Top Stories
ప్రధాన వార్తలు
టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, అన్నమయ్య జిల్లా: టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హామీలన్నీ మోసమేనని బీజేపీ వైఖరితో అర్థమైందన్నారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో తమ ఫోటో వద్దని బీజేపీ గట్టిగా చెప్పిందని పేర్కొన్నారు. బాబు డిక్లేర్ చేసిన మేనిఫెస్టోలో మోదీ ఫోటో పెట్టొద్దని బీజేపీ తేల్చేసిందన్నారు. ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు.అవ్వాతాతలకు ఇంటివద్దకే అందే పెన్షన్ను ఆపిన దుర్మార్గుడు చంద్రబాబని ధ్వజమెత్తారు. మీ బిడ్డకు(జగన్) మంచి పేరు వస్తుందనే బాబు పెన్షన్లను అడ్డుకున్నాడని మండిపడ్డారు. తన మనిషిని నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పనెన్షన్ను అడ్డుకున్నాడని.. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో తన కుట్రలను మనపై నెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పూర్తి ప్రసంగంఈ ఎన్నికలు.. రాబోయే అయిదేళ్ల భవిష్యత్.జగన్కు ఓటేస్తే..పథకాలు కొనసాగింపు.చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ముగింపే.పొరపాటున బాబుకు ఓటేస్తే..పసుపుపతి నిద్రలేస్తాడు.వదల బొమ్మాళి అంటూ పేదల రక్తం తాగుతాడు..బాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే.2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా?.రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?రూ. 87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పెట్టుబడి సాయం కింద బాబు ఏనాడు ఒక్క రూపాయి ఇవ్వలేదు.బాబు ఏనాడైనా రైతుభరోసా కింద ఒక్క రూపాయి అయినా ఇచ్చాడా.14 ఏళ్లలో బాబు ఏనాడు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు.డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నాడు..చేశాడా?.రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?అక్కాచెల్లెమ్మలను మోసం చేసి రోడ్డుపై నిలబెట్టాడుఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?గర్భిణీ స్త్రీలకు రూ. 10 వేలు ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?గ్యాస్ సిలిండర్పై రూ. 100 సబ్సిడీ ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు.. విడిపించాడా?ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానన్నాడు.. చేశాడా?మీ బిడ్డ జగన్ రైతన్నకు అండగా నిలబడ్డాడు.పెట్టుబడి సాయం కింద మీ బిడ్డ ప్రతియేటా రూ. 13, 500 ఇచ్చాడు.జగన్కు, చంద్రబాబుకు ఉన్న తేడా గమనించండని కోరుతున్నా.అక్కా చెల్లెమ్మలకు మీ బిడ్డ జగన్ తోడుగా ఉన్నాడుఅక్కాచెల్లెమ్మల కోసం మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేర్చా.అక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నా వడ్డీ, చేయూతతో ఆదుకున్నాం.అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఆబీసీ నేస్తం తీసుకొచ్చా.31 లక్షల ఇళ్లపట్టాలు అక్కా చెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్.ఇంటి వద్దకే అవ్వాతాతలకు పెన్షన్ అందిస్తున్నాం.పెన్షన్ రూ. 3 వేల నుంచి రూ, ,500లకు పెంచుకుంటూ పోతాం.14 ఏళ్లలో చంద్రబాబు ఏనాడైనా పెన్షనర్లను పట్టించుకున్నాడా? చంద్రబాబు మోసాలను ఓడించడానికి మీరంతా సిద్ధమేనా.రైతుభరోసాగా ఏడాదికి రూ.16 వేలు.. ఐదేళ్లకు రూ.80 వేలు ఇస్తాడు మీ జగన్.చంద్రబాబు వల్ల రాష్ట్రంలోని మహిళలందరికీ కొన్ని రూ.వేల కోట్ల నష్టం జరిగింది. పిల్లలను బడులకు పంపే తల్లులకు ఇచ్చే అమ్మఒడిని రూ.17 వేలుకు పెంచాం.
టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు
కరీబియన్ దీవులు, యూఎస్ఏ వేదికలుగా జూన్ 1 నుంచి జరుగబోయే టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత జట్టును ఇవాళ (ఏప్రిల్ 30) ప్రకటించారు. ముందుగా చెప్పినట్లుగానే ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా.. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకోగా.. స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్పై వేటు పడింది. చాలాకాలం తర్వాత చహల్ టీ20 జట్టులోకి రాగా.. సిరాజ్, అర్ష్దీప్ తమ స్థానాలు నిలుపుకున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సెంచరీ మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయని యశస్వి జైస్వాల్పై సెలెక్టర్లు విశ్వాసముంచగా.. వరల్డ్కప్ బెర్త్పై గంపెడాశలు పెట్టుకున్న రింకూ సింగ్ ట్రావెలింగ్ రిజర్వ్గా ఎంపియ్యాడు. శుభ్మన్ గిల్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ కూడా ట్రావెలింగ్ రిజర్వ్గా ఎంపియ్యారు.టీ20 వరల్డ్కప్ కోసం టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాట్రావెలింగ్ రిజర్వ్: శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్
వీడని తీరుగా.. ఈ మాటల్లో గురు-శిష్యుల బంధం..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూని గమనించారా? అందులో ఆయన ఒక అంశానికి ఇచ్చిన సమాధానం చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విధేయుడుగానే కొనసాగుతున్నట్లు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, రేవంత్ మనసు మాత్రం చంద్రబాబుపైనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని కనిపెట్టారు. ఓకే. ఏదో కాంగ్రెస్ పార్టీ నేత కనుక, ఆ పార్టీతో వైఎస్సార్సీపీకి సంబంధం లేదు కనుక అలా మాట్లాడారులే అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఆశ్చర్యంగా బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇచ్చేలా చంద్రబాబుకు అనుకూలంగా అభిప్రాయాలు చెప్పడం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది.తెలుగుదేశం పార్టీని ఏపీలో భుజాన వేసుకుని మోస్తున్న ఒక పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఒక ప్రశ్న ఏమిటంటే?, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నట్లు తమకు సమాచారం అందిందని కేసీఆర్, కేటీఆర్ అంటున్నారు.. ఇదేమైనా రాజకీయ వ్యూహమా? ఆ వ్యాఖ్య ప్రభావం తెలంగాణలో పడే అవకాశం ఉందా అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడిగారు. దానికి రేవంత్ ఏమి సమాధానం ఇచ్చారంటే.. చంద్రబాబునాయుడుపై ఉండే అసూయ, ద్వేషం.. అంతకంటే ఏమి ఉంటుంది? కేసీఆర్కు ఏదో ఓ బాధ, దుఃఖం. కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య అవగాహన ముందు నుంచి ఉన్నదే. చంద్రబాబు అరెస్టును కూడా సమర్దించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఒక జట్టుగా వ్యవహరిస్తున్నారు.. అని రేవంత్ బదులు ఇచ్చారు. ఈ జవాబు ద్వారా తాను, బీజేపీ కూటమిలో ఉన్న చంద్రబాబు ఒక జట్టు అని రేవంత్ చెప్పకనే చెప్పేశారు.మరో ప్రశ్న ఏమిటంటే ఏపీ ఎన్నికల ఫలితాలపై మీ అంచనా అని అడిగారు..!?'ఎక్కడైనా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉంది. వాళ్లు చెప్పిన మాట నిలబెట్టుకోనందువల్ల ప్రతికూల వాతావారణం ఉంది. మేం షర్మిల నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్ ఇన్నింగ్స్ ప్రారంభించాం. ఎన్ని సీట్లు గెలిపించుకోగలం? షర్మిల ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలపై ఎలా కొట్లాడుతున్నారు? ఆమెను ఎలా మద్దతుగా నిలబడాలి? అనేదే నా ప్రణాళిక. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనేదే మా రాజకీయ ప్రణాళిక. ఈసారి అక్కడ అన్ని సీట్లలో పోటీ దిగాం. మా దృష్టంతా కాంగ్రెస్కు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికే'..."రేవంత్ సమాధానాలు చూస్తే ఏమనిపిస్తుంది! చంద్రబాబుపైన కేసీఆర్ కోపం ద్వేషం ఉన్నాయట. అదే నిజమైతే ఓటుకు నోటు కేసులో ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు పేరు కూడా కేసీఆర్ ప్రభుత్వం చేర్పించి ఉండేది కదా! ఆ కేసులో రేవంత్ నేరుగా దొరికిపోతే, చంద్రబాబు మొత్తం కథకు సూత్రధారి. ఏ కేసులో అయినా కుట్రదారులను పట్టుకోకుండా ఉంటారా? కేసు పెట్టకుండా ఉంటారా? ఇక కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక జట్టు అని రేవంత్ తేల్చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నడైనా తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టారా? నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక తెలంగాణ రాజకీయాలలో కూడా తన పాత్ర పోషించడం ఆరంభిస్తే ఏ మేరకు ప్రభావం ఉంటుందో రేవంత్ ఊహించుకోలేని అమాయకుడు కాదు.చంద్రబాబు అరెస్టును కేసీఆర్ సమర్ధించారట. అప్పట్లో కేసీఆర్ ఆ ఉదంతంపై ఎక్కడా స్పందించలేదు. పైగా కేటీఆర్ కూడా చంద్రబాబు అరెస్టుపై సానుభూతి వ్యాఖ్యలే చేశారు. మరో మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఏకంగా ఖండించారు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే చంద్రబాబు అవినీతి కేసులో ఉన్నా అరెస్టు చేయకూడదని రేవంత్ చెబుతున్నారా? అలాంటప్పుడు కేసీఆర్ పై నిత్యం అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయనతో పాటు, కేటీఆర్, హరీష్ రావులను కూడా జైలుకు పంపుతామని ఎలా అంటున్నారు. అంటే చంద్రబాబు తప్ప ఇంకెవరిపైన అయినా కేసులు పెట్టవచ్చని రేవంత్ చెబుతున్నారా. చంద్రబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని రేవంత్ వదులుకోలేకపోతున్నారని అనుకోవాలి.చంద్రబాబు పరోక్షంగా కాంగ్రెస్కు సహకరించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆయన నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయినా ఆయన కోసం సానుభూతి వచనాలు పలకడం ద్వారా రేవంత్ తన గురు, శిష్య సంబంధాన్ని వదలుకోలేకపోతున్నారని చెప్పాలి. తెలంగాణలో బీజేపీపై ఘాటైన విమర్శలు చేస్తున్న రేవంత్ ఏపీలో ఎందుకు మాట్లాడలేదు. బీజేపీ ఊసే ఎత్తలేదు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశంకు ఓటు వేయవద్దని అనలేదు. కాంగ్రెస్ గురించి ఏదో మొహమాటానికి మాట్లాడినట్లు అనిపించింది. పైగా ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉందని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత గురించి నేరుగా అనకపోయినా, ఆయన ఉద్దేశం అర్థం అవుతూనే ఉంది.విశేషం ఏమిటంటే చంద్రబాబు నాయుడు అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్ తోను ఏకకాలంలో జట్టుకట్టి రాజకీయం చేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించడంలోను, ఆ తర్వాత ఆమె చేస్తున్న ప్రకటనలలోను చంద్రబాబు పాత్ర ఉందన్న సంగతి బహిరంగ రహస్యం. ఇందులో ఎవరిది తప్పు అంటే ఏమి చెబుతాం. కాంగ్రెస్ నేతలుగా ఉన్న రేవంత్, షర్మిలలు తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని భావిస్తున్నారు. అంతే తప్ప బీజేపీతో మద్దతు కట్టిన టీడీపీ అనుకోవడం లేదు. అందుకే తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు తరచుగా రేవంత్ పై ఒక ఆరోపణ చేస్తుంటారు. బీజేపీ అగ్రనేతలతో కూడా రేవంత్ సంబంధాలు పెట్టుకున్నారని, భవిష్యత్తులో ఈయన బీజేపీలోకి జంప్ చేయవచ్చని ప్రచారం చేస్తుంటారు. ఇందులో నిజం ఉండకపోవచ్చు. కానీ ఏపీ రాజకీయాలలో ఈయన అనుసరించిన ధోరణి గమనిస్తే మాత్రం ఈయనకు నిజంగా బీజేపీ సిద్దాంతం పైన, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీపైన వ్యతిరేకత లేదన్న భావన కలుగుతుంది.ఒకప్పుడు చంద్రబాబుతో తనకు సంబంధం లేదని పైకి అన్నప్పటికీ, అధికారం వచ్చాక రేవంత్ తన మనసులో మాట బయటపెట్టారని అనుకోవచ్చు. ఒక వైపు ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉందని చెబుతున్న ఆయన తన ప్రభుత్వం గురించి ప్రజలలో మంచి అభిప్రాయం ఉందని అంటున్నారు. పార్లమెంటు ఎన్నికలు తన పాలనకు రిఫరెండమ్ అని అంటున్నారు. రేవంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు గమనిస్తే, అచ్చం తన గురువు చంద్రబాబు మాదిరే చేస్తున్నట్లుగా ఉంది. ఆరు గ్యారంటీలలో ఐదు అమలు చేశామని అంటున్నారు. నిజంగా అలా చేసి ఉంటే గొప్ప విషయమే అవుతుంది. కానీ ఒక్కో గ్యారంటీలోని కొన్ని అంశాలను అమలు చేసి, మిగిలినవాటిని పక్కనబెట్టిన సంగతి ప్రజలు మర్చిపోతారని అనుకుంటున్నారు.ఉదాహరణకు ఆర్టీసీ బస్లలో మహిళల ఉచిత ప్రయాణం కల్పించిన మాట నిజమే. కానీ ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్న వాగ్దానం గురించి ఎందుకు చెప్పరు? గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలు ఎక్కడ అమలు అవుతున్నాయో ఎవరికి తెలియదు. పాతికవేల కోట్ల అప్పులు తీర్చామని చెప్పారు. బాగానే ఉంది. మరి 17వేల కోట్ల అప్పు ఎందుకు చేశారో వివరించాలి కదా? రైతు రుణమాఫీపై వాయిదాలు వేస్తూ ఆగస్టు పదిహేను అని అంటున్నారు. నిజంగా అప్పుడు చేస్తే గొప్ప విషయమే.కార్పొరేషన్ ఏర్పాటు చేసి, బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుంటామని అంటున్నారు. గతంలో చంద్రబాబు కూడా ఇలాంటి ప్రయత్నం చేయకపోలేదు. అప్పట్లో కేంద్రంలో ఉన్నది తన అనుకూల ప్రభుత్వమే అయినా, ఆయన ప్రతిపాదనకు రిజర్వు బ్యాంక్ ఒప్పుకోలేదు. ఇప్పుడు రేవంత్ ఎలా చేయగలుగుతారో చూడాలి. పలు ప్రాంతాలలో కరెంటు కోతలు ఇబ్బంది పెడుతున్నాయని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. పద్నాలుగు సీట్లు సాధిస్తామని అంటున్నారు. తన ప్రభుత్వంలో తప్పు చేయలేదని అంటున్నారు. మంచిదే. ప్రజలను నిరాశపరచలేదని, కనుక రిఫరెండంగా భావిస్తున్నామని రేవంత్ అన్నారు.ఇది పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ క్యాడర్లో ఒక విశ్వాసం నెలకొల్పడానికి చేసే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఒకవేళ రేవంత్ చెప్పినట్లు 14 సీట్లు సాధిస్తే కాంగ్రెస్లో తిరుగులేని నేత అవుతారు. అలాకాకపోతే ఆయన రిఫరెండమే ఆయనకు తలనొప్పిగా మారుతుంది. ఏది ఏమైనా ఏపీలో చంద్రబాబుకు మేలు చేకూర్చే పనిలో ఉన్న కాంగ్రెస్ నేతగా వ్యవహరిస్తారా? లేక బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీని వ్యతిరేకించి సిద్ధాంతానికి కట్టుబడి ఉండే నేతగా ఉంటారా! అన్నది ఆయనే తేల్చుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
లోక్సభ ఎన్నికల పోలింగ్ తరుణంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ హోమంత్రి రాంనివాస్ రావత్ బీజేపీలో చేరడం చర్చాంశనీయంగా మారింది.ఆరుసార్లు ఎమ్మెల్యేగామధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాంనివాస్ రావత్ రాహుల్గాంధీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో సుమారు వెయ్యి మంది మద్దతుదారులతో బీజేపీలో చేరారు. సీఎం మోహన్ యాదవ్, రాష్ట్ర పార్టీ చీఫ్ వీడీ శర్మ, మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. రావత్ విజయపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని ప్రముఖ కాంగ్రెస్ నాయకులలో ఒకరు.బీజేపీలోకి కమల్ నాథ్ సన్నిహితుడు కాగా,ఎన్నికలు ప్రకటించిన తర్వాత బీజేపీలో చేరిన రెండో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రావత్. మార్చి 29న మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్కు అత్యంత సన్నిహితుడు, అమర్వాడ ఎమ్మెల్యే కమలేష్ షా బీజేపీలో చేరారునామినేషన్ ఉపసంహరణ.. ఆపై బీజేపీలోకి జంప్మధ్యప్రదేశ్ ఇండోర్లో మే 13న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఏప్రిల్ 29న ఇండోర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి అక్షయ్ కాంతి బామ్ తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. కొన్ని గంటల్లోనే బీజేపీలో చేరారు. కాగా, బీజేపీ సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీపై కాంగ్రెస్ నేత అక్షయ్ కాంతి బామ్ను రంగంలోకి దించింది. అనూహ్యంత్ అక్షయ్ కాంతి బామ్ బీజేపీ చెంతకు చేరడం మధ్యప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది.
పుష్ప-2 ఫస్ట్ సింగిల్.. రిలీజ్ టైమ్ ఇదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. పుష్ప పార్ట్-1కు సీక్వెల్గా సుకుమార్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా పుష్ప-2 మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ను రిలీజ్ డేట్ అండ్ టైమ్ను ప్రకటించారు మేకర్స్.మే 1వ తేదీన ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేయన్నట్లు ప్రకటించారు. ఏకంగా ఆరు భాషల్లో ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ ప్రత్యేక పోస్టర్ను షేర్ చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేసింది.కాగా.. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎర్రచందన సిండికేట్ నేపథ్యంలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో పుష్ప-2పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. S̶e̶n̶s̶a̶t̶i̶o̶n̶a̶l̶ s̶u̶r̶p̶r̶i̶s̶e̶Sensational song ✅🔥🔥#Pushpa2FirstSingle out tomorrow at 5.04 PM in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam & Bengali.#PushpaPushpa chant all the way 💥💥A Rockstar @ThisIsDSP Musical 🎵#Pushpa2TheRule Grand release worldwide on… pic.twitter.com/3fuyv9GFlA— Mythri Movie Makers (@MythriOfficial) April 30, 2024
బాబు అలవికాని హామీలు.. మేనిఫెస్టోకు బీజేపీ దూరం
సాక్షి, విజయవాడ: చంద్రబాబు అలవికాని హామీలకు మేం బాధ్యులం కాదంటూ బీజేపీ తప్పించుకుంది. కూటమి మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉంది. మేనిఫెస్టోలో మోదీ, బీజేపీ ఫొటోలు వేయొద్దని ఆ పార్టీ అల్టిమేటం జారీ చేసింది.మోదీ, నడ్డా, అమిత్, పురేందేశ్వరి ఫొటోలు లేకుండా కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తామని ఇన్నాళ్లూ టీడీపీ చెప్పింది. మీడియాను మూడు పార్టీల మేనిఫెస్టో అంటూ పిలిచారు. బీజేపీ ఒప్పుకోకపోవడంతో చంద్రబాబు, పవన్ ఫొటోలతో మేనిఫెస్టో విడుదల చేశారు.మేనిఫెస్టో కాపీని ముట్టుకోవడానికి కూడా బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఒప్పుకోలేదు. కూటమి మేనిఫెస్టోకు టీడీపీ, జనసేనదే బాధ్యత అని చంద్రబాబు చెబుతున్నారు. 2014లో మేనిఫెస్టోలో చంద్రబాబు.. మోదీ ఫొటో పెట్టారు.. హామీలు అమలు కాకపోవడంతో మోదీకి చంద్రబాబు చెడ్డపేరు తెచ్చారని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ వద్దని గట్టిగా చెప్పడంతోనే మోదీ ఫొటో పెట్టేందుకు చంద్రబాబు సాహసించలేదు.తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీజేపీ అగ్రనేతలు స్పష్టంగా ముస్లిం రిజర్వేషన్లపై ప్రకటనలు చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్నారు. ఆ విషయంలో బీజేపీ, టిడిపి మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. అందుకే చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు బీజేపీ అధికారికంగా దూరం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు కేసు విచారిస్తున్న రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. సిసోడియాకు బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ,ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టులో వాదనలు వినిపించాయి. దీంతో కోర్టు సిసోడియాకు బెయిల్ నిరాకరించింది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాను సీబీఐ గతేడాది ఫిబ్రవరి26న అరెస్టు చేసింది. అప్పటి నుంచి సిసోడియా జైలులోనే ఉంటున్నారు. సీబీఐతో పాటు ఈడీ పెట్టిన కేసుల్లో సిసోడియా రెగ్యులర్ బెయిల్ కోర్టు డిస్మిస్ చేయడం ఇది రెండవసారి. గతేడాది సిసోడియా వేసిన బెయిల్ పిటిషన్లను ట్రయల్కోర్టుతో పాటు హైకోర్టు,సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే.
IPL 2024: కేకేఆర్ స్టార్ ప్లేయర్కు భారీ షాక్.. జరిమానాతో పాటు నిషేధం
కేకేఆర్ స్టార్ బౌలర్ హర్షిత్ రాణాకు భారీ షాక్ తగిలింది. నిన్న (ఏప్రిల్ 29) ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను అతని మ్యాచ్ ఫీజ్లో 100 శాతం కోత విధించబడింది. ప్రస్తుత సీజన్లో రాణా రెండోసారి కోడ్ ఉల్లంఘనకు పాల్పడటంతో అతనిపై ఓ మ్యాచ్ నిషేధం కూడా పడింది. ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు బ్యాటర్ అభిషేక్ పోరెల్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు రాణాపై కఠిన చర్యలు తీసుకున్నారు. అభిషేక్ ఔటైన తర్వాత రాణా శృతిమించిన సంబురాలు (అభిషేక్ను డగౌట్ వైపు వెళ్లాలని కోపంగా ఆదేశించాడు) చేసుకుని తగిన మూల్యం చెల్లించుకున్నాడు. రాణా కొద్ది రోజుల కిందట కూడా ఇలాగే ప్రవర్తించి జరిమానాను ఎదుర్కొన్నాడు. సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ను ఔట్ చేశాక ఓవరాక్షన్ (ఫ్లయింగ్ కిస్ ఇస్తూ కోపంగా చూశాడు) చేశాడు. అందుకు మ్యాచ్ ఫీజ్లో 60 శాతం జరిమానాను ఎదుర్కొన్నాడు. ఢిల్లీతో మ్యాచ్లో రాణా అతి చేసినా బౌలింగ్లో ఆట్టున్నాడు. 4 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో కేకేఆర్ ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగా.. కేకేఆర్ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, ఈ సీజన్లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఫిలిప్ సాల్ట్ (68) మెరుపు ఇన్నింగ్స్ ఆడి కేకేఆర్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు కేకేఆర్ బౌలర్లు చెలరేగడంతో ఢిల్లీ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. కుల్దీప్ యాదవ్ (35 నాటౌట్) ఆ జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా, వైభవ్ అరోరా తలో 2 వికెట్లు, స్టార్క్, నరైన్ చెరో వికెట్ పడగొట్టారు.
T20 WC SA Squad: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్
టీ20 ప్రపంచకప్-2024 కోసం సౌతాఫ్రికా తమ జట్టు ప్రకటించింది. మెగా టోర్నీ నేపథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం వెల్లడించింది. ఐసీసీ ఈవెంట్లో ఐడెన్ మార్క్రమ్ సారథ్యంలో తలపడే టీమ్లో అన్రిచ్ నోర్జే, క్వింటన్ డికాక్లకు చోటు ఇవ్వడం గమనార్హం.కాగా ఇటీవలే వీరిద్దరిని సౌతాఫ్రికా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బోర్డు తప్పించిన విషయం తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా పేసర్ ఆన్రిచ్ నోర్జే గతేడాది సెప్టెంబరు నుంచి అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉండగా.. వరల్డ్కప్-2023 టోర్నీ తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు డికాక్.అన్క్యాప్ట్ ప్లేయర్ల పంట పండింది!ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా టీ20 లీగ్లో సత్తా చాటిన ఇద్దరు అన్క్యాప్ట్ ప్లేయర్ల పంట పండింది. ఇంతవరకు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించని రియాన్ రికెల్టన్, ఒట్నీల్ బార్ట్మన్లు ఏకంగా ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించారు. ఎంఐ కేప్టౌన్ తరఫున రికెల్టన్ 530 పరుగులతో సౌతాఫ్రికా టీ20 లీగ్లో టాప్ స్కోరర్గా నిలవగా.. సన్రైజర్స్ ఈస్టర్న్కేప్ తరఫున బరిలోకి దిగిన బార్ట్మన్ 18 వికెట్లతో రాణించి జట్టును వరుసగా రెండోసారి చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు యువ ఆటగాళ్లకు సౌతాఫ్రికా పెద్దపీటవేయడం గమనార్హం. ఇక ఐపీఎల్-2024లో దుమ్ములేపుతున్న పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్లు కూడా మెగా ఈవెంట్లో భాగం కానున్నారు. కాగా జూన్ 1న ప్రపంచకప్నకు తెరలేవనుండగా.. జూన్ 3న సౌతాఫ్రికా న్యూయార్క్ వేదికగా శ్రీలంకతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.టీ20 ప్రపంచకప్-2024 కోసం సౌతాఫ్రికా జట్టు ఇదే:ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, గెరాల్డ్ కొయోట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్చూన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జే, కగిసో రబడ, రియాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్.ట్రావెలింగ్ రిజర్వ్స్: నండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి.
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
సాక్షి, కడప: చంద్రబాబు అంటేనే వెన్నుపోట్లు, మోసాలు, అబద్దాలు, కుట్రలే గుర్తొస్తాయని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చంద్రబాబు వయసు 75 ఏళ్లు దాటినా.. కనీసం పశ్చాతాపం కూడా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. పేదలకు, బాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని తెలిపారు. వైఎస్ జగన్కు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని.. పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేనని అన్నారు.కడప జిల్లా మైదుకూరులో సీఎం జగన్ మంగళవారం ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం అయినా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. 2014లో మేనిపెస్టోను అమలు చేశావా అంటే బాబుకు కోమొస్తుందని విమర్శించారు. మన ప్రభుత్వ స్కీముల లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోందని దుయ్యబట్టారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు చేసిన స్కీములేమిటని ప్రశ్నించారు. చంద్రబాబును ప్రశ్నలడిగితే ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి, టీవీ5కు, దత్తపుత్రుడికి, వదినమ్మకు పిచ్చిపిచ్చిగా కోపం వస్తోంది. వీరితోపాటు చంద్రన్న కాంగ్రెస్కు కూడా కోపం వస్తోంది. నేను స్కీమ్ల లిస్ట్ చదివితే వాళ్లు నా మీద తిట్లు, శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు గడగడా చదవుతున్నారు.జగన్ను ఎందుకు చంపకూడదని ఈ బాబు అంటున్నాడు.చంద్రబాబు సంస్కారానికి ఒక నమస్కారం.చేతకాని వాడికి కోపం ఎక్కువ అనే సామేత ఉంది. పేదలకు చేసిన మంచి ఏంటి అంటే సమాధానం లేదు. జగన్ను తిడితే ఏం ప్రయోజనమయ్యా చంద్రబాబు. ఇదే అసత్యాల హరిశ్చంద్రులంతా కలిసి 2014 లో ఇచ్చిన ఎన్నికల వాగ్దాలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు.బాబు కొత్త మేనిఫెస్టోకు విలువ, విశ్వసనీయత లేదు.మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుంది. ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్కారు ఇస్తారంట.. నమ్ముతారా? వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశాం. ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమం అందిస్తున్నాం.గతంలో ఎప్పుడూలేనన్ని స్కీమ్లు తీసుకొచ్చాం.రూ. 2లక్షల 70 వేల కోట్లు అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో వేశాం.2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం.విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.నాడు-నేడుతో ప్రభుత్వ ఆత్రుల రూపురేఖలుర్చాంఅవ్వాతాతలకు ఇంటి వద్దకే పెన్షన్..ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం.ఉన్నత చదువుల కోసం విద్యా దీవెన, వసతి దీవెన.ప్రతి ఇంటికి సంక్షేమం అందించాం.రూ. 2 లక్షల 70 వేల కోట్లు అక్కా చెల్లెమ్మల ఖాతాల్లో వేశాం. రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్. కాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నాం.31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కాచెల్లెమ్మల పేరుపై రిజస్ట్రేషన్.ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినక్ పెట్టాం.ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ సైతం తీసుకొచ్చాం.పేషెంట్ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం.పేదవారికి అండగా ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష.కాపు నేస్త,ఈబీసీ నేస్తం, ఆసరా అందిస్తున్నాం.మహిళల రక్షణ కోసం మహిళా పోలీస్ స్టేషన్లు.గ్రామ స్వరాజ్యానికి ప్రతీక గ్రామ సచివాలయాలు.క్లాస్రూమ్లో డిజిటల్ బోర్డులు, విద్యార్థుల చేతిలో ట్యాబ్స్ కనిపిస్తున్నాయి.వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్పై నొక్కాలి.పేదవాడి భవిష్యత్కోసం రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలి.175, 175 అసెంబ్లీ, 3\25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే.
తప్పక చదవండి
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
సినిమా
అలాంటి 'దర్శకనిర్మాతల' వల్లే తెలుగులో ఛాన్సులు రాలేదు: ఇలియానా
'దేవదాసు'లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఇలియానా.. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ గోవా బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే తెలుగునాట టాప్ హీరోయిన్గా కొనసాగింది.ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేసి అలరించిన ఈమె కొన్నేళ్లుగా టాలీవుడ్కు దూరంగా ఉంది. సుమారు ఎనిమిదేళ్ల గ్యాప్లో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో మళ్లీ మెరిసింది. సౌత్ ఇండియా చిత్రాలకు ఆమె ఎందుకు దూరంగా ఉన్నారో తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇలియానా చెప్పింది. ఇక్కడ ఆమెకు ఎందుకు అవకాశాలు రాలేదో కూడా ఓపెన్గానే చెప్పింది.2012లో ఇలియానాకు బాలీవుడ్లో నటించేందుకు అవకాశం దక్కింది. ఆ సినిమా విడుదల తర్వాత తెలుగులో పెద్దగా కనిపించని ఈ బ్యూటీ.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. ఈ క్రమంలో దక్షిణాది సినిమాలకు దూరమైంది. ఇదే విషయాన్ని ఇలియానా ఇలా చెప్పింది. 'అనురాగ్ బసు' దర్శకత్వం నుంచి 2012లో 'బర్ఫీ' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాను. ఆ సమయానికి దక్షిణాదిలో చాలా సినిమాలతో బిజాగా ఉన్నాను. కానీ 'బర్ఫీ' కథ నచ్చడంతో ఆ ప్రాజెక్ట్ను వదలుకోవాలనిపించలేదు. నా అంచనా నిజమైంది. సినిమా సూపర్ హిట్ అయింది. ఈ వార్తతో ఇక సౌత్ ఇండియాలో నేను సినిమాలు చేయనని అందరూ భావించారు. ఆపై నేను బాలీవుడ్కు షిఫ్ట్ అయ్యానని కూడా అనుకున్నారు. ఈ కారణంతో దక్షిణాది నిర్మాతలతో పాటు దర్శకులు కూడా నా పట్ల ఆసక్తి చూపించలేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ సినిమా అయినా సరే చాలా నిజాయితీగా నేను పనిచేశాను. కానీ నాకు మాత్రం అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఈ విషయంపై ఇన్నేళ్లైనా నాకు క్లారిటీ రాలేదు. దో ఔర్ దో ప్యార్, తేరా క్యా హోగా లవ్లీ వంటి బాలీవుడ్ చిత్రాలతో ఏడాదిలో ఇలియానా నటించింది.
ట్రెండింగ్లో 'ఫ్యామిలీ స్టార్'.. అలాంటి రూమర్స్కు చెక్
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "ఫ్యామిలీ స్టార్". ఇప్పటికే థియేటర్లో ప్రేక్షకులను మెప్పించిన సినిమా రీసెంట్గా అమోజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నామంటూ పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఫ్యామిలీ స్టార్ విడుదల సమయంలో సినిమా మీద కొందరు చేసిన నెగిటివ్ ప్రచారం నిజమేననుకుని సినిమాను థియేటర్లో చూడలేదని, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో సినిమాను ఎంజాయ్ చేస్తున్నామంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. విజయ్, మృణాల్ జోడీ ఈ సినిమాకు బాగా కలిసొచ్చిన అంశమని తెలుపుతున్నారు. కథలో హీరో తన గురించి ఆలోచించుకోకుండా ఫ్యామిలీ కోసం నిలబడటం అనే కాన్సెప్ట్ అందరూ ఆలోచించతగినట్లూ ఉందంటూ వారు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో కొందరు కావాలని ఈ సినిమా పట్ల తప్పుగా ప్రచారం చేసినా కూడా విజయ్ క్రేజ్తో ఫ్యామిలీ స్టార్ సినిమా మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్కు రీచ్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్తో ఆ దుష్ప్రచారం అంతా తేలిపోయింది. ఇండియాలోనే కాదు అమెరికాలోనూ ఫ్యామిలీ స్టార్ సినిమాను ప్రైమ్ వీడియోలో చూస్తున్నవారు సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మిగతా సినిమాల్లాగే ఫ్యామిలీ స్టార్ లోనూ కొన్ని మిస్టేక్స్ ఉన్నా సినిమా అన్ని అంశాల్లో బాగుందని చెబుతున్నారు. ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రెస్పాన్స్ తో సోషల్ మీడియా నెగిటివ్ ప్రాపగండా నమ్మొద్దనే రియలైజేషన్ ప్రేక్షకుల్లో కలుగుతోంది. ఇది విజయ్ దేవరకొండ నెక్ట్ సినిమాలకు తప్పకుండా ఉపయోగపడనుంది. అమెజాన్ ప్రైమ్లో టాప్ వన్లో ఫ్యామిలీ స్టార్ చిత్రం దూసుకుపోతుంది.
'కల్కి' కాపీ సినిమా కాదు.. క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్
ప్రభాస్ 'కల్కి 2989 ఏడీ' మూవీ గురించి నిత్యం ఏదొ ఒక వైరల్ న్యూస్ వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా కమల్హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా జూన్ 27న విడుదలవుతుందని తాజాగా ప్రకటన కూడా వచ్చేసింది.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు చూసిన ప్రేక్షకులు పలు కామెంట్లు చేస్తున్నారు. హాలీవుడ్లో సూపర్ హిట్ అయిన 'డ్యూన్'ను కాపీ కొట్టారంటూ నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. ఇదే విషయంపై కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు.తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న నాగ్అశ్విన్.. కల్కిని కొందరు హాలీవుడ్ సినిమా డ్యూన్తో పోలుస్తున్నారు.. అందులో ఎలాంటి నిజం లేదని ఆయన అన్నారు. బహుశా అలా పోల్చే వారందరూ కూడా సినిమాలో ఉన్న ఇసుకను చూసి అలా భావించి ఉంటారని ఆయన అన్నారు. ఇప్పటికే చాలాసార్లు 'కల్కి' చిత్రాన్ని ఇలా వేరే హాలీవుడ్ చిత్రాలతో పోల్చారని ఆయన తెలిపారు. ఇందులో ఏ సినిమా రెఫరెన్స్లు లేవు. సినిమా విడుదల తర్వాత ఆ విషయంపై అందరికీ క్లారిటీ వస్తుంది. ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
ప్రేమ, పెళ్లి అనేది ఇద్దరు మనసులకు సంబంధించిన విషయం. ఒకరికొకరు నచ్చితే, మనసుకు నచ్చితే పెళ్లి చేసుకోవచ్చు. ఇందులో ఇతరుల అభిప్రాయమో, ఇష్టాఇష్టాల్లో అక్కర్లేదు. అయినా ఒకరికి నచ్చితే మరొకరికి నచ్చాలనేమీలేదు. అందువల్ల ఒకరి గురించి వ్యంగంగా మాట్లాడటం సబబు కాదు. కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్కుమార్ విషయంలోనూ ఇలాంటి కామెంట్సే సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ బోల్డ్ అండ్ బ్యూటీ గురించి అందరికీ తెలిసిందే. బహుభాషా నటి. ఎలాంటి పాత్రనైనా అవలీలగా నటించగల సత్తా ఉన్న నటి. ప్రముఖ నటుడు శరత్కుమార్ వారసురాలు అయినా స్వయం కృషితోనే ఎదిగిన నటి. తమిళ 'పోడాపోడీ' చిత్రంతో కథానాయకిగా తెరంగేట్రం చేసిన వరలక్ష్మీ శరత్కుమార్లో మంచి నృత్య కళాకారిణి ఉన్నారన్నది ఈ తరానికి చెందిన చాలా మందికి తెలియకపోవచ్చు. ఆమె బెల్లీ డాన్సర్. ఇకపోతే నటిగా బిజీగా ఉన్న ఈమె జీవితంలో ఒక తోడును వెతుక్కున్నారు. ఆయన పేరు 'నికోలయ్ సచ్దేవ్'. ఈయన్ని ప్రేమించిన వరలక్ష్మీ శరత్కుమార్ పెళ్లికి సిద్ధం అవుతున్నారు. ఇటీవల వీరి వివాహ నిశ్చితార్థం కూడా ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో నిడారంబరంగా జరిగింది. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అయితే నటి వరలక్ష్మీ శరత్కుమార్పై జరుగుతున్న ట్రోలింగ్కు కారణం ఆమె ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతున్న నికోలయ్ ఇంతకు ముందే వివాహితుడు కావడమే. అంతే కాదు అతనికి ఒక కూతురు కూడా ఉంది. ఆయనెలా వరలక్ష్మీ శరత్కుమార్కు నచ్చారు? డబ్బు కోసం పెళ్లి చేసుకోబోతున్నారా? అనే కామెంట్స్ దొర్లుతున్నాయి. వాటిపై ఇటీవల ఒక భేటీలో స్పందించిన వరలక్ష్మీ శరత్కుమార్ తాను కష్టపడి పని చేస్తున్నాననీ, తన సంపాదనతో చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. నికోలయ్ను డబ్బు కోసమే పెళ్లి చేసుకోబోతున్నానని కొందరు కామెంట్స్ చేస్తున్నారనీ, అదే డబ్బు తన వద్దా ఉందని చెప్పారు. అలాంటిది డబ్బు కోసం తానెందుకు మరొకరిని పెళ్లి చేసుకోవాలి అని ప్రశ్నించారు. నికోలయ్ తనకు పరిచయం అయినప్పుడు భార్యతోనే కలిసున్నారని చెప్పారు. ఆయనతో తనకు కొన్ని నెలల క్రితమే స్నేహం ఏర్పడిందన్నారు. ఆ సమయంలో ఆయన ప్రవర్తన, మర్యాద, తన ప్రొఫెషన్పై గౌరవం చూసి తనకు ఆయనపై ప్రేమ కలిగిందన్నారు. అయినప్పటికీ నికోలయ్ తన తల్లిదండ్రులను కలిసి తనపై ఆయనకు ఉన్న ప్రేమ గురించి చెప్పారన్నారు. ఇకపోతే తనకాయన ఎలా నచ్చారు అనే కామెంట్స్ చేస్తున్నారనీ, తన కళ్లకు ఆయన నచ్చారనీ బదులిచ్చారు. రెండు పెళ్లిళ్లు చేసుకున్న తన తల్లిదండ్రులు సంతోషంగా జీవించడం లేదా? అని వరలక్ష్మీ శరత్కుమార్ స్ట్రాంగ్గా స్పందించడం గమనార్హం.
బిజినెస్
టెకీలకు శుభవార్త.. ఈ ఏడాది 10వేల మందికి ఉద్యోగాలు
టెక్ కంపెనీలు జనరేటివ్ ఏఐపై దూకుడుగా పనిచేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో వీటిలో అపార అవకాశాలున్నట్లు గుర్తించి ఆదిశగా ముందుకుసాగుతున్నాయి. తాజాగా జనరేటివ్ ఏఐలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. మార్చి త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.కృత్రిమమేధ రంగంలో కంపెనీ చాలా మందికి శిక్షణ ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికే సుమారు 25,000 మందికి శిక్షణ ఇవ్వగా, మరో 50,000 మందికి ఈ ఏడాదిలో ట్రెయినింగ్ పూర్తి చేస్తామన్నారు. గడిచిన త్రైమాసికంలో కొత్తగా 2700 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు తెలిపారు. 2024-25లో పరిస్థితులను బట్టి నియామకాలుంటాయన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇలాగే కొనసాగిగే కనీసం 10,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిస్తామన్నారు. భవిష్యత్తులో ఏదైనా మార్పులు ఏదురైతే నియామకాల సంఖ్యలోనూ తేడాలుండవచ్చని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థకంపనీ మార్చి త్రైమాసికంలో ఆదాయ వృద్ధి రేటు 5.4%గా నమోదైంది. టెక్ కంపెనీలకు అడ్వాన్స్డ్ టెక్నాలజీలపై క్లౌడ్, జనరేటివ్ఏఐ ప్రాజెక్టులు పెరుగుతాయని విజయ్ అంచనా వేశారు. అయితే ఆర్థిక సేవల విభాగంలో మాత్రం కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకావొచ్చన్నారు. రానున్న రోజుల్లో జనరేటివ్ ఏఐ ఆధారిత సైబర్ భద్రత, డేటా, క్లౌడ్ ఇమిగ్రేషన్, ప్రైవేటు ఏఐ స్టాక్ల నిర్మాణం తదితర విభాగాల్లో ఆర్డర్లు పెరిగే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.
గ్రీన్లో ఓపెన్ అయిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 22,670కు చేరింది. సెన్సెక్స్ 57 పాయింట్లు దిగజారి 74,751 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.6 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 88 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.62 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.32 శాతం లాభపడింది. నాస్డాక్ 0.35 శాతం ఎగబాకింది.అంచనాలకు మించి క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటనతో బ్యాంకులు, ఫైనాన్స్ రంగాల షేర్లలో భారీ కొనుగోళ్లు నెలకొన్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు కలిసొచ్చాయి. క్రూడాయిల్ ధరలు దిగిరావడం, ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం, డాలర్ ఇండెక్స్ బలహీనత వంటి అంశాలు సెంటిమెంట్ను బలపరిచాయి. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మే 1న సెలవు కావడంతో, మార్కెట్లు ఈవారం 4 రోజులే పనిచేయనున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డా.కృష్ణ ఎల్లా ఎంపిక
కోవాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లు కొనసాగనున్నారు.ఈ పదవిలో ఇప్పటి వరకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదార్ పూనావాలా ఉన్నారు. ఐవీఎంఏ ఉపాధ్యక్షురాలిగా బయోలాజికల్ ఇ.లిమిటెడ్ ఎండీ మహిమా దాట్ల, కోశాధికారిగా భారత్ బయోటెక్ సీఎఫ్ఓ టి.శ్రీనివాస్లను ఎన్నుకున్నారు. ఐవీఎంఏ డైరెక్టర్ జనరల్గా డాక్టర్ హర్షవర్థన్ కొనసాగుతారు.ఇదీ చదవండి: ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థఅందరికీ అవసరమయ్యే టీకాలు అందించడమే ఐవీఎంఏ ప్రధాన లక్ష్యమని డాక్టర్ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ ప్రమాణాలకు అనుగుణంగా దేశంలో టీకాల తయారీ సంస్థలు సిద్ధం కావాలన్నారు. ఆఫ్రికా వంటి దేశాలకు టీకా అవసరాలు అధిమన్నారు. టీకా తయారీలో వస్తున్న అంకుర సంస్థలకు సరైన ప్రోత్సాహకాలు అందించాలన్నారు.
కోవిషీల్డ్తో సైడ్ ఎఫెక్ట్స్.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా
కరోనా మహమ్మారి అధికంగా విజృంభించిన సమయంలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం 'ఆస్ట్రాజెనెకా' (AstraZeneca) కూడా కోవిడ్ వ్యాక్సిన్ అందించింది. అయితే ఆ వ్యాక్సిన్ దుష్ప్రభావానికి కారణమవుతుందని ఇటీవల అంగీకరించింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆస్ట్రాజెనెకా అందించిన కోవిషీల్డ్ కొన్ని సందర్భాల్లో బ్లాట్ క్లాట్స్, తక్కువ ప్లేట్లెట్ కౌంట్కు దారితీసే అవకాశం ఉందని వ్యాక్సిన్ తయారీదారు వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాచే ఉత్పత్తి చేసింది. దీనిని దేశంలో విస్తృతంగా ఉపయోగించారు.ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అనేక సందర్భాల్లో మరణానికి లేదా తీవ్ర గాయాలకు కారణమైందని 51 మంది బాధితులు 100 మిలియన్ పౌండ్ల వరకు నష్టపరిహారాన్ని కోరుతూ యూకే హైకోర్టులో ఇప్పటికే ఫిటిషన్ వేశారు. జామీ స్కాట్ 2021 ఏప్రిల్లో న్యాయపోరాటం ప్రారంభించారు. ఆ తరువాత చాలామంది దీనిపై కేసులు వేయడం మొదలుపెట్టారు.ప్రారంభంలో ఆస్ట్రాజెనెకా కంపెనీ క్లెయిమ్లను వ్యతిరేకించింది. అయితే ఇటీవల కోవిషీల్డ్ అరుదైన సందర్భాల్లో.. TTS (థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్) రక్తం గడ్డకట్టడం, బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్ తక్కువవుతుందని అంగీకరించింది.
వీడియోలు
స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు మేనిఫెస్టో మాయలు
టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!
చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్
చంద్రబాబును ఉతికారేసిన జగన్
ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!
కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం
మైదుకూరులో జనసునామి