Top Stories
ప్రధాన వార్తలు
నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 10 గంటలకు రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలోని రాజానగరం నియోజకవర్గంలో ఉన్న కోరుకొండ జంక్షన్లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం లోక్సభ స్థానం పరిధిలోని ఇచ్ఛాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం లోక్సభ పరిధిలో గాజువాక నియోజకవర్గంలో ఉన్న పాత గాజువాక సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
General Elections 2024: ప్రారంభమైన మూడో విడత పోలింగ్
updates మధ్య ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు ఖజురహో అభ్యర్థి వీడీ శర్మ ఓటు హకక్కు వినియోగించుకున్నారు.భోపాల్లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Madhya Pradesh BJP President and candidate from Khajuraho constituency VD Sharma casts his vote at a polling booth in Bhopal. BJP has fielded Alok Sharma from here, Congress has fielded Arun Shrivastava. BJP's Sadhvi Pragya Singh Thakur is the sitting MP from the… pic.twitter.com/34ZA8VRERu— ANI (@ANI) May 7, 2024 కర్ణాటకలోని కలబురిగి పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి డా. ఉమేష్ యాదవ్ ఓటు వేశారు.#WATCH | Karnataka: BJP candidate Dr Umesh Jadhav shows the indelible ink mark on his finger after casting his vote at a polling booth in Kalaburagi.Congress has fielded party chief Mallikarjun Kharge's son-in-law Radhakrishna Doddamani against him from here.… pic.twitter.com/6TQNcePEvq— ANI (@ANI) May 7, 2024ఓటు వేయాలని ప్రధాని మోదీ ట్వీట్..‘నేటి మూడో దశలో రికార్డు స్థాయిలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీ చురుకైన భాగస్వామ్యం ఖచ్చితంగా ఎన్నికలను ఉత్సాహంగా మారుస్తుంది’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.Urging all those who are voting in today’s phase to vote in record numbers. Their active participation will certainly make the elections more vibrant.— Narendra Modi (@narendramodi) May 7, 2024 లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రారంభమైందిఓటు వేయడానికి ప్రజలు క్యూ లైన్లలో నిల్చుంటున్నారుVoting for the third phase of #LokSabhaElections2024 begins. Polling being held in 93 constituencies across 11 states and Union Territories (UTs) today.17.24 crore voters are casting their votes today. pic.twitter.com/CpQ7gGurNG— ANI (@ANI) May 7, 2024 నేడు లోక్ సభ మూడో విడత ఎన్నికల పోలింగ్ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6వరకు పోలింగ్11 రాష్ట్రాల్లోని 93 ఎంపీ సీట్లకు ఎన్నికలుఎన్నికల బరిలో 1352 మంది అభ్యర్థులుగుజరాత్ , మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ సహ పలు రాష్ట్రాలలో ఎన్నికలుఅహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాఓటు హక్కు వినియోగించుకోనున్న 17.24 కోట్ల మంది ఓటర్లు1.85 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘంఓటు హక్కు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఎస్ఎంఎస్ / వాట్సాప్ మెసేజ్ లు పంపుతున్న ఎన్నికల సంఘంమూడో విడత పోలింగ్ రోజున సాధారణ వాతావరణమే ఉంటుందని అంచనాలువడగల్పుల ప్రభావం తట్టుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, నీళ్లు, ఓఆర్ఎస్ ఏర్పాటుచేసిన ఈసీఎన్నికల ను ప్రత్యక్షంగా చూసేందుకు 23 దేశాల ప్రతినిధులను ఆహ్వానించిన ఈసీపరస్పర వివాదాస్పద ఆరోపణలు, ఈసీకి ఫిర్యాదు లతో రాజకీయ పార్టీలు పెంచిన ప్రచారవేడి చల్లారాక నేడు కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశ పోలింగ్కు సిద్ధమైంది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ దశతో గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్లోని అన్ని స్థానా లకూ పోలింగ్ పూర్తి కానుంది. ఈ రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగిన విష యం తెల్సిందే. ఈసారి మూడో దశలో 120 మంది మహిళలుసహా 1,300కు పైగా అభ్యర్థులు పోటీపడు తున్నారు.బరిలో అగ్రనేతలు, ప్రముఖులు కేంద్రమంత్రులు అమిత్ షా(గాంధీనగర్), జ్యోతిరాదిత్య సింధియా(గుణ), మన్సుఖ్ మాండవీయ(పోర్బందర్), పురుషోత్తం రూపాలా(రాజ్కోట్), ప్రహ్లాద్ జోషి (ధార్వాడ్), ఎస్పీ సింగ్ బఘేల్(ఆగ్రా)మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు శివరాజ్సింగ్ చౌహాన్(విదిశ), దిగ్విజయ్సింగ్(రాజ్గఢ్), ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై (హవేరీ), బారామతిలో వదినా, మరదళ్లు సునేత్రా పవార్, సుప్రియా సూలే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.283 చోట్ల పోలింగ్ పూర్తిఇప్పటికే గుజరాత్లోని సూరత్ నియోజక వర్గంలో బీజేపీ ఏకగ్రీవంగా గెల్చింది. గతంలో వాయిదాపడిన బైతుల్ నియోజ కవర్గంలో ఈరోజే పోలింగ్ నిర్వహిస్తు న్నారు. మూడోదశలో 11 కోట్లకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పశ్చిమబెంగాల్లో ఈరోజు పోలింగ్ ఉన్న నాలుగు స్థానాల్లోనూ ముస్లిం ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. కర్ణాటకలో ఈరోజు పోలింగ్ ఉన్న 14 స్థానాలనూ 2019 ఎన్నికల్లో బీజేపీ క్వీన్స్వీప్ చేసింది. మూడో దశ ముగిస్తే మొత్తం 543 స్థానాలకుగాను ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283కి చేరుకుంటుంది. నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్ ఒకటో తేదీన నిర్వహిస్తారు. అన్ని స్థానాలకు ఓట్ల లెక్కింపును జూన్ 4న చేపడతారు.రాష్ట్రం సీట్లుగుజరాత్ 25కర్ణాటక 14మహారాష్ట్ర 11ఉత్తరప్రదేశ్ 10మధ్యప్రదేశ్ 9ఛత్తీస్గఢ్ 7బిహార్ 5అస్సాం 4బెంగాల్ 4గోవా 2దాద్రానగర్, హవేలీ, డయ్యూడామన్ 2
May 7th: ఏపీ ఎన్నికల సమాచారం
AP Political And Elections News Updates In Telugu7:25 AM, May 7th, 2024తప్పుడు పోస్టులపై ఈసీ సీరియస్.. కీలక ఆదేశాలుసోషల్ మీడియా లో తప్పుడు పోస్టులపై ఎన్నికల సంఘం సీరియస్ కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీమహిళల్ని కించపరచడం,మైనర్లతో ప్రచారం,జంతువులకు హాని తలపెడుతున్న వీడియోలు,ఫోటోలు నిషేధం.అలాంటి పోస్టులు ఈసీ నోటీసుకు వచ్చిన మూడు గంటల్లో గా తొలగించాలినిబంధనలు పాటించకుంటే ఆయా పార్టీల నాయకులపై కేసులు పెడతామని హెచ్చరిక. 6:59 AM, May 7th, 2024చిలకటూరిపేట పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. ఈసీ సీరియస్ చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఈసీ ఆదేశాలు.ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎం బ్యాలెట్(టెండర్ బ్యాలెట్) పేపర్లను ఇచ్చిన అధికారులు.అధికారుల నిర్లక్ష్యంతో 1219 మంది ఉద్యోగుల ఓట్లు చెల్లని వైనం.వీరందరికీ తిరిగి రెండు రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు.సంబంధిత అధికారులపై ఈనెల 9లోగా క్రమశిక్షణ చర్యలకు ఈసీ ఆదేశాలు6:45 AM, May 7th, 2024చంద్రబాబుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్సీఎం జగన్ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై సీఈసీ ఆగ్రహంఎన్నికల్ కోడ్ ను అతిక్రమించటంపై సీరియస్బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని వార్నింగ్ఏప్రిల్ 6న పెదకూరపాడు, 10న నిడదవోలు, తణుకు, 11న అమలాపురం, 15న పలాస, 17న పెడనలో జరిగిన సభల్లో సీఎంని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మాట్లాడిన చంద్రబాబు6:37 AM, May 7th, 2024భీమవరంలో టీడీపీ, జనసేన మధ్య రగడ..భీమవరంలో తెలుగు తమ్ముళ్లని ఉతికారేసిన జన సైనికులు!జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి ఆంజనేయులుకి ఏమాత్రం సహకరించని టీడీపీ.ప్రచారంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కవ్వింపులతో మొదలైన రగడసర్దిచెప్పేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల ముందే బాహాబాహీ.చేతికి దొరికిన వాటితో చితక్కొట్టిన జనసైనికులుఈ దెబ్బతో భీమవరంలో జనసేన గెలుపుపై ఆశలు గల్లంతు!6:30 AM, May 7th, 2024అబద్దం.. వాస్తవంఎన్నికల వేళ కూటమి కుట్రలుఏపీపై ఢిల్లీ పెద్దల తప్పుడు ప్రకటనలువాస్తవాలతో వివరించే యత్నం వీడియో పోస్ట్ చేసిన వైస్సార్సీపీమన రాష్ట్రంపై డిల్లీ పెద్దల తప్పుడు ప్రచారాలు Vs అసలు వాస్తవాలు! 💥#FactCheck#ProgressiveAP#YSJaganDevelopsAP #DevelopmentInAP pic.twitter.com/G2KbNXK9Pl— YSR Congress Party (@YSRCParty) May 6, 2024
Lok Sabha Election 2024: మోదీ, షా కంచుకోటలో... కాంగ్రెస్కు పెనుసవాల్
దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో శుక్రవారం మూడో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. కీలకమైన రాష్ట్రం గుజరాత్లో మొత్తం స్థానాలకూ ఇదే విడతలో పోలింగ్ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్లో గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్స్వీప్చేసింది. అదే ఊపులో ఈసారి హ్యాట్రిక్పై కన్నేసింది. లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో అంతకంతకూ చిక్కిపోతున్న కాంగ్రెస్ ఈసారి ఆప్తో కలిసి ‘ఇండియా’ కూటమి కింద బీజేపీని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో గుజరాత్లోని కీలక లోక్సభ స్థానాలపై ఫోకస్... వదోదర... కొత్త ముఖాలు గుజరాత్లో మూడో అతి పెద్ద నగరమిది. ఇక్కడ వరుసగా రెండు ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలుపొందిన రంజన్బెన్ ధనంజయ్ భట్ను బీజేపీ అనూహ్యంగా పక్కనబెట్టింది. డాక్టర్ హేమంగ్ జోషీని పార్టీ బరిలో నిలిపింది. కాంగ్రెస్ తరఫున పధియార్ జస్పాల్సింగ్ మహేంద్రసింగ్ పోటీలో ఉన్నారు. వీరిద్దరూ కొత్తవారే కావడం విశేషం. ఈ సీటు 1998 నుంచి బీజేపీ గుప్పిట్లోనే ఉంది. మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదంతో మరోసారి నెగ్గుతామని కమలనాథులు ధీమాగా ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 7 సెగ్మెంట్లలో 6 బీజేపీ ఖాతాలోనే పడ్డాయి. మిగతా చోట స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. 2014లో మోదీ లోక్సభ అరంగేట్రం వారణాసి, వదోదరల నుంచే జరగడం తెలిసిందే. ఇక్కడ ఆయనకు ఏకంగా 5.7 లక్షల మెజారిటీ లభించింది. వారణాసి నుంచి ఎంపీగా కొనసాగి వదోదరను వదులుకున్నారు. రాజ్కోట్... రూపాలాకు రాజ్పుత్ గండం గుజరాత్లో ఎదురే లేని కమలనాథులకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కొత్త చిక్కులు తెచ్చిపెట్టారు. సిట్టింగ్ ఎంపీ మోహన్ కుందరియాను కాదని బీజేపీ ఆయనకు టికెటిచి్చంది. కానీ ‘మహారాజులు బ్రిటి‹Ùవారికి, విదేశీ పాలకులకు లొంగిపోయారని, వారితో విందువినోదాల్లో మునగడమే గాక వాళ్లకు తమ కుమార్తెలనిచ్చి పెళ్లిళ్లు చేశా’రని రాజ్పుత్లపై రూపాలా చేసిన వ్యాఖ్యలతో ఆ సామాజికవర్గం భగ్గుమంది. ఆయన్ను రాజ్కోట్ బరి నుంచి తప్పించాలని, లేదంటే ఓడించి తీరుతామని బీజేపీకి వారు అలి్టమేటమిచ్చారు! ఆందోళనలు కూడా చేశారు. రూపాలా పలుమార్లు క్షమాపణలు చెప్పినా వివాదం సద్దుమణగలేదు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పరేశ్బాయ్ ధనాని పోటీలో ఉన్నారు. రాజ్పుత్లు, పటీదార్లు, మధ్య ఎప్పటినుంచో వైరముంది. పటీదార్ సామాజికవర్గానికి చెందిన రూపాలా దానికిలా ఆజ్యం పోయడం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.భావనగర్.. బరిలో ఆప్ ఈ స్థానంపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్నేసింది. కాంగ్రెస్తో పొత్తులో భాగంగా భావనగర్, బరుచ్లను ఆ పార్టీ దక్కించుకుంది. ఇక్కడ గట్టి పట్టున్న బీజేపీని ఢీకొట్టేందుకు ఉమేశ్బాయ్ నరన్బాయ్ మక్వానాను పోటీకి దించింది. బీజేపీ కూడా సిట్టింగ్ ఎంపీ భారతీబెన్ ధీరూబాయ్ శియాల్ను పక్కనబెట్టి నింబూబెన్ బంభానియాకు టికెటిచి్చంది. 1991 నుంచీ ఇక్కడ కాషాయ జెండానే ఎగురుతోంది. గత ఎన్నికల్లో భారతీబెన్కు 4.29 లక్షల మెజారిటీ లభించింది. ఈ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. మిగతా స్థానం ఆప్ది కావడం విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి 5 సీట్లు నెగ్గిన ఆప్ లోక్సభ బరిలో బీజేపీకి సవాలు విసురుతోంది. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ను అక్రమంగా అరెస్టు చేశారంటూ ప్రచారంతో హోరెత్తిస్తోంది. కేజ్రీవాల్ భార్య సునీత కూడా ప్రచారానికి దిగారు. పోర్బందర్.. మన్సుఖ్ అరంగేట్రం బీజేపీకి గట్టి పట్టున్న ఈ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తొలిసారి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 2012 నుంచీ రాజ్యసభకు ఎన్నికవుతున్న ఆయన పోటీతో పోర్బందర్పై ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రమేశ్బాయ్ ధడక్ చేతిలో 2.3 లక్షల ఓట్ల తేడాతో ఓడిన లలిత్ వసోయాకే కాంగ్రెస్ మళ్లీ టికెటిచి్చంది. ఈ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. కుతియానాలో మాత్రం సమాజ్వాదీ పార్టీ గెలిచింది. బనస్కాంత.. గెనీబెన్ సవాల్ ఉత్తర గుజరాత్లోని ఈ స్థానంలో బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ‘వావ్’ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గెనీబెన్ ఠాకోర్ను కాంగ్రెస్ బరిలోకి దించడమే అందుకు కారణం. దాంతో బీజేపీ కూడా సిట్టింగ్ ఎంపీ పర్వత్బాయ్ పటేల్ను కాదని ఇంజనీరింగ్ ప్రొఫెసర్ రేఖా బెన్ చౌదరి రూపంలో మహిళకే టికెటివ్వాల్సి వచ్చింది. ఆమెకు రాజకీయ అనుభవం లేదు. తొలిసారి ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. గుజరాత్లో ఇరు పారీ్టల నుంచీ మహిళలే రంగంలో ఉన్న ఏకైక సీటు కావడంతో బనస్కాంత అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దీని పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు చోట్ల గెలిచింది. అయితే గెనీబెన్ కమలం హవాలో కూడా విజయం సాధించి ‘వావ్’ అనిపించారు. రేఖాబెన్కు రాజకీయ అనుభవం లేకున్నా నియోజకవర్గంతో సత్సబంధాలున్నాయి. బనస్ డెయిరీ ఈ నియోజకవర్గంలోని 4.5 లక్షల మంది రైతుల నుంచి రోజూ పాలు సేకరిస్తుంది. దీని వ్యవస్థాపకుడు గల్బాబాయ్ చౌదరి మనుమరాలు రేఖ. ఆమె భర్త హితేశ్ చౌదరి బీజేపీ నాయకుడు. అయినా గెనీబెన్ వంటి బలమైన ప్రత్యరి్థపై రేఖ వంటి కొత్త ముఖాన్ని నిలబెట్టడంపై బీజేపీ కార్యకర్తల్లోనూ అసంతృప్తి నెలకొందని పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి!గాంధీనగర్.. అద్వానీ కోటలో షా పాగా! ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటైన ఈ నియోజకవర్గం 1989 నుంచి కమలనాథుల గుప్పిట్లోనే ఉంది. శంకర్ సింఘ్ వాఘేలా, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ వంటి హేమాహేమీలకు నెలవైన ఈ స్థానంలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ దిగ్గజం అమిత్ షా పాగా వేశారు. గత లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 5,57,014 ఓట్ల మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. ఈసారి మెజారిటీ మరింత పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన్ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి! చివరకు 62 ఏళ్ల సోనల్ పటేల్ను రంగంలోకి దించింది. ఆమె ఏఐసీసీ సెక్రటరీగా. ముంబై, పశి్చమ మహారాష్ట్ర ఇన్చార్జిగా ఉన్నారు. గిఫ్ట్ సిటీ అభివృద్ధి, గాంధీ సబర్మతి ఆశ్రమానికి మెరుగులు, అయోధ్య రామ మందిరం, మోదీ ఫ్యాక్టర్ తదితరాలతో తనకు తిరుగులేదని షా ధీమాతో ఉన్నారు. గాం«దీనగర్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాలూ బీజేపీవే! సీఎం భూపేంద్ర పటేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఘట్లోడియా కూడా వాటిలో ఒకటి.– సాక్షి, నేషనల్ డెస్క్
ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
నరసరావుపేట రూరల్/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/పెనమలూరు: పోలింగ్తేదీ సమీపిస్తున్న కొద్దీ ఓటమి తథ్యమనే విషయం తెలుస్తుండటంతో టీడీపీ నేతలు కుట్రలకు పదునుపెట్టారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను కొల్లగొట్టాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నిబంధనల్ని ఉల్లంఘించి ప్రలోభాల వలలు విసురుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సోమవారం కూడా నగదు ఎర వేస్తూ, ప్రలోభాలకు గురిచేస్తూ, బెదిరిస్తూ.. ఏదో ఒకరకంగా ఓట్లు వేయించుకోవాలని బరితెగించి వ్యవహరించారు. ప్రశ్నించినవారిపై దాడిచేసి కిడ్నాప్ చేస్తున్నారు. అక్రమాలను ప్రశ్నించిన వైఎస్సార్సీపీ వారిపై రాళ్లదాడులకు దిగుతున్నారు. నరసరావుపేటలో ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి కిడ్నాప్ నరసరావుపేటలో ఎస్ఎస్ అండ్ ఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్ట్ల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఓటర్లకు నగదు ఎర చూపారు. దీన్ని సెల్ఫోన్లో చిత్రీకరించిన ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి సత్యనారాయణరెడ్డి అక్కడున్న పోలీసు అధికారులకు చూపించారు. పోలీసులు.. టీడీపీ నాయకుల ప్రచారానికి అభ్యంతరం తెలిపి వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో టీడీపీ వారు సత్యనారాయణరెడ్డిపై దాడిచేసి కొట్టి బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. విషయం తెలిసి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. అక్కడున్న టీడీపీ వారిని పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై తెలుగుదేశం వర్గీయులు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. కాగా, తనపై దాడిచేసి బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మధిర సత్యనారాయణరెడ్డి చెప్పారు. టీడీపీ నాయకులకు చెందిన ఈ విద్యాసంస్థలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంపై వైఎస్సార్సీపీ వర్గీయులు కలెక్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.నిస్పాక్షికంగా ఉన్న ఉద్యోగులే లక్ష్యం విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ హై సూ్కల్కు ఎదురుగా ఉన్న పోలింగ్ కేంద్రం సమీపంలో టీడీపీ నాయకులు పోతన్నరెడ్డి, కాళ్ల శంకర్, బొట్ట రమణ నిస్పాక్షికంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా హడావుడి చేశారు. ఓటర్ల వివరాలు నమోదు చేసుకున్న కార్యకర్తలు తర్వాత ఫోన్ పే, గుగూల్ పే వంటి వాటిని ఉపయోగించినట్లు తెలిసింది.ఉద్యోగి ఓటు వేసిన మరో వ్యక్తికృష్ణాజిల్లా పెనమలూరులో ఏర్పాటు చేసిన 141 పోలింగ్ కేంద్రంలో పెనమలూరు సచివాలయం–1లో డిజిటల్ అసిస్టెంట్ మట్ట కిషోర్బాబు ఓటును గుర్తుతెలియని వారు వేశారు. సోమవారం ఓటేసేందుకు వచ్చిన కిషోర్బాబు తన ఓటు అప్పటికే వేసి ఉండటంతో అభ్యంతరం తెలిపారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లు కూడా నిరసన తెలిపి కిషోర్కు ఓటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కిషోర్బాబుకు మంగళవారం 140వ బూత్లో ఓటు కల్పిస్తామని ఏఆర్వో వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. పోలింగ్ కేంద్రం హెల్ప్డెసు్కలో విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడు ఎల్.గోవిందరాజులు టీడీపీకి ఓటేయాలని తమకు సూచించారని ఉయ్యూరు ఏజీ ఆండ్ ఎస్జీ కాలేజీ ఎన్ఎస్ఎస్ వలంటీర్లు చెప్పారు. దీనిపై వైఎస్సార్సీపీ ఏజెంట్లు ఏఆర్వోకి ఫిర్యాదు చేశారు. దీంతో గోవిందరాజులును ఎన్నికల విధుల నుంచి తప్పించారు.
ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
న్యూయార్క్: నీలిచిత్రాల తార స్టార్మీ డేనియల్తో సంబంధం విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆమెకు తన లాయర్ ద్వారా అనైతిక మార్గంలో నగదు పంపించిన(హష్ మనీ) కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కోర్టు ఆగ్రహానికి గురయ్యారు. జడ్జీలు, సాక్షులపై వ్యాఖ్యానాలు చేయొద్దని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టొద్దన్న గ్యాగ్ ఉత్తర్వులను మళ్లీ ఉల్లంఘించినందుకు 1,000 డాలర్ల జరిమానాను న్యాయస్థానం విధించింది. మరోసారి ఉల్లంఘిస్తే జైల్లో పడేస్తామని సోమవారం జడ్జి జువాన్ ఎం.మెర్చాన్ హెచ్చరించారు. ఇప్పటికే తొమ్మిదిసార్లు ఉల్లంఘించినందుకు గత వారమే ట్రంప్నకు 9,000 డాలర్ల జరిమానా విధించడం విదితమే.
రాయ్బరేలీ వ్యూహం
ఎట్టకేలకు ఒక చర్చ ముగిసింది, మరో చర్చ మొదలైంది. కాంగ్రెస్ నేత, గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ శుక్రవారం రాయ్బరేలీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడంతో ఉత్తర ప్రదేశ్లో ఆయన పోటీ చేస్తారా, లేదా అన్న చర్చకు ఫుల్స్టాప్ పడింది. అదే సమయంలో 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతుల్లో ఓటమి పాలైన అమేథీని కాకుండా, ఇటీవల రాజ్యసభకు వెళ్ళేంత వరకు తన తల్లి ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీని ఆయన ఎన్నుకోవడంతో కొత్త చర్చ మొదలైంది. భారత రాజకీయాలకు గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్ నుంచి మళ్ళీ పోటీ చేసేందుకు రాహుల్ తీసుకున్న నిర్ణయంపై అంచనాలున్నాయి, అనుమానాలూ ఉన్నాయి. ఈ పోటీతో ఎన్నికల వ్యూహంలోనూ, ఇటు విస్తృత రాజకీయ కథనంలోనూ కాంగ్రెస్ పార్టీ గట్టి మార్పు తెస్తున్నట్టు కనిపిస్తోంది. ఉత్తరాదిన పార్టీకి మళ్ళీ జవసత్వాలు అందించడానికి దీన్ని ఒక అవకాశంగా కాంగ్రెస్ భావిస్తోంది. అమేథీ స్థానంలో కాకున్నా కుటుంబానికి కలిసొచ్చిన రాయ్బరేలీని ఎంచుకోవడం ద్వారా యూపీ ఎన్నికల క్షేత్రంలో పార్టీకి రాహుల్ కొత్త ఉత్సాహం తెచ్చారనుకోవాలి. చిరకాలంగా గాంధీ కుటుంబ వారసులే పోటీ చేస్తున్న కంచుకోట లాంటి అమేథీ స్థానాన్ని... నియోజకవర్గం బాగోగులు చూసే మరో విధేయ నేత కేఎల్ శర్మకు కట్టబెట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 20 ఎన్నికల్లో 17 సార్లు కాంగ్రెస్కే జై కొట్టిన స్థానం రాయ్బరేలీ. ప్రధాని ఇందిరాగాంధీ మొదలు పలువురు గాంధీ కుటుంబ సభ్యులకు పట్టం కట్టిన మరో కంచుకోట. అక్కడ పోటీ ద్వారా యూపీలో క్రియాశీలకంగా నిలవడమే కాక, తనపై బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రాహుల్ వీలు చిక్కించుకున్నారు. అయితే, ఆఖరు నిమిషంలో ప్రకటించిన ఈ అభ్యర్థిత్వంతో అనేక సవాళ్ళూ తప్పవు. వాటిని ఎలా అధిగమించి, సంక్లిష్ట సామాజిక – రాజకీయ కోణాలున్న హిందీ హార్ట్ల్యాండ్లో పట్టు సాధిస్తారన్నది చూడాలి. ఆ రాష్ట్రంలో బీజేపీకి ఉన్నంత బలమైన ఎన్నికల యంత్రాంగం, పార్టీ వ్యవస్థ ప్రస్తుతం కాంగ్రెస్కు లేకపోవడం లోటు. వాటిని అధిగమించి, ప్రస్తుత ఉత్సాహాన్ని ఎన్నికల లబ్ధిగా ఎలా మలచగలుగుతారో వేచిచూడాలి. నిజానికి, క్రితంసారి ఉత్తరాదిన కాంగ్రెస్ ఊపు తగ్గినా దక్షిణాదిలో ఉనికి నిలిపిన కేరళలోని వయనాడ్ స్థానమంటే సహజంగానే రాహుల్కు ప్రత్యేక అభిమానం. అది ఆయన మాటల్లో, చేతల్లో కనిపిస్తూనే ఉంటుంది. దక్షిణాదిన హస్తం హవా కొనసాగేందుకు వయనాడ్ భావోద్వేగ బంధంగా ఉపకరిస్తుందని ఆయన ఆలోచన. అందుకే, ఈసారీ ఆయన అక్కడ నుంచి కూడా పోటీ చేశారు. వయనాడ్లో రాహుల్ స్థానికేతరుడనీ, యూపీలో గెలిస్తే ఈ స్థానాన్ని వదిలేస్తాడనీ ప్రత్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నందు వల్లే అక్కడ ఎన్నికలయ్యేంత వరకు తెలివిగా తన రాయ్బరేలీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదు. ఆఖరి వరకూ అమేథీ, రాయ్బరేలీలలో పోటీ అంశాన్ని సస్పెన్స్లోనే ఉంచుతూ, అధికార పార్టీని ఇరుకునపెట్టారు. బీజేపీ సైతం పోటీకి భయపడి రాహుల్ వెనుకంజ వేస్తున్నారన్న ప్రచారంతో ఒత్తిడి పెంచింది. ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ, ముఖాముఖి పోరుకు వెరవడం లేదని నిరూపించేందుకు రాహుల్కు ఈ రాయ్బరేలీ అభ్యర్థిత్వం ఉపకరించనుంది. హస్తం పార్టీకి రాయ్బరేలీ ఎంత అడ్డా అయినా, రాహుల్ పోటీలో రిస్కులూ ఉన్నాయి. యూపీలోని మొత్తం 80 లోక్సభా స్థానాల్లో క్రితంసారి 64 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి అంతకు మించి ఫలితాలు సాధించాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయన అలవాటైన స్థానం వదిలేసి, సాహసించారు. కానీ, ఆయన ఛరిష్మా, కాంగ్రెస్కు చిరకాలంగా ఉన్న స్థానిక సంబంధాలు పనికొస్తాయని భావిస్తున్నారు. అసలు అమేథీలో ప్రియాంక, రాయ్బరేలీలో రాహుల్ పోటీ చేయాలన్న ఆలోచనా ఒక దశలో జరిగింది. కానీ, ప్రతిపక్షం ఆరోపిస్తున్న వారసత్వ రాజకీయాలు, బంధుప్రీతికి ఊతమిచ్చినట్టు అవుతుందని దానికి స్వస్తి చెప్పారు. ఇక, అమేథీలో పోటీచేస్తున్న కేఎల్ శర్మ పంజాబ్ నుంచి వచ్చినవారైనప్పటికీ, ఇరుగుపొరుగు స్థానాలైన అమేథీ, రాయ్బరేలీల్లో గత 30 ఏళ్ళుగా పార్టీ తరఫున పనిచేస్తున్నారు. జనంతో, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలున్న ఆయన, స్టార్ అభ్యర్థి స్మృతీ ఇరానీపై గెలుస్తారని కాంగ్రెస్ ఆశ. 1977లో ఇందిరా గాంధీపై రాజ్నారాయణ్, గడచిన 2019లో రాహుల్పై స్మృతి గెలిచినట్టే, రేపు స్మృతిపై శర్మ గెలవకూడదని ఏమీ లేదు. అధిక సంఖ్యాక ప్రజల మద్దతే కీలకమైన ప్రజాస్వామ్యంలో ఏమైనా జరగవచ్చు. అసలు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది సదరు వ్యక్తుల, పార్టీల నిర్ణయం. అయితే, దేశంలోని అనేక ప్రధాన సమస్యల కన్నా అమేథీ, రాయ్బరేలీలలో రాహుల్ పోటీ చేస్తారా, లేదా అన్నదే ముఖ్యమన్నట్టుగా జాతీయ టీవీ ఛానళ్ళు దీనిపైనే చర్చోపచర్చలు చేయడం విచిత్రం. 1952లో ఫిరోజ్ గాంధీ, తర్వాత ఇందిర, అటుపైన సోనియా, ఇప్పుడు రాహుల్ పోటీతో రాయ్బరేలీతో కాంగ్రెస్ బంధం అమేథీ కన్నా పాతది, పట్టున్నది. కానీ, ఇల్లలకగానే పండగ కాదు. సాక్షాత్తూ ప్రియాంక యూపీ ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ 398 స్థానాల్లో పోటీ చేసినా, రెండంటే రెండింట్లో గెలిచింది. ఇప్పుడు లోక్సభకు 17 స్థానాల్లో బరిలో నిలిచింది. అభ్యర్థుల పేర్లు కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. ఒకవేళ రేపు వయనాడ్, రాయ్బరేలీ – రెంటిలోనూ రాహుల్ గెలిస్తే, దేన్ని వదులుకోవాలన్నదీ చిక్కే. రాగల రోజుల్లో మరిన్ని విడతల పోలింగ్తో ఎన్నికల వేడి పెరిగాక కానీ, యూపీలో రాహుల్ పోటీ తాలూకు సిసలైన ప్రభావమేమిటో అర్థం కాదు. ఒకవేళ పాచిక పారి, రాయ్బరేలీలోనే కాక యూపీ అంతటా రాహుల్ ప్రభావం కనిపిస్తే రాజకీయాలు మళ్ళీ మలుపు తిరుగుతాయి. హస్తం పార్టీ ఆశ కూడా అదే!
సమాన అవకాశాల... విద్యా విప్లవం
భారతీయ సమాజంలో అసమానతలు అధికంగా ఉండటానికి ప్రధాన కారణం అవకాశాలు అందరికీ సమానంగా లేకపో వడం. ముఖ్యంగా మంచి విద్యను అభ్యసించే అవ కాశం కొందరికే ఉండటం. దీన్ని గమనించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కనివిని ఎరుగని రీతిలో విద్యావ్యవస్థ రూపురేఖలను మార్చేశారు. దీంతో ఎక్కడో కొండ కోనల్లో నివసించే ఆది వాసీ పిల్లలు సైతం పట్టణ ప్రాంత విద్యార్థులతో సమానంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిపుచ్చుకుంటు న్నారు. ఇదో విప్లవం. ఈ విప్లవ ఫలితాలు ఇప్పుడి ప్పుడే దృశ్యమానమవుతున్నాయి. కొండబారిడి గిరి జన గ్రామానికి చెందిన బాలిక మనస్విని ఐక్యరాజ్య సమితి దాకా వెళ్లడం ఇందుకు ఒక ఉదాహరణ.కొండబారిడి ఒక సవర ఆదివాసీ పల్లె. ఆరు దశాబ్దాల క్రితం ఇక్కడ వెంపటాపు సత్యం అనే బడి పంతులు భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమించి సాయుధ విప్లవం సృష్టించాడు. నేడు అదే గ్రామంలో ఇపుడు చదువుల విప్లవం కూడా మొద లైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నదే కొండ బారిడి. ఆ పల్లెకు చెందిన ఎస్. మనస్విని ఆంగ్లంలో అరుదైన ప్రతిభ చూపడంతో తనతో పాటు మరో 9 మంది విద్యార్థులను అమెరికాలోని ఐక్యరాజ్య సమితి ఆహ్వానించగా... అక్కడ ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ సంస్థల సదస్సులో పాల్గొని వచ్చింది.‘ఏపీలో విద్యావ్యవస్థపై ఐక్యరాజ్య సమితిలో మాట్లాడాను. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యావిధానం, ‘నాడు–నేడు’తో మా స్కూల్ స్వరూపమే మారిపోవడం గురించి వివరించాను. మన ప్రభుత్వం మాలాంటి పేదల చదువు కోసం చేస్తున్న కృషిని తెలుసుకొని వారు ఎంతో ఆశ్చర్య పోయారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్కూల్స్లో ఎలా ప్రవేశ పెడుతున్నారు? వాతావరణ మార్పుల ప్రభావం గురించి చెప్పాను. మారుమూల గిరిజన పల్లెకు చెందిన నాకు ఇదొక మరువలేని అనుభూతి’ అని సంతోషంగా చెప్పింది మనస్విని. సింగిల్ పేరెంట్కు చెందిన ఈ ఆదివాసీ బాలిక గుమ్మలక్ష్మిపురం, కేజీబీవీ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. సర్కారు బడుల్లో చదివే పేద పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించాలనే తప నతో ఆధునిక విద్యాబోధన, మౌలిక వసతుల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘నాడు–నేడు’ కార్యక్రమంలో 44,512 ప్రభుత్వ బడులను బాగు చేసే కార్యక్రమాన్ని మూడు దశలుగా విభజించి ముందుకెళుతోంది. ‘అమ్మ ఒడి’ వంటి వినూత్న పథకాలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ను పెంచాయి. దాదాపు 2,47,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు మారడం ఇందుకు నిదర్శనం.అరకు నుండి డుంబ్రిగుడ వెళ్లేదారిలో జైపూర్ బస్స్టాప్ ఎదురుగా కొండల మధ్య ఇంద్రధను స్సులా మెరిసిపోతున్న కోట లాంటి రెసిడెన్షియల్ గిరిజన పాఠశాల దగ్గర ఆగాం. విశాలమైన ప్లేగ్రౌండ్లో ఆడుకుంటున్న తమ పిల్లలను చూడడా నికి వచ్చిన పేరెంట్స్ని పలకరించినపుడు...‘ప్రభుత్వం తన ఆలోచనలకు అనుగుణంగా చేపట్టిన పనులతో ఈ ప్రభుత్వ స్కూళ్లు కార్పొరేట్ స్కూళ్లను మించి మారిపోయాయి. మా పాపను ఈ స్కూల్లో చేర్పించడానికి సీట్లు లేక చాలా కష్ట పడాల్సి వచ్చింది. ప్రభుత్వ ప్రయత్నం బాగుంద’ని అన్నారు. ‘గిరిజన గ్రామాల్లో బడులను ఏకపక్షంగా ఇంగ్లిష్ మీడియంలోకి మార్చడం లేదు. ప్రతిదీ పద్ధతి ప్రకారం, శాస్త్రీయ విధానంలో సాగుతోంది. ప్రతి పుస్తకాన్నీ బైలింగ్యువల్ పద్ధతిలో... అంటే ఒక పేజీ ఇంగ్లిష్, పక్క పేజీ తెలుగులో ముద్రించారు . దీని వల్ల పిల్లలు తెలుగును మర్చిపోకుండా ఇంగ్లిషును నేర్చుకుంటున్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల బడి మానేసే పిల్లల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింద’ని పార్వతీపురం మన్యం జిల్లా, చాపరాయి బిన్నిడి పాఠశాల ఉపాధ్యాయుడు వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా 40 వేల తరగతి గదుల్లో ఐఎఫ్బీలు ఏర్పాటు చేసినట్టు ఆమధ్య ఒక ఆంగ్ల ఛానెల్ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్యూలో సీఎం వై.ఎస్. జగన్ చెప్పినపుడు అవి విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకుందామని, గుమ్మలక్ష్మీపురం గ్రామంలోని ఒక స్కూల్కి వెళ్లాం. అక్కడ విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ఉన్న ట్యాబ్స్ ఇచ్చారు. ఆరో తరగతి నుంచి, ఆపై తరగ తుల్లోని ప్రతి క్లాస్రూమ్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. గుండె పనిచేసే విధా నాన్ని డిజిటల్ స్క్రీన్ మీద విద్యార్థులకు టీచర్లు బోధించడం చూశాం. ఇలా ఒక ప్రణాళికా బద్ధంగా పాఠశాల విద్యా రంగంలో వినూత్న మార్పులు మొదలై టీచర్లలో నైపుణ్యం, సామర్థ్యం పెంపుకు కూడా సర్కారు కృషి చేస్తున్నది. ఏపీ విద్యారంగం సరికొత్త మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఇందువల్ల సమాన విద్యావ కాశాలకు నోచుకుంటున్నారు బడుగులు. ఇంతకంటే కావలసినదేముంది?శ్యాంమోహన్ వ్యాసకర్త కార్టూనిస్ట్, జర్నలిస్ట్మొబైల్: 94405 95858
అక్రమాలు కో‘కొల్లు’లు
విజయవాడ: కృష్ణాజిల్లాలోని తీరప్రాంత ముఖ్య పట్టణానికి ప్రాతినిధ్యం వహించిన ఆ టీడీపీ నేత అక్రమాలు కోకొల్లలు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రి పదవీ వెలగబెట్టిన ఆయన హయాంలో ప్రజలు మౌలిక వసతులు లేక నరకం అనుభవించారు. గుక్కెడునీటికీ అంగలార్చారు. కానీ ఆయన మాత్రం భారీగా అక్రమాస్తులు మూటగట్టారు. మామ ద్వారా వసూళ్ల దందా సాగించారు. సెటిల్మెంట్లు చేశారు. ప్రభుత్వ స్థలాలూ కాజేశారు. అవినీతి సొమ్ముతో విజయవాడతో పాటు తీరప్రాంత మండలాలు, హైదరాబాద్లలో రూ.కోట్ల విలువ చేసే స్థలాలు కొన్నారు. ఎక్సైజ్లో భారీగా దోపిడీ ∗ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భారీగా దండుకున్నారు. ఒక్కో బదిలీకి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మంత్రిగా ఉన్న రెండేళ్లలోనే రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు దోపిడీకి పాల్పడ్డారు. లిక్కర్ దందా నడిపారు. ∗ భీమవరంలో భార్యాభర్తల మ్యూచువల్ బదిలీ కోసం దాదాపు రూ.40 లక్షలు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ∗ ఎక్సైజ్ శాఖలో డిజిటలైజేషన్ నిమిత్తం కాంట్రాక్టర్ నుంచి రూ.5 కోట్లు నాటి ప్రభుత్వ పెద్దలకు అందాయి. ఆ కాంట్రాక్టర్ నుంచి మాజీ మంత్రి రూ.2 కోట్లు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఎక్సైజ్ స్టేషన్ల నుంచి నెలవారీ మామూళ్లూ వసూలు చేశారని సమాచారం. ∗ ఇసుక రవాణాలోనూ వసూళ్ల దందాకు పాల్పడ్డారు. ఈ తంతు మొత్తం మాజీ మంత్రి అనుచరుడు దగ్గరుండి నడిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయన అండతో ముఖ్యపట్టణంలో తెలుగు తమ్ముళ్లు భూ కబ్జాలకు పాల్పడ్డారు. ప్లాట్లుగా వేసి స్థలాలు అమ్ముకున్నారు. రూ.కోట్లకు పడగలెత్తారు. ∗ సొంత రైసు మిల్లును అడ్డుపెట్టుకుని ధాన్యం కొనుగోళ్లలో అక్రమ దందాకు పాల్పడ్డారు. రూ.3 కోట్ల వరకు ఇలా బొక్కేసినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండూ ప్రతిపక్షాల నుంచి వినిపించింది. ∗ కరకట్ట, చల్లపల్లి బైపార్ రోడ్డు, విజయవాడ – మచిలీపట్నం హైవే నిర్మాణ పనులకు సంబంధించిన మట్టి (బుసక) సరఫరాలో నాలుగున్నరేళ్లలో రూ.వందల కోట్లు మింగారు. పొక్లెయిన్ బుజ్జీని బినామీగా పెట్టి కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు తవ్వి వచి్చన మట్టిని నిర్మాణాలకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారు. ∗ ప్రభుత్వ పథకాల మంజూరులోనూ భారీ వసూళ్లకు తెరతీశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీకి కమీషన్లు వసూలు చేసి తన కక్కుర్తి బుద్ధిని చాటుకున్నారు. రైతు రథం పంపిణీ, అదనపు తరగతుల నిర్మాణాల్లోనూ గడ్డికరిచినట్టు ఆరోపణలు ఉన్నాయి. ∗ బినామీల పేరుతో కాల్మనీ వ్యవహారం నడిపించి రూ.1.50 కోట్లు దండుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ∗ రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ అభ్యర్థి వద్ద రూ.5 లక్షలు వసూలు చేశారని సమాచారం. ఉద్యోగం రాకపోవడంతో ఆ అభ్యర్థి ప్రశి్నస్తే రూ.3 లక్షలు బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇప్పిస్తానని నచ్చజెప్పినట్లు సమాచారం. ∗ ముఖ్యపట్టణంలో డివైడర్ గ్రిల్ పనుల్లోనూ అవకతవకలకు పాల్పడ్డారు. బీచ్ ఫెస్టివల్, పోర్టు పనులు ప్రారంభం విషయంలో చంద్రబాబు పర్యటనలోనూ భారీగా వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణంలోనూ భారీగా కమీషన్లు దండుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ∗ ఒక్కో వాటర్ ట్యాంక్ రూ.5 కోట్లతో 7 ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ట్యాంకుకు 10 శాతం చొప్పున రూ.3.50 కోట్లు దండుకున్నట్లు తెలిసింది. ∗ రైల్వే గేట్ నుంచి మంగినపూడి బీచ్ వరకు రూ.14 కోట్లతో చేపట్టిన రోడ్డు పనుల్లో 10 శాతం వాటా కింద రూ.1.40 కోట్లు వసూలు చేశారు. గుట్కా విక్రయదారుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ∗ జాతీయ తుపాను విపత్తుల నివారణ పథకం కింద రూ.36.45 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో మచిలీపట్నం నుంచి కృత్తివెన్ను మండల సమీపం వరకు 18.6 కిలోమీటర్ల మేర చేపట్టిన కరకట్ట నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలిచ్చారు. అనతి కాలంలో ఆ కరకట్ట బాగా దెబ్బతింది. ∗ మంత్రి రాజకీయ గురువు కూడా ఈ అక్రమాల్లో భాగం పంచుకున్నారు. తన పరిశ్రమలో నకిలీ ఎరువులు తయారు చేసి, వాటిని రైతులకు కట్టబెట్టి రూ.లక్షలు కొల్లగొట్టారు. ఈ విషయం అప్పట్లో దుమారం రేపింది. విజిలెన్స్ అధికారులు దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. హత్య సహా 25 కేసులు ఈ మాజీ మంత్రి 2020 జూలై 27న మచిలీపట్నం చేపల మార్కెట్లో జరిగిన వైఎస్సార్ సీపీ నాయకుడు మోకా భాస్కరరావు హత్య కేసులో ఏ–4 నిందితుడిగా ఉన్నారు. క్రైం నంబర్ 192/2020తో 120 బీ, 302 ఐపీసీ 109 రెడ్ విత్ 34, 37 ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది. ఆయన పరారు కావడంతో పోలీసు ప్రత్యేక బృందం గాలించి అదుపులోకి తీసుకుంది. రెండు నెలల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కేసు ఇప్పటికీ నడుస్తోంది. ఈయనపై 2009 నుంచి ఇప్పటి వరకు హత్య, ఎస్సీ, ఎస్టీ కేసులతోపాటు మొత్తం 25 కేసులు నమోదయ్యాయి. అందులో 12 కేసుల నుంచి తన పలుకుబడి ఉపమోగించి బయటపడ్డారు. మిగిలినవి విచారణ దశలో ఉన్నాయి.
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్రోబ్కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్తో, గ్లామ్డేస్ విభిన్నమైన నెక్లెస్లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- భారత్ సేవల రంగం నెమ్మది
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
సినిమా
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
మంచువిష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ప్రముఖులు నటిస్తోన్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ఓ అతిథి పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అతడు నందీశ్వరుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.కన్నప్పలో ప్రభాస్అయితే కన్నప్ప షూటింగ్లో ప్రభాస్ ఎప్పుడు జాయిన్ అవుతారనే విషయంపై నెట్టింట టాక్ నడుస్తోంది. ది రాజాసాబ్, కల్కి సినిమాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్.. కన్నప్ప కోసం కేవలం మూడు రోజుల సమయం మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. మే సెకండ్ వీక్లో ప్రభాస్ పాల్గొననున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అక్షయ్ కుమార్ తన సీన్లకు సంబంధించిన షూటింగ్ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని విష్ణు మంచు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.అయితే మొదట శివుడి పాత్రలో ప్రభాస్ను తీసుకోవాలనుకున్నారు. కానీ అక్షయ్ ఎంట్రీతో ప్రభాస్ నందీశ్వరుడి పాత్ర పోషించనున్నాడు. దీంతో ప్రభాస్తో షూటింగ్ పూర్తి చేయడానికి ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాను మంచు విష్ణు భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్ కూడా కీలకపాత్రలు పోషించనున్నారు. ఇక సినిమాలో పార్వతిగా అనుష్క శెట్టి నటిస్తోంది.
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
హమరేశ్, ప్రార్ధన సందీప్ జంటగా నటించిన చిత్రం సత్య. ఈ చిత్రాన్ని వాలీ మోహన్దాస్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ సినిమాను శివమ్ మీడియా బ్యానర్పై శివమల్లాల నిర్మించారు. ఈ బ్యానర్లో వచ్చిన తొలి సినిమాగా సత్య నిలిచింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎనిమిది మంది దర్శకుల చేతుల మీదగా విడుదల చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ సినిమా మే 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపారు.ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణచైతన్య మాట్లాడుతూ..'హమరేష్ చూడడానికి జీవీ ప్రకాష్ లాగా ఉన్నాడు. నిర్మాత శివ మల్లాల నాకు నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి తెలుసు, నన్ను జనాలకి చూపించడానికి ఫొటోస్ తీసేవారు. ఆయనకి ఈ సినిమా పెద్ద సక్సెస్ ని తీసుకుని రావాలని కోరుకుంటున్నా' అని అన్నారు. డైరెక్టర్ శశి కిరణ్ టిక్క మాట్లాడుతూ..' సత్య ట్రైలర్ చాల బాగుంది. టీం అందరికీ అల్ ది బెస్ట్, శివ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఆయనా అలానే నవ్వుతూ ఉండాలి. అలానే మంచి సక్సెస్ అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. చిత్ర దర్శకుడు వాలి మోహన్ దాస్ మాట్లాడుతూ.' తమిళంలో ఈ సినిమాని నేను రంగోలిగా తీశాను. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో శివ మల్లాల ద్వారా వస్తోంది. అందరూ చూసి మంచి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా' అని అన్నారు.నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ..'ఈరోజు నాకోసం ఇంత మంది వచ్చి సపోర్ట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. జస్ట్ ఈ సినిమా చూసి రివ్యూ చెప్దామని అనుకున్నా. కానీ సినిమా చూడగానే నాకు బాగా నచ్చింది. ఈరోజు జస్ట్ ట్రైలర్ లాంఛ్కే ఎనిమిది మంది డైరెక్టర్స్ వచ్చారు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు నేను ఫోటోగ్రాఫర్గా కెరీర్ ప్రారంభించి ప్రొడ్యూసర్ వరకు వచ్చా. నా కెరీర్ ముందు నుంచి సపోర్ట్ చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. మే 10న సత్య సినిమా వస్తుంది. అందరూ తప్పకుండా చూడండి' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సుందరమూర్తి కేఎస్ సంగీతమందించారు.
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత వస్తున్న సినిమా కావడంతో తారక్ ఫ్యాన్స్ క్రేజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్లో జరుగుతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అటవి ప్రాంతంలో దేవర షూటింగ్ జరుగుతున్న సమయంలో జూనియర్ ఆర్టిస్టులపై తేనెటీగలు దాడి చేసినట్లు తెలుస్తుంది. షూటింగ్ స్పాట్లో ఉన్న 20 మందికి పైగా గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వారందరూ కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారట. ప్రమాదం జరిగిన సమయంలో జూ ఎన్టీఆర్ లేరు. ఆయన ప్రస్తుతం 'వార్2' సెట్స్లో ఉన్నారు.జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న దేవరలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నరైన్, సైఫ్ అలీఖా న్ , టామ్ షైన్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజాగ్ షెడ్యూల్లో తొలుత ఎన్టీఆర్ పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. ఈ చిత్రంలో మొత్తం ఆరుగురు హీరోయిన్లు నటించారు. బాలీవుడ్ భామ రిచ్చా చద్దా ఈ సిరీస్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో విశేష ఆదరణ దక్కించుకుంటోంది. మే 1వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిచా సహానటులపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముఖ్యంగా నటీమణులు, మహిళా నిర్మాతలతో పనిచేయడం గురించి మాట్లాడింది. తనతో పోటీపడేందుకు ప్రయత్నిస్తున్న వారితో కలిసి పనిచేసినట్లు వెల్లడించింది. ఎలాంటి సూచనలు ఇవ్వకుండా తన ఎదుగుదలను అడ్డుకునే వారితో కలిసి నటించడం చాలా కష్టంగా అనిపించిందని తెలిపింది.రిచా చద్దా మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో చాలామంది స్త్రీవాదులనే ఆలోచనను నేను అంగీకరించను. చెక్కులు బౌన్స్ అయిన మహిళా నిర్మాతలతో కూడా పనిచేశా. అంతే కాదు వారితో కొన్ని భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా. అలాంటి వారు కేవలం ట్విట్టర్లో మాత్రమే స్త్రీవాదులుగా చలామణి అవుతుంటారు. సినిమా సెట్లో నటీనటుల మధ్య సోదరి భావం ఎప్పుడూ ఉండదు. తనకు ఎలాంటి సరైన సూచనలు ఇవ్వకుండా.. సన్నివేశాలలో లైట్స్ ఆఫ్ చేసే సహనటులు ఇప్పటికీ నాతో నిరంతరం పోటీ పడుతున్నారు. స్త్రీవాదమనేది జెండర్కు సంబంధించినది కాదు. పురుషుల్లోనూ బలమైన స్త్రీవాదులు ఉన్నారని తెలుసు' అని అన్నారు. పురుషులు కూడా స్త్రీవాదులు కావచ్చు.. అలాగే స్త్రీలు కూడా పురుషవాదులు కావచ్చని పేర్కొంది. కాగా.. రిచా చద్దా ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ'హీరామండిలో తన నటనకు ప్రశంసలు అందుకుంది.
ఫొటోలు
క్రీడలు
IPL 2024: ముంబై ఆశలకు సూర్య ఊపిరి
ముంబై: ఐపీఎల్ నుంచి ‘ఫైవ్ స్టార్’ చాంపియన్ ముంబై ఇండియన్స్ అందరికంటే ముందుగా ని్రష్కమించే ముప్పును సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్స్లు) తప్పించాడు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడి ముంబైని రేసులో నిలిపాడు. సోమవారం జరిగిన మ్యాచ్లో ముంబై 7 వికెట్ల తేడాతో హైదరాబాద్పై ఘనవిజయం సాధించింది. మొదట సన్రైజర్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. హెడ్ (30 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్), ప్యాట్ కమిన్స్ (17 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. హార్దిక్ పాండ్యా, పియూశ్ చావ్లా చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబై 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్కు అండగా తిలక్ వర్మ (32 బంతుల్లో 37 నాటౌట్; 6 ఫోర్లు) నిలిచాడు. ఆదుకున్న హెడ్ ఆరంభంలో హెడ్, ఆఖర్లో కమిన్స్ మెరుపులు మినహా సన్రైజర్స్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్లో బోర్ కొట్టించింది. పవర్ప్లేలో 56/1 స్కోరు చేసిన హైదరాబాద్ 10 ఓవర్ల దాకా 88/2 స్కోరుతో పటిష్టంగానే కనిపించింది. అభిషేక్ (11), మయాంక్ అగర్వాల్ (5), నితీశ్ కుమార్ రెడ్డి (15 బంతుల్లో 20; 2 ఫోర్లు), క్లాసెన్ (2)... ఇలా కీలక బ్యాటర్లందరినీ వరుస విరామంలో కోల్పోవడంతో హైదరాబాద్ కోలుకోలేదు. 16వ ఓవర్ వేసిన పాండ్యా... షహబాజ్ అహ్మద్ (10), మార్కో జాన్సెన్ (17)లను అవుట్ చేయగా, సమద్ (3)ను చావ్లా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 136 పరుగులకే 8 వికెట్లు పడిపోవడంతో డెత్ ఓవర్లలో దూకుడుగా ఆడే స్పెషలిస్టు బ్యాటరే కరువయ్యాడు. అయితే కెపె్టన్ కమిన్స్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో సత్తాచాటడంతో హైదరాబాద్ 170 పైచిలుకు స్కోరు చేయగలిగింది. ‘సూర్య’ మేటి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రోహిత్ (4) అవుటవగానే సూర్యకుమార్ క్రీజులోకి వచ్చాడు. అంతకుముందే ఇషాన్ కిషన్ (9) పెవిలియన్లో కూర్చుకున్నాడు. ఆ తర్వాత నమన్ ధీర్ (0) డకౌటయ్యాడు. ముంబై స్కోరు 31/3. సంబరాల్లో హైదరాబాద్! ఒత్తిడిలో ముంబై... ఈ దశలో తిలక్ వర్మ అండతో ముంబైని పీకల్లోతు కష్టాల్లోంచి ఘనవిజయం దాకా సూర్యకుమార్ గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. మొదట్లో బౌండరీలతో జట్టును నడిపించిన ‘భారత 360’ డిగ్రీ బ్యాటర్ తర్వాత భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో జట్టు స్కోరు ఆరో ఓవర్లో 50 దాటగా... 12వ ఓవర్లో వంద పరుగుల్ని అధిగమించింది. ఈ భాగస్వామ్యం మెరుపులతో లక్ష్యాన్ని చేరింది. 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న సూర్య... శతక్కొట్టేందుకు మరో 21 బంతుల్లే అవసరమయ్యాయి. 18వ ఓవర్లో భారీ సిక్సర్తో 51 బంతుల్లో సెంచరీని పూర్తిచేసుకోవడంతోనే మ్యాచ్ కూడా ముగిసింది. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) తిలక్ వర్మ (బి) చావ్లా 48; అభిõÙక్ (సి) ఇషాన్ (బి) బుమ్రా 11; మయాంక్ (బి) అన్షుల్ 5; నితీశ్ కుమార్ రెడ్డి (సి) అన్షుల్ (బి) హార్దిక్ 20; క్లాసెన్ (బి) చావ్లా 2; జాన్సెన్ (బి) హార్దిక్ 17; షహబాజ్ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ 10; సమద్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చావ్లా 3; కమిన్స్ (నాటౌట్) 35; సనీ్వర్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–56, 2–68, 3–90, 4–92, 5–96, 6–120, 7–124, 8–136. బౌలింగ్: తుషార 4–0–42–0, అన్షుల్ 4–0–42–1, బుమ్రా 4–0–23–1, హార్దిక్ పాండ్యా 4–0–31–3, పియూశ్ చావ్లా 4–0–33–3. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) మయాంక్ (బి) జాన్సెన్ 9; రోహిత్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 4; నమన్ (సి) జాన్సెన్ (బి) భువనేశ్వర్ 0; సూర్యకుమార్ (నాటౌట్) 102; తిలక్ వర్మ (నాటౌట్) 37; ఎక్స్ట్రాలు 22; మొత్తం (17.2 ఓవర్లలో 3 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–26, 2–31, 3–31. బౌలింగ్: భువనేశ్వర్ 4–1–22–1, జాన్సెన్ 3–0–45–1, కమిన్స్ 4–1–35–1, నటరాజన్ 3.2–0–31–0, నితీశ్ కుమార్ రెడ్డి 2–0–16–0, షహబాజ్ 1–0–11–0.
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
ఐపీఎల్-2024లో వరుస ఓటములను చవిచూసిన ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 3 వికెట్లు కోల్పోయి 17.2 ఓవర్లలో చేధించింది. కాగా లక్ష్య చేధనలో ముంబై 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎస్ఆర్హెచ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సూర్య తన హోం గ్రౌండ్లో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఓవైపు గాయంతో బాధపడుతూనే ముంబై ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. సూర్య కేవలం 51 బంతుల్లోనే 12 ఫోర్లు, 6 సిక్స్లతో 102 పరుగులతో ఆజేయంగా నిలిచి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. అతడితో పాటు తిలక్ వర్మ(37నాటౌట్) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మార్కో జానెసన్, కమ్మిన్స్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(48) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్న కమ్మిన్స్ 2 సిక్స్లు, 2 ఫోర్లతో 35 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. వీరిద్దరితో పాటు నితీష్ రెడ్డి(20), జానెసన్(17) రాణించారు. ఇక ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, చావ్లా తలా మూడు వికెట్లు సాధించగా.. అన్షుల్ కాంబోజ్, బుమ్రా చెరో వికెట్ సాధించారు.
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
టీ20 వరల్డ్కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. ఈ జట్టుకు రిచీ బెరింగ్టన్ సారథ్యం వహించనున్నాడు. గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న మైఖేల్ జోన్స్, పేసర్ బ్రాడ్ వీల్ తిరిగి రీఎంట్రీ ఇచ్చారు. ఈ మెగా టోర్నీలో స్కాట్లాండ్ గ్రూప్-బిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఒమన్, నమీబియాలతో పాటు ఉంది. స్కాట్లాండ్ జట్టు మే 26న ఈ పొట్టి వరల్డ్కప్ కోసం కరేబియన్ దీవులకు పయనం కానుంది. స్కాటిష్ జట్టు ట్రినిడాడ్లో ఆఫ్ఘనిస్తాన్, ఉగాండాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడనుంది. ఇక ప్రధాన టోర్నీలో స్కాట్లాండ్ తమ తొలి మ్యాచ్లో జూన్ 4 ఇంగ్లండ్తో తలపడనుంది.స్కాట్లాండ్ టీ20 వరల్డ్కప్ జట్టురిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్, బ్రాడ్ క్యూరీ, క్రిస్ గ్రీవ్స్, ఒలి హెయిర్స్, జాక్ జార్విస్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, బ్రాండన్ మెక్ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, క్రిస్ సోల్, చార్లీ టియర్, మార్క్ వాట్, బ్రాడ్ వీల్.
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
టీ20 వరల్డ్కప్-2024 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టు కొత్త జెర్సీని విడుదల చేసింది. మ్యాట్రిక్స్ జెర్సీ' 24 పేరుతో పీసీబీ తమ న్యూజెర్సీని సోషల్ మీడియా వేదికగా రివీల్ చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది నసీమ్ షా వంటి స్టార్ ప్లేయర్స్ కొత్త జెర్సీని ధరించి ఉన్న ఫోటోను పీసీబీ షేర్ చేసింది.ఈ జెర్సీని పాకిస్తాన్ అభిమానులు పీసీబీ స్టోర్లో కొనుగోలు చేయవచ్చని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇక పాక్ న్యూ జెర్సీ.. వారి సాంప్రదాయ ఆకుపచ్చ రంగులో ఉంది. టోర్నమెంట్కు చెందిన లోగో.. జెర్సీ కుడివైపు ఉండగా, పీసీబీ లోగో ఎడమవైపు ఉంది.ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్లో జూన్ 6న అమెరికాతో తలపడనుంది. అయితే ఈ పొట్టి ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇంకా తమ జట్టును ప్రకటించలేదు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటన తర్వాత తమ జట్టును పీసీబీ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కోసం భారత్ ఇప్పటికే తమ జట్టుతో పాటు కొత్త జెర్సీని కూడా విడుదల చేసింది. Presenting you the Matrix Jersey is a symbol of unity 🇵🇰🌟Pre-order your Matrix Jersey now: https://t.co/TWU32T9BHd#WearYourPassion | #WeHaveWeWill pic.twitter.com/mbLUWqj6Pv— Pakistan Cricket (@TheRealPCB) May 6, 2024
బిజినెస్
ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్లు వీరే..
సంపన్నులైన వ్యాపార దిగ్గజాలు వారి బిజినెస్ కార్యకలాపాలను తమ వారసులకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే ఆసియాలోనే కుబేరుడైన ముఖేశ్ అంబానీ తన వారసులకు వ్యాపారాలను అప్పగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపారస్థులు తమ తర్వాత తరాన్ని పరిచయం చేస్తున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఫోర్బ్స్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్స్ ర్యాంకింగ్ 2024లో ఉన్న 2,781 మందిలో దాదాపు మూడింట ఒకవంతు మంది అంటే మొత్తం 934 మంది తమ వారసులకు వ్యాపారాన్ని అప్పగించారు. వీరు నడిపిస్తున్న కంపెనీలు, వాటి మార్కెటింగ్ విలువ ఏకంగా 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది.ముఖేశ్ అంబానీరిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సంపద దాదాపు 113.5 బిలియన్ అమెరికన్ డాలర్లు. రిలయన్స్ టెలికాం విభాగం జియో ఇన్ఫోకామ్కు తన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ సారథ్యం వహిస్తున్నారు. కూతురు ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు అనంత్ అంబానీ పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.బెర్నార్డ్ ఆర్నాల్ట్ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్కు డెల్ఫిన్ ఆర్నాల్ట్, ఆంటోయిన్ ఆర్నాల్ట్, జీన్ ఆర్నాల్ట్, ఫ్రెడెరిక్ ఆర్నాల్ట్, అలెగ్జాండర్ ఆర్నాల్ట్ అనే వారసులున్నారు. తన కుటుంబ సంపద మొత్తం 214.1 బిలియన్ అమెరికన్ డాలర్లు. తన వారసులు బెర్నార్డ్ ఆర్నాల్ట్ కంపెనీ ఎల్వీఎంహెచ్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. డెల్ఫిన్ ఆర్నాల్ట్(49) 2023లో మాంటిల్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆంటోయిన్ ఆర్నాల్ట్(46) ఎల్వీఎంహెచ్ కమ్యూనికేషన్స్, ఇమేజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్ విభాగాన్ని పర్యవేక్షిస్తారు. అలెగ్జాండర్ ఆర్నాల్ట్(31) కమ్యూనికేషన్ విభాగంలో పనిచేస్తున్నారు. ఫ్రెడెరిక్ ఆర్నార్ట్(29)ట్యాగ్హ్యూర్ పదవీకాలం తర్వాత 2024లో ఎల్వీఎంహెచ్ వాచెస్కు సీఈఓగా చేరారు. జీన్ ఆర్నాల్ట్(25) 2021లో ఎల్వీఎంహెచ్లో చేరారు. లూయిస్ విట్టన్ వాచీల విభాగానికి మార్కెటింగ్ హెడ్గా చేస్తున్నారు.అదానీ గ్రూప్గౌతమ్ అదానీ ఛైర్మన్గా ఉన్న ఈ గ్రూప్ సంపద సుమారు 102.4 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఆయనకు కరణ్, జీత్ అదానీలు ఇద్దరు కుమారులు. పర్డ్యూ యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన కరణ్ తన తండ్రి తర్వాత అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. జీత్ అదానీ 2019లో అదానీ గ్రూప్లో చేరారు.షాపూర్జీ పల్లోంజీ గ్రూప్షాపూర్ మిస్త్రీ స్థాపించిన ఈ గ్రూప్ సంపద 37.7 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉంది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వారసుడిగా పల్లోన్ మిస్త్రీ సంస్థను ముందుండి నడిపిస్తున్నారు. ఈ గ్రూప్నకు నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పేరుంది. ఇందులో టాటా సన్స్ వాటా కలిగి ఉంది.ఇదీ చదవండి: 15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టుఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్లాఓరీల్ సంస్థ వ్యవస్థాపకుడు ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్ 94.5 బిలియన్ డాలర్ల సందప కలిగి ఉన్నారు. ప్రపంచంలోని ప్రముఖ సౌందర్య సాధనాల దిగ్గజ సంస్థగా లాఓరీల్కు మంచి పేరుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళ ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్ వారసులు జీన్-విక్టర్, నికోలస్ మేయర్స్. జీన్-విక్టర్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో పనిచేస్తున్నారు. నికోలస్ మేయర్స్ కుంటుంబం పెట్టుబడి సంస్థకు సంబంధించిన వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు.
వ్యాపారులు, వృత్తి నిపుణులకు.. ఫారం 3
ఒక్క మాటలో చెప్పాలంటే ఫారం 1,2 .. జీతం మీద ఆదాయం వచ్చిన వారే వేయాలి. మిగిలిన ఫారాలు ఏవి కూడా వేతన జీవులకు వర్తించవు. ఈ ఫారం–3, అలాగే ఇక నుంచి వచ్చే ఫారాలు వ్యాపారం లేదా వృత్తి మీద ఆదాయం ఉన్న వారికే వర్తిస్తాయి. ఫారం–3ని వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు వాడాలి.ఇది చాలా పెద్ద ఫారం అని చెప్పవచ్చు. నిడివిపరంగా అనడం లేదు.. ఇవ్వాల్సిన వివరాలు ఎక్కువ..సంఖ్య ఎక్కువ.వ్యక్తులు, హిందు ఉమ్మడి కుటుంబాలు వేయొచ్చు.ముఖ్యమైన రూలు ఏమిటంటే వ్యాపారం / లేదా వృత్తి మీద ఆదాయం ఉన్నవారు మాత్రమే ఫారం–3ని వేయాలి.ఆదాయపు పన్ను చట్టప్రకారం వ్యాపారానికొక రకమైన ఫారం, వృత్తి నిపుణులకొక రకమైన ఫారం లేదు. అందరికీ ఒకే ఫారం.‘వ్యాపారం’ అనే పదానికి నిర్వచనంలోనే ఎన్నో వాటితో పాటు ‘వృత్తి’ని కలిపారు.వ్యక్తులు/కుటుంబాలకు ట్యాక్స్ ఆడిట్ వర్తించినా, వర్తించకపోయినా ఈ ఫారం వేయాలి.ఈ రిటర్నులో ఇంటి మీద ఆదాయం, జీతం, పెన్షన్, వ్యాపారం/వృత్తి మీద ఆదాయం, ఇతర ఆదాయాలు, మూలధన లాభాలు.. అంటే చట్టంలో పొందుపర్చిన అన్నీ.. అంటే ఐదు శీర్షికల్లో ఏర్పడ్డ ఆదాయం ఉన్నవారు వేయొచ్చు.భాగస్వామ్యం నుంచి పారితోíÙకం వచ్చే వారు వేయొచ్చు.దీన్ని ‘మాస్టర్ ఫారం’ అని అనొచ్చు. ఎందుకంటే, వ్యక్తి లేదా ఉమ్మడి కుటుంబం ప్రతి ఆదాయం.. ఇండియాలో వచ్చినది కావొచ్చు విదేశాల నుంచి వచ్చినది కావొచ్చు.. ‘సర్వం’ ఇందులో కవర్ అవుతుంది.అంతే కాకుండా, ఆదాయం కానివి.. ఉదాహరణకు, అడ్వాన్సులకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వాలి.ఆ ఆర్థిక సంవత్సరంలో జరిగిన పెద్ద లావాదేవీలు, ఇండియాలో గానీ విదేశాల్లో గానీ జరిగినవి ఇవ్వాలి.అలాగే, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ల వివరాలు ఇవ్వాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ల వల్ల ఆదాయం ఏర్పడకపోయినా వివరాలు ఇవ్వాలి. ఉదాహరణగా ఒక ఇంటి కోసం భారీ మొత్తాన్ని అడ్వాన్సుగా ఇచ్చారు. ఇలాంటి వ్యవహారాలన్నింటిని కూడా పొందుపర్చాలి.కొంత నిర్దేశించిన టర్నోవరు దాటిన వారే అకౌంట్స్ బుక్స్ రాయాలి. కానీ మా సలహా ఏమిటంటే.. వ్యాపారం/వృత్తి ఉన్నవారు అకౌంట్స్ రాయండి. వ్యవహారం జరిగినప్పుడు స్పష్టంగా సమగ్రంగా అన్నీ ఒక చోట పర్మనెంట్ బుక్లో రాసుకోండి. వివరణ రాయండి.ఇలా రాసి ఉంచడం మీకు కాస్తంత శ్రమ కావచ్చు కానీ, తర్వాత రోజుల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఫారం నింపడానికి / దాఖలు చేయడానికి అవసరమైతే వృత్తి నిపుణుల సర్వీసులు తీసుకోండి.- కె.సీహెచ్, ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, - కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులుఇవి చదవండి: రూ. 27 లక్షల కోట్లకు గృహ రుణాలు..
15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు
ఈశాన్య దిల్లీలోని కరవాల్ నగర్ ప్రాంతంలో కల్తీ మసాలా దినుసుల తయారీకి సంబంధించిన భారీ రాకెట్ను పోలీసులు కనుగొన్నారు. రెండు కర్మాగారాలపై దాడులు నిర్వహించి 15 టన్నుల నకిలీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీకి కారణమైన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసుకు సంబంధించి డీసీపీ పవేరియా మాట్లాడుతూ..‘మసాలా దినుసుల్లో కల్తీ జరుగుతోందనే సమాచారం మేరకు ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. దిల్లీ పరిసర ప్రాంతాల్లో సెర్చ్ నిర్వహించాం. ఆపరేషన్ సమయంలో దిలీప్ సింగ్ (46) అనే వ్యక్తికి చెందిన ఒక ప్రాసెసింగ్ యూనిట్లో పాడైపోయిన ఆకులు, నిషేధిత పదార్థాలను ఉపయోగించి కల్తీ పసుపును ఉత్పత్తి చేయడం గుర్తించాం. బియ్యం, మినుములు, కలప పొట్టు, మిరపకాయలు, ఆమ్లాలు, నూనెలను కలిపి వీటిని తయారుచేస్తున్నట్లు కనుగొన్నాం. సెర్చ్ సమయంలో సింగ్తోపాటు అక్కడే ఉన్న సర్ఫరాజ్(32) పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాం. ఈ కల్తీ మసాలా దినుసులు మార్కెటింగ్ చేసేది ఖుర్సీద్ మాలిక్ (42) అనే మరోవ్యక్తి అని తేలింది. దాంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నాం. సర్ఫరాజ్కు కరవాల్ నగర్లోని కాలీ ఖాతా రోడ్లో మరో ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. ఈ ముఠా 2019 నుంచి కల్తీ మసాలా దినుసుల వ్యాపారం చేస్తున్నారు. ఈ రెండు యూనిట్లలో నిలువ ఉన్న సుమారు 15 టన్నుల కల్తీ మసాలా దినుసులను సీజ్ చేశాం. చట్ట ప్రకారం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం’ అని వివరించారు.సీజ్చేసిన వాటిలో పసుపు, గరం మసాలా, దనియా పొడి కలిపి 7,105 కిలోలు ఉంది. కలపపొడి, బియ్యం, మినుములు, మిరపకాయలు, సిట్రిక్ యాసిడ్.. వంటి పదార్థాలు 7,215 కిలోలు ఉన్నాయి.ఇదీ చదవండి: మసాలాలో పురుగుమందులు.. నివేదికలను తోసిపుచ్చిన ప్రభుత్వ సంస్థభారత బ్రాండ్లైన ఎవరెస్ట్, ఎండీహెచ్ ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనే క్యాన్సర్ కారకం ఉందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఈఎఫ్ఎస్ఏ) గుర్తించిన సంగతి తెలిసిందే. దాంతో హాంకాంగ్, సింగపూర్ల్లో వాటి ఉత్పత్తులపై నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే 2020 సెప్టెంబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్యకాలంలో ఇండియాలో తయారైన దాదాపు 527 ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్కు దారితేసే కారకాలు ఉన్నట్లు రాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ (ఆర్ఏఎస్ఎఫ్ఎఫ్) డేటా ప్రకారం నిర్ధారణ అయినట్లు ఈఎఫ్ఎస్ఏ అధికారులు ఇటీవల తెలిపారు.
రూ. 27 లక్షల కోట్లకు గృహ రుణాలు..
న్యూఢిల్లీ: గృహాల రంగానికి ఇచ్చిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు రూ. 10 లక్షల కోట్లు ఎగిశాయి. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి రికార్డు స్థాయిలో రూ. 27.23 లక్షల కోట్లకు చేరాయి. రంగాలవారీగా బ్యాంకు రుణాల అంశంపై ఆర్బీఐ వెలువరించిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.వీటి ప్రకారం 2022 మార్చిలో గృహ నిర్మాణ రంగంలో (హౌసింగ్కు ప్రాధాన్యతా రంగం కింద ఇచ్చినవి సహా) రుణబాకీలు రూ. 17,26,697 కోట్లుగా ఉండగా 2024 మర్చి ఆఖరు నాటికి రూ. 27,22,720 కోట్లకు చేరింది. కమర్షియల్ రియల్ ఎస్టేట్కి ఇచ్చినవి రూ. 2.97 లక్షల కోట్ల నుంచి రూ. 4.48 లక్షల కోట్లకు చేరాయి.కోవిడ్ అనంతరం గత రెండేళ్లలో ఇళ్ల విక్రయాలు, ధరలు గణనీయంగా పెరిగినట్లు పలు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థలు తెలిపాయి. ప్రభుత్వ తోడ్పాటు చర్యలతో అందుబాటు ధరల్లోని ఇళ్లకు డిమాండ్ నెలకొన్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నవీస్ తెలిపారు. రాబోయే రోజుల్లోనూ గృహ రుణాల వృద్ధి పటిష్టంగానే ఉంటుందని, అయితే, అధిక బేస్ కారణంగా 15–20 శాతానికి దిగి రావొచ్చని పేర్కొన్నారు.ఇవి చదవండి: పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
వీడియోలు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
ఫ్యామిలీ
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ దరిచేరవు. పైగా వ్యాధులు తగ్గుముఖం పట్టడమే కాకుండా మళ్లీ తలెత్తవట. ముఖ్యంగా విషదోషాలు, దుర్బలత్వం, చర్మరోగాలు, క్షయ, కొవ్వు, అమిత వేడి తగ్గిపోయి శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందని యోగ రత్నాకరం అనే వైద్య గ్రంథంలో ఉంది. అంతేగాదు స్వర్గంలో దేవతల కోసం అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవ౦తుడు సృష్టించాడని ఆ గ్రంథం చెబుతోంది. అలాంటి మజ్జిగని ఈ వేసవిలో తాగుతుంటే వడదెబ్బ కొట్టదట. పైగా మహాభారత కాలం నుంచే వడదెబ్బ నుంచి రక్షించుకునేందుకు ఈ మజ్జిగతో రకరలా పానీయాలు తయారు చేసుకుని తాగేవారట. అవేంటో చూద్దామా..!'కూర్చిక' పానీయం: ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అందులో రెండుగ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి. ఈ పానీయాన్ని ‘కూర్చిక’ అంటారు. ఇందులో పంచదార గానీ, ఉప్పు గానీ కలపకుండానే తాగవచ్చు. ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ 100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి, మూడింటినీ కలిపి తగినంత ఉప్పు కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి. ఈ కూర్చికను తాగినప్పుడల్లా అందులో దీన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగితే వడదెబ్బ కొట్టదు, పైగా పేగులకు బలాన్నిస్తు౦ది. అంతేగాదు జీర్ణకోశ వ్యాధులన్నింటికీ మేలు చేస్తు౦ది. అలాగే వేసవిలో వచ్చే జలుబుని నివారిస్తు౦ది.'రసాల' పానీయం:పెరుగు మీద తేరుకున్న నీళ్ళు, పాలు కలగలిపి ఆరోగ్యకరమైన 'రసాల' అనే పానీయాన్ని భీముడు తయారు చేశాడని భావప్రకాశ వైద్య గ్ర౦థంలో ఉంది. అరణ్యవాసంలో ఉన్నప్పుడు, పాండవుల దగ్గరకు శ్రీకృష్ణుడు వస్తే, భీముడు స్వయంగా దీన్ని తయారు చేసి వడ్డించాడట!. ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకుండా చేస్తుంది కాబట్టి, ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయం ఇది. తన ఆశ్రమాన్ని సందర్శి౦చటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి రాముని గౌరవార్థ౦ ఇచ్చిన విందులో 'రసాల' కూడా ఉంది. ఎలా చేస్తారంటే..?బాగా కడిగిన ఒక చిన్న కుండ లేదా ముంత తీసుకోండి. దాని మూతిని మూస్తూ ఒక పలుచని వస్త్రాన్ని రెండుమూడు పొరల మీద వాసెన (ఆవిరిపోక యెసటికుండ మూతిమూసి కట్టిన గుడ్డ) కట్ట౦డి. ఒక కప్పు పలుచని పెరుగులో అరకప్పు “పంచదార” కలిపి, ఈ మిశ్రమాన్ని చల్లకవ్వంతో బాగా చిలికి ఆ వాసెన మీద పోసి వడకట్టండి.పెరుగులో ప౦చదార కరిగి నీరై ఆ వస్త్రంలోంచి క్రి౦ది ముంతలోకి దిగిపోతాయి. వాసెనమీద పొడిగా పెరుగు ముద్ద మిగిలి ఉ౦టు౦ది. దాన్ని అన్న౦లో పెరుగు లాగా వాడుకోండి. ఈ రసాల పానీయం తయారీకి దీంతో పనిలేదు. ముంతలో మిగిలిన తియ్యని పెరుగు నీటిని ద్రప్యం అంటారు. ఈ ద్రప్యం నిండా లాక్టోబాసిల్లస్ అనే ఉపకారక సూక్ష్మజీవులు ఉ౦టాయి. అవి పేగుల్ని స౦రక్షించి జీర్ణాశయాన్ని బలసంపన్నం చేస్తాయి. ఆ నీటితోనే రసాలను తయారు చేస్తారు ఇప్పుడు, కాచి చల్లార్చిన పాలు ఈ ద్రప్యానికి రెట్టింపు కొలతలో తీసుకొని ముంతలోని పెరుగు నీళ్ళతో కలప౦డి. చల్లకవ్వంతో ఈ మిశ్రమాన్ని చక్కగా చిలికి, అందులో ఏలకుల పొడి, లవంగాల పొడి, కొద్దిగా పచ్చకర్పూరం, మిరియాల పొడి కలపండి. ఈ కమ్మని పానీయమే రసాల!.దీన్ని అప్పటికప్పుడు తాగేలాగా తయారు చేసుకొవాలి.తేటతో కూడా..ఈ వడగట్టే ప్రక్రియకు బదులుగా, పెరుగు లేదా మజ్జిగ మీద తేరుకొన్న తేటని తీసుకొని, సమానంగా పాలు కలిపి చిలికి తయారు చేసుకొవచ్చు కూడా! శొంఠి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చాలా స్వల్పంగా పచ్చకర్పూరం” వీటన్నింటిని మెత్తగా ద౦చిన పొడిని కొద్దిగా ఈ రసాలలో కలుపుకొని త్రాగితే ఎక్కువ ప్రయోజనాత్మకంగా ఉంటుంది. మజ్జిగ మీద తేటలో కేవలం ఉపయోగకారక సూక్ష్మజివులు లాక్టోబాసిల్లై మాత్రమే ఉంటాయి. ఈ సూక్ష్మజీవుల కారణ౦గానే పాలకన్నా పెరుగు, పెరుగు కన్నా చిలికిన మజ్జిగ ఎక్కువ ఆరోగ్య దాయకమైనవిగా ఉంటాయి. మజ్జిగలొని లాక్టోబాసిల్లై ని తెచ్చి పాలలో కలిపి, చిలికి ఈ రసాల ప్రయోగాన్ని మన పూర్వీకులు చేశారన్నమాట. ఇది ”అమీబియాసిస్” వ్యాధి, “పేగుపూత”, “రక్త విరేచనాలు”, “కలరా” వ్యాధులు ఉన్నవారికి కూడా ఇవ్వదగిన పానీయం. వేసవి కాలానికి అనుకూలంగా ఉంటుంది. వడ దెబ్బ తగలనీయదు. శరీరంలో వేడిని తగ్గిస్తు౦ది. తక్షణం శక్తినిస్తుంది. ముఖ్యంగా కామెర్ల వ్యాధిలో ఎక్కువ మేలు చేస్తుంది. పెరుగు మీద తేట, వైద్యపరంగా, చెవులను బలసంపన్నం చేస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. చెవిలో హోరు(టినిటస్), చెవులలో తేడాల వలన కలిగే తలతిరుగుడు (వెర్టిగో)లా౦టి వ్యాధులకు ఇది గొప్ప ఔషధంగా పని చేస్తు౦దన్నమాట.తేమనం..తేమనం అనేది శ్రీనాథుడి కాలంలో ప్రసిద్ధి చె౦దిన వంటకమే!. దీన్ని తిపిగానూ, కార౦గానూ రెండు రకాలుగా తయారు చేసుకొంటారు. ఈ మజ్జిగలో పాలు, బెల్లం, తగినంత చేర్చి, ఒక పొంగు వచ్చే వరకూ కాచితే అది “తేమనం” అనే తెలుగు పానీయంగా తయారవుతుంది. ఇది వేసవి పానీయాలలో మేలైన పానీయం. వడదెబ్బ వలన కలిగే శోషని నివారిస్తుంది. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. చల్లారిన తరువాత త్రాగటం మంచిది. దీన్ని తీపి మజ్జిగ పులుసు అని కూడా పిలుస్తారు.మజ్జిగమీద తేట:మజ్జిగ మీద తేటకు మజ్జిగతో సమానమైన గుణాలున్నాయి. చిలికిన మజ్జిగని ఒక గిన్నెలో సగానికి పోసి మూడొంతుల వరకూ నీళ్ళు కలిపి రెండు గంటలు కదల్చకుండా ఉంచండి. మజ్జిగమీద ఆ నీరు తేరుకొంటుంది. మజ్జిగ తేటను వంచుకొని మళ్ళీ నీళ్ళు పోయండి. ఇలా ప్రతి రెండు మూడు గంటల కొకసారి మజ్జిగ నీళ్ళు వంచుకొని వేసవి కాలం అంతా మంచి నీళ్ళకు బదులుగా ఈ మజ్జిగ నీళ్ళు తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టదుగాక కొట్టదు. ఎండల్లో బయటకు వెళ్ల వలిసి వస్తే చిలికిన మజ్జిగలో నిమ్మకాయి, ఉప్పు వేసుకుని తాగండి. అవసరమయ్యితే ఓ బాటిల్ నిండా వేసుకుని తీసుకువెళ్లండి. లేదా తిరిగి ఇంటికి వచ్చాక మరొక్కసారి తాగండి వడదెబ్బ కొట్టదు.(చదవండి: సమ్మర్లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి!)
సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
చిన్న పిల్లల చేష్టలు భలే ముద్దుగా ఉంటాయ్. అందులోనూ అమ్మాయిలు చేస్తే ఇంకా ముచ్చటగా ఉంటుంది. అమ్మచీర దొంగచాటుగా చుట్టేసు కోవడం, పెద్ద జడకోసం ఆరాట పడటం . అబ్బో..ఈ లిస్ట్ చాలా పెద్దదే. ఇది మాత్రమే కాదు.. అమ్మ చేసే పనులను కాపీ చేస్తూ ఉంటారు. పెద్ద ఆరిందాలాగా చీపురు పట్టకొని ఊడ్వడం, బుజ్జి బుజ్జి చేతులతో వంట చేసేయడం, వడ్డించడం లాంటి పనులు చేసి మురిపిస్తుంటారు. ఇక ఒక టీవీ చూస్తూ డాన్స్లు వేయడం,అద్దం ముందు నించొని చేసే చేష్టల గురించైతే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. తాజాగా ఓ చిన్నారి డ్యాన్స్ వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.Who says group dance is not possible with a single performer? 😀😛😂 #Dance #cutenessoverload pic.twitter.com/mOJIVgB6yR— Ananth Rupanagudi (@Ananth_IRAS) May 5, 2024 ఒక షాపింగ్ మాల్లో ఒక చిన్నారి ఒక రేంజ్లో డ్యాన్స్ చేసింది. ఎక్కడ ఎవరు తీసారు అనే వివరాలు అందుబాటులో లేనప్పటికీ, షాపింగ్ మాల్ ట్రయిల్ రూంలో అద్దం ముందు నిల్చొని అద్భుతంగా స్టెప్పులేసింది. దీంతో అద్దాల్లో నలుగురు చిన్నారులు గ్రూపు డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ అమ్మాయి అభియం కూడా నిజంగా అక్కడ నలుగురు అమ్మాయిలున్నారా అనిపించేలా చేసింది. దీంతో నెటిజన్లు వావ్..సూపర్ అంటున్నారు. మరి మీరు కూడా ఒకసారి చూసేయ్యండి ఆ వీడియోను.
ఓ సుకుమారీ.. నీ స్టయిలే అదిరే.. కుమారీ! (ఫోటోలు)
ఒబెసిటీ ఇంత ప్రమాదకరమైనదా? పాపం ఆ వ్యక్తి..!
ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య ఒబెసిటీ. ప్రస్తుతం ఉన్న అస్తవ్యస్తమైన జీవన విధానం, కల్తీ ఫుడ్ల కారణంగా టీనేజీ యువత ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తోంది. కనీసం పెళ్లీడు రాకమునుపే పెద్దవాళ్లలా కనిపించేంత భారీకాయంతో సతమతమవ్వుతున్నారు. అచ్చం అలాంటి సమస్యతోనే అత్యంత లావుగా ఉండే వ్యక్తి మరణించాడు. జస్ట్ 33 ఏళ్లకే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఒబెసిటీ ఇంత ప్రమాకమైనదే? లావుగా ఉంటే అంతే సంగతులా..!లావుగా ఉంటే లైఫ్ లాసే అని ఈ వ్యక్తిని చూస్తే అనిపిస్తుంది. ఈ దిగ్బ్రాంతికర ఘటన యూకేలో చోటు చేసుకుంది. బ్రిటన్ నివాసి జాసన్ హోల్డన్ యూకేలోనే అత్యంత లావుగా ఉండే వ్యక్తి. అతడి బరువు ఏకంగా 317 కిలోలు. అతన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి అగ్నిమాపక సిబ్బంది సహాయం తీసుకోవాలట. ఇక అతడు పడుకోవాలన్నా.. ప్రత్యేకంగా రూపొందించిన ఫర్నిచర్పై బెడ్పై నిద్రిస్తాడు. అతడికి అతిగా తినే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. అది ఎంతలా ఉందంటే రోజువారీగా ఏకంగా పదివేలకు పైగా కేలరీలు తీసుకునేంత స్థాయిలో ఉంది. అతడి బ్రేక్ఫాస్ట్లో డోనార్ కబాబ్లు తీసుకుంటాడంటే..అతడు ఎంతలా తింటాడో చెప్పాల్సిన పనిలేదు. దీని కారణంగానే ఆరోగ్యం క్షీణించటం మొదలయ్యింది. దీంతో అతను కొన్నాళ్లుగా గదికే పరితం కాగా, క్రమేణ మంచానికే పరిమతమయ్యాడు. ఆ తర్వాత చలనశీలత దెబ్బతింది. మొదట అతడి శరీరంలో కిడ్నీ పనిచేయడం మానేసింది. అలా నెమ్మదిగా మిగతా అవయవాలు వైఫల్యం చెందడం ప్రారంభించడంతో 34వ ఏటాలోకి అడుగుపెట్టడానికి కొన్ని రోజుల ముందే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతడు గతేడాది ఒక ఇంటర్వ్యూలో తన సమయం అయిపోయిందని, తాను ఎన్నాళ్లో బతకనని చెప్పేశాడు కూడా. పైగా అలా కాకుండా ఏదైనా చెయ్యాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఒకసారి 2020లో ప్రమాదవశాత్తు హోల్టన్ మూడవ అంతస్తు నుంచి పడిపోయాడు. పాపం అతడిని రక్షించటానికి ఏకంగా 30 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, క్రేన్ రంగంలోకి దిగి కాపాడారు. ఆ ఘటనను తలచుకుంటూ అది తన జీవితంలో అత్యంత బాధకరమైన ఘటనగా పేర్కొన్నాడు హోల్డన్. ఆ టైంలో తనను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి చాలా బాధపడడ్డానని అన్నాడు. హోల్డన్ మానసిక స్థితి ఎంతలా మారిపోయిందంటే.. లావుగా ఉండే వ్యక్తులను ఆధారం చేసుకుని తీసిన సినిమాలు సైతం అతడికి భయానక చిత్రాలుగా అనిపించాయి. కనీసం తన అమ్మను కూడా చూడొద్దని కన్నీటి పర్యంతమయ్యాడు. దీన్ని బట్టి చూస్తే.. ఈ అధిక బరువు కారణంగా ఎంతగా ఇబ్బంది పడ్డానేది నేరుగానే తెలుస్తోంది. అతను తరుచుగా ఈ బ్రిటన్ దేశంలో తానే అత్యంత లావుగా ఉన్నవ్యక్తిని అని బాధపడేవాడు. అతడి పోస్ట్మార్టం రిపోర్టులో కూడా అధిక బరువు కారణంగా అవయవాల వైఫల్యం చెంది మరణించినట్లు ఉంది. హోల్టన్ ఈ అధిక బరువు కారణంగా స్ట్రోక్లు, రక్త గడ్డకట్టడం వంటి పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అధిక బరువు అనేది ప్రాణాంతకమైన సమస్యే. నిర్లక్ష్యం వహించకుండా ఆరోగ్యకరమైన పద్ధతిలో తగ్గించుకునే యత్నం చేయకపోతే అంతే సంగతులని ఈ ఉదంతమే చెబుతోంది. అందువల్ల కొద్దిపాటి శారీరక శ్రమ, క్యాలరీల తక్కువ ఉన్న ప్రత్యామ్నాయ ఆహారంతో బరువుని అదుపులో ఉంచుకునే యత్నం చేయండి. సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించండి.(చదవండి: సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?)
న్యూస్ పాడ్కాస్ట్
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం పట్ల ఎన్నికల సంఘం సీరియస్.. తక్షణం దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
అవ్వాతాతల పెన్షన్లపై చంద్రబాబు పాపిష్టి కళ్లు.. నరసాపురం, క్రోసూరు, కనిగిరి ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ ఆరాటం.. గుజరాత్ ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. జగన్ది ప్రోగ్రెస్ రిపోర్ట్... టంగుటూరు, మైదుకూరు, కలికిరి ఎన్నికల సభల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నేత చంద్రబాబును నమ్మితే అధోగతే.. చోడవరం, అంబాజీపేట, పొన్నూరు ప్రచార సభల్లో ప్రజలను అప్రమత్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
మోసగాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలి.. ఎన్నికల ప్రచార సభల్లో రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ..ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో మరింత సంక్షేమం.. మరింత అభివృద్ధి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... నవరత్నాల పథకాలన్నీ కొనసాగింపు..ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణను నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోను.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ హెచ్చరిక..ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
Karachi Bakery:హోటల్స్, బేకరీల్లో తనిఖీ
హైదరాబాద్: హైదరాబాద్లోని పలు హోటల్స్, బేకరీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఎంజేమార్కెట్ చౌరస్తాలోని అంతర్జాతీయ గుర్తింపు పొందిన కరాచీ బేకరీలో గడువు తేదీ ముగిసిన పదార్థాలను గుర్తించారు. ఇందులో రూ.5200 వేల విలువైన బిస్కెట్లు, మిఠాయిలు, చాక్లెట్ కేకులు, రస్క్, బన్నులు ఉన్నాయి. అంతేగాకుండా పలు ఆహార పదార్థాలపై లేబుల్ లేని ఉత్పత్తులను గుర్తించారు. ఫుడ్సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో కరాచీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
సుల్తానాబాద్రూరల్: డ్రైవర్ సీటు కింది స్ప్రింగ్ ఊడిపోవడంతో ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడడంతో ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై శ్రావణ్కుమార్, మృతుల కుటుంబసభ్యుల కథనం ప్రకారం..సుల్తానాబాద్ మండలం చిన్న కూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ మల్యాల వెంకటేశ్ మియాపూర్ గ్రామ పరిధిలో చేను కౌలుకు తీసుకొని మొక్కజొ న్న సాగు చేశాడు. పంట చేతికి రావడంతో తన భార్య మల్యాల వైష్ణవి(35)తోపాటు పోచంపల్లి రాజమ్మ(61), బేతి లక్ష్మి(50), పోచంపల్లి పద్మ, విజ్జగిరి రమ, విజ్జగిరి రాజమ్మ, పోచంపల్లి లక్ష్మి ని ట్రాక్టర్లో తీసుకొని ఆదివారం ఉదయం 7గంటల సమయంలో చేను వద్దకు వెళ్లాడు. మొక్కజొన్న కంకులు కోసి ట్రాక్టర్లో లోడ్ చేసుకున్నాడు. తిరుగుప్రయాణంలో వారిని ట్రాక్టర్ ట్రాలీ పై ఎక్కించుకొని కాలువ వెంట ఉన్న దారి నుంచి వస్తున్నాడు. మధ్యాహ్నం 12గంటల సమయంలో డ్రైవర్ సీటు కింద ఉన్న స్ప్రింగ్ ఊడిపోయింది. దీంతో ఒక్కసారిగా డ్రైవర్ కుప్పకూలిపోయాడు. స్టీరింగ్ చేజారి ట్రాక్టర్ అదుపు తప్పింది. వేగంగా కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. దీంతో ట్రాలీ కింద మహిళా కూలీలు నలిగిపోయారు. ఇందులో మల్యాల వైష్ణవి, పోచంపల్లి రాజమ్మ, బేతి లక్ష్మి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. పోచంపల్లి పద్మ, విజ్జగిరి రమ, విజ్జగిరి రాజమ్మ, పోచంపల్లి లక్ష్మికి తీవ్ర గాయాలు సమీపంలోని రైతులు వెంటనే కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ వెంకటేశ్కు స్వల్ప గాయాలు కావడంతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాలను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సీఐ సుబ్బారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు ఎస్సై కేసు నమోదు చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, నాయకులు నల్ల మనోహర్రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు.
పది రోజుల్లో బిడ్డ పెళ్లి.. అంతలోనే తండ్రి మృతి
కోరుట్ల: పది రోజుల్లో బిడ్డ పెళ్లి.. అంతలోనే వాంతులు చేసుకొని, మృతిచెందాడు కోరుట్లకు చెందిన ఓ ఆటోడ్రైవర్. వైద్యులు సమయానికి చికిత్స అందించక పోవడం వల్లే చనిపోయాడని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి ఫర్నిచర్ ధ్వంసం చేసి, దవాఖానా ఎదుట ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని హాజీపురకు చెందిన నజీబుర్ రెహ్మాన్(48) ఆటోడ్రైవర్. ఆదివారం మధ్యాహ్నం బస్టాండ్ ఆటో అడ్డా వద్ద వాంతులు చేసుకున్నాడు. అక్కడున్నవారు అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించకుండా గంటసేపు కాలయాపన చేసి, చివరికి నజీబుర్ రెహ్మాన్ మృతిచెందినట్లు చె ప్పారు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెబితే మరో ఆస్పత్రికి తీసుకువెళ్లేవారమని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువులతో కలి సి ఆస్పత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసి, ఆందో ళన చేపట్టారు. వైద్యుడు శ్రవణ్, సిబ్బందిపై గొడవకు దిగడంతో ఓ గదిలోకి వెళ్లి, దాక్కున్నారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ గొడవ సద్దుమణగలేదు. బాధితులు వైద్య సిబ్బంది దాక్కున్న గదిలోకి పెట్రోల్ విసరడంతో అప్రమత్తమయ్యారు. వారిని అక్కడినుంచి సురక్షితంగా తరలించారు. సుమారు 4 గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. చివరకు మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్రావు, కోరుట్ల సీఐ సురేశ్బాబు, ఎస్సైలు చిరంజీవి, శ్యాంరాజ్, నవీన్ మృతుడి బంధువులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఈ నెల 17న పెద్ద కూతురి వివాహం జరగాల్సి ఉంది. ఈ సమయంలో నజీబుర్ రెహ్మాన్ ఆకస్మిక మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వాంతులు చేసుకున్న కోరుట్లవాసి వైద్యులు చికిత్స అందించలేదని కుటుంబసభ్యుల ఆరోపణ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు, సిబ్బందితో గొడవ ఫర్నిచర్ ధ్వంసం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
మంచిర్యాలక్రైం/నస్పూర్: తమ ఇద్దరు కుమారులకు ఈతనేర్పించేందుకు స్విమ్మింగ్ పూల్కు తీసుకెళ్లిన ఆ తండ్రి అదే స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ ఊపిరాడక కొడుకుల కళ్లెదుటే మృతి చెందిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. నస్పూర్ ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల మేరకు గద్దెరాగడికి చెందిన పంజాల సతీష్గౌడ్ (41) మంచిర్యాల పోలీస్ స్టేషన్లో బ్లూకోర్ట్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొద్దిరోజులుగా తన ఇద్దరు కుమారులతో కలిసి సీసీసీలోని సింగరేణి స్విమ్మింగ్పూల్కు వెళ్తున్నాడు. ఆదివారం స్విమ్మింగ్ చేస్తుండగా అధిక రక్తపోటుకు గురికావడంతో నీటిలో మునిగిపోయి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. తోటి స్విమ్మర్లు, సిబ్బంది మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య స్వప్న, ఇద్దరు కుమారులు యశ్వంత్(12) వేయాన్(10) ఉన్నారు. స్పప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. నివాళులర్పించిన డీసీపీ అశోక్ కుమార్ కానిస్టేబుల్ సతీష్ మృతిని జిల్లా పోలీస్ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. శనివారం రాత్రి తమతో కలిసి బ్లూకోర్ట్ పెట్రోలింగ్ విధుల్లో ఉత్సాహంగా పాల్గొన్న సతీష్ మృతి చెందిన వార్త తెలియగానే డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ ప్రకాశ్, ఎస్సైలు, సీఐలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలివచ్చి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆర్నెళ్ల క్రితమే గృహప్రవేశం కొత్తగా ఇంటిని నిర్మించుకున్న సతీష్ ఆర్నెళ్ల క్రితమే గృహప్రవేశం కూడా చేశాడు. కొత్త ఇంట్లోకి ప్రవేశించి ఏడాది కూడా పూర్తికాకముందే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో మృతుని కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. స్విమ్మింగ్ పూల్లో ఈతకొడుతూ కానిస్టేబుల్ మృతి నివాళులర్పించిన డీసీపీ అశోక్కుమార్