Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

We Will Bounce Back YS Jagan With YSRCP Leaders
పార్టీ శ్రేణులకు అండగా నిలవండి: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ప్రజలకు మంచి చేశాం.. కచ్చితంగా పార్టీ ఫునర్వైభవం సాధించి తీరుతుందని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద నమ్మకం వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ నేతలు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, పోటీచేసిన అభ్యర్థులు గురువారం సాయంత్రం తాడేపల్లికి వెళ్లి వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ దాడుల గురించి నేతలు ప్రస్తావించగా.. పార్టీ తరఫున న్యాయపరమైన చర్యలకు వెళ్తున్నామని, ఈ టైంలో పార్ట శ్రేణులకు అండగా నిలవాలంటూ నేతలకు వైఎస్‌ జగన్‌ సూచించారు.వైఎస్‌ జగన్‌తో పార్టీ నేతలు.. ‘‘ప్రజలకు మంచి చేశాం, కచ్చితంగా పార్టీ పునర్‌ వైభవం సాధిస్తుందనే నమ్మకం మాకుంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో జీవన ప్రమాణాలు పెంచడానికి మీరు(జగన్‌ను ఉద్దేశించి) చేసిన విశేష కృషి కచ్చితంగా ప్రజల మనసుల్లో నిలిచిపోయింది. వ్యవసాయం, విద్య, వైద్యం తదితర రంగాల్లో తీసుకొచ్చిన గణనీయమైన మార్పులు ప్రజల జీవితాలను మార్చేదిశగా గొప్ప అడుగులుగా నిలిచిపోతాయి. .. ఈవీఎం మేనేజ్‌మెంట్‌ అనుమానాలు, ఈసీ–కొంతమంది పోలీసు అధికారుల కుట్రల నేపథ్యంలో కూడా సీట్లు గణనీయంగా తగ్గిపోయాయి. అయినా కూడా 40శాతం ఓటింగ్‌ వచ్చిందంటే సంక్షేమ పథకాలే కారణం. గడచిన ఐదేళ్లలో అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందే ఉన్నాయి.. ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తాం. గడచిన ఐదేళ్లు సుపరిపాలనకు ఒక గీటురాయిలా నిలిచిపోతుంది. .. కొన్నిరోజుల్లో రానున్న కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలుపై కచ్చితంగా ప్రజల దృష్టిఉంటుంది. ఈ ఐదేళ్లపాలనతో కచ్చితంగా బేరీజు వేసుకుంటారు. మాటమీద నిలబడి, ఇచ్చిన హామీలను నెరవేర్చిన విశ్వసనీయ పార్టీగా వైఎస్సార్‌సీపీకి ప్రజల మనసులో చోటు ఉంది. పార్టీ పునర్వైభవానికి గట్టి పునాది కూడా ఇదే. .. ఎన్నికలు జరిగిన తీరుపై అనే సందేహాలున్నాయి. పక్కా పార్టీ గ్రామాల్లో కూడా ఓట్లు రాకపోవడంపైనా అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంల వ్యవహారంపై ఒక పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో అక్రమాలకు తెర తీశారు. ఎన్నికల సంఘం కూటమి అనుకూల అధికారులు, పోలీసు అధికారుల మధ్య కుమ్మక్కు నడిచింది. వైఎస్సార్‌సీపీ నాయకుల్ని, కార్యకర్తలను ఉద్దేశ పూర్వకంగా భయభ్రాంతులకు గురిచేశారు. పోలింగ్‌ సమయంలో భయానక పరిస్థితులు సృష్టించారు’’ అని నేతలు పార్టీ అధినేత వద్ద ప్రస్తావించారు.రాష్ట్రవ్యాప్తంగా దాడులు:కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడులపై పార్టీ నాయకులు, వైఎస్‌ జగన్‌ వద్ద తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్మాదంతో స్వైరవిహారం చేస్తున్నారని, ఎక్కడికక్కడ దాడులకు దిగుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రాణాలకు హాని తలపెట్టడమే కాకుండా ఆస్తుల విధ్వంసాలకు దిగుతున్నారు. పార్టీ నాయకులతో వైఎస్‌ జగన్‌.. పార్టీ శ్రేణులకు అండగా నిలవండి. వారికి తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి. న్యాయపరంగా తీసుకోవాల్సిన వాటిపై పార్టీపరంగా చర్యలు తీసుకుంటున్నాం. గవర్నర్‌కు కూడా పార్టీ తరఫున ఫిర్యాదు చేశాం.👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

kangana Ranaut Responds On CISF Conistable Slapped her In Airport
ఎయిర్‌పోర్ట్‌లో కంగనాపై దాడి.. స్పందించిన నటి!

బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌పై సీఐఎస్‌ఎఫ్‌ మహిళ కానిస్టేబుల్‌ దాడికి పాల్పడింది. చండీఘర్‌ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న ఆమెపై సెక్యూరిటీ చెకప్ సమయంలో కంగనాను చెంపదెబ్బ కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌గా మారింది. రైతుల ధర్నాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే కంగనాపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే తాజాగా ఈ సంఘటనపై కంగనా స్పందించింది. తనపై దాడి నిజంగానే జరిగినట్లు వెల్లడించింది. దీనిపై మీడియాతో పాటు చాలామంది నుంచి నాకు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని పేర్కొంది. అయితే ప్రస్తుతం తాను సేఫ్‌గానే ఉన్నట్లు తెలిపింది. చండీఘర్‌ విమానాశ్రయంలో సెక్యూరిటీ స్టాఫ్‌ నాపై చేయి చేసుకున్నారు. నా లగేజీ చెకప్ తర్వాత లోపలికి వెళ్తుండగా.. అక్కడే ఉన్న ఇద్దరు మహిళా సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు నా చెంపపై కొట్టడంతో పాటు అసభ్యంగా మాట్లాడారు. దీనిపై వారిని ప్రశ్నించగా.. రైతుల ధర్నాకు మద్దతుగానే తనపై దాడి చేసినట్లు చెప్పారని కంగనా తెలిపింది. అయితే ప్రస్తుతానికి తాను సురక్షితంగానే ఉన్నానని.. కానీ పంజాబ్‌లో ఉగ్రవాదం పెద్దఎత్తున పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.కాగా.. కంగనాపై చెయ్యి చేసుకున్న సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ను కుల్వీందర్‌ కౌర్‌గా గుర్తించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ మండి స్థానం నుంచి కంగనా గెలుపొందిన సంగతి తెలిసిందే. తాజా దాడి ఘటనపై బీజేపీ నేతలు, సానుభూతి పరులు సోషల్‌ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Shocking rise in terror and violence in Punjab…. pic.twitter.com/7aefpp4blQ— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) June 6, 2024

YSRCP Leaders Complaint To Governor On TDP Attacks After Counting
వైఎస్సార్‌సీపీ జెండా మోసిన వాళ్లపై టీడీపీ దాడులు: పేర్ని నాని

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతోందని అన్నారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అరాచక చేష్టలకు దిగింది. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసి.. ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. గవర్నర్‌ నజీర్‌ను కలిసిన అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే టార్గెట్‌గా టీడీపీ దాడులు జరిపిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. బిహార్‌ తరహాలో ఏపీలో టీడీపీ దాడులకు తెగబడిందని మండిపడ్డారు. బిహార్‌ సంస్కృతిని టీడీపీ ఆచరిస్తోందన్నారు. టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారని అన్నారు. టీడీపీ నేతలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ జెండా మోసిన వారిపై దాడులకు తెగబడుతున్నారు.నూజివీడులో పట్టపగలే కత్తులతో దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు పేర్ని నాని. ఇళ్లలోకి చొరబడి ఆస్తులను ధ్వసం చేస్తున్నారని మండ్డారు. టీడీపీ దాడులు చూసి గవర్నర్‌ కూడా ఆశ్చర్యపోయారని తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా? లేనట్టా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలను కాపాడుకోవడానికి కమిటీలు వేశామని, 26 జిల్లాల్లోనూ మా లీగల్‌ టీమ్‌లు యాక్టివేట్‌ అయ్యాయని తెలిపారు. బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. టీడీపీ గుండాల దాడులతోపాటు.. పోలీసుల తీరుపై కూడా గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.వైఎస్సార్‌సీపీ నేతల బృందానికి రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వం వహించారు. గవర్నర్‌ను కలిసిన వాళ్లలో తాజా ఎంపీలు గురుమూర్తి, తనుజా, ఎమ్మెల్యేలు శివప్రసాద్, మత్యలింగం, విశ్వేశ్వర రాజు, పర్చూర్‌ నేత బాలాజీ ఉన్నారు.

UK Woman With Rare Disorder Shops In Her Sleep
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్‌ చేయడమా..?

కొందరికీ షాపింగ్‌ అంటే మహా ఇష్టం. చూసిందల్లా కొంటుంటారు. పాపం బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకుని కొందామన్నా సాధ్యం కాదు కొందరికీ. ఎంతలా కంట్రోల్‌గా ఉందామన్న ఆ వస్తువు కొనేదాక నిద్రపట్టని వాళ్ల గురించిn కూడా విన్నాం. కానీ నిద్రలో షాపింగ్‌ చేసే వ్యాధి గురించి విన్నారా? ఔను..! ఈ వ్యక్తులు నిద్రలోనే తెలియకుండానే షాపింగ్‌ చేస్తుంటారు. మెలుకవ వచ్చాక గానీ అసలు విషయం తెలియదంట. వామ్మో.. ఇదేం వ్యాది!. ఇలాంటివి కూడా ఉంటాయా అనుకోకండి. అలాంటి అరుదైన వ్యాధితోనే బాధపడుతోంది ఓ మహిళ.యూకేకి చెందిన 42 ఏళ్ల కెల్లీ నైప్స్‌ పారాసోమ్నియా ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీన్ని అరుదైన పారాసోమ్నియా స్లీపింగ్‌ డిజార్డర్‌గా పిలుస్తారు. ఈ డిజార్డర్‌ కారణంగా ఆమె నిద్రలోనే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేస్తుందట. ఏకంగా పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు దగ్గర నుంచి ఫ్రిడ్జ్‌ వంటి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్‌ వస్తువులు కూడా కొనుగోలు చేసేస్తుంది. వాటి బిల్లను కూడా క్రెడిట్‌ కార్డులతో చెల్లించేస్తుందట. మేలుకువ వచ్చాక మొబైల్‌ చూసుకుంటే గానీ తెలియదంట. తన అకౌంట్‌లో డబ్బు కట్‌ అయ్యాక గానీ అసలు విషయం తెలుసుకులేకతున్నాని చెబుతుంది. ఇలా నిద్రలో తనకు తెలియకుండానే షాపింగ్‌ చేసి లక్షల్లో డబ్బుల పోగొట్టుకున్నానని చెబుతోంది. దీంతో ఆమెకు ప్రతి రాత్రి భయానకంగా మారిపోయింది. "తన జీవితంలో ప్రతి రాత్రి ఓ పీడకల మాదిరిగా అయిపోతోందని బాధపడుతోంది. తన క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వివరాలన్నీఫోన్‌లోనే సేవ్‌ అయ్యి ఉంటాయట. ఐతే ఈ మాయదారి జబ్బు కారణంగా తన బ్యాంక్‌ వివరాన్ని సైబర్‌ నేరాగాళ్లకు చెప్పేయడం కూడా జరిగిందంట. దీంతో వాళ్లు ఆమె ఖాతా నుంచి సుమారు రూ. 20 వేలకు పైగా తస్కరించారట కూడా. అయితే ఈలోగా తాను తన బ్యాంక్‌ లావాదేవీలను లాక్‌ చేసేయడంతో కొద్ది మొత్తంలోనే డబ్బును కోల్పోయానని అంటోంది." కెల్లీ. ఇక సమస్య నుంచి బయటపడేందుకు ముక్కుకి శ్వాస సంబధ సమస్యల నిమిత్తం అమర్చుకునే పరికరాన్ని ధరించి పడుకుంటుంది. ఈ డివైజ్‌ ముక్కు నుంచి హెడ్‌ వరకు కదలకుండా అటాచ్‌ అయ్యేలా డివైజ్‌ ఉంటుంది. కాబట్టి నిద్రలోనే తనకు తెలయకుండా చేసే విచిత్రమైన పనుల నుంచి ఉపశమనం పొందొచ్చనేది కెల్లీ ఆశ. అయితే కెల్లీ సమస్య నుంచి బయటపడలేదు సరికదా..!ఈ పరికరాన్ని కూడా నిద్రలో తనకు తెలియకుండానే తీసేస్తుందంట. ఈ సమస్య కారణంగా తాను అప్పులు పాలవ్వుతున్నానని కెల్లీ ఆవేదనగా చెప్పుకొచ్చింది. అయితే దీనికి చికిత్స లేదు. తనకు తానుగా బయటపడాలని సంకల్పించుకుంటేనే సాధ్యమని చెబుతున్నారు వైద్య నిపుణులు.పారాసోమ్నియా స్లీపింగ్‌ డిజార్డర్ అంటే..ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి నిద్రలోనే నడవడం /మాట్లాడటం / తినడం/ ఏమైన ఇతర కార్యకలాపాల్లో పాల్గొనడం వంటివి ఏ మాత్రం పూర్తి అవగాహనతో చేయరు. ఆ టైంలో వారికి మెదడు పాక్షికంగా మేల్కొని ఉంటుంది. ఎవరైనా ఆ వ్యక్తులను గమనించి గట్టిగా అదిలిస్తే తిరిగి స్ప్రుహలోకి వస్తారు. ఇలాంటివన్నీ రాత్రి మొదటి జామునే జరుగుతాయట. చిన్నారుల్లోనూ, కొందరూ పెద్దల్లోనూ నిద్రలోనే నడవడం/మాట్లాడటం వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి. అయితే ఈ డిజార్డర్‌ తీవ్రంగా ఉంటేనే ఇలా సమస్యలు ఫేస్‌ చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: అనారోగ్యంలోనూ... నీట్‌ టాపర్‌గా!)

These World Leaders To Attend PM Modi Oath Ceremony In Delhi
మారిన మోదీ ప్రమాణ స్వీకార తేదీ? ఈ దేశాల అగ్రనేతలకు ఆహ్వానం!

న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం మోదీ జూన్‌ 9న ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. తొలుత జూన్‌ 8న మోదీ ప్రమాణ స్వీకార ఉంటుందని వార్తలు వెలువడగా.. తాజాగా ఆ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రానికి మార్చినట్లు సమాచారం. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.కాగా దేశంలో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తి మోదీనే కావడం విశేషం. మోదీ ప్రమాణ స్వీకారానికి దక్షణాసియా దేశాలకు చెందిన అగ్ర నేతలు తరలిరానున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే హాజరు అయ్యే విషయం ఖరారైంది. ఈ మేరకు ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా రణిల్‌ విక్రమసింఘేను ప్రధాని మోదీ ఆహ్వానించారని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. బంగ్లాదేశ్‌ ప్రధాని సైతం శనివారం నాటి కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈవెంట్‌ కోసం ఆమె ఒకరోజు ముందే అంటే శుక్రవారమే ఢిల్లీకి చేరుకోనున్నారు. వీరితోపాటు భూటాన్‌, నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహాల్‌ ప్రచండ, భూటాన్‌ షెరింగ్ టోబ్గే, మారిషస్‌ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్‌లకు కూడా ప్రధాని మోదీ ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. ఇటీవల ప్రకటించిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలను గెలుచుకుంది. 2014లో 282 సీట్లు, 2019లో 303 చోట్ల విజయ కేతనం ఎగరవేసి సొంతంగా మేజార్టీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. ఈసారి ఈసారి మెజార్టీ(272) కంటే తక్కువ స్థానాలకే పరిమితమైంది. కేవలం 240 సీట్లను గెలుచుకున్న బీజేపీ.. ఎన్డీయే కూటమి మిత్రపక్షాల సాయంతో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయనుంది. కూటమి నేతల మద్దతుతోే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

Congress leaders want Rahul Gandhi to become Leader of Opposition in lok sabha
‘లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేతగా రాహుల్‌ గాంధీనే ఎన్నుకోవాలి’

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎ‍న్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా 99 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి 234 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ తర్వాత సింగిల్‌గా కాంగ్రెస్‌ పార్టీనే అధిక సీట్లు సంపాధించుకుంది. ఇండియా కూటమిలో సైతం కాంగ్రెస్‌ పార్టీనే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేతగా ఎవరు ఉండాలనే విషయంపై పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.కాగా, గతంలో కంటే కాంగ్రెస్‌ పార్టీ అధిక సీట్లు గెలుచుకొని పుంజుకోవటంలో రాహుల్‌ గాంధీ కీలక పాత్ర పోషించారని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే రాహుల్‌ గాంధీనే లోక్‌ సభలో కాంగ్రెస్‌ లీడర్‌ ఆఫ్‌ అపోజిషన్‌గా ఉండాలని తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు.లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేతగా రాహుల్‌ గాంధీ ఉండాలని తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంలో గెలుపొందిన మాణిక్యం ఠాగూర్ ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. ‘‘ నా పార్లమెంట్‌ నియోజకవర్గంలో రాహుల్‌ గాంధీ పేరు మీదనే ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగాను. నాకు తెలిసి లోక్‌సభలో రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ ప్రతిపక్షనేత ఉండాలి. ఎన్నికైన ఎంపీలందరిలో ఇదే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాంగ్రెస్‌ ఒక ప్రజాస్వామ్య పార్టీ’’ అని అన్నారు.కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ ఎంపీ వివేక్‌ తన్ఖా సైతం లోక్‌సభలో రాహుల్‌ గాంధీని కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షనేతగా ఎన్నకుంటే బాగుంటుందని తలిపారు. ‘‘లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్‌ గాంధీ ముందుండి నడిపించారు. లోక్‌సభలో కూడా కాంగ్రెస్‌ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అయితే రాహుల్ గాంధీ తన కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోరు. ఇలాంటి నిర్ణయాలను పార్టీ పెద్దలు, ఎంపీలు తీసుకుంటారు. కానీ ఏకగ్రీవంగా ఉన్న ఒకే ఒక అవకాశం.. రాహుల్‌ గాంధీనే’’ అని తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ నేత కార్తి చిదంబరం కూడా స్పందించారు. నా వ్యక్తిగతంగా.. లోక్‌ సభలో కాంగ్రెస్‌ ప్రతిపక్షపార్టీ నేతగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు తీసుకుంటే అది సరైన నిర్ణయంగా భావిస్తానని అన్నారు. ఇక 2019లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలుకావటంతో రాహుల్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ గతం కంటే మెరుగైన స్థానాలు గెలవటంతో లోక్‌సభలో రాహుల్‌ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండాలనే చర్చ పార్టీ నేతల్లో జోరుగా సాగుతోంది.

Kollywood Star Hero Vijay Sethupathi Comments On Uppena Fame
కూతురి లాంటి ఆమెతో రొమాన్స్‌ చేయలేను.. స్టార్‌ హీరో ఆసక్తికర కామెంట్స్!

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి మహారాజా మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని నిథిలన్‌ దర్శకత్వంతో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.ప్రస్తుతం విజయ్ ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగాఉప్పెన ఫేమ్‌ కృతిశెట్టిపై మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనతో సినిమాలు ఒప్పుకోకపోవడానికి గల కారణాలను వెల్లడించారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ..'నేను నటించిన డీఎస్పీ చిత్రంలో కృతిని హీరోయిన్‌గా తీసుకుంటే చేయనని చెప్పా. ఎందుకంటే ఉప్పెన సినిమాలో తండ్రిగా నటించా. అది సూపర్‌హిట్‌గా నిలిచింది. అందులో నా కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్‌ సీన్స్‌ చేయలేనని చెప్పా. కూతురిగా భావించిన కృతిశెట్టితో నటించడం నా వల్ల కాదు' అని అన్నారు. కాగా.. గతంలోనూ విజయ్‌ సేతుపతి ఇదే విషయాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఉప్పెన తర్వాత రెండు సినిమాల్లో హీరోయిన్‌గా కృతిని ఎంపిక చేయగా తిరస్కరించారు.

Rohit unsure about what to expect from Nassau track: Rohit sharma
పిచ్ అస్సలు అర్థం కావడం లేదు.. కానీ వారు మాత్రం అద్బుతం: రోహిత్‌

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో టీమిండియా బోణీ కొట్టిన సంగ‌తి తెలిసిందే. బుధ‌వారం(జూన్ 5)న న్యూయ‌ర్క్ వేదిక‌గా ఐర్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఐరీష్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ భార‌త బౌల‌ర్ల దాటికి కేవ‌లం 96 ప‌రుగుల‌కే ఆలౌటైంది. అనంత‌రం 97 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని భార‌త జ‌ట్టు కేవ‌లం 12.2 ఓవ‌ర్ల‌లో ఊదిప‌డేసింది. ఇక ఈ విజ‌యంపై మ్యాచ్ అనంత‌రం టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్పందించాడు. త‌మ బౌల‌ర్లు అద్బుతంగా రాణించార‌ని హిట్‌మ్యాన్ కొనియాడాడు. అదే విధంగా త‌న గాయంపై కూడా రోహిత్ అప్‌డేట్ ఇచ్చాడు. "నా మో చేయి ఇంకా కొంచెం నొప్పిగా ఉంది. పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. ఇక టాస్‌ సమయంలోనే నేను చెప్పాను పిచ్‌ను అంచనా వేయడం చాలా కష్టమని. అసలు ఈ వికెట్ నుంచి ఏం ఆశించాలో కూడా అర్థం కావడం లేదు.కేవలం ఐదు నెలల వయసున్న పిచ్‌పై ఎలా ఆడాలో తెలియడం లేదు. మేము సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా పిచ్‌ ఇంకా అలానే ఉంది. ఇది బౌలర్లకు సరిపోయే వికెట్. ఈ వికెట్‌పై ఫాస్ట్‌ బౌలర్లు సరైన లెంగ్త్‌లో బౌలింగ్‌ చేస్తే సరిపోతుంది. మా జట్టులో ఒక్క అర్ష్‌దీప్‌ సింగ్‌కు తప్ప దాదాపు అంతమంది బౌలర్లకు టెస్టు క్రికెట్‌లో ఆడిన అనుభవం ఉంది. అయినప్పటికి అర్ష్‌దీప్‌ ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టి మాకు మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. ఈ వికెట్‌పై నలుగురు స్పిన్నర్లతో ఆడాలనుకోలేదు.బ్యాలెన్స్‌గా ఉండే తుది జట్టును ఎంపిక చేశాము. మా తుది జట్టులో ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లతో పాటు, ఇద్దరు పేస్‌ ఆల్‌రౌండర్లు, ఇద్దరు స్పిన్‌ ఆల్‌రౌండర్లకు చోటిచ్చాము. పిచ్‌ సీమర్లకు అనుకూలించినందున స్పిన్నర్లతో కేవలం రెండు ఓవర్లు మాత్రం వేయించాను. ఒకవేళ స్పిన్‌కు అనుకూలించి ఉంటే వారితో ఫుల్‌ కోటాను పూర్తి చేసే వాడిని. పరిస్థితులకు తగ్గ జట్టు మా వద్ద వుంది. ఒకవేళ పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు కూడా పిచ్‌ ఈ విధంగానే ఉంటే అందుకు తగ్గట్టు మేము సన్నద్దమవుతామని" పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో రోహిత్‌ పేర్కొన్నాడు.

Ksr Comments On The Atrocities Of TDP Leaders
సీఎం పీఠం ఎక్కనేలేదు.. ఈలోపే మరీ ఇంతలానా?

ఆంధ్రప్రదేశ్ లో ఎంతలో ఎంత మార్పు చూడండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టకముందే ఆ పార్టీకి చెందిన కొన్ని అరాచక శక్తులు విజృంభిస్తున్న వైనం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని చోట్ల ఇళ్లలోకి చొరబడి మరీ కత్తులతో నరకడం, వైఎస్సార్‌సీపీ జెండానే కనిపించకూడదని బెదిరించడం ఇవన్నీ ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తాయి. ప్రజాస్వామ్యంతో సంబంధం లేదని, తాము అనుకున్నది చేస్తామని అనుకుంటే అది మరింత ఉద్రిక్తతలకు దారి తీస్తుంది.పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇంత సడన్ గా నిర్వీర్యం అయిందో అర్థం కావడం లేదు. కొన్ని చోట్ల వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపైకి దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. అసలు ఈ ఎన్నిక ఫలితాలు ఇలా ఉన్నాయేమిటి? ఏమైనా గోల్ మాల్ జరిగిందా అనే అనుమానాలు ఒక వైపు వ్యక్తం అవుతుంటే, మరో వైపు టీడీపీ, జనసేనలకు చెందినవారు చేస్తున్న అరాచకాలతో అట్టుడికే పరిస్థితి ఏర్పడుతుంది. చంద్రబాబు నాయుడు కానీ, ఆయన కుమారుడు లోకేష్ కానీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కానీ ఒక్కసారి కూడా ఇలాంటివాటిని ఖండించినట్లు కనబడలేదు. దాంతో వారు కూడా ఇలాంటి గొడవలను ప్రోత్సహిస్తున్నారని జనం అనుకునే అవకాశం ఉంటుంది.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఒక చిన్న ఘటన ఏమైనా జరిగినా, వ్యక్తిగత కారణాలతో ఘర్షణలు జరిగినా, వైఎస్సార్‌సీపీకి పులిమి నానా హడావుడి చేసిన టీడీపీ మద్దతు మీడియా ఇప్పుడు ఎక్కడా నోరుమెదపుతున్నట్లు లేదు. ప్రస్తుతం జరుగుతున్న హింసాకాండ వారి దృష్టిలో ప్రజాస్వామ్యబద్దంగా, రాజ్యాంగబద్దంగా జరుగుతున్నదని అనుకుంటున్నారేమో తెలియదు. టీడీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి రకరకాల రూపాలలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి యత్నాలు సాగాయి. కాస్త గట్టిగా ఉండే అధికారులను మార్చేయడం, టీడీపీ వైపు నుంచి జరిగే ఘర్షణలను పట్టించుకోకపోవడం, వైఎస్సార్‌సీపీ నుంచి ఏమి జరిగినా వెంటనే స్పందించడం, తీవ్రమైన చర్యలు తీసుకోవడం కనిపించింది. కొన్ని ఏరియాలలో టీడీపీ రిగ్గింగ్ అవకాశం ఉన్నచోట్ల పోలీసులను చాలా తక్కువ సంఖ్యలో పెట్టారట. తద్వారా యథేచ్చగా రిగ్గింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారన్నమాట. అదే వైఎస్సార్‌సీపీ వారు రిగ్గింగు చేసే చాన్స్ ఉందని అనుకున్నచోట మొత్తం బలగాలన్నిటినీ కేంద్రీకరించారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. పోలింగ్ మరుసటి రోజు మాచర్ల, తాడిపత్రి, తిరుపతి మొదలైన చోట్ల టీడీపీ వారు దాడులు చేసి గందరగోళాలు సృష్టించారు. విచిత్రం ఏమిటంటే పోలీసులే తాడిపత్రి అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలోకి వెళ్లి సిసిటీవీని, కెమెరాలను పగులకొట్టి విద్వంసానికి పాల్పడడం, అయినా వారిపై ఏమి చర్య తీసుకున్నది తెలియదు.వీటిలో అత్యధికం తెలుగుదేశం గూండాలు చేసినవేనని వైఎస్సార్‌సీపీ చెబుతోంది. అది నిజమే అని దృవీకరించే విధంగా కౌంటింగ్ తర్వాత రచ్చ సాగుతోంది. వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ విజయవాడలో ఒక హోటల్ లో టిఫిన్ చేస్తుంటే వచ్చి దాడి చేశారు. లోకేష్ ను విమర్శించే స్థాయి నీదా అని బూతులు తిడుతూ రెచ్చిపోయారు. పలువురు వైఎస్సార్‌సీపీ నేతలకు, వారిని సమర్ధించినవారికి ఫోన్ లు చేసి టీడీపీ మద్దతుదారులు బూతులు తిడుతున్నారు. అసభ్యకర మెస్సేజ్ లు పెడుతున్నారు. టీడీపీ వేధింపులకు తాళలేక ఏలూరు సమీపంలోని విజయరాయి వద్ద ప్రవీణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడుకు చెందిన కళ్యాణ మండపంపై దాడి చేశారు. మాజీ మంత్రి విడదల రజనీ ఆఫీస్ లో విధ్వంసం సృష్టించారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కొండూరు తదితర చోట్ల వైఎస్సార్‌సీపీ వారి ఇళ్లపై కర్రలు, కత్తులతో దాడి చేశారు. వైఎస్సార్‌సీపీవారు ఊళ్లలో ఉండడానికి వీలు లేదని హెచ్చరికలు జారీ చేసి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాజీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పల్నాడులో ఒక యూట్యూబ్ చానల్ నడిపే వైఎస్సార్‌సీపీ అభిమాని ఇంటిపైకి వెళ్లి కత్తితో దాడిచేస్తే, అతని వృద్ద తల్లిదండ్రులు తల్లడిల్లుతూ ఏడుస్తున్న వీడియో వైరల్ అయింది.ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆఫీస్ పై దాడులు చేశారు. ఈ గొడవలలో టీడీపీతో పాటు, బీజేపీ, జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద రాళ్లతో వీరంగం సృష్టించారు. రాయచోటి మండలం యండపల్లి అనేచోట మాజీ ఎంపీ పోల సుబ్బారెడ్డి ఇంటిపై పడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. గుంటూరులో ఒక హాస్టల్ పేరు చివరలో రెడ్డి అని ఉన్నందుకు హాస్టల్ యజమానితో కాళ్లు పట్టించుకున్నారట. కళ్యాణ దుర్గంలో వైఎస్సార్‌సీపీ నేత ఉమామహేశ్వరనాయుడు ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసి కారు, ప్రచార రథం ధ్వంసం చేశారు.ఇలా వివిధ జిల్లాలలో సాగుతున్న ఈ అరాచకాలను పోలీసులు ఎప్పటికి అరికడతారో తెలియదు కానీ, దీనివల్ల సమాజంలో మరింత అన్ రెస్ట్ పెరిగిపోతుంది. ఈ దాడులకు ప్రతిగా వైఎస్సార్‌సీపీవారు కూడా ఏదో రకంగా తిప్పికొట్టడానికి యత్నించే అవకాశం ఉంటుంది. దానిని నివారించడం చాలా అవసరం. అధికారం వచ్చిన తర్వాత చాలా బాధ్యతగా ఉంటామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు అనేప్పటికీ, పోలీసులకు ఈ ఘర్షణలపై గట్టి చర్యలు తీసుకోవాలని ఎందుకు సూచించలేదో తెలియదు. లోకేష్ తాము అధికారంలోకి వచ్చాక బదులు తీర్చుకుంటామని అనేమాటలను జనం గుర్తు చేసుకుంటున్నారు. దానికి తగినట్లే ప్రస్తుతం దాడులు సాగుతున్నాయి.గతంలో ఏవో జరిగాయని ప్రతీకారంతో రగిలిపోతున్నారని, అందుకే ఇలా చేస్తున్నారని టీడీపీకి మద్దతు ఇచ్చేవారు, వారి మీడియా ప్రచారం చేయవచ్చు. అందులో ఎంత నిజం ఉందన్నది వేరే విషయం. అధికారంలోకి వచ్చినవారు అన్నిటిని సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగాలి. అంతేకానీ కక్షపూరితంగా మరింత రెచ్చగూడదని చెప్పక తప్పదు. కానీ అప్పట్లో అరాచక పాలన అని ప్రచారం చేసినవారు ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి జరుగుతున్న అరాచకాలను ఎలా సమర్ధిస్తారు? ఈ దౌర్జన్యాలు, దాడుల ద్వారా టీడీపీ కూటమి ఇకపై ఇంకెంత అరాచకానికి పాల్పడుతుందో అని జనం భయపడుతున్నారు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు

How to Make Correction in Name, KYC and Other Details
ఈపీఎఫ్‌ అకౌంట్‍లో తప్పులున్నాయా? ఇలా సులభంగా మార్చుకోండి..

సాధారణంగా ఉద్యోగం చేసేవారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్​ (EPF) అకౌంట్ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ అకౌంట్ వివరాల్లో ఏవైనా తప్పులు ఉండే అవకాశం ఉంటుంది. గతంలో ఉద్యోగులు తమ జాయింట్ డిక్లరేషన్ ఫారంను నింపి, దానిని ఈపీఎఫ్ఓ కార్యాలయంలో ఇచ్చేవారు. ఇప్పుడు ఏవైనా మార్పులు చేసుకోవాలనుంటే.. ఫిజికల్ ఫారమ్‌తో పనిలేకుండా.. ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. ఈ కథనంలో ఈపీఎఫ్ చందాదారులు ఆన్​లైన్​లో తమకు చెందిన 11 వ్యక్తిగత వివరాలను ఎలా మార్చుకోవాలో వివరంగా తెలుసుకుందాం.ఆన్​లైన్​లో మార్చుకోగలిన 11 వ్యక్తిగత వివరాలుపేరుజెండర్పుట్టిన తేదీతండ్రి / తల్లి పేరురిలేషన్​షిప్వైవాహిక స్థితిజాయినింగ్ డేట్రీజన్ ఫర్ క్విట్టింగ్ డేట్ ఆఫ్ క్విట్టింగ్నేషనాలిటీఆధార్ఆన్​లైన్​లో ఎలా మార్చుకోవాలంటే?👉ఉద్యోగి ముందుగా ఈపీఎఫ్ఓ అధికారికి వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి👉హోమ్ పేజీలో మొదట కనిపించే 'సర్వీస్' ట్యాబ్ మీద క్లిక్ చేసిన తరువాత 'ఫర్ ఎంప్లాయిస్' అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.👉ఆ తరువాత సర్వీస్ సెక్షన్ కింద కనిపించే 'మెంబర్ యూఏఎన్ / ఆన్‌లైన్ సర్వీస్' ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి.👉ఆలా క్లిక్ చేయగానే మీకు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.👉కొత్త పేజీలో కుడివైపు కనిపించే బాక్సులలో 'యూఏఎన్, పాస్​వర్డ్‌, క్యాప్చా' వంటి వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. 👉ఇవన్నీ పూర్తి చేసిన తరువాత అసలైన ఈపీఎఫ్ఓ అకౌంట్ పేజీ ఓపెన్ అవుతుంది.👉ఈపీఎఫ్ఓ అకౌంట్ పేజీ ఓపెన్ అయినా తరువాత స్క్రీన్ మీద కనిపించే.. 'మేనేజ్' ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ మెంబర్ ఐడీ ఎంటర్ చేసిన తరువాత.. ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో.. వాటిని ఎంటర్ చేసుకోవాలి.👉అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అప్​లోడ్‌ చేసిన తరువాత సబ్మిట్ చేయాలి.👉అన్ని సరిగ్గా అప్​లోడ్‌ చేసి సబ్మిట్ చేసిన తరువాత రిక్వెస్ట్ యాక్సెప్ట్ అవుతుంది. ఆ తరువాత వివరాలు మీకు అందుతాయి.ఎంప్లాయర్ చేయాల్సింది..👉ఎంప్లాయ్ వివరాలను అందుకున్న తరువాత ఎంప్లాయర్.. ఈపీఎఫ్ఓ అధికారికి వెబ్‌సైట్‌లో ఎంప్లాయర్ ఐడీతో ఎంటర్ అవ్వాలి. 👉మెంబర్ ట్యాబ్‌ మీద క్లిక్ చేసి.. జాయింట్ డిక్లరేషన్ చేంజ్ రిక్వెస్ట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.👉ఉద్యోగి అభ్యర్థను చెక్ చేసిన తరువాత ఎంప్లాయర్ అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు.👉ఎంప్లాయర్ ఉద్యోగి రిక్వెస్ట్ అంగీకరిస్తే.. అది ఈపీఎఫ్ఓకు చేరుతుంది.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement