Top Stories
ప్రధాన వార్తలు
కేంద్ర కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకే పెద్దపీట!
ఢిల్లీ: కేంద్రంలో కొలువుదీరబోయే ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ తన స్థానాల్ని డబుల్ చేసుకోగా.. ఏపీలోనూ కూటమి ద్వారా మంచి ఫలితాన్నే రాబట్టుకోగలిగింది. దీంతో తెలంగాణ నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి, అలాగే ఏపీ నుంచి ఐదారుగురికి కేబినెట్లో చోటు దక్కవచ్చనే సంకేతాలు అందుతున్నాయి.తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే బీసీ కోటాలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు మంత్రి పదవి దక్కవచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇక.. మహిళా కోటాలో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఇక.. కేంద్ర కేబినెట్లో బెర్త్ ఆశిస్తున్న ఈటల రాజేందర్కు.. తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చనే చర్చ ఆ పార్టీలో నడుస్తోంది.ఏపీ బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి, సీఎం రమేష్కు మంత్రివర్గంలో చాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి బాలశౌరికి సహయ మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కూటమిలో కీలకంగా మారిన టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు, రాయలసీమ నుంచి పార్థసారధికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది.మంత్రివర్గ కూర్పుపై కొనసాగుతున్న కసరత్తు..ఎన్డీయే భాగస్వామి పక్షాల అధినేతలతో విడివిడిగా శుక్రవారం జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. మంత్రివర్గంలో కోరుకుంటున్న పదవులు, స్థానాలపై నేతలు చర్చించారు. ఇవాళ కూడా మంతివర్గ కూర్పుపై కసరత్తు కొనసాగుతోంది. టీడీపీ, జేడీ(యూ)కు అధిక ప్రాధాన్యం కలిగిన శాఖలు దక్కే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు కేబినెట్లో ఛాన్స్ లభించనుంది. మరో ఇద్దరికి సహాయ మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గం రేసులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఉన్నారు.రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే మంత్రిత్వ శాఖలు తీసుకుంటామని టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు. పట్టణాభివృద్ధి, జలవనరుల శాఖ, పరిశ్రమల శాఖలను టీడీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి అవకాశం లభించనున్నట్లు సమాచారం. ఏపీ బీజేపీ కోటాలో పురందేశ్వరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మంత్రి పదవి కోసం ముమ్మరంగా సీఎం రమేష్ లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ఎన్డీయే పక్ష పార్టీలు భాగస్వామ్యం కానున్నాయి. కీలకమైన హోమ్, ఆర్థిక, రక్షణ విదేశాంగ శాఖలు బీజేపీకే కేటాయించనున్నట్లు సమాచారం. మూడు మంత్రి పదవులు, రెండు సహాయ మంత్రి పదవులను టీడీపీ కోరుతున్నట్లు తెలుస్తోంది.టీడీపీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. జేడీ(యూ) మూడు మంత్రి పదవులు కోరుతున్నట్లు తెలుస్తోంది. శివసేన, ఎన్సీపీ, ఆర్ఎల్డీకి ఒక్కొక్క మంత్రి పదవి కేటాయించనున్నట్లు సమాచారం. దీంతో పాటు బీహార్ ప్రత్యేక హోదా ప్రకటించాలని సీఎం నితీశ్ కుమార్ కోరుతున్నారు.
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండ గురించి చేసిన ట్వీట్ ఏ మాత్రం పద్ధతిగా ఉన్నట్లు అనిపించదు. వందల గ్రామాలు, పట్టణాలలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు చెలరేగి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లపై దాడులు చేస్తుంటే ఖండించకపోతే మానే, పరోక్షంగా వాటిని సమర్థిస్తున్నట్లుగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి.కౌంటింగ్ జరుగుతున్న రోజే వైఎస్సార్సీపీ ఓడిపోతోందని తెలిసిన క్షణం నుంచే టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. గత నాలుగు రోజులుగా కత్తులు, కర్రలతో యథేచ్ఛగా తిరుగుతుంటే, ఎక్కడో ఒకటి, అరచోట తప్ప, మిగిలిన అన్ని ప్రాంతాలలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. హింసాకాండకు ఎవరూ పాల్పడవద్దని చెప్పవలసిన సీనియర్ నేత చంద్రబాబు నాయుడు ఏమని అంటున్నారో చూడండి. "రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి" అని అన్నారు.ఎక్కడైనా ఓడిపోయినవారు కవ్వింపు చర్యలకు దిగే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ ఎక్కడైనా జరిగితే వెంటనే టీడీపీ మీడియా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టి ఉండేది కాదా! ఒకపక్క అంతగా టీడీపీ వారు చెలరేగిపోతున్న సమయంలో ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యలు అనడం ఏమిటి? ఆ పేరుతో దాడులు చేసుకోండని చెప్పినట్లు శ్రేణులు అర్థం చేసుకోవా! ఈ నెల పన్నెండున ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పదకుండు రాత్రివరకు ఇలాంటి దాడులు జరుగుతాయన్న ప్రచారం ఉంది. ఈలోగా అనూహ్యంగా ఈనాడు అధినేత రామోజీరావు కన్నుమూశారు కనుక ఈ దాడులను ఏమైనా ఆపుతారేమో చూడాలి.టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడం అంటే, వారు దాడులు చేసినప్పుడు వైఎస్సార్సీపీవారు ఏమైనా ప్రతిదాడికి దిగుతారేమో జాగ్రత్త అని చెప్పినట్లు అనిపిస్తుంది తప్ప శాంతిభద్రతలను కాపాడాలని కోరుకున్నట్లుగా లేదు. వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యల పట్ల నాయకులు సైతం అలర్ట్ గా ఉండి.. ఎటువంటి దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలి అని ఆయన అన్నారు. దీనిని బట్టి టీడీపీ నేతలు ఏమి చేయాలో అర్థం చేసుకోవాలన్నమాట. వైఎస్సార్సీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా కార్యకర్తలు పూర్తి సంయమనం పాటించాలి అని ఆయన సూచించారు. అంతే తప్ప టీడీపీ కార్యకర్తలు దాడులు చేయవద్దని అనడానికి ఇష్టపడడం లేదనుకోవాలి. పోలీసులు సైతం ఇంతవరకు జరిగిన హింసాకాండను వైఎస్సార్సీపీ వారి చర్యగానే చూడాలి తప్ప, టీడీపీ దాడులుగా చూడకూడదని అనుకునే అవకాశం కనిపించడం లేదా?వందల చోట్ల ఈ దాడులు జరిగితే పోలీసులు ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఇదేనా రాజ్యాంగం, చట్టబద్ధపాలన అంటే! పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని ముక్తాయింపుగా చివరిలో ఒక మాట అన్నారు. అసలు ఇది ట్విటర్ లో చెప్పవలసిన విషయమా! పోలీసు డీజీపీ తదితర ఉన్నతాధికారులను పిలిచి సమీక్షించి, లేదా వారికి ఫోన్ చేసి వెంటనే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఏపీకి చెడ్డపేరు రాకుండా చూడాలని చెప్పవలసిన చంద్రబాబు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే వచ్చే రోజులు ఇంకెంత భయానకంగా ఉంటాయో అనే సందేహం వస్తుంది.అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఎవరు హింసాయుత చర్యలకు దిగినా తప్పే. గ్రామాలలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలపై దాడులు చేస్తే అది వైఎస్సార్సీపీ మూకల చర్యలు అని అనుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లుగా ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయడం, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ది పనుల శిలాఫలకాలు ధ్వంసం చేయడం వైఎస్సార్సీపీవారి పనేనని టీడీపీ చెప్పేలా ఉంది. మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశి, కొడాలి నాని, తదితరుల ఇళ్లపైకి దాడి చేసింది వైఎస్సార్సీపీ మూకలని చెప్పదలిచారా? ఒక పక్క టీడీపీ జెండాలతో కత్తులు, కర్రలతో టీడీపీ కార్యకర్తలు, అసాంఘీక శక్తులు స్వైర విహారం చేస్తుంటే, వైఎస్సార్సీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డా సంయమనంగా ఉండాలని టీడీపీ వారిని కోరుతున్నానని చంద్రబాబు అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. రాజ్యాంగ విధులను కాలరాయడమే.గతంలో ఏ ఒక్క చిన్న ఘటన జరిగినా నానా హడావుడి చేసిన చంద్రబాబు ఇప్పుడు తాపీగా ఒక కామెంట్ ను అది కూడా ట్విటర్ లో చేసి ఊరుకున్నారు. ఇది సమంజసమేనా? కానీ దీని గురించి ఆయనను అడిగేదెవ్వరు. ప్రశ్నిస్తానని చెబుతూ రాజకీయాలలోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా గెలిచానన్న ఆనందంలో ఇలాంటివాటిపై కనీసం స్పందించలేకపోతున్నారు. జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడులను కూడా ఆయన నిరోధించడం లేదు. ఈ నేపధ్యంలోనే టీడీపీ నేత వర్మ కారుపై జనసేన కార్యకర్తలు చేసిన దాడిని కూడా ఆయన ఖండించినట్లు అనిపించడం లేదు. ఇక లోకేష్ ఎర్రబుక్ సిద్ధం అంటూ ఆయా చోట్ల టీడీపీ వారు ప్లెక్సీలు పెడుతున్నారని కొందరు చెబుతున్నారు. అది మరింత రెచ్చగొట్టే చర్య అవుతుంది. అధికారంలోకి వచ్చాక కూడా అలాంటివాటిని ప్రోత్సహిస్తే విపరిణామాలు ఎదురవుతాయి.వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాంటి ఘటనలు దాదాపు జరగలేదు. అయినా హింసాకాండ అంటూ తమకు మద్దతు ఇచ్చే మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేయించారు. ఇప్పుడు ఆ మీడియాలో ప్రస్తుత హింసకు సంబంధించి కథనాలేవీ ప్రముఖంగా రావడం లేదు. ఈ పరిస్థితిలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన పార్టీ నేతలతో జిల్లాలవారీగా కమిటీలు ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పే యత్నం చేస్తున్నారు. బహుశా ఆయన కూడా కొద్ది రోజులలో టీడీపీ దాడులవల్ల తీవ్రంగా గాయపడిన, ఆస్తులు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పవచ్చు.కొద్ది మంది ఈ దాడులలో గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వైఎస్సార్సీపీ ఓటమి భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మస్థైర్యంతో ఉండవలసిన సమయం ఇది. ఏ పార్టీకి అయినా గెలుపు, ఓటములు ఉంటాయి. జగన్ అన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం కొలువు తీరకముందే ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలను కుప్పకూల్చారనిపిస్తుంది. చంద్రబాబు కక్షలకు ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చిందని ఆయన అన్నారు. చివరికి యూనివర్సిటీలలో కూడా టీడీపీ శక్తులు అరాచకం సృష్టిస్తుంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయితే ఎవరికి చెప్పుకోవాలి.ప్రధానమంత్రి మోదీ కూడా ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలియదు. దేశంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా మాట్లాడే ప్రధాని ఏపీని మాత్రం విస్మరించడం బాధాకరం. ఈ హింసాకాండలో బాధితులైన కార్యకర్తలకు అండగా ఉంటానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కచ్చితంగా బాధితులకు ధైర్యం చెప్పవలసిన సమయం ఇది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కసారి బయటకు వచ్చి ఆయా ప్రదేశాలకు వెళ్లి పరిశీలన చేస్తే వైఎస్సార్సీపీ క్యాడర్ కు నైతికబలం వస్తుంది. అలాగే రెచ్చిపోయే టీడీపీ మద్దతుదారులు కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందని చెప్పాలి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలు చేస్తున్న అరాచకాలకు ముగింపు పలికేలా చర్యలు తీసుకోకపోతే ఆయన మళ్లీ 2014నాటి పాలనను పునరావృతం చేయడానికే సిద్ధపడుతున్నారన్న సంకేతాలు వెళతాయని అర్థం చేసుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
నితీశ్కు ప్రధాని పదవి ఆఫర్ చేసిన ఇండియా కూటమి!
పట్నా: ఎన్డీయే సంకీర్ణ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో బిహార్లోని నితీష్కుమార్ జేడీ(యూ) కీలకంగా మారింది. బీజేపీ సొంతంగా మెజార్టి సీట్లు దక్కించుకోని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నితీష్ కుమార్కి డిప్యూటీ పీఎం పదవి ఆఫర్ చేసి.. తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జేడి(యూ) నేత కేసీ త్యాగి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘ జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్కి ఇండియా కూటమి నుంచి ఏకంగా ప్రధాన మంత్రి పదవి ఆఫర్ వచ్చింది. ఇండియా కూటమికి కన్వీనర్గా అంగీకరించని వాళ్లు.. ఏకంగా నితీష్కు ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేశారు. అందుకే నితీష్ వాళ్ల ఆఫర్ను తిరస్కరిచారు. తాము ఎన్డీయేతోనే ఉన్నాం. మళ్లీ ఇండియా కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదు. మా మద్దలు ఎన్డీయే ఉంటుంది’’ అని అన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టి సొంతంగా బీజేపీ, కాంగ్రెస్ కూటమికి లేకపోవటంతో నితీష్ కుమార్పై మద్దతును కీలకంగా మారింది. ఈ క్రమంలోనే ఇండియా కూటమి ఆయన మద్దతు కోరినట్లు త్యాగి తెలిపారు. తరచూ కూటములు మారుతారనే పేరు నితీష్ కుమార్ ఉన్న విషయం తెలిసిందే. ఇండియా కూటమి ఏర్పాటులో మొదటిగా నితీష్ కుమారే కీలకంగా వ్యవహరించారు. పట్నాలో జరిగిన మొదటి సమావేశానికి సైతం అధ్యక్షత వహించారు. అయితే.. ఎన్నికల ముందు ఈ ఏడాది జనవరిలో సీఎం పదవి రాజీనామా చేసి మరీ ఎన్డీయే కూటమిలో చేరిపోయారు. ఇక.. లోక్సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ జేడీ(యూ) 12 ఎంపీ స్థానాలను గెలుచుకొని ఎన్డీయే కూటమిలో మూడో స్థానంలో ఉంది. శుక్రవారం భాగస్వామ్య పార్టీలు ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్న విషయం తెలిసిందే. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కోలువుదీరనుంది. రేపు (ఆదివారం) 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు.స్పందించిన కాంగ్రెస్తమ పార్టీ చీఫ్కు నితీశ్కుమార్కు ఇండియా కూటమి ప్రధానమంత్రి పదవి అఫర్ చేసిందని జేడీ(యూ) నేత త్యాగి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘ జేడీ(యూ) నేత త్యాగి చెప్పినటువంటి సమాచారం మా వద్ద లేదు’’ అని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. త్యాగి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
సంతకం చేయండి.. మార్పు డిమాండ్ చేయండి
హైదరాబాద్, సాక్షి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాధారణ ఎన్నికల ఫలితాలు యావత్ సమాజాన్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఐదేళ్లపాటు సంక్షేమ పథకాలతో.. అభివృద్ధి దిశగా రాష్ట్రం ఉరకలేసింది. ముఖ్యమంత్రిగా అన్నింటా అణగారిన వర్గాలకు పెద్ద పీట వేశారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. అయినా కూడా ఫలితాలు ఘోరంగా వచ్చాయి. ఊహించని ఈ ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. వివిధ సంక్షేమ పథకాలతో పాటు మెడికల్ కాలేజ్ లు, పోర్ట్ లు,నాడు-నేడు, ఇంగ్లీష్ విద్య.. ఇలా ఎన్నో సంస్కరణలతో ఏపీని దేశ చిత్ర పటంలో ప్రత్యేకంగా నిలిపింది జగన్ పాలన. ఎన్నికలు ముగిశా.. ఎగ్జిట్ పోల్స్లోనూ వైఎస్సార్సీపీకే అనుకూల ఫలితాలు వచ్చాయి. అలాంటి పార్టీకి గారి పార్టీ కి 11 మళ్ళీ,4 ఎంపీ లు రావడం అనేది చాలా దారుణమనే అభిప్రాయం వినవస్తోంది. ఆఖరికి అధికార యంత్రాంగంలో భాగమైన పోలీసులు, ఎన్నికల కమిషన్ వాళ్లు కుమ్మక్కై కూటమి కోసం పని చేశాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల్ని హింసించాయి. మరోవైపు కూటమి అభ్యర్థుల గెలుపు.. మెజారిటీపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధి పొందిన ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకే ఓటేశామని అంటున్నారు. అలాంటప్పుడు.. ఇలాంటి ఓటమి ఎలా?. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఈవీఎంల మీద అనుమానాలున్నాయి. అందుకే ఎన్నికలను రద్దు చేసి.. మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో.. సానే అమర్నాథ్ Change.org ద్వారా పిటిషన్ వేశారు. వీలైనంత వరకు తిరిగి ఎన్నికలు జరిపించేంత వరకు తనతో పోరాడాలని, లేదంటే రీకౌంటింగ్ అయినా చేయించాలని ఎన్నికల సంఘాన్ని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సంతకం చేయండి.. మార్పు డిమాండ్ చేయండి
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఒడిశా రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర శాసనసభకు తొలిసారిగా ముస్లిం మైనారిటీకి చెందిన మహిళ ఎన్నికైంది. ఆమె పేరు సోఫియా ఫిర్దౌస్.. వయసు 32 ఏళ్లు. కాంగ్రెస్ అభ్యర్థిగా బారాబతి-కటక్ స్థానం నుంచి పోటీ చేసి తన ప్రత్యర్థి బీజేపికి చెందిన పూర్ణ చంద్ర మహాపాత్రను ఎనిమిది వేల మెజార్టీ ఓట్ల తేడాతో ఓడించారు. ఇంతకీ ఈ సోఫియాకున్న ఆసక్తికర నేపథ్యాన్ని పరిశీలిస్తే.. ఫిర్దౌస్ ఒడిశా సీనియర్ కాంగ్రెస్ నేత మహమ్మద్ మోకిమ్ కుమార్తె. తండ్రిపై అవినీతి ఆరోపణలు ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడింది. దీంతో ఆయన స్థానంలో కూతురు ఫిర్దౌస్ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే తండ్రి అవినీతి మరక.. ఈ యువ నేత గెలుపును ఆపలేకపోయింది. అంతేగాదు స్వాతంత్యం వచ్చిన తర్వాత ఒడిశాలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె విజయం ఒడిషా రాజకీయ పుటల్లోకి ఎక్కింది.కెరీర్..ఫిర్దౌస్ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చూశారు. ఆ తర్వాత 2022లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎంబీ) నుంచి ఎగ్జిక్యూటిబవ్ జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంను కూడా పూర్తి చేశారు.2023లో కాన్ఫెడరేషన్ ఆప్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసీయేషిన్ ఆఫ్ ఇండియా(సీఆర్ఈడీఏఐ) అధ్యక్షురాలిగా ఫిర్దౌస్ ఎన్నికయ్యారు. అలాగే సీఆర్ఈడీఏఐ మహిళా విభాగానికి ఈస్ట్ జోన్ కో ఆర్డినేటర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆమె ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ)కి కో చైర్మన్గా కూడా చేశారు. అంతేగాదు మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ఐఎన్డబ్ల్యూఈసీ సభ్యురాలు కూడా. ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త షేక్ మెరాజ్ ఉల్ హక్ను వివాహం చేసుకున్నారు. రాజకీయాల్లో ఒడిషా తొలి మహిళా ముఖ్యమంత్రి నందిని సత్పతి, ఫిర్దౌస్కు ఆదర్శమట. విశేషం ఏంటంటే.. 1972లో బారాబతి-కటక్ నియోజకవర్గం నుంచే నందిని సత్పతి గెలుపొందారు. కాగా, ఈ 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు గణనీయమైన రాజకీయ మార్పును చవిచూశాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 147 సీట్లలో 78 స్థానాలను గెలుచుకోని విజయం సాధించింది. దీంతో 24 ఏళ్ల పాటు ఏకధాటిగా పాలించిన బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీ నాయకుడు నవీన్ పట్నాయక్ పాలనకు తెరపడింది. (చదవండి: మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా..)
అర్జున్ సర్జా ఇంట పెళ్లి వేడుకలు.. హీరోయిన్ హల్దీ పిక్స్ వైరల్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు, హీరోయిన్ ఐశ్వర్య మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కనుంది. కోలీవుడ్ లెజెండరీ నటుడు, దర్శకుడు తంబి రామయ్య ఇంటికి కోడలిగా వెళ్లనుంది. తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతితో జూన్ 10న చెన్నైలోని హనుమాన్ ఆలయంలో వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేయనుంది. ఆప్యాయంగా ముద్దాడిన తండ్రిఇప్పటికే పెళ్లి పనులు జోరందుకోగా తాజాగా హల్దీ, మెహందీ వేడుకలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. అందులో అర్జున్ సర్జా తన కూతురిని ఆప్యాయంగా ముద్దాడాడు. కాగా ఇది లవ్ మ్యారేజ్.. ఐశ్వర్య- ఉమాపతి ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా గతేడాదే వారు పచ్చజెండా ఊపారు. అక్టోబర్లో నిశ్చితార్థం జరిపారు.కెరీర్..సినిమాల విషయానికి వస్తే.. ఐశ్వర్య కెరీర్ అనుకుంత సక్సెస్ఫుల్గా సాగడం లేదు. కూతురి కోసం అర్జున్ డైరెక్టర్గా మారి సినిమా తీయగా అది కూడా ఆశించినంత ఫలితం అందుకోలేకపోయింది. మరోవైపు ఉమాపతి అడగప్పట్టత్తు మగజనంగళే, మనియార్ కుటుంబం, తిరుమనం, థానే వాడి వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. చదవండి: యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
సంచలనాల వరల్డ్ కప్.. పెద్ద జట్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న పసికూనలు
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. దాదాపుగా ప్రతి మ్యాచ్లో బడా జట్లకు పసికూనలు షాకిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన 15 మ్యాచ్ల్లో పెద్ద జట్లపై చిన్న జట్లు హవా చూపాయి.ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లపై ఓ లుక్కేద్దాం..టోర్నీ ఆరంభ మ్యాచ్లోనే ఓ మోస్తరు సంచలనం నమోదైంది. తమకంటే పటిష్టమైన కెనడాకు తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న యూఎస్ఏ ఊహించని షాకిచ్చింది. రెండో మ్యాచ్లో మరో పసికూన పపువా న్యూ గినియా.. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన వెస్టిండీస్ను దాదాపుగా ఓడించినంత పని చేసింది. ఈ మ్యాచ్లో విండీస్ బతుకు జీవుడా అన్నట్లు చివరి ఓవర్లో విజయం సాధించింది.పసికూనల మధ్య జరిగిన మూడో మ్యాచ్ సైతం నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్లో ఒమన్పై నమీబియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది.శ్రీలంక-సౌతాఫ్రికా మధ్య జరిగిన నాలుగో మ్యాచ్.. ఆఫ్ఘనిస్తాన్-ఉగాండ మధ్య జరిగిన ఐదో మ్యాచ్ అందరూ ఊహించినట్లుగానే జరిగాయి. ఈ రెండు మ్యాచ్ల్లో ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. స్కాట్లాండ్-ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఆతర్వాతి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్ రద్దు కాకుండా ఉండి ఉంటే ఇందులోనూ సంచలనానికి ఆస్కారం ఉండేది.నేపాల్-నెదర్లాండ్స్ మధ్య జరిగిన ఏడో మ్యాచ్.. భారత్-ఐర్లాండ్ మధ్య జరిగిన ఎనిమిదో మ్యాచ్.. ఆస్ట్రేలియా-ఒమన్ మధ్య జరిగిన తొమ్మిదో మ్యాచ్ అందరూ ఊహించినట్లుగానే ఏకపక్షంగా సాగాయి.అనంతరం పపువా న్యూ గినియా-ఉగాండ మధ్య జరిగిన పదో మ్యాచ్లో ఓ మోస్తరు సంచలనం నమోదైంది. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న ఉగాండ.. పొట్టి ప్రపంచకప్లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.పదకొండో మ్యాచ్ నుంచి పొట్టి ప్రపంచకప్ మరింత రసవత్తరంగా మారింది. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న యూఎస్ఏ.. తమకంటే చాలా రెట్లు మెరుగైన పాకిస్తాన్కు ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్ను ఐసీసీ పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో ఘోరమైన అప్సెట్గా అభివర్ణించింది.నమీబియా-స్కాట్లాండ్ మధ్య జరిగిన 12వ మ్యాచ్ ఏ హడావుడి లేకుండా సజావుగా సాగగా.. కెనడా-ఐర్లాండ్ మధ్య జరిగిన 13వ మ్యాచ్లో మరో సంచలనం నమోదైంది. కెనడా.. తమకంటే పటిష్టమైన ఐర్లాండ్కు ఊహించని షాకిచ్చి ప్రస్తుత ప్రపంచకప్లో తొలి విజయం నమోదు చేసుకుంది.నిన్న జరిగిన 14వ మ్యాచ్లో మరోసారి సంచలనం నమోదైంది. ఓ సారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన శ్రీలంకను ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని బంగ్లాదేశ్ మట్టికరిపించింది. నిన్ననే జరిగిన మరో మ్యాచ్లో క్రికెట్ ప్రపంచం ఊహించని మరో పెను సంచలనం నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్.. తమకంటే చాలా రెట్లు పటిష్టమైన న్యూజిలాండ్కు ఊహించని షాకిచ్చింది.ఇలా ఇప్పటివరకు జరిగిన 15 మ్యాచ్ల్లో ఒకటి అరా మినహా దాదాపుగా అన్ని మ్యాచ్ల్లో సంచలనాలు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈ ప్రపంచకప్లో సంచలనాలు నమోదవుతున్నాయి. మెగా టోర్నీ ఇలాగే కొనసాగాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రపంచంలో 7000 ‘జాంబీ కంపెనీలు’.. ఏంటివి?
అప్పుల ఊబిలో కూరుకుపోయి మనుగడ అంచున కొట్టుమిట్టాడుతూ రుణాలపై వడ్డీని కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న కంపెనీలను జాంబీ కంపెనీలుగా వ్యవహరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి జాంబీ కంపెనీల సంఖ్య గత పదేళ్లలో గణనీయంగా పెరిగింది.అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషణలో జాంబీ కంపెనీల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,000 పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీలకు పెరిగింది. ఒక్క యునైటెడ్ స్టేట్స్లోనే ఇలాంటి కంపెనీలు 2,000 లకు చేరాయి. ఏళ్ల తరబడి చౌక రుణాలు పేరుకుపోవడం, మొండి ద్రవ్యోల్బణం రుణ వ్యయాలను దశాబ్ద గరిష్టాలకు నెట్టింది.వీటిలో అనేక చిన్న, మధ్య తరహా కంపెనీలు త్వరలోనే తమ లెక్కల రోజును ఎదుర్కోవలసి రావచ్చు. వందల బిలియన్ డాలర్ల రుణాలను వారు తిరిగి చెల్లించలేకపోవచ్చు. గత మూడేళ్లలో కార్యకలాపాల ద్వారా తమ రుణాలపై వడ్డీని కూడా చెల్లించడానికి తగినంత డబ్బు సంపాదించడంలో విఫలమైన కంపెనీలను సాధారణంగా జాంబీలుగా నిర్వచిస్తారు.కార్నివాల్ క్రూయిజ్ లైన్, జెట్ బ్లూ ఎయిర్ వేస్, వేఫేర్, పెలోటన్, ఇటలీకి చెందిన టెలికాం ఇటాలియా, బ్రిటిష్ సాకర్ దిగ్గజం మాంచెస్టర్ యునైటెడ్ లను నడుపుతున్న కంపెనీలతో సహా ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్డమ్, యూఎస్లలో గత దశాబ్దంలో ఇలాంటి కంపెనీల సంఖ్య 30 శాతం పెరిగిందని అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషణలో తేలింది.మార్చిలో ఫెడరల్ రిజర్వ్ కోత ప్రారంభిస్తుందనే అంచనాతో రుణదాతలు తమ వాలెట్లను తెరవడంతో ఈ ఏడాది మొదటి కొన్ని నెలల్లో వందలాది జాంబీ కంపెనీలు తమ రుణాలను రీఫైనాన్స్ చేసుకున్నాయి. దీంతో గత ఆరు నెలల్లో 1,000 కి పైగా జాంబీ కంపెనీల స్టాక్స్ 20 శాతానికి పైగా పెరగడానికి సహాయపడింది. కానీ చాలా కంపెనీలు రీఫైనాన్స్ పొందలేకపోయాయి. ఇప్పుడు ఈ సంవత్సరం మొదటి, ఏకైక ఫెడ్ కోతను ఆశిస్తున్న నేపథ్యంలో జాంబీ కంపెనీలు 1.1 ట్రిలియన్ డాలర్ల రుణాలను చెల్లించాల్సి ఉంది.
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.మూడురోజుల క్రితం ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేసి స్టంట్స్ వేశారు. వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న రామోజీరావు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. వయోభారంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. తెల్లవారుజామున 4.50 గంటలకు తుది శ్వాస విడిచారు.రామోజీరావు మృతి పట్ల సీఎం రేవంత్రెడ్డి సంతాపం తెలిపారు. అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్కు సీఎస్ ద్వారా సీఎం ఆదేశాలు జారీ చేశారు.రేపు రామోజీరావు అంత్యక్రియలురామోజీరావు అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామోజీరావు భౌతికకాయానికి ప్రముఖులు నివాళులర్పించారు. వెంకయ్యనాయుడు, కేటీఆర్, సబితా, జానారెడ్డి,హరీశ్రావు రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.రేపు సినిమా షూటింగ్లకు సెలవురామోజీరావు మృతికి సంతాపంగా రేపు(ఆదివారం) సినిమా షూటింగ్లకు సెలవు ప్రకటించినట్లు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ వెల్లడించారు.రామోజీ మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈనాడుతో పాటు ‘సితార’ సినీ పత్రిక నడిపారు. హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ సిటీని నిర్మించారు. 2016లో భారత ప్రభుత్వం రామోజీని పద్మవిభూషణ్తో సత్కరించింది.ఇదీ చదవండి: రామోజీరావు మృతిపట్ల ప్రముఖుల సంతాపం
రామోజీరావు మరణం దిగ్భ్రాంతి కలిగించింది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రామోజీరావు మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ‘‘రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2024గవర్నర్ సంతాపం..రామోజీరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు మీడియా, వినోద రంగంలో నిష్ణాతుడని, తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడంలో ప్రసిద్ధి చెందారని, జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యా రంగాల్లో ఎనలేని సేవలందించినందుకు గాను రామోజీరావును పద్మవిభూషణ్తో సత్కరించినట్లు తెలిపారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తప్పక చదవండి
- చెల్లిని కాపాడబోయి నీట మునిగిన అక్క మృతి
- ఉబ్బసం రోగులకోసం చేప ప్రసాదం
- మావోయిస్టుల ఏరివేతకు ‘జల్శక్తి’
- T20 World Cup 2024: నిప్పులు చెరిగిన సౌతాఫ్రికా పేసర్లు
- ఎర్త్ రైజ్ ఫోటోతో ప్రపంచాన్నే మార్చేసిన నాసా ఆస్ట్రోనాట్ దుర్మరణం
- పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్
- పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
- పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ ప్రయోగం
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. పోలీస్ డాగ్స్కు అరుదైన గౌరవం
- Russia: భారతీయ వైద్య విద్యార్థుల మృతదేహాలు వెలికితీత
సినిమా
డబ్బు తీసుకోలేదు.. చాలామంది ఇలాగే.. దీనిగురించి ఎవరూ మాట్లాడరు!
కొందరు హీరోలు పైసా తక్కువైతే చాలు ప్రాణం పోయినట్లు ఫీలవుతారు. మరికొందరు నిర్మాతల పరిస్థితిని, సినిమా రిజల్ట్ను బట్టి రెమ్యునరేషన్ తగ్గించుకుంటారు లేదంటే ఒక్క రూపాయి కూడా తీసుకోరు. హీరో కార్తీక్ ఆర్యన్ రెండో రకానికి చెందినవాడు. స్టార్ సెలబ్రిటీలు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం వల్ల సదరు సినిమాకు పని చేసే టెక్నీషియన్స్కు ఇతర నటీనటులకు సరైన డబ్బు అందడం లేదని ఈ మధ్య బాలీవుడ్లో ఓ చర్చ నడుస్తోంది. తడిసి మోపెడవుతున్న బడ్జెట్హీరోల పారితోషికానికి తోడు.. వారి మేకప్మెన్కు, హెయిర్ డ్రెస్సర్కు, స్టైలిస్ట్కు.. ఇలా తన దగ్గర పనిచేసే అందరికీ జీతాలివ్వాలని సరికొత్త డిమాండ్లు పెడుతుండటంతో బడ్జెట్ మితిమీరిపోతోందన్నది ప్రధాన అంశం. తాజాగా దీనిపై కార్తీక్ ఆర్యన్ స్పందిస్తూ.. ఈ చర్చ జరగకముందు నేను షెహజాదా సినిమా చేశాను. చిత్ర నిర్మాతల దగ్గర సరిపడా బడ్జెట్ లేకపోవడంతో నా ఫీజు వదిలేసుకున్నాను. రెమ్యునరేషన్ తీసుకోలేదని సినిమా నిర్మాతల్లో నేనూ ఒకడినని క్రెడిట్ ఇచ్చారు. ఇలాంటివి ఎవరూ రాయరు.హీరోల త్యాగం చూడరే!నేనే కాదు, చాలామంది స్టార్స్ నిర్మాతల కోసం ఆలోచించి చాలా సాయం చేస్తుంటారు. వారికి తోడుగా ఉంటారు. దర్శకుడు, యాక్టర్స్, నిర్మాతలు.. ఇలా ప్రతి ఒక్కరూ సినిమాను ముందుకు తీసుకెళ్లడానికే ఆలోచిస్తారు. ఎవరూ దాన్ని సాగదీయాలని చూడరు. సినిమా ఉంటే ఏంటి, పోతే ఏంటి? నాకైతే నా డబ్బులు నాకు ముట్టాల్సిందే అని ఎవరూ మాట్లాడరు అని చెప్పుకొచ్చాడు.అల వైకుంఠపురములో రీమేక్కాగా అల వైకుంఠపురములో సినిమాకు రీమేక్గా షెహజాదా తెరకెక్కింది. ఇందులో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించారు. రోహిత్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను భూషణ్ కుమార్, అల్లు అరవింద్, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది.చదవండి: సౌత్ హీరోలు ఫేక్.. పైకి మాత్రం తెగ నటిస్తారు: బాలీవుడ్ ఫోటోగ్రాఫర్
ఒకే ఒక్క సినిమా.. హిట్టయితే ఇండస్ట్రీని షేక్ చేయడం పక్కా!
సాధారణంగా హీరోయిన్లకు నాలుగైదు హిట్లు పడితేకానీ గుర్తింపు రాదు. చిన్న చిన్న హీరోలతో నటించి మెప్పిస్తే..స్టార్ హీరోల సినిమాల్లో చాన్స్ వస్తుంది. అక్కడ ఒక్క హిట్ పడితే చాలు..ఇక స్టార్ హీరోయిన్ అయిపోతారు. వరుస అవకాశాలు వస్తాయి. అయితే ఇదంతా జరగడానికి కొంత సమయం పడుతుంది. అదృష్టం కూడా ఉండాలి. కానీ కొంతమంది హీరోయిన్లకి మాత్రం తొలి సినిమాతోనే స్టార్ హీరోలతో నటించే అవకాశం వస్తుంది. అది హిట్టయితే చాలు..వాళ్లు ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయం. అలాంటి బంపరాఫర్స్ని పట్టేసిన హీరోయిన్లపై ఓ లుక్కేద్దాం.మాళవికా మోహన్.. ఈ బ్యూటీ పేరు తెలుగు ఆడియన్స్కి అంతగా గుర్తుండకపోవచ్చు కానీ, తమిళ్ ఆడియన్స్కి మాత్రం బాగా తెలుసు. రజనీకాంత్, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ‘మాస్టర్’తో సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ బ్యూటీ ఇంతవరకు టాలీవుడ్ సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు ఏకంగా పాన్ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మారుతి-ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ చిత్రంలో మాళవిక హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా విడుదలై హిట్టయితే మాత్రం మాళవిక స్టార్ హీరోయిన్గా మారడం ఖాయం.జాన్వీ కపూర్.. దీవంగత నటి, అందాల తార శ్రీదేవి ముద్దుల తనయగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. అక్కడ వరుస సినిమాలు చేసిన రావాల్సినంత గుర్తింపు రాలేదు. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్పై కన్నేసింది. తొలి సినిమాతోనే ఎన్టీఆర్తో నటించే చాన్స్ కొట్టేసింది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘దేవర’మూవీలో జాన్వీనే హీరోయిన్. అంతేకాదు రామ్చరణ్-బుచ్చిబాబు కాంబినేసన్లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు విడుదలై హిట్టయితే..సౌత్లో ఈ బ్యూటీకి వరుస సినిమా అవకాశాలు రావడం ఖాయమని సీనీ విశ్లేషకులు చెబుతున్నారు.అషికా రంగనాథ్.. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నటించే అవకాశం వచ్చిందంటే.. ఆ హీరోయిన్కి ప్రమోషన్స్ వచ్చినట్టే లెక్క. చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే అషికా రంగనాథ్కి మాత్రం రెండో సినిమాతోనే మెగాస్టార్ సరసన నటించే అవకాశం దక్కింది. ‘నా సామిరంగ’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత అషికాకు తెలుగులో వరుస సినిమాలు వచ్చే అవకాశం ఉంది.
బాలీవుడ్లోకి శ్రీలీల ఎంట్రీ.. ఆ స్టార్ హీరో కొడుకుతో కలిసి!
శ్రీలీల.. టాలీవుడ్లోకి వచ్చి వరసపెట్టి సినిమాలు చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతానికైతే తెలుగు వరకు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. తెలుగు వరకు అయితే ఈమె చేతిలో 'ఉస్తాద్ భగత్ సింగ్' మాత్రమే ఉంది. మరోవైపు తమిళంలోనూ ఆఫర్స్ వచ్చాయని అంటున్నారు. కానీ ఇంకా ఫైనల్ అయినట్లు లేదు. ఇప్పుడు ఇవన్నీ కాదన్నట్లు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేస్తుందని టాక్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)అమెరికాలో పుట్టి పెరిగిన శ్రీలీల.. తెలుగు-కన్నడ మూలాలున్న ఫ్యామిలీలో పుట్టింది. టీనేజ్లో ఉండగానే కన్నడ సినిమాతో హీరోయిన్ అయిపోయింది. 'పెళ్లి సందD' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది హిట్ కానప్పటికీ కేక పుట్టించే డ్యాన్సింగ్ స్కిల్స్ ఉండటంతో వరస ఛాన్సులు వరించాయి. అలా అరడజనుకు పైగా మూవీస్ చేసింది. కానీ 'ధమాకా' తప్పితే చెప్పుకోదగ్గర హిట్ ఈమెకు పడలేదు.రీసెంట్గా తమిళ స్టార్ అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీలో హీరోయిన్గా సెలెక్ట్ అయిందని అన్నారు. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయిందంటున్నారు. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్గా అనుకుంటున్నారట. ఇది కన్ఫర్మ్ అయి, హిట్ కొడితే మాత్రం శ్రీలీల పంట పండినట్లే!(ఇదీ చదవండి: బిగ్బాస్ షోలో లవ్, పెళ్లి.. నాలుగేళ్లకే విడాకులు!)
సౌత్ హీరోలు ఫేక్.. పైకి మాత్రం తెగ నటిస్తారు: బాలీవుడ్ ఫోటోగ్రాఫర్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో హిందీ చిత్రపరిశ్రమపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. స్టార్ హీరోల సినిమాలను బహిష్కరించాలన్న డిమాండ్స్ కూడా తెరపైకి వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో దక్షిణాది చిత్రాలు మంచి కంటెంట్తో వచ్చి క్లిక్ అవడంతో అందరి కళ్లు సౌత్పై పడ్డాయి. పాన్ ఇండియా లెవల్లో సౌత్ సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి.సౌత్ వర్సెస్ బాలీవుడ్దీంతో అప్పటినుంచి బాలీవుడ్ను సౌత్ ఇండస్ట్రీతో పోల్చడం మొదలుపెట్టారు. దక్షిణాది తారలు ఎంతో సింపుల్గా ఉంటారని, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారని.. కానీ హిందీ హీరోలు ఎక్కువ పోజులు కొడతారని విమర్శించారు. అయితే సౌత్ స్టార్స్ బయటకు కనిపించేంత విధేయతగా మెసులుకోరని బాలీవుడ్ కెమెరామన్ (ఫోటోగ్రాఫర్) వీరేందర్ చావ్లా అంటున్నాడు. వీరేందర్ చావ్లా, ఫోటోగ్రాఫర్చెప్పులేసుకుని..అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌత్ సెలబ్రిటీలు ఫేక్గా కనిపిస్తారు. ఏదో పైకి మాత్రం ఒదిగి ఉన్నట్లు నటిస్తారు. ఒక హీరో (విజయ్ దేవరకొండ) అయితే తన సినిమా ప్రమోషన్స్కు చెప్పులు వేసుకుని వచ్చాడు. సింపుల్గా ఉన్నట్లు చూపించుకోవడానికే కెమెరా ముందు అలా యాక్ట్ చేశాడు. సౌత్లో మరో బిగ్ స్టార్ (జూనియర్ ఎన్టీఆర్) సాధారణంగా ఎప్పుడూ సైలెంట్గానే ఉంటాడు. ఫోటో తీసిందొకరైతే కోప్పడింది మాత్రం..అతడు హోటల్కు వెళ్తుండగా ఓ ఫోటోగ్రాఫర్ ఆయన్ను క్లిక్మనిపించాడు. అందుకాయన నా టీమ్ మెంబర్పై కోప్పడ్డాడు. నిజానికి ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది వేరే వ్యక్తి. కోప్పడింది మాత్రం మా వాళ్లపై! మహేశ్బాబు అయితే బాలీవుడ్ తనకు అవసరం లేదని చెప్పాడు. ఈయన ఇలా యాటిట్యూడ్ చూపిస్తున్నారేంటని అనుకున్నాను. అసలు ఫేక్గా ఉండేది సౌత్ హీరోలే.. బాలీవుడ్లో ఉన్నవాళ్లు లోపల, బయట ఒకేలా ఉంటారు' అని వీరేందర్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఎయిడ్స్ ఉందని ప్రచారం.. దశాబ్దాల తర్వాత నోరు విప్పిన హీరో
ఫొటోలు
కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్బాస్ బ్యూటీ (ఫోటోలు)
అర్జున్ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్గా హల్దీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)
మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్ (ఫొటోలు)
Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)
క్రీడలు
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన హసరంగ
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి క్రికెట్లో శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. హసరంగకు ముందు ఈ రికార్డు దిగ్గజ పేసర్ లసిత్ మలింగ పేరిట ఉండేది. టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్తో నిన్న (జూన్ 7) జరిగిన మ్యాచ్లో హసరంగ.. మలింగ రికార్డును అధిగమించాడు.మలింగ 84 అంతర్జాతీయ టీ20ల్లో 107 వికెట్లు పడగొట్టగా.. హసరంగ తన 67వ టీ20 మ్యాచ్లోనే ఈ మార్కును దాటాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో తౌహిద్ హ్రిదోయ్ వికెట్ పడగొట్టడం ద్వారా హసరంగ (108 వికెట్లు) శ్రీలంక తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్గా అవతరించాడు. ఈ మ్యాచ్లో హసరంగ హ్రిదోయ్ వికెట్తో పాటు మరో వికెట్ (లిట్టన్ దాస్) కూడా పడగొట్టాడు.ఈ మ్యాచ్లో హసరంగతో పాటు నువాన్ తుషార (4-0-18-4), మతీశ పతిరణ (4-0-27-1), ధనంజయ డిసిల్వ (2-0-11-1) సత్తా చాటినా శ్రీలంక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక అత్యంత పేలవంగా బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసింది. లంక ఇన్నింగ్స్లో పథుమ్ నిస్సంక (47) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేశాడు. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్, ముస్తాఫిజుర్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్ 2, తంజిమ్ హసన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. లంక బౌలర్లు ప్రతిఘటించినప్పటికీ మరో ఓవర్ మిగిలుండగానే (8 వికెట్ల నష్టానికి) విజయతీరాలకు చేరింది. లిటన్ దాస్ (36), తౌహిద్ హ్రిదోయ్ (40), మహ్మదుల్లా (16 నాటౌట్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి బంగ్లాదేశ్కు 2 వికెట్ల తేడాతో విజయాన్నందించారు.టీ20ల్లో శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..హసరంగ-108 వికెట్లుమలింగ- 107కులశేఖర- 66అజంత మెండిస్-66దుష్మంత చమీరా-55
T20 World Cup 2024: సౌతాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచ్.. తుది జట్లు ఇవే..!
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 8) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో నెదర్లాండ్స్-సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. న్యూయార్క్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్లో ఆడిన జట్లతోనే ఇరు జట్లు ఈ మ్యాచ్లోనూ బరిలోకి దిగుతున్నాయి. గ్రూప్-డిలో భాగమైన సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన చెరో మ్యాచ్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. సౌతాఫ్రికా.. శ్రీలంకపై విజయం సాధించగా..నెదర్లాండ్స్.. నేపాల్ను మట్టికరిపించింది.తుది జట్లు..నెదర్లాండ్స్: మైకేల్ లెవిట్, మాక్స్ ఓడౌడ్, విక్రమ్జిత్ సింగ్, సైబ్రాండ్ ఎంగెల్బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్/వికెట్కీపర్), బాస్ డి లీడే, తేజ నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, టిమ్ ప్రింగిల్, పాల్ వాన్ మీకెరెన్, వివియన్ కింగ్మాదక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్కీపర్), రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్మన్
T20 World Cup 2024: రషీద్ ఖాన్ ఈజ్ ద బెస్ట్
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా న్యూజిలాండ్తో నిన్న (జూన్ 7) జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో సత్తా చాటి తమకంటే చాలా రెట్లు మెరుగైన న్యూజిలాండ్ను ఖంగుతినిపించారు. తొలుత బ్యాటింగ్లో చెలరేగిన ఆఫ్ఘన్ ప్లేయర్లు.. ఆతర్వాత బౌలింగ్లోనూ విజృంభించి కివీస్కు ఊహించని షాకిచ్చారు. ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి పటిష్టమైన న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. కివీస్ ఇన్నింగ్స్లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్దమవుతుంది. న్యూజిలాండ్ను ఈ స్థితికి దిగజార్చడానికి ముఖ్య కారకుడు ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్. ఈ మ్యాచ్లో రషీద్ 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. రషీద్తో పాటు ఫజల్ హక్ ఫారూఖీ (3.2-0-17-4), మొహమ్మద్ నబీ (4-0-16-2) కూడా చెలరేగడంతో న్యూజిలాండ్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. రషీద్, ఫజల్ హక్, నబీల దెబ్బకు 15.2 ఓవర్లలో 75 పరుగులకే చాపచుట్టేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ (18), మ్యాట్ హెన్రీ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరిద్దరు కూడా సింగిల్ డిజిట్ స్కోర్కే టపా కట్టేసి ఉంటే న్యూజిలాండ్ 50 పరుగుల మార్కు కూడా దాటేది కాదు. దీనికి ముందు రహ్మానుల్లా గుర్బాజ్ (80), ఇబ్రహీం జద్రాన్ (44) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో గుర్బాజ్, జద్రాన్తో పాటు అజ్మతుల్లా (22) రాణించాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, మ్యాట్ హెన్రీ తలో 2 వికెట్లు తీయగా.. ఫెర్గూసన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆఫ్ఘన్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో కలిసికట్టుగా రాణించి కివీస్ను 84 పరుగుల తేడాతో చిత్తు చేశారు. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడటం ఇదే తొలిసారి.రషీద్ ఈజ్ ద బెస్ట్..ఈ మ్యాచ్లో అద్భుత గణాంకాలు నమోదు చేసి కివీస్ పతనాన్ని శాశించిన ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ప్రపంచకప్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (4-0-17-4) నమోదు చేసిన కెప్టెన్గా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. రషీద్కు ముందు ఈ ఘనత న్యూజిలాండ్ స్పిన్నర్ డేనియల్ వెటోరీ పేరిట ఉండేది. వెటోరీ 2007 వరల్డ్కప్లో ఇండియాపై 4 ఓవరల్లో 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో రషీద్, వెటోరీ తర్వాత ఒమన్ బౌలర్ జీషన్ మక్సూద్ (2021లో పపువా న్యూ గినియాపై 4-0-20-4), ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (2012లో శ్రీలంకపై 4-0-24-3) ఉన్నారు.
టీ20 వరల్డ్కప్లో భిన్న పరిస్థితి
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్కప్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో గతానికి భిన్నంగా చిన్న జట్ల హవా కొనసాగుతుంది. ఫలితంగా 15 మ్యాచ్లు పూర్తైనా అగ్ర జట్లు తమ తమ గ్రూప్ల్లో టాప్ ప్లేస్కు చేరుకోలేకపోయారు. చిన్న జట్లు అనూహ్య రీతిలో రాణించి పెద్ద జట్లను ఓడించడంతో వాటిదే పైచేయిగా ఉంది. గ్రూప్-ఏ నుంచి తొలి ప్రపంచకప్ ఆడుతున్న యూఎస్ఏ.. పాకిస్తాన్ సహా కెనడాపై సంచలన విజయాలు సాధించి గ్రూప్ టాపర్గా ఉండగా.. భారత్ రెండో స్థానంలో, కెనడా మూడో ప్లేస్లో ఉన్నాయి. ఆడిన ఓ మ్యాచ్లో ఓడిన పాక్ నాలుగో స్థానంలో ఉండగా.. రెండు మ్యాచ్ల్లో ఓడిన ఐర్లాండ్ ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. యూఎస్ఏ చేతిలో ఓటమి నేపథ్యంలో పాక్ సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి హేమాహేమీ జట్లు ఉండగా.. ఎవరు ఊహించని విధంగా ఈ గ్రూప్లో స్కాట్లాండ్ టాప్ ప్లేస్లో ఉంది. స్కాట్లాండ్ ఓ మ్యాచ్లో గెలిచి (నమీబియా), మరో మ్యాచ్ రద్దు కావడంతో (ఇంగ్లండ్) 3 పాయింట్లతో గ్రూప్ టాపర్గా ఉంది. ఆసీస్, నమీబియా, ఇంగ్లండ్, ఒమన్ రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నాయి.గ్రూప్-సిలో సంచలనాల ఆఫ్ఘనిస్తాన్ టాప్ ప్లేస్లో ఉండగా.. తాజాగా ఆ జట్టు చేతిలో చావుదెబ్బ తిన్న న్యూజిలాండ్ ఆఖరి స్థానంలో నిలిచింది. వెస్టిండీస్, ఉగాండ, పపువా న్యూ గినియా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి.గ్రూప్-డి విషయానికొస్తే.. ఈ గ్రూప్ నుంచి సూపర్-8 బెర్త్ రేసులో ముందుండాల్సిన శ్రీలంక ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడి చిట్ట చివరి స్థానంలో ఉండగా.. ఆడిన ఒక్క మ్యాచ్లో గెలిచిన సౌతాఫ్రికా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆడిన ఏకైక మ్యాచ్లో ఓడిన నేపాల్ నాలుగో స్థానంలో ఉంది.ప్రపంచకప్లో ఇవాళ (జూన్ 8) మరో మూడు మ్యాచ్లు జరగాల్సి ఉంది. గ్రూప్-డి నుంచి నెదర్లాండ్స్, సౌతాఫ్రికా.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఉగాండ పోటీపడనున్నాయి. ఈ మూడు మ్యాచ్ల్లో ఊహించిన ఫలితాలు వచ్చినా ఆఫ్ఘనిస్తాన్, యూఎస్ఏ, స్కాట్లాండ్ జట్లు ఆయా గ్రూప్ల్లో టాప్లోనే కొనసాగుతాయి.
బిజినెస్
హోమ్ లోన్ కస్టమర్లకు గుడ్న్యూస్.. తగ్గనున్న భారం!
హోమ్ లోన్ కస్టమర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్న్యూస్ చెప్పింది. తాజా ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ వడ్డీ రేట్లలో (ఎంసీఎల్ఆర్) మార్పులు చేసింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండేళ్ల కాలపరిమితి రుణాలపై వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో 9.35 శాతంగా ఉన్న ఎంసీఎల్ఆర్ 9.30 శాతానికి తగ్గింది. ఫలితంగా అదే కాలపరిమితికి హోమ్ లోన్ రేట్లు తగ్గనున్నాయి. అయితే, ఇతర కాలపరిమితి రుణాలకు వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయి. బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం.. సవరించిన ఎంసీఎల్ఆర్ 2024 జూన్ 7 నుంచి అమల్లోకి వస్తుంది.ఎంసీఎల్ఆర్ అంటే..ఎంసీఎల్ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ అనేది బ్యాంకు రుణం ఇవ్వగల కనీస వడ్డీ రేటు. బ్యాంకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు, కాలపరిమితి ప్రీమియం వంటి అంశాల ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. సాధరణంగా ఎంసీఎల్ఆర్ తక్కువగా ఉంటే ఈఎంఐల భారం తగ్గుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బెంచ్ర్క్ ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 8.95 శాతం నుంచి 9.35 శాతం మధ్య ఉంది. ఎంసీఎల్ఆర్ సవరణల ప్రభావం తక్షణమే ఉండదని గమనించాలి. ఎంసీఎల్ఆర్ ఆధారిత గృహ రుణాలకు రీసెట్ పీరియడ్ ఉంది. ఆ తర్వాత రుణగ్రహీతలకు రేట్లు సవరిస్తారు.
భారత్లో టెస్లా పెట్టుబడులు.. మస్క్ యూటర్న్
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ యూటర్న్ తీసుకున్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మస్క్ ప్రధాని మోదీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మోదీకి మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు. మా సంస్థ త్వరలో భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని ట్వీట్ చేశారు.భారత్కు ఆహ్వానంఆ ట్వీట్కు మోదీ స్పందించారు. ప్రతిభావంతులైన భారతీయ యువత, జనాభా, ఊహాజనిత విధానాలు, స్థిరమైన ప్రజాస్వామ్య రాజకీయాలతో మా భాగస్వాములందరికీ వ్యాపార వ్యవహారాల్ని చక్కబెట్టుకునేందుకు అనువైన వాతావరణాన్ని అందించడాన్ని కొనసాగిస్తామని మస్క్ ట్వీట్కు రిప్లయి ఇచ్చారు. మస్క్ యూటర్న్.. అంతలోనే భారత్లో టెస్లా పెట్టుబడులు నిమిత్తం ఆ సంస్థ సీఈవో ఎలోన్ మస్క్ ఈ ఏడాది ఏప్రిల్ 21,22 తేదీలలో ప్రధాని మోదీతో భేటీ కానున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత టెస్లాకు భారీ బాధ్యతలు ఉన్నాయని మస్క్ ట్వీట్ చేయడం..అనూహ్యంగా చైనాలో ప్రత్యక్షమయ్యారు. దీంతో మస్క్ భారత్లో పెట్టుబడుల అంశం వెనక్కి తగ్గింది. తాజాగా, మరోమారు పెట్టుబడులు పెట్టడంపై మస్క్ ట్వీట్ చేయడం వ్యాపార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ప్రముఖ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల రీకాల్
టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఐకూబ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. జులై 10, 2023 నుంచి సెప్టెంబర్ 9, 2023 మధ్య తయారు చేసిన వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..‘ప్రోయాక్టివ్ ఇన్స్పెక్షన్’ కోసం ఐకూబ్ మోడల్ ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల్ చేస్తున్నారు. వాహనాల సామర్థ్యం ఎలాఉందో నిర్థారించుకోవడానికి బ్రిడ్జ్ ట్యూబ్ను తనిఖీ చేయనున్నారు. అందులో ఏదైనా సమస్యలుంటే కస్టమర్లకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగానే సర్వీసు చేస్తామని కంపెనీ తెలిపింది. ఇందుకు సంబంధించి డీలర్ భాగస్వాములు వ్యక్తిగతంగా కస్టమర్లను సంప్రదిస్తారని సంస్థ పేర్కొంది.
భారత్లో కొత్త కారు లాంచ్ చేసిన దేశీయ కంపెనీ
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో లాంచ్ అయింది. మూడు వేరియంట్లలో లభించే ఈ కారు ప్రారంభ ధర రూ. 9.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ హ్యాచ్బ్యాక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 120 హార్స్ పవర్, 170 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో లభిస్తుంది. కాబట్టి ఇది స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కారు కంటే కూడా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది.అటామిక్ ఆరెంజ్, అవెన్యూ వైట్, ప్యూర్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో లభించే టాటా ఆల్ట్రోజ్ రేసర్.. దాని బోనెట్, రూఫ్ వంటి వాటి మీద వైట్ రేసింగ్ స్ట్రిప్స్ పొందుతుంది. అక్కడక్కడా రేసింగ్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ అలాగే ఉన్నాయి.డిజైన్ మాత్రమే కాకుండా టాటా ఆల్ట్రోజ్ రేసర్ వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్స్క్రీన్, 7.0 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సెంటర్ కన్సోల్లోని గేర్ లివర్ మొదలైనవి కూడా ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్ పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.
వీడియోలు
వైఎస్సార్సీపీ జెండా పట్టుకుంటే దాడి.. ఏపీలో దాడులపై షర్మిలా రెడ్డి ఫైర్
ప్రియుడితో కలిసి భర్తపై భార్య దారుణం
హైదరాబాద్ లో భారీ వర్షం
ఎంతవరకైనా సిద్ధం..
నో పోలీస్.. నో కేసు.. టీడీపీ, జనసేన దాడులపై పేర్ని నాని ఫైర్..
పోలీసుల ప్రేక్షక పాత్ర కొడాలి నాని షాకింగ్ రియాక్షన్
రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి
పేర్ని కిట్టును అడ్డుకున్న పోలీసులు..
ఎన్నికల ఫలితాలపై మార్గాని భరత్ షాకింగ్ రియాక్షన్..
లోక్ సభ ఫలితాలపై ఖర్గే అసంతృప్తి..
ఫ్యామిలీ
టీనేజర్లపై.. స్మార్ట్ ఫోన్ల ప్రభావం! అధ్యయనాల్లో ఏం తేలిందంటే?
ఇటీవల పరిస్థితులను గమనిస్తే చిన్నారుల నుంచి మొదలుకొని పండు ముదుసలి వరకు సెల్ ఫోన్ వాడనీ వారు లేరేమో. సంవత్సరంలోపు పిల్లలు గుక్కపట్టి ఏడిస్తే కన్నతల్లి దగ్గరకు తీసుకొని పాలు తాగించేది. భయంతో ఏడిస్తే నేనున్నానే భరోసాను నింపుతూ ఎత్తుకుని లాలించేది. గోరుముద్దలు తినిపిస్తూ జోలపుచ్చే ది. కానీ ప్రస్తుతం ఇవేవీ కనిపించడం లేదు. ఆప్యాయతలు, ప్రేమానురాగాలు కనుమరు గయ్యాయి. పిల్లవాడు మారం చేస్తేచాలు సెల్ ఫోన్ చేతిలో పెడితే ఏడుపు ఆగిపోతుంది. సెల్ ఫోన్ మన జీవతంలో ఎంత దూరం వరకు వెళ్లిందో గమనిస్తున్నామా అనిపిస్తుంది.ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తే ఇంటిలో ఏది ఉన్నా లేక పోయినా స్మార్ట్ ఫోన్లు మాత్రం ఇంటిలో కనీస ఒక్కరికి ఉంటుంది. అదృష్టమో, దురదృష్టమో కానీ స్మార్ట్ ఫోన్ నేడు మానవ జీవతంలో ఒక భాగమైంది. చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటే చాలు అందలమెక్కేసినట్లుగా భావిస్తున్నారు. జనం నాలుగో జనరేషన్ టెక్నాలజీ పుణ్యమా అని స్మార్ట్ ఫోన్లు మరింత స్మార్ట్ గా జనానికి చేరువైపోయింది.అవసరం కోసం మొదలై సౌకర్యంగా అలవాటై చివరికి ఫోన్ కి బానిసలుగా మారే ప్రమాదకరం ఏర్పాడింది. స్మార్ట్ ఫోన్ల విషయంలో నియంత్రణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగస్తులు అయిన ఇళ్లల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. సెల్ ఫోన్ వాడకంతో పిల్లల్లో మానసిక సామర్థ్యం కొరవడుతుంది.సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియో ధార్మిక కిరణాల నుంచి చిన్నారుల బ్రెయిన్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లల్లో సృజనాత్మకశక్తి, ఆలోచనాశక్తి, తెలివితేటలు, మందగిస్తాయి. ఏకాగ్రత సన్నగిల్లుతుంది. ఆత్మ విశ్వాసం లోపించడంతో పాటుగా కోపం, మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరిగే అవకాశం ఉంటుంది. సెల్ ఫోన్లలో వివిధ రకాలైన గేమ్స్ అందుబాటులోకి రావడంతో ఆ గేమ్స్ లో మునిగిపోయిన పిల్లలు పక్కనున్న ఎవరినీ పట్టించుకోని స్థితిలో ఒంటరితనానికి అలవాటుపడి మానవ సంబంధాలకు దూరంగా తల్లిదండ్రుల ఆత్మీయ స్పర్శకు నోచుకోలేక పెరుగుతారు.మొదటగా ఎంతో చిన్నవిగా కనిపించే సమస్యలను సరైన సమయంలో పట్టించుకుని సరైన పరిష్కారాలు వెతకకపోతే అవే పెద్దవిగా మారి పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై త్రీవ ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లలు ఏవైనా సమస్యలతో బాధపడుతూ, ఏడుస్తూ తమ దగ్గరకు వస్తే అవి చిన్నవే కదా అని వదిలివేయకుండా వాటిని పరిశీలించి, పరిష్కరించాలి. తల్లిదండ్రులు పని ఒత్తిడిలో ఉండి సెల్ ఫోన్లోనే అన్ని సమస్యలకు పరిష్కారం ఉన్నట్లు యూట్యూబ్ గేమ్స్ కు పిల్లలను అలవాటు చేస్తున్నారు.ఇవి పిల్లవాడి భవిష్యత్తును దెబ్బతీస్తుందని గుర్తించాలి. పిల్లల కోసమే మా జీవతం అని భావిస్తున్న తల్లిదండ్రులు పిల్లల సెల్ ఫోన్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వారి భవిష్యత్తును చేజేతులా పాడు చేసినవారవుతారు. పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం చాల ముఖ్యం. సమస్య ఎదురైనప్పుడు ముందుగా గుర్తించి దాన్ని పరిష్కారం చేయగలిగితే పిల్లల భవిష్యత్ బంగారంగా మార్చుకోచ్చు.టీనేజర్ల ప్రవర్తనపై అధ్యయనం..టీనేజర్ల ఆరోగ్యం, ప్రవర్తన తాలూకు అంశాలపై అమెరికాలోని "శాండియాగో స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ ఐజెన్ కన్సెల్టింగ్ ఫౌండర్" వైద్యురాలు 'జీన్ త్వెంగె' టీనేజర్ల ప్రవర్తనపై అధ్యయనం చేశారు. ఆమె తన బృందంతో కలసి 13 నుంచి 18 వయస్సుగల పది లక్షలకు పైగా పిల్లలపై అధ్యయనం చేశారు.టీనేజర్లు తమ సమయాన్ని ఎలా గడుతున్నారనేదే మానసిక ఆరోగ్య కోణంలో ప్రాథమిక అంశమని ఆమె పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ల యుగం పిల్లల్లో మానసిక సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఇందుకు సంబంధించిన ఓ బలమైన కేస్ స్టడీని ప్రపంచం ముందుంచారు జీన్ త్వెంగె. ఒంటరితనంతో బాధపడే టీనేజర్లు సంఖ్య బాగా పెరగడం, వారు తమ జీవితం వృథా అయిపోనట్లు భావిస్తుండడం వంటి లక్షణాలు గమనించారు. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలు.ఐదేళ్లలో ఈ వ్యాధి లక్షణాలు 60 శాతం మేరకు పెరిగాయి. తమను తాము గాయపరచుకునేంతగా అవి విజృంభించాయి. బాలికల్లో ఈ ప్రమాదకర ధోరణి రెండు మూడింతలు పెరిగింది. కొన్నేళ్లలోనే టీనేజర్ల అత్మహత్యలు రెట్టింపయ్యాయి. అని జీన్ తన అధ్యయన సారాంశాన్ని వివరించారు."అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్" కలిసి జరిపిన అధ్యయనం ప్రకారం మన దేశంలోని కాలేజీ విద్యార్థులు రోజుకు 150 సార్లకు పైగా తమ ఫోన్లు చెక్ చేసుకుంటున్నారు. ఫోన్ చూసుకోకపోతే ఏదో మిస్ అయిపోతామనే ఆలోచన వారిని వెంటాడుతోందని, ఇదో వ్యసనంలా మారిందని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ లక్షణాలున్న వారు క్రమంగా యాంగ్జయిటీ సంబంధిత సమస్యల బారినపడే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.ఇవి చదవండి: మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా..
మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా..
మనల్ని ఎవరైన కామెంట్ చేస్తేనే దిగులు పడిపోతాం. మనం బాగానే ఉన్నా.. ఏదో ఒక విధంగా కామెంట్ చేస్తారనే విషయం తెలిసిందే. అలాంటిది అస్సలు రూపమే చూసేందుకు అసహ్యంగా ఉంటే.. అస్సలు బయటకు అడుపెట్టం. కానీ ఈ అమ్మాయి ఆ బాధను దిగమింగడం కాదు..సానుకూలంగా ఆ వైకల్యాన్ని అంగీకరించింది. ఆ అవహేళనలను అధిగమంచి తానెంటో ప్రపంచానికి తెలియజేడమే కాకుండా ఎందరికో స్ఫూర్తిని ఇచ్చింది. జన్మతః లేదా మరేదైన కారణం వల్ల వచ్చే వైకల్యం లేదా అనారోగ్యంతో చతికిలపడిపోకూడదని చాటి చెప్పింది. సత్తువ, స్థైర్యం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ప్రూవ్ చేసింది. ఎవరంటే ఆమె..కేరళలోని తిరువనంతపురంకి చెందిన 24 ఏళ్ల బిస్మిత. చిన్నప్పటి నుంచి ఎన్నో హేళనలు, చిత్కారాలు. ఎందుకంటే..? బిస్మిత అరుదైన జన్యుపరమైన చర్మ పరిస్థితి కారణంగా శరీరం అంతా మచ్చల మచ్చలుగా ఉంటుంది. ఇలా బిస్మతకు పుట్టిన రెండు నెలలకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయితే ఆమె తల్లి మజిత(47)కు కూడా ఇలానే ఉండటంతో..అదే ఆమెకు వంశపారపర్యంగా వచ్చేసింది. కేరళలోని ఆసుపత్రులన్నీ తిరిగింది ఆమె తల్లి. జన్యుపరంగా వచ్చే చర్మ సమస్య, చికిత్స లేదని వైద్యులు చేతులెత్తేయడంతో.. కూతురి జీవితం ఏమైపోతుందోనని ఆందోళనకు గురైంది మజిత. చెప్పాలంటే ఇది ఒక విధమైన బొల్లి వ్యాధి మాదిరిగా బిస్మిత చర్మం ఉంటుంది. ఎన్ని అవమానాలు ఎదురైనా.. చదువును మాత్రం వదల లేదు. అలా ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. అయితే బిస్మిత చిన్నప్పుడు స్కూల్లో జరిగే పాటల పోటీల్లో ఎప్పుడూ ఆమెనే విజేత. అందరూ ఆమె గొంతు బాగుంటుందని ప్రశంసించేవారు. దీంతో తానే సొంతంగా వీడియోలు తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది బిస్మితకి. అందుకు అమ్మ కూడా ఒప్పుకోవడంతో 2019లో టిక్టాక్ వీడియోలు చేయడం ప్రారంభించింది. అయితే వాటికి ప్రశంసలు కన్నా విమర్శలే ఎక్కువగా వచ్చేవని బాధగా చెబుతోంది బిస్మిత. అస్సలు నీ ముఖం అద్దంలో చూసుకున్నావా..నువ్వు దెయ్యానివా లేక మచ్చల జింకవా.. అంటూ కామెంట్లు పెట్టేవారు. ఇది జన్యుపరమైన సమస్య కదా!..దీన్నే ఇంతలా పట్టించుకుంటున్నారేంటీ అని బాధగా ఉండేది బిస్మతకి. అయినా సరే వీడియోలు తీయడం ఆపలేదు. అనుకోకుండా టిక్టాక్ని మనదేశంలో బ్యాన్ చేయడంతో ఇన్స్టాలో రీల్స్ పోస్ట్ చేసేది. వాటిని కూడా అసభ్య పదజాలంతో ట్రోలింగ్ చేసేవారు. అయినా సరే వెనకడుగు వేయడకుదని గట్టిగా నిశ్చయించుకుంది బిస్మిత. అయితే ఇన్స్టాలో బిస్మిత వీడియో చూసి.. ఓ ఫొటోగ్రాఫర్ మేకోవర్ పేరుతో ఫొటో షూట్ చేస్తానని అడిగాడు. ఆ షూట్లో నవ వధువులా బిస్మిత మేకప్తో ఉంటుంది. అందమైన వధువుగా బిస్మిత మారిన వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు ఒక్క రోజులోనే లక్షల వ్యూస్ వచ్చాయి. దీంతో ‘బిస్మి వ్లాగ్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది బిస్మిత. మచ్చలున్న అమ్మాయిని పెళ్లాడటానికి ఎవరు ముందుకొస్తారని బంధువులంతా అన్నారు. కానీ ఆటో డ్రైవర్ సాను తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. ఆయన సపోర్ట్ ఎంతో ఉందంటోంది బిస్మిత. ఈ రీల్స్లో తనలాంటి వాళ్లు ఎదుర్కొనే సమస్యలను, రోజువారీ విషయాలను షేర్ చేస్తుంది బిస్మిత. ఆ దంపతులకు ఒక కొడుకు కూడా. అయితే అతడికి కూడా ఇలాంటి జన్యు సమస్యే వచ్చింది. తన కొడుకు అయినా ఈ సమస్య నుంచి బయటపడాలని ఆమె భర్త ఎన్నో ఆస్పత్రులు తిప్పాడు కానీ ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో ప్రస్తుతం బాబుకి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతోంది బిస్మిత. ఈ విషయాన్నే వీడియోలో చూపిస్తుంటే..దీనికి కూడా ఆమెను విమర్శించడం బాధకరం. కొడుకు అలా ఉన్నా కూడా.. వీడియోలు చేస్తున్నావు..నీ బతుకు ఇంతేనా అని తిడుతూ కామెంట్లు పెడుతున్నారని బాధగా చెప్పింది బిస్మిత. అయితే తాను వాటిని పట్టించుకోను ఇంకా అలాంటివే చేస్తాను..నా కొడుకికి ఎలా ధైర్యంగా ఉండాలో చెప్పేందుకైనా ఆపాను అని స్టైర్యంగా చెబుతోంది బిస్మిత.నిజంగా బిస్మిత చాలా గ్రేట్ కదూ..! జస్ట్ ఎవ్వరైనా చిన్నగా.. ఏదైనా అన్నా.. తట్టుకోలేం, ఈజీగా తీసుకోలేం. అలాంటిది ఆమె తన రూపం అలా ఉన్నా ధైర్యంగా కెమెరా ముందుకు రావడమే గాక తనలాంటి వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. నిజంగా బిస్మిత తనలాంటి వాళ్లకే కాదు..ట్రోలింగ్కి గురయ్యి బాధపడుతున్నవారికి కూడా ఈమె స్ఫూర్తి.(చదవండి: ఫిడే చెస్ రేటింగ్ పొందిన అతిపిన్న వయస్కురాలు! దటీజ్ జియానా గర్గ్..!)
జిమ్లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగ..పాపం..! ఇలా వర్క్ట్లు..
ఓ దొంగ జిమ్లో చోరీ చేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. ఏదో పట్టుకుపోదామనుకుని వచ్చి ఇలా దొరికిపోతానని ఊహించని దొంగను యజమాని ఏం చేశాడో వింటే షాకవ్వుతారు. పట్టుబడిన ఆ దొంగకు జిమ్ యజమాని ఎవ్వరూ ఊహించని ఓ శిక్ష వేసి మరీ పోలీసులకు అప్పగించాడు. ఇంతకీ ఆ జిమ్ యజమాని ఏం చేశాడంటే..ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో చోటు చేసుకుంది. ఓ దొంగ జిమ్ సెంటర్లోకి వెళ్లి చోరీ చేయాలని అనుకున్నాడు. అక్కడ ఉన్న షట్టర్ని ఏదో విధంగా ఓపెన్ చేసి లోపలకి వెళ్లి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో ఇంట్లో ఉన్న జిమ్ యజమానికి అర్థరాత్రి హఠాత్తుగా మెలుకువ వచ్చి ఫోన్ చెక్ చేసుకుంటాడు. జిమ్ సెంటర్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా..అక్కడ ఓ దొంగ పచార్లు కొడుతున్నట్లు కనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా జిమ్కి వెళ్లి ఆ దొంగను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు యజమాని. దీంతో భయాందోళనకు గురైన దొంగ ఏం చేయాలో తోచక బిత్తరచూపులు చూశాడు. అయితే ఆ జిమ యజమాని దొంగని ట్రెడ్మిల్పై పరిగెత్తమంటూ శిక్ష విధించి మరీ పోలీసులకు అప్పగించాడు. పాపం దొంగలించడానికి వచ్చి ఇలా వర్క్ట్లు చేసి మరీ జైలుకి వెళ్తానని ఊహించి ఉండడు కదా..!. ఇలాంటి ఫన్నీ ఘటనే గతవారం ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగింది. ఓ దొంగ దొంగతనం చేయడానికి చవ్చి ఏసీ ఆన్ చేసుకుని మరీ నేలపై ప్రశాంతగా నిద్రపోయాడు. కళ్లు తెరిచి చూసేసరికి చుట్టూ పోలీసులు ఉండటంతో కంగుతిన్నాడు. అతడు మద్యం మత్తులో ఉండటంతో ఇలా నిద్రపోయాడని పోలీసులు చెప్పారు. (చదవండి: ద్రౌపది ముర్ము మోదీకి దహీ-చీనీని తినిపించడానికి రీజన్! ఏంటీ స్వీట్ ప్రాముఖ్యత)
హానికరమైన ఉపేక్ష!
కురుక్షేత్ర సంగ్రామం మొదలైన నాటి నుండి జరిగిన సంగతులను తాను చూసి వచ్చి తన ప్రభువైన ధృతరాష్ట్రుడికి వర్ణించి చెబుతుంటాడు సంజయుడు. భీష్మ, ద్రోణాచార్యుల సర్వసేనాధిపత్యంలో పదిహేను రోజుల యుద్ధం తరువాత, రెండు రోజులు కర్ణుడి నాయకత్వంలో యుద్ధం జరిగింది. ఆ రెండు రోజుల యుద్ధం చివరన అర్జునుడి చేతిలో కర్ణుడు, భీముడి చేతిలో దుశ్శాసనుడు నిహతులయ్యారు.ఆ సంగతులను వివరించిన సంజయుడు, కౌరవుల విజయానికి సంబంధించిన ఆశలు అడుగంటిపోయేలా దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం తాగి భీముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడని చెబుతాడు. అది విన్న ధృతరాష్ట్రుడు హతాశుడై, సంజయుడు అలా చెబుతున్నాడంటే దుర్యోధనుడు కూడా మరణించి ఉంటాడని ఊహించుకుని హాహాకారాలు చేస్తూ మూర్ఛపోతాడు.విదురుడి సహాయంతో, సంజయుడు సపర్యలు చేసిన అనంతరం మూర్ఛలోంచి తేరుకున్న ధృతరాష్ట్రుడు ‘నీవు మొదట చెప్పిన మాటలు నేను సరిగా వినలేదు. దుర్యోధనుడికి ఏ ప్రమాదము సంభవించ లేదు కదా!’ అంటాడు. ప్రపంచమంతా ఏమైపోయినా çఫరవాలేదు, దుర్యోధనుడు ఒక్కడు బ్రతికి ఉంటే చాలు అన్నట్లుగా ఉంటుంది ధృతరాష్ట్రుడి వైఖరి. ఈ వైఖరిని గట్టిగానే నిరసిస్తాడు సంజయుడు.కొడుకులంత రాజ్యంబును గొనగ శక్తులను దురాశను వారల యవినయములునీ వుపేక్షింతు; మానునే? యా విరుద్ధకర్మమున ఫలమొందక కౌరవేంద్ర!‘రాజ్యం మొత్తాన్నీ తామే కాజేయాలన్న దురాశతో నిండిన కాంక్షతో నీ కొడుకులు చేసే కానిపనులన్నిటినీ నీవు ఉపేక్షించి, చూస్తూ ఊరుకున్నావు. ఏనాటికైనా దాని ఫలితం అనుభవించాల్సిన సమయం రాకుండా ఉంటుందా? అదే ఇప్పుడు వచ్చింది చూడు!’ అని ధృతరాష్ట్రుడి మొహం మీదనే సంజయుడు అనడం ఆంధ్ర మహాభారతం, కర్ణపర్వంలోని పై తేటగీతి పద్యంలో కనబడుతుంది.ఈ మాటలు అనిపించుకుని కూడా ‘అది సరేలే, ఇంతకీ దుర్యోధనుడు క్షేమంగానే ఉన్నాడు కదా?!’ అంటాడు ధృతరాష్ట్రుడు. కళ్ళెదురుగా వినాశనానికి సంబంధించిన ఛాయలు కనపడుతున్నా చూడడానికి ఇచ్చగించని స్వార్థపూరిత ఉపేక్ష ధృతరాష్ట్రుడిది! ధృతరాష్ట్రుడి అంగవైకల్యం దృష్టి లేకపోవడం కాదు. దానిని అడ్డం పెట్టుకుని అతడు ప్రదర్శిస్తూ వచ్చిన ఉపేక్షయే! చెడు జరగకుండా ఆపగలిగే అధికారం చేతిలో ఉంచుకుని కూడా ఉపేక్షించడం ఊహించనంత వినాశనానికి దారితీస్తుందని ఇది తెలుపుతుంది. – భట్టు వెంకటరావుఇవి చదవండి: ఉద్యమ వాస్తవ చరిత్ర..
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రధానమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ... నేడు ఎన్డీఏ ఎంపీల సమావేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవ ఎన్నిక.. శనివారం లేదా ఆదివారం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించిన ఎన్డీయే.. బీజేపీకి కూటమికి 292 స్థానాలు, ఇండియా కూటమికి 234 స్థానాలు.. 240 సీట్లకే పరిమితమైన బీజేపీ, మెజారిటీ కంటే 32 స్థానాలు తక్కువ.. 99కి పెరిగిన కాంగ్రెస్ బలం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా ఈరోజే వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి, రీప్లేస్మెంట్ మనమే.. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
మళ్లీ విజయం మనదే, ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం... ‘ఎక్స్’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు కేరళకు నైరుతి రుతుపవనాల రాక.. రెండు రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
మావోయిస్టుల ఏరివేతకు ‘జల్శక్తి’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులకు పట్టు ఉన్నట్లు చెప్పుకునే బస్తర్ అడవుల్లో ఎండాకాలంలో సహజంగానే పోలీసు బలగాలది పైచేయి అవుతోంది. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లలో వంద మందికి పైగా మావోయిస్టులు హతమవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అయితే, వానాకాలానికి వచ్చేసరికి అడవులు చిక్కబడటం.. వాగులు, వంకలు ఉప్పొంగడంతో పోలీసుల కూంబింగ్కు అవాంతరాలు ఎదురవుతున్నాయి.ఈ నేపథ్యంలో వానాకాలంలోనూ బస్తర్ అడవుల్లో మావోయిస్టుల నుంచి ఎదురయ్యే దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భద్రతా దళాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా అడవుల్లోకి సులభంగా చొచ్చుకెళ్లేందుకు వీలుగా గతంలో ఎన్నడూ లేనివిధంగా రోప్ వేను అందుబాటులోకి తెచ్చాయి. బేస్ క్యాంపుల ఏర్పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు సరిహద్దుగా ఉన్న ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పామేడు, ధర్మారం, కవరుగట్ట, కొండపల్లి, బట్టిగూడెం, బాసగూడ ప్రాంతాలు మావోయిస్టులకు అడ్డాలుగా ఉన్నాయి. అతికష్టంపై భద్రతా దళాలు చింతవాగుకు ఇరువైపులా ఉన్న పామేడు, ధర్మారంలో బేస్క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఈ ఏడాది జనవరి 16న రాత్రి 600 మందికి పైగా మావోయిస్టులు ఈ రెండు క్యాంపులను చుట్టుముట్టి భీకరంగా దాడి చేశారు.సుమారు మూడు గంటల పాటు సాగిన దాడిలో ఆరు వందలకు పైగా గ్రనేడ్లు విసిరారు. ఈ దాడిలో భద్రతా దళాలకు చెందిన నలభై మందికి తీవ్రగాయాలైనట్టు సమాచారం. అప్పటికే చింతవాగుపై వంతెన నిర్మాణ పనులు మొదలుపెట్టినా సకాలంలో పూర్తి కాలేదు. దీంతో ఏటా వానాకాలంలో మూడు నెలల పాటు ఉప్పొంగే చింతవాగు భద్రతా దళాలకు ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా భద్రతా దళాలు వంతెనకు ప్రత్యామ్నాయంగా యుద్ధప్రాతిపదికన రోప్వేను నిర్మించాయి. ఈ రోప్వే ద్వారా రెండు క్యాంపుల మధ్య రాకపోకలకు ఆటంకాలు ఉండవని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఆపరేషన్ జల్శక్తి వేసవిలో మావోయిస్టు ప్రభావిత అడవుల్లోకి చొచ్చుకెళ్లిన భద్రతా దళాలు అక్కడ క్యాంపులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇలాంటి క్యాంపులకు వానాకాలంలో భద్రత కరువైపోతోంది. భద్రతా దళాల రక్షణ వ్యవస్థను చీల్చుకుంటూ క్యాంపుల మీద మావోయిస్టులు దాడులు చేస్తున్నారు. దీంతో వానాకాలంలో కూడా బస్తర్ అడవులపై పట్టు సాధించేందుకు భద్రతా దళాలు ఆపరేషన్ జల్శక్తి పేరుతో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. వరదలు ఎదుర్కొని, దట్టమైన అడవుల్లో కూంబింగ్ నిర్వహించడంపై భద్రతా దళాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే రాకపోకలకు వీలుగా వంతెనలు, రోప్వేల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి.120 మంది హతంకేంద్రం చేపట్టిన మావోయిస్టుల ఏరివేత ఇప్పుడు తుదిదశ (ఆపరేషన్ కగార్ – ది ఫైనల్ మిషన్)కు చేరింది. బస్తర్ అడవుల్లో ఏర్పాటైన వందలాది క్యాంపుల్లో 10 వేల మంది పారామిలిటరీ దళాలు పాగా వేశాయి. వేసవి ఆరంభంలో భద్ర తా దళాల దూకుడుకు కళ్లెం వేసేందుకు మావోయిస్టు పార్టీ టెక్నికల్ కౌంటర్–అఫెన్సివ్ క్యాంపెన్(టీసీ–ఓసీ) పేరుతో దాడులు మొదలెట్టింది. దీనికి ప్రతిగా భద్రతా దళాలు ఆపరేషన్ సూర్యశక్తి పేరుతో ప్రతి వ్యూహాన్ని రూపొందించుకుని దాడులకు దిగాయి. అందువల్లే ఈ ఏడాది మావోయిస్టు పార్టీ నుంచి భద్రతా దళాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఇదే క్రమంలో భద్రతా దళాలు జరిపిన దాడులు, ఎన్కౌంటర్లలో 120 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. ఇక ఇప్పుడు జల్శక్తి పేరుతో వానాకాలంలోనూ దూకుడు పెంచేందుకు భద్రతా దళాలు సిద్ధమవుతున్నాయి.
బాలీవుడ్ కాలింగ్
ప్రతి ఏడాది బాలీవుడ్ తారలు కొంతమంది టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటారు. అలాగే దక్షిణాది హీరోయిన్లు కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటారు. ఈ ఏడాది కొందరు సౌత్ హీరోయిన్లను బాలీవుడ్ పిలిచింది. బాలీవుడ్ నుంచి కాల్ అందుకుని, ప్రస్తుతం అక్కడ సినిమాలు చేస్తున్న దక్షిణాది కథానాయికల గురించి తెలుసుకుందాం. కెరీర్లో యాభైకి పైగా సినిమాల్లో నటించి, దక్షిణాదిన స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయారు సమంత. హిందీలో ‘ఫ్యామిలీ మేన్’ సీజన్ 2 వెబ్ సిరీస్లో చేసిన రాజ్యలక్ష్మి పాత్రతో ఉత్తరాదిన కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇదే జోష్లో ఇండియన్ వెర్షన్ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ను కూడా పూర్తి చేశారామె. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ హిందీ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది.ఇలా హిందీలో రెండు వెబ్ సిరీస్లు చేసిన సమంత ఇంకా అక్కడ ఒక్క సినిమా కూడా చేయలేదు. గతంలో రణ్వీర్ సింగ్, విక్కీ కౌశల్, రాజ్కుమార్ రావుల సినిమాల్లో సమంత హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగింది. కానీ అప్పట్లో ఆమె అనారోగ్య పరిస్థితుల కారణంగా కుదర్లేదట. ఇప్పుడు ఆ సమయం వచ్చిందట. ఓ హిందీ చిత్రం కోసం సమంత ఇటీవల కథ విన్నారని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. సో... హిందీలో సమంత నటించే తొలి చిత్రంపై స్పష్టత రావడానికి కొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.కాస్త ఆలస్యంగా... దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో కీర్తీ సురేష్ ఒకరు. నటిగా సౌత్లో తన సత్తా ఏంటో సిల్వర్ స్క్రీన్పై చూపించిన కీర్తీ సురేష్ బాలీవుడ్లోనూ టాప్ హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నట్లున్నారు. ఈ క్రమంలోనే హిందీ చిత్రం ‘బేబీ జాన్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించారు. హిందీలో కీర్తీకి ఇది తొలి చిత్రం కాగా ఈ చిత్రదర్శకుడు కాలీస్ (తమిళ డైరెక్టర్)కు కూడా హిందీలో ఇదే తొలి చిత్రం. తమిళంలో అట్లీ దర్శకత్వం వహించిన ‘తేరీ’ సినిమాకు హిందీ రీమేక్గా ‘బేబీ జాన్’ తెరకెక్కింది.జ్యోతిదేశ్ పాండే, మురాద్ ఖేతనీ, అట్లీ, ప్రియా అట్లీ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను మే 31న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. కొత్త తేదీ పై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే కీర్తీ సురేష్, రాధికా ఆప్టే లీడ్ రోల్స్లో హిందీలో ఓ యాక్షన్ వెబ్ సిరీస్ కూడా రూపొందుతోంది. ఇదిలా ఉంటే... ‘బేబీ జాన్’ చిత్రానికన్నా ముందే కీర్తీకి బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘మైదాన్’లో ముందు హీరో యిన్గా కీర్తీ సురేష్ను తీసుకున్నారు ఈ చిత్రదర్శకుడు అమిత్ శర్మ. కానీ ఆ తర్వాత కీర్తీ సురేష్ ఈ ్రపాజెక్ట్ నుంచి తప్పుకోగా, ప్రియమణి నటించారు. ‘మైదాన్’ ఈ ఏడాది ఏప్రిల్ 10న రిలీజైంది. ఇలా కీర్తీ సురేష్ బాలీవుడ్ ఎంట్రీ కాస్త ఆలస్యమైంది. ఏక్ దిన్ హీరోయిన్ సాయి పల్లవికి సౌత్లో మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ను బాలీవుడ్లోనూ రిపీట్ చేయాలనుకుంటున్నారీ బ్యూటీ. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటించిన చిత్రం ‘ఏక్ దిన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో నటించారు సాయి పల్లవి. హిందీలో సాయి పల్లవి నటించిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమా మేజర్ షూటింగ్ జపాన్లో జరిగింది. ఆమిర్ ఖాన్ ఓ నిర్మాతగా ఉన్న ఈ ‘ఏక్ దిన్’ సినిమా చిత్రీకరణ పూర్తయింది.ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట ఆమిర్ ఖాన్. మరోవైపు మరో హిందీ చిత్రం ‘రామాయణ్’లో సాయి పల్లవి నటిస్తున్నారు. రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. సీతారాములుగా సాయి పల్లవి, రణ్బీర్ నటిస్తున్న ఈ భారీ చిత్రానికి నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. యశ్, నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2025 చివర్లో ఈ సినిమా తొలి భాగాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని బాలీవుడ్ టాక్. కబురొచ్చింది ప్రస్తుతం తెలుగులో ట్రెండింగ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. నటన పరంగా ఈ బ్యూటీకి ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. అందువల్లే రవితేజ ‘ధమాకా’, మహేశ్బాబు ‘గుంటూరు కారం’ వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించగలిగారు. తాజాగా శ్రీలీలకు బాలీవుడ్ నుంచి కబురొచ్చిందని టాక్. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం ఆలీఖాన్ హీరోగా ‘దిలేర్’ అనే సినిమా రూపొందుతోంది. కృణాల్ దేశ్ముఖ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్లో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉందట. ఓ హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ శ్రీలీలను సంప్రదించారని సమాచారం. కథ నచ్చడంతో శ్రీలీల కూడా ఓకే చెప్పారని వినికిడి. అదే నిజమైతే శ్రీలీలకు ఇదే తొలి హిందీ చిత్రం అవుతుంది. కేరాఫ్ మహారాజ్ఞి ‘బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్’ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించారు సంయుక్తా మీనన్. అలాగే మలయాళ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ హీరోయిన్గా నటించి పాపులర్ అయ్యారామె. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకీ రెడీ అయ్యారు. కానీ హీరోయిన్గా కాదు... ఓ లీడ్ రోల్లో... కాజోల్, ప్రభుదేవా లీడ్ రోల్స్లో ‘మహారాజ్ఞి: క్వీన్ ఆఫ్ క్వీన్స్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చరణ్తేజ్ ఉప్పలపాటి ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి దర్శకుడు.ఈ సినిమాలో సంయుక్తా మీనన్ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కాజోల్కు చెల్లి పాత్రలో కనిపిస్తారట సంయుక్త. నసీరుద్దీన్ షా, ఆదిత్య సీల్, చాయా కదమ్ వంటివారు ఈ సినిమాలోని ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. వెంకట అనీష్, హర్మాన్ బవేజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దక్షిణాది కథానాయికల జాబితాలో మరికొంతమంది ఉన్నారు.
మహిళ దారుణ హత్య
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలంలోని బైరవునిపల్లిలో శుక్రవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కొన్నాళ్లుగా వేధిస్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడగా ఆయన కూడా కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించి వివరాలు... బైరవునిపల్లి గ్రామానికి చెందిన కోళ్ల సైదమ్మ(47)తో ఆమె భర్త దూరంగా ఉంటుండగా, సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓప్రైవేట్ పాఠశాల హాస్టల్లో వార్డెన్గా పనిచేస్తోంది. ప్రస్తుతం సెలవులు కావడంతో స్వగ్రామమైన బైరవునిపల్లి వచ్చింది. అదే గ్రామానికి చెందిన సొంటి శ్రీను తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఆమెను కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికి వెళ్లి కొట్టినట్లు తెలిసింది. ఈనేపథ్యాన శుక్రవారం కూడా సైదమ్మ ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకున్న శ్రీను వెళ్లి గొడవకు దిగాడు. ఆమె తనను నిరాకరించిందన్న కోపంతో ముందుగానే సిద్ధం చేసుకున్న కత్తితో మూడు చోట్ల బలంగా పొడిచాడు. ఆపై చేతులను కత్తితో ఇష్టానుసారంగా కోశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైదమ్మ రక్తపు మడుగులో పడి పోయింది. దీంతో స్థానికులు ఆమెను నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా శ్రీను సైతం అదే కత్తితో పొడుచుకోగా పేగులు బయటకు రావడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఆయనను ఖమ్మం తరలించగా పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉండగా, సెలవుల్లో ఇంటికి రాకుండా కోదాడలో ఉన్నా బతికేదని వారు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.భారీ బందోబస్తుహత్య జరగడంతో బైరవునిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. సైదమ్మ కుటుంబ సభ్యులు, బంధువులు హత్య చేసిన శ్రీను కోసం గ్రామంలో గాలించారు. కానీ ఆయన సైతం ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుసుకున్న వారు ఆగ్రహంతో ఉండగా.. ఎలాంటి ఘటనలు జరగకుండా ఖమ్మం రూరల్ సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యాన నేలకొండపల్లి, ముదిగొండ ఎస్సైలు తోట నాగరాజు, నరేష్, సిబ్బందితో పహారా ఏర్పాటు చేశారు. ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అనుమానంతో భార్యను హత్యచేసిన భర్త
చినగంజాం: భార్యను అనుమానించిన ఓ భర్త.. ఆమెను కత్తితో మెడపై నరికి చంపిన సం«ఘటన బాపట్ల జిల్లా చినగంజాం పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చినగంజాం పంచాయతీ మహాలక్ష్మీకాలనీకి చెందిన కత్తి దుర్గ (30)ను భర్త కత్తి శ్రీను దారుణంగా కత్తితో దాడి చేసి మెడపై నరికి చంపాడు. వీరికి 15 సంవత్సరాల కిందట వివాహమైంది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కొంత కాలంగా మహాలక్ష్మీకాలనీలో కాపురం ఉంటున్నారు. భార్య దుర్గ కొద్ది రోజులుగా తరచూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుందనే అనుమానంతో గొడవలు జరుగుతున్నాయి. భర్త వేధింపులు తట్టుకోలేని భార్య దుర్గ.. అదే కాలనీలో నివాసం ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు నెల రోజుల కిందట తన తొమ్మిదేళ్ల రెండో కుమార్తెను వెంట తీసుకుని వెళ్లిపోయింది. ఈ క్రమంలో శుక్రవారం భర్త కత్తి శ్రీను తన అత్తమామలు ఇంట్లో లేనివేళ వెళ్లి భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరూ వాదులాడుకుంటుండగా, ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం కత్తితో ఆమె మెడపై నరికి దారుణంగా హత్య చేశాడు. ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కుమార్తె పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లి స్థానికులకు సమాచారం అందించింది. సంఘటన స్థలానికి వెళ్లిన స్థానికులు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు చేరుకునే సరికే దుర్గ మృతి చెంది ఉంది. ఆమె భర్త శ్రీను పరారీలో ఉన్నాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ, ఎస్ఐ... సంఘటన స్థలాన్ని ఇంకొల్లు సీఐ బీ శ్రీనివాసరావు, చినగంజాం ఎస్ఐ ఎం.శ్రీనివాసరావు పరిశీలించి శవ పంచనామా నిర్వహించారు. దుర్గ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు కత్తి శ్రీనును పట్టుకుంటామని చెప్పారు.మేం ఇంట్లో లేని సమయంలో మా కుమార్తెను చంపాడు... తాము ఇంట్లో లేకుండా వేటకు వెళ్లిన సమయంలో వచ్చిన తమ అల్లుడు శ్రీను తమ కుమార్డె దుర్గను కత్తితో దారుణంగా నరికి చంపాడని దుర్గ తల్లిదండ్రులు ఎం.అంజయ్య, రాగమ్మ పోలీసులకు తెలిపారు. పెళ్లయిన దగ్గర నుంచి తమ కుమార్తెను తరచూ వేధింపులకు గురిచేసేవాడని చెప్పారు. ఆమెకు ముగ్గురు బిడ్డలున్నారని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులను వారు కోరారు.