రితమే చెరువు చేశారు.పీవీ రమేష్ ఏడాదిక్రితం మ్యూటేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రైతు నాగేంద్రకు, పీవీ రమేష్‌కు సరిహద్దు వివాదం ఉంది. జనవరిలో కలెక్టర్, ఆర్డీవో సమక్షంలో విచారణ జరిగింది.పీవీ రమేష్ తన గుమస్తాతో ఒరిజనల్స్ కాకుండా జిరాక్స్ పంపించారు. 70 ఎకరాల చెరువులో పీవీ రమేష్ పొలం ఎంతో తెలియదు.చెరువు సరిహద్దులు ఫిక్స్ చేస్తే ఆయన భూమి ఎంతో తేలుతుంది.పోలింగ్ అయ్యాక సర్వే చేస్తారు. పీవీ రమేష్ విన్నకోటకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలి’ అని పేర్కొన్నారు. 

Lg Ordered Nia Probe On Kejriwal
కేజ్రీవాల్‌కు మరో షాక్‌.. ‘ఎల్‌జీ’ సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ: ఎన్నికల వేళ అరవింద్‌ కేజ్రీవాల్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే లిక్కర్‌ కేసులో అరెస్టయి తీహార్‌ జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా షాకిచ్చారు.ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతిస్తున్న‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’అనే సంస్థ నుంచి ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ నిధులు స్వీకరించారనే అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారణకు గవర్నర్‌ సోమవారం(మే6)  సిఫారసు చేశారు.ఆమ్‌ఆద్మీపార్టీకి సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థ నుంచి ఆప్‌కు 16 మిలియన్‌ డాలర్ల నిధులు వచ్చాయన్న ఫిర్యాదు ఆధారంగా ఎన్‌ఐఏ విచారణకు ఆదేశించినట్లు గవర్నర్‌ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును వరల్డ్‌ హిందూ ఫెడరేషన్‌ అశూ మోంగియా ఇచ్చినట్లు తెలిపారు. 

Heeramandi Indresh Malik Comments On Sonakshi Sinha
సోనాక్షీతో ఇంటిమేట్‌ సీన్స్‌.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు

బాలీవుడ్‌ టాప్‌ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మొట్టమొదటి వెబ్‌ సిరీస్‌ హీరామండి: ది డైమండ్‌ బజార్‌. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌ హిట్‌ టాక్‌తో స్ట్రీమింగ్‌ అవుతుంది. మే 1నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అలరిస్తుంది. ఇందులో మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌  తదితరులు నటించారు.హీరామండి వెబ్‌ సిరీస్‌లో ఉస్తాద్‌జీ పాత్రలో మెప్పించిన ఇంద్రేష్ మాలిక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఇందులో సోనాక్షి సిన్హాతో  ఇంటిమేట్‌ సీన్‌  గురించి ఆయన ఇలా చెప్పుకొచ్చాడు.‘సోనాక్షీకి, నాకు మధ్య ఉన్న ఇంటిమేట్‌ సీన్స్ కోసం ఎక్కువ రీటేక్‌లు తీసుకోలేదు. ఈ సీన్స్‌ తీస్తున్న సమయంలో నేను భయాందోళనకు గురైయాను.  కాస్త సిగ్గుగా కూడా అనిపించింది.  కానీ,  సోనాక్షీ నాతో మాట్లాడి రిలాక్స్‌గా ఉండమని కోరారు. ఈ సీన్స్‌ కూడా ఆమె అమ్మగారి ముందే జరిగాయి. ఈ క్రమంలో సోనాక్షీ తల్లి ముందే నాతో మాట్లాడారు. ఈ సిరీస్‌లో ఇలాంటి సీన్లు అవసరం, కంగారు పడొద్దని చెప్పారు. సుమారు గంటకు పైగానే అందరం చర్చించుకున్నాకే షూట్‌ మొదలపెట్టాం. అందుకే ఎక్కువ రీటేక్‌లు తీసుకోలేదు. ఈ సిరీస్‌లో నా పాత్ర చాలా కీలకం.  ఆ పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇది నా కోసమే రూపొందించబడిందని నేను అనుకుంటున్నాను. సంజయ్‌ భన్సాలీ ప్రతీ సీన్‌ను చాలా జాగ్రత్తగా తీశారు.మరోక సన్నివేశంలో సోనాక్షి తన కాళ్లతో నా తలను టచ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఆమె తల్లి పూనమ్ సిన్హా కూడా సెట్స్‌లో ఉన్నారు. ఆ సీన్‌ సమయంలో కాస్త ఇబ్బంది ఉన్నా.. ఆమె నాకు కొంత ఆత్మస్థైర్యాన్ని కలిగించింది. ఇలాంటి ఎన్నో సీన్స్‌ మా మధ్య ఉన్నాయి. హీరామండి సెట్ నుంచి నాకు చాలా అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి.' అని ఇంద్రేష్ మాలిక్ చెప్పాడు.

Election Commission Appointed Ap New Dgp Harishkumar Gupta
ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా.. నియమించిన ‘ఈసీ’

సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ కొత్త డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తాను ఎన్నికల కమిషన్‌(ఈసీ) నియమించింది. సోమవారం(మే6) సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని  గుప్తాను ఈసీ ఆదేశించింది. ఇప్పటివరకు డీజీపీగా బాధ్యతలు నిర్వహించిన రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదివారం ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఏపీ చీఫ్‌ సెక్రటరీ(సీఎస్‌) ముగ్గురు సీనియర్‌ అధికారులతో జాబితాను పంపగా అందులో నుంచి హరీ‌ష్‌కుమార్‌గుప్తాను డీజీపీగా ఈసీ నియమించింది.

East and South India To Get Relief From Heatwave By Tomorrow Says IMD
హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ

ఢిల్లీ: దేశంలోని ప్రధాన నగరాల్లో ఎండ తీవ్రత రోజు రోజుకి భారీగా పెరుగుతోంది. ప్రజలు భానుడి వేడి తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో భారత వాతావరణ శాఖ తీవ్రమైన వేడిగాలులు త్వరలో తగ్గుముఖం పట్టబోతున్నాయని ఓ శుభవార్త చెప్పింది.తూర్పు, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో వేడిగాలులు తగ్గుముఖం పట్టబోతున్నాయి. తూర్పు ప్రాంతానికి ఈ రోజులో ఉపశమనం లభించవచ్చు. దక్షిణాది రాష్ట్రాలు కూడా త్వరకలోనే వేడి తీవ్రతలు తగ్గుతాయని ఐఎండీ పేర్కొంది. మే 10 వరకు ఈ ప్రాంతాలలో ఉరుములు, గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.గత నెల నుంచి భారతదేశంలో పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వ్యాపించడంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువ అవుతున్నాయి. ఏప్రిల్ చివరి రోజున కోల్‌కతాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది, కోల్‌కతాలో దశాబ్దాలుగా ఇంతటి ఉష్ణోగ్రత నమోదు కాలేదు.రాబోయే ఐదు రోజుల్లో గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లను ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, ఈశాన్య రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మేఘాలయలోని ఖాసీ-జైంతియా హిల్స్ ప్రాంతంలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. 400 మందికి పైగా ప్రజలు నష్టపోయినట్లు.. మరో 48 గంటల పాటు ఈ వర్షం కొనసాగుతుందని వాతావరణ సఖ పేర్కొంది.

Delhi Liquor Case: BRS MLC Kavitha Bail Rejected
కల్వకుంట్ల కవితకు బిగ్‌ షాక్‌

న్యూఢిల్లీ, సాక్షి: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ.. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టైన కల్వకుంట్ల కవితకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో బెయిల్‌ కోరుతూ ఆమె వేసిన రెండు పిటిషన్లను ట్రయల్‌ కోర్టు  కొట్టేసింది.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ, సీబీఐ అరెస్టులను సవాల్‌ చేస్తూ కవిత విడివిడిగా బెయిల్‌పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై మూడు రోజులపాటు విచారణ జరిగింది. రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా.. ఈ బెయిల్‌ పిటిషన్లపై వాదనలు విన్నారు. చివరకు బెయిల్‌ నిరాకరిస్తూ ఇవాళ(సోమవారం) తీర్పు ఇచ్చారు.లిక్కర్‌ స్కాం కేసులో మార్చి 15వ తేదీన హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను ఈడీ అరెస్ట్‌ చేసింది. ఆపై జ్యూడీషియల్‌ రిమాండ్‌ కింద తీహార్ జైల్లో ఉన్న కవితను.. సీబీఐ కూడా అరెస్ట్‌ చేసింది.  ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారుచేయించి  అక్రమార్జన  చేశారని కవితపై అభియోగాలు నమోదు చేశాయి ఇరు దర్యాప్తు సంస్థలు. మద్యం విధానాన్ని అనుకూలంగా రూపొందించినందుకుగానూ ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల రూపాయల లంచం కవిత ఇచ్చారని, ఆ వంద కోట్లను సౌత్‌ గ్రూప్‌ సిండికేట్‌ నుంచి వసూలు చేశారని ఈడీ, సీబీఐలు ఆరోపించాయి. అంతేకాదు.. ఈ వ్యవహారంలో పైసా పెట్టుబడి లేకుండానే కవిత ఇండోస్పిరిట్ లో 33% వాటా కవిత దక్కించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.  వాదనలు ఇలా.. ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారు అని, ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని ఇటు ఈడీ, అటు సీబీఐ వాదించాయి. ఆమె బయటకు వస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని వాదనలు వినిపించాయి.అయితే కేవలం రాజకీయ కక్షతో ఈ కేసు పెట్టారని, కేవలం అప్రూవర్ల స్టేట్‌మెంట్లను ఆధారంగా చేసుకుని కవితను అరెస్ట్‌ చేశారని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. అంతేకాదు ఈ కేసులో కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లేవని వాదనలు వినిపించారు. ఇదీ చదవండి: కవిత అరెస్టు అక్రమం కాదు! వాదనలు విన్న న్యాయమూర్తి కావేరీ బవేజా.. ఈడీ, సీబీఐ వాదనలతో ఏకీభవిస్తూ కవిత పిటిషన్లను డిస్మిస్‌ చేశారు.రేపటితో కవిత జ్యుడీషియల్‌ కస్టడీ ముగియనుంది. బెయిల్‌ నిరాకరిస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టును ఆమె ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all