Top Stories
ప్రధాన వార్తలు
కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపులో మోదీ మార్క్!
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్రంలో కొత్త కేబినెట్ కొలువుదీరే సమయం వచ్చింది. ప్రధాని మోదీ సహా కొత్త మంత్రులంతా ఇప్పటికే ప్రమాణం చేసేశారు కూడా. మరి ఎవరెవరికి ఏ శాఖ ఇస్తారనేదానిపై స్పష్టత వచ్చేది ఎప్పుడు?. మోదీ మార్క ఉండనుందా? అనే చర్చ మొదలైంది. ఇవాళ(సోమవారం, జూన్ 10) సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త కేంద్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ భేటీలోపు లేదంటే ఈ భేటీలోనే కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు ఉండనుందని తెలుస్తోంది. అంతేకాదు.. వంద రోజుల యాక్షన్ ప్లాన్ మీద తొలి కేబినెట్ సమావేశంలో మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తారని సమాచారం. మరోవైపు.. భాగస్వామ్య పక్షాల ఆశిస్తున్న శాఖల అంశాన్ని పరిగణలోకి తీసుకున్న బీజేపీ.. వ్యూహాత్మక నిర్ణయంతోనే ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, రైల్వే, రవాణా శాఖలను తమ దగ్గరే అంటిపెట్టుకోనుంది బీజేపీ. అలాగే.. మూడో దఫా ప్రభుత్వంలో మ్యానుఫ్యాక్చరింగ్, మౌలిక వసతులపై ప్రధాన ఫోకస్ ఉంటుందనే గతంలోనే ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో.. దీని పరిధిలోకి వచ్చే శాఖలు కూడా బీజేపీ చేతిలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. మంత్రి వర్గ కూర్పులో ప్రధాని మోదీ కులసమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అలాగే.. త్వరలో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకూ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక కొత్త మంత్రుల్లో 27 మంది బీసీలు ఉన్నారు. ఐదుగురు మైనారిటీలు, ఏడుగురు మహిళలు ఉన్నారు. యువత, సీనియర్ల కాంబినేషన్లో మోదీ మార్క్తో బెర్తులు ఉంటాయనేది తెలుస్తోంది. ఇక.. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు సైతం తమ తమ ప్రయోజనాల దృష్ట్యా శాఖల్ని డిమాండ్ చేశాయి. జేడీఎస్ కుమారస్వామి వ్యవసాయ శాఖ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే శాఖల్ని కోరామని మరో మిత్రపక్షం టీడీపీ ఇది వరకే ప్రకటించుకుంది. అలాగే..జేడీయూ, ఇతర పార్టీలు సైతం పలు శాఖల్ని డిమాండ్ చేసినట్లు తెలియవస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీయే ఎంపీల సమావేశం జరుగుతున్న టైంలోనే.. మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మిత్రపక్ష నేతలతో మంత్రివర్గ కూర్పు, ఎవరికి ఏయే శాఖల వంటి అంశాలపై చర్చలు జరిగి, ఓ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.నిన్న రాత్రి 72 మంది మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇందులో 30 మంది మంత్రివర్గంలోకి, ఐదుగురికి స్వతంత్ర మంత్రులుగా, అలాగే.. 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. 43 మంది మూడుకంటే ఎక్కువసార్లు పార్లమెంట్కు ఎన్నికయ్యారు. అలాగే.. ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులను తీసుకోవడం గమనార్హం. అలాగే.. తెలుగు రాష్ట్రాల తరఫున తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ముగ్గురి మంత్రి వర్గంలో చోటు దక్కింది. విశేషం ఏంటంటే.. కేంద్ర కేబినెట్లో ఇంకా ఖాళీగానే 9 బెర్తులు ఉండడం.
ఒకే రన్వేపై రెండు విమానాలకు అనుమతి ఉందా?
విమానం టేకాఫ్ అయిన నిమిషంలోపే అదే రన్వేపై మరో విమానం ల్యాండ్ అయిన ఘటన ఇటీవల ముంబై ఎయిర్పోర్ట్లో చోటుచేసుకుంది. సంఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) స్పందించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)ని విధుల్లో నుంచి తొలగించింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒకే రన్వేపై రెండు విమానాలు నడపవచ్చని నిబంధనలున్నట్లు కొన్ని సంస్థలు నివేదిస్తున్నాయి. ఆ వివరాల గురించి తెలుసుకుందాం. అసలేం జరిగిందంటే..ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..జూన్ 8న 6ఈ 6053 అనే ఇండిగో విమానం ఇందోర్ నుంచి ముంబై ఎయిర్పోర్ట్లో దిగాల్సి ఉంది. దాంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)ను ల్యాండింగ్ క్లియరెన్స్ కోసం అనుమతించాలని కోరారు. ఏటీసీ సూచనలను అనుసరించి ఇండిగో విమానం ఎయిర్పోర్ట్లో దిగింది. ఇదిలాఉండగా, ఎయిర్ఇండియాకు చెందిన ఏఐ657 అనే విమానం అదే సమయంలో ముంబై నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు ఏటీసీ టేకాఫ్కోసం అనుమతించారు. దాంతో రెండు విమానాలు నిమిషం తేడాతో రన్వేపై ప్రయాణించాయి. ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన క్షణాల్లో ఇండిగో విమానం అదే రన్వేపై ల్యాండ్ అయింది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే రెండు విమానాల ప్రయాణికులకు తీవ్ర నష్టం జరిగేదని తోటి ప్యాసింజర్లు తెలిపారు.ఘటనను తీవ్రంగా పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)ని విధుల్లో నుంచి తొలగించింది. డీజీసీఏతోపాటు ఇండిగో, ఎయిరిండియా సంస్థలు ఘటనపై విచారణ ప్రారంభించినట్లు తెలిపాయి.ఒకే రన్వేలో రెండు విమానాలు నడపవచ్చా?ఏటీసీ నిబంధనల ప్రకారం వాతావరణంలో ఎలాంటి విజిబిలిటీ సమస్యలు లేవని నిర్ధారించుకుని ప్రత్యేక షరతులకు లోబడి, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి మూడు నిమిషాలలోపు రెండు విమాన టేకాఫ్లు, రెండు ల్యాండింగ్లకు అనుమతించవచ్చు. ముంబై ఎయిర్పోర్ట్లో జరిగిన ఈ ప్రత్యేక సందర్భంలో కూడా విజిబిలిటీ బాగానే ఉందని, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేవని పీటీఐ నివేదించింది.ఇదీ చదవండి: రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్జాబ్స్..!ఇదిలాఉండగా, విమానాశ్రయాల్లో అధిక జనసాంద్రత ఉన్నపుడు ఏటీసీలపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని కొందరు అధికారులు తెలిపారు. ఏటీసీ, సంబంధిత పైలట్లు ఘటనకు సంబంధించి సరైన నిబంధనలు అనుసరించారా లేదా అనే అంశంపై డీజీసీఏ విచారణ జరుగుతుందని చెప్పారు. అధిక జనసాంద్రత కలిగిన విమానాశ్రయాల్లో ముంబై ఎయిర్పోర్ట్ ఒకటి. అక్కడ విమానాలరాకపోకలు ఎక్కువగా ఉంటాయి. విమానాశ్రయంలోని ఆర్డబ్ల్యూ27 అనే రన్వేపై గంటకు 46 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయని తెలిసింది.Serious security concern at @CSMIA_Official Mumbai Airport yesterday putting 100s of life at riskWhile @airindia ✈️ was in the process of take off, another 🛬 from @IndiGo6E was allowed to land on same runway@DGCAIndia takes action against #Mumbai ATC official responsible pic.twitter.com/nsJvHZrWTZ— Nikhil Lakhwani (@nikhil_lakhwani) June 9, 2024
ఏపీలో దాడులపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సీరియస్
న్యూఢిల్లీ, సాక్షి: ఇక నుంచి దేశంలో వికసిత్ భారత్ ఎజెండాగా పనిచేస్తామని మరోసారి కేంద్ర మంత్రిగా ఎన్నికైక బీజేపీ సీనియర్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అంటున్నారు. తెలంగాణతో పాటు ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపైనా సోమవారం ఢిల్లీలో సాక్షితో ఆయన ఎక్స్ క్లూజివ్గా మాట్లాడారు. ‘‘ఎన్నికలైపోయాయి, ఇక ప్రతిపక్షాలన్నీ అభివృద్ధికి సహకరించాలి. వికసిత్ భారత్ ఎజెండా పనిచేస్తాం. పేద ప్రజలకు కోట్లాది ఇల్లు నిర్మిస్తాం. తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయల నిధులు తెచ్చాం. తెలంగాణకు నేను నిధులు తీసుకురాలేదనే వారు మూర్ఖులు. అలాంటి మూర్ఖుల మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. రీజినల్ రింగ్ రోడ్డుకు రాష్ట్రం తరఫున నిధులను జమ చేయడం లేదు. కేంద్రం ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదు’’ అని విమర్శించారాయన. .. రాబోయే రోజుల్లో తెలంగాణలో 88 సీట్లు టార్గెట్గా పని చేస్తామని, తెలంగాణలో కచ్చితంగా అధికారాన్ని సాధిస్తామని అంటున్నారాయన. వచ్చేసారి తెలంగాణలో అసెంబ్లీ , లోక్సభ ఎన్నికల ఒకేసారి జరుగుతాయి. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చేస్తున్న బీఆర్ఎస్ ఓటు బదిలీ ఆరోపణలపై స్పందిస్తూ.. తెలంగాణ ఒక పార్టీ గుత్తాధిపత్యం నడవదు. కాంగ్రెస్ పార్టీ అవగాహన లేకుండా .. తెలివి తక్కువగా మాట్లాడుతోంది. మాకు బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ ఓట్లు కూడా బదిలీ అయ్యాయి’’ అని అన్నారు. ఇక ఏపీలో కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలపైనా ఆయన స్పందించారు. ఏపీలో ఎన్నికల తర్వాత దాడులు మంచిది కాదు. అలాంటి దాడులను క్షమించే ప్రసక్తి లేదు. ఆ తరహా దాడులపై జీరో టాలరెన్స్ తో వ్యవహరిస్తాం’’ అని కేనంద్ర మంత్రి కిషన్రెడ్డి హెచ్చరించారు.
కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు ఆ జట్టు మాజీ ఆటగాళ్లు. బాబర్ ఆజం బృందం ఆట తీరును విమర్శిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఐసీసీ ఈవెంట్లలో దాయాది పాక్పై భారత జట్టు విజయపరంపర కొనసాగుతోంది. న్యూయార్క్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో రోహిత్ సేన మరోసారి పాక్ను విజయానికి దూరం చేసింది.చివరి వరకు నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్లో ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పాకిస్తాన్.. భారత్ను 119 పరుగులకే కట్టడి చేసింది.నసీం షా, హ్యారిస్ రవూఫ్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. ఆమిర్ రెండు, షాహిన్ ఆఫ్రిది ఒక్కో పడగొట్టారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(31) శుభారంభం అందించినా.. మిగిలిన వాళ్ల నుంచి అతడికి సహకారం అందలేదు.టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా అద్భుత రీతిలో బౌలింగ్ చేస్తూ.. పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వీరి దెబ్బకు పరుగులు రాబట్టడం పక్కనపెడితే వికెట్ను ఎలా కాపాడుకోవాలో తెలియక బ్యాటర్లు తలలు పట్టుకున్నారు.ఉద్దేశపూర్వకంగానే?ఈ క్రమంలో నత్తనడకన సాగిన పాక్కు ఇన్నింగ్స్ 113 పరుగుల వద్ద ముగిసిపోయింది. ఫలితంగా ఆరు పరుగుల తేడాతో పాక్కు ఓటమి తప్పలేదు. ఇక పాకిస్తాన్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచిన రిజ్వాన్ 44 బంతుల్లో 31 పరుగులు చేయగా.. ఇమాద్ వసీం అతడి తర్వాతి స్థానంలో నిలిచాడు.ఇమాద్ వసీం 23 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులే చేశాడు. మిగతా వాళ్లు కూడా బుమ్రా ‘డాట్’ మ్యాజిక్కు చిత్తై చెత్త స్ట్రైక్రేటు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్ ఇమాద్ వసీంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇమాద్ ఇన్నింగ్స్ గమనిస్తే.. అతడు ఉద్దేశపూర్వకంగానే బంతులు వృథా చేసినట్లు అనిపించిందని ఆరోపించాడు. అతడి వల్లే లక్ష్య ఛేదన మరింత సంక్లిష్టంగా మారిందని సలీం మాలిక్ విమర్శించాడు. చదవండి: వాళ్ల నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం.. రెండు గెలిస్తేనే: బాబర్ ఆజం View this post on Instagram A post shared by ICC (@icc)
వైఎస్సార్సీపీని వీడితే నాకు పుట్టగతులుండవు: విశ్వేశ్వర రాజు
ఎఎస్సార్, సాక్షి: రాజకీయంగా ఎన్నో అవకాశాలు ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు Matsyarasa Visweswara Raju అంటున్నారు. ఆయనపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు.‘‘నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నా. వైఎస్ జగన్తోనే నా పయనం కొనసాగుతుంది. నాకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చింది ఆయనే. ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, నా భార్యకు జెడ్పీటీసీగా అవకాశం కల్పించారు. ఎన్నో అవకాశాలు ఇచ్చిన వైఎస్సార్సీపీని వీడితే నాకు పుట్టగతులు ఉండవు. .. పార్టీ మారే ప్రసక్తే లేదు. ఊపిరి ఉన్నంత వరకు జగన్తోనే ఉంటా. 2029లో మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది’’ అని విశ్వేశ్వరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: చంద్రబాబు చెప్పినా.. ఏపీలో ఆగని టీడీపీ దాష్టీకం
స్టార్ హీరో పేరు చెప్పి మోసం.. టాలీవుడ్ హీరోయిన్పై ఫిర్యాదు
షో స్టాపర్.. ఈ సిరీస్ ప్రకటించి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఆ మధ్య ఈ సిరీస్ను అటకెక్కించారని ప్రచారం జరిగితే అదంతా అబద్ధమని దర్శకనిర్మాత మనీశ్ హరిశంకర్ పేర్కొన్నాడు. డబ్బింగ్ పూర్తయిందని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపాడు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామన్నాడు. జీనత్ అమన్, జరీనా వాహబ్, శ్వేత తివారి, దిగంగన సూర్యవంశీ, సౌరభ్ రాజ్ జైన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రగల్భాలు పలికి..ఈ క్రమంలో హీరోయిన్ దిగంగన సూర్యవంశీపై నిర్మాత మనీశ్ హరిశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం.. షో స్టాపర్ ప్రాజెక్ట్ కోసం హీరో అక్షయ్ కుమార్తో పాటు అతడి నిర్మాణ కంపెనీని ఈ సిరీస్ సమర్పకులుగా వ్యవహరించేందుకు ఒప్పిస్తానని దిగంగన ప్రగల్భాలు పలికింది. తనకు అక్షయ్ కుమార్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్తో పరిచయాలు ఉన్నాయని, ఈ ప్రాజెక్టులో వారిని కూడా భాగం చేస్తానని నమ్మించింది. పెద్దమొత్తంలో డబ్బు గుంజిఅలా అక్షయ్ కుమార్ను రప్పిస్తానని చెప్పి తమ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి చివరకు మోసం చేసిందని ఎమ్హెచ్ ఫిలింస్ బ్యానర్ ఆరోపిస్తోంది. తన డిమాండ్లు నెరవేర్చకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హరిశంకర్ను బెదిరించిందని అతడి అడ్వకేట్ ఫాల్గుని బ్రాహ్మభట్ తెలిపారు. అలాగే ప్రాజెక్టు ఆగిపోయిందని, పేమెంట్స్ ఇవ్వడం లేదని ఆరోపణలు చేసి తమ బ్యానర్ ప్రతిష్ట దిగజార్చారంటూ నటుడు రాకేశ్ బేడీ, దిగంగన సూర్యవంశీ ఫ్యాషన్ డిజైనర్ కృష్ణన్ పార్మర్పైనా నిర్మాత పరువు నష్టం దావా వేశారు. కాగా దిగంగన తెలుగులో హిప్పి, వలయం, సిటీమార్, క్రేజీఫెలో వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది.చదవండి: ప్రియుడితో సినీ నటి ప్లాన్.. స్నేహితురాలిని బర్త్డే పార్టీకి పిలిచి ఆపై..
జమ్ము కశ్మీర్: డ్రోన్ల సాయంతో ఎన్ఐఏ ‘ఉగ్ర’ వేట
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రియాసి జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన యాత్రికులు కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా ఆదివారం సాయంత్రం టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు.ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. సంఘటన ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్కు చెందిన ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత సమీపంలోని గుహల్లోకి వారు పారిపోయి ఉంటాని భావిస్తున్నారు. ఈ క్రమంలో దాడి జరిగిన ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి, భారీ వృక్షాలతో ఉండటంతో ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్త ఎన్ఐఏ ఈ దాడిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం కూడా ఆపరేషన్లో చేరింది.కాగా శివ ఖోరీ మందిరం నుంచి వైష్ణో దేవి ఆలయం వైపు వెళ్తుండగా.. సమీపంలోని అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు బస్సుపై దాడి చేసి కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో బస్సు డ్రైవర్కు గాయాలవ్వడంతో నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలోనే బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. వాహనం లోయలో పడినప్పటికీ ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు కొనసాగించారు. ఈ ఘటనలో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నారని తెలుస్తోంది. గత నెలలో రాజౌరి, పూంచ్లలో ఇతర దాడులు పాల్పడిన ఉగ్రవాదులో ఈ ఆపరేషన్లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితిని సమీక్షించారు. ఘటనలో గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించా. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ఉగ్రదాడిని ఖండించారు.
ఇలాంటి బంపర్ ఆఫర్ ఇస్తే..బరువు తగ్గడం ఖాయం!
ప్రస్తుతం అందర్నీ బాగా వేదించే సమస్య అధిక బరువు. నేటి జీవన విధానం, శారీరక శ్రమ లేకుండా ఏసీ గదుల్లో కంప్యూటర్ల మందు గంటగంటలు కూర్చొని చేసే ఉద్యోగాలతో చిన్న, పెద్దా అంతా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఒకవేళ వ్యాయామాలు చేద్దామనుకున్నా..కొన్ని రోజులు చేసి బద్ధకంతో స్కిప్ చేస్తూ పోతుండటంతో బరువులో పెద్ద మార్పు ఉండదు. దీంతో అధిక బరువు అన్నది భారమైన సమస్యగా మిగిలిపోతోంది చాలామందికి. తాజగా ఓ కంపెనీ తమ ఉద్యోగులకు ఓ మంచి బంపర్ ఆఫర్ ఇచ్చింది. తన ఉద్యోగులు ఆరోగ్యకరంగా మంచి సామర్థ్యంతో పనిచేయాలన్న లక్ష్యంతో ఈ ఆఫర్ని పెట్టిందట. ఆ ఆఫర్ వింటే ఇలాంటి కంపెనీలు కూడా ఉంటాయా?.. అని విస్తుపోతారు. ఎక్కడంటే..చైనాలో షెన్జెన్లోని ఇన్స్టా360 అనే టెక్ కంపెనీ తన ఉద్యోగులకు మంచి ఆరోగ్యంతో హాయిగా పనిచేసుకోండి అంటూ ఓ గొప్ప ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే హాయిగా బరువు తగ్గండి దగ్గర దగ్గర కోటి రూపాయాల వరకు బోనస్లు పొందండి అని ఆఫర్ ఇచ్చింది. ఈ టెక్ కంపెనీ తన ఉద్యోగులు ఊబకాయ సమస్య నుంచి బయటపడేలా బరువు తగ్గించే బ్యూట్ క్యాంప్ అనే కార్యక్రమాన్ని ప్రారండించింది. ఈ కార్యక్రమంలో మూడు నెలల పాటు సాగుతుంది. ప్రతి సెషన్లో సుమారు 30 మంది ఉద్యోగుల వరకు నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ కార్యక్రమంలో ఊబకాయం ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఇస్తారు.ప్రతి సెషన్ మూడు గ్రూపులుగా విభజించి, వారంలో సముహం మొత్తం బరువు సగటు ఆధారంగా బోనస్లు అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్ విజయాన్ని ఆయా సముహాలకే ఇస్తుంది. ఎందుకంటే గ్రూప్లో ఉన్నవాళ్లంతా తగ్గితేనే కదా డబ్బులు వస్తాయి. కాబట్టి బరువు తగ్గాలన్న సంకల్పం వారిలో అనుకోకుండా రావడమే గాక పక్కవారిని మోటీవేట్ చేస్తారు. దీంతో సమిష్టిగా బరువు తగ్గే ప్రయత్నం తోపాటు వారి మధ్య సత్సంబంధాలు బాగుంటాయి. ఈ కార్యక్రమాన్ని ఆ కంపెనీ 2023లో ప్రారంభించింది. ఆ కంపెనీ అనుకున్నట్లు తమ ఉద్యోగలు సత్వరమే బరువు తగ్గేలా చేయడంలో అద్భుతమైన ఫలితాలు కూడా సాధించింది. ఇలా ప్రస్తుతం ఆ కంపెనీలో సుమారు 150 మంది ఉద్యోగులు దాక ఏకంగా 800 కిలోలు బరువు తగ్గి దాదాపు రూ. 83 లక్షల దాక రివార్డులు సంపాదించుకున్నారు. ఈ మేరకు ఆ కంపెనీలో పనిచేసే లి అనే వ్యక్తి మాట్లాడుతూ..తాను ఈ కార్యక్రమంలో నవంబర్ 2023లో చేరానని చెప్పాడు. ఆ శిక్షణ కార్యక్రమంలో రన్నింగ్, బాస్కెట్బాల్, స్విమ్మింగ్ వంటివి చేసి సుమారు 17.5 కిలోల మేర బరువు తగ్గి రూ. 80 వేలు బోనస్గా పొందానని తెలిపాడు. ఈ ప్రోగ్రాం తన ఆరోగ్యాన్ని, ఆర్థికస్థితిని మెరుగుపరిచిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ కంపెనీలో వెంటనే జాయిన్ అవుతానని ఒకరూ, మరోకరూ తాను ఏకంగా 10 కి.మీ వరుకు పరుగెత్తగలనని, తనలాంటి సిబ్బందితో తొందరగా ఆ కంపెనీ దివాలా తీసేస్తుందని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్)
ఫ్రాన్స్ పార్లమెంట్ రద్దు.. ఆకస్మిక ఎన్నికలకు మేక్రాన్
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాన్స్ పార్లమెంట్ను రద్దు చేస్తూ.. ఆకస్మిక ఎన్నికలకు వెళ్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. అతిత్వరలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారాయన. యూరోపియన్ యూనియన్(EU) పార్లమెంటరీ ఎన్నికల్లో తన పార్టీ భారీ ఓటమి చవిచూస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. జూన్ 30న తొలి విడత, రెండో విడత ఎన్నికలు జూలై 7న జరగనున్నాయని మేక్రాన్ ప్రకటించారు. అయితే.. ఈయూ ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ పార్టీ 31.5 శాతం ఓట్లు, మాక్రేన్ రెనాయిసెన్స్ పార్టీకి 15.2 శాతం ఓట్లు.. పైగా సగం ఓట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అలాగే.. సోషలిస్ట్ పార్టీ 14.3 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలుస్తుందని పోల్ సర్వేలు వెల్లడించాయి. దీంతో ఆయన పార్లమెంట్ రద్దును ప్రకటించి.. ఆ వెంటనే ఆకస్మిక ఎన్నికల ప్రకటన చేశారు.‘రైట్ పార్టీలు పలు చోట్ల పుంజుకుంటున్నాయి. అయితే నేను రాజీనామా చేసే పరిస్థితి లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ రాత్రి(ఆదివారం)కే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నా. ఈ నిర్ణయం చాలా పెద్దది. ఫ్రాన్స్ ప్రజలపై ఉన్న నమ్మకంతో, భవిష్యత్తు తరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నా’ అని మేక్రాన్ అన్నారు.ఫ్రాన్స్లో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి 577 మంది దిగువ సభ సభ్యుల్ని ఎన్నుకుంటారు. వాస్తవానికి ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు 2027లో జరగాల్సి ఉంది. ఇక.. ఈయూ ఎన్నికలు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రజాస్వామిక ఎన్నిక విధానం. 720 మంది ప్రతినిధులు ఉండే యూరోపియన్ పార్లమెంట్ను ఎన్నుకునేందుకు 40 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ ఎన్నికల ఫలితాలు.. యూరోపియన్ యూనియన్ నిర్ణయాత్మక నిర్ణయాలపై ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే.. వాతావరణ మార్పులు, రక్షణ, వలసలు, అంతర్జాతీయ దౌత్యం లాంటి అంశాలు.. అదీ చైనా, అమెరికా లాంటి దేశాల దౌత్య సంబంధాలతో ముడిపడి ఉంటుంది.
ఆ పదవే కావాలి.. పట్టుబడుతున్న పవన్?!
విజయవాడ, సాక్షి: మరో రెండు రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నారు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం, కేంద్ర కేబినెట్లో బెర్తుల కోసం ఢిల్లీ పర్యటనతో బిజిబిజీగా గడిపిన చంద్రబాబు.. ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ కూర్పు కోసం కసరత్తులు ముమ్మరం చేయబోతున్నారు. టీడీపీతో పాటు మిత్రపక్షాలు జనసేన, బీజేపీలకు ఏయే శాఖలు కట్టబెట్టాలో అనేదానిపై ఆ పార్టీల నేతలతో ఇవాళ్టి నుంచే మంతనాలు కొనసాగించే ఛాన్స్ కనిపిస్తోంది.అయితే.. ప్రధాన మిత్రపక్షం జనసేన నాలుగు మంత్రి పదవులకు తగ్గకూడదనే కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. మరోవైపు.. డిప్యూటీ సీఎం పోస్ట్ కోసం పవన్కల్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారంటూ తాజాగా ఓ జాతీయ మీడియా వెబ్సైట్ కథనం ఇచ్చింది. ఆదివారం మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకారానికి భార్యతో సహా వెళ్లిన పవన్ ఈ మాట అన్నారని సదరు వెబ్సైట్ ప్రచురించగా.. దానిని బాబు అనుకూల మీడియా సైతం తాజాగా ధృవీకరించడం విశేషం. డిప్యూటీ సీఎం పదవితో పాటు నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలన్నది పవన్ ప్రధాన డిమాండ్గా తెలుస్తోంది. జనసేన కోటాలో సీనియర్ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. నాదెండ్ల మనోహర్, పులవర్తి అంజిబాబు, మండలి బుద్ధ ప్రసాద్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేష్, బొమ్మిడి నాయకర్, అరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్, వర ప్రసాద్ లు మంత్రి పదవుల రేసులో ప్రధానంగా ఉన్నారు. మరోవైపు.. చిరు, నాగబాబులతో పవన్కు సిఫార్సులు వెళ్తున్నాయనే ప్రచారం ఒకటి నడుస్తోంది. ఈ ఊహాగానాల లెక్కన జనసేనలో పవన్తో పాటు ముగ్గురికి మంత్రులుగా అవకాశం దక్కనుందన్నమాట. మరోవైపు.. కొత్త మంత్రి వర్గంలో చోటు కోసం బీజేపీ సైతం కొన్ని షరతులు విధిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం టీడీపీకి రెండు కేబినెట్ పోస్టులు ఇచ్చింది బీజేపీ. అలాగే.. ఇక్కడా అదే ఫార్ములా పాటించాలని టీడీపీ అధినేతను కోరినట్లు సమాచారం. దీంతో బీజేపీకి రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ తరఫున బీసీ కోటాలో ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్కు ఆ అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ఇక మరో మంత్రి పదవి కోసం తీవ్ర పోటీ తప్పదనే చర్చ మొదలైంది. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లలో ఎవరికో ఒక్కరికే ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు.. పార్థసారథి(ఆదోని), ఆదినారాయణ రెడ్డి(జమ్మలమడుగు)లు సైతం ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు టీడీపీ కోటాలోనూ పేర్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో సీనియర్లను అసంతృప్తిపర్చకుండా కేబినెట్ను రూపకల్పన చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
తప్పక చదవండి
- ఏపీలో దాడులపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సీరియస్
- అమాంతం పెరిగిన చిరాగ్ ఫ్యాన్ ఫాలోయింగ్
- స్టార్ హీరో పేరు చెప్పి మోసం.. టాలీవుడ్ హీరోయిన్పై ఫిర్యాదు
- కెనడాలో భారత సంతతి యువకుడి హత్య!
- టీ20 ప్రపంచకప్ 2024లో తొలి వికెట్ డౌన్
- రోడ్డు ప్రమాదంలో నలుగురు యూట్యూబర్ల దుర్మరణం
- ఎన్నికల ఫలితాల రోజు మార్కెట్ పతనంపై సుప్రీం కోర్టులో పిటిషన్
- ఆల్టైమ్హైలో స్టాక్మార్కెట్ సూచీలు.. 23,400 మార్కు చేరిన నిఫ్టీ
- గ్రూప్–1 పరీక్ష రాసి వస్తుండగా విషాదం
- మోదీ ప్రమాణస్వీకారం.. అంబానీ, షారుక్ ఫోటో వైరల్
సినిమా
గుడిలో కమెడియన్ పెళ్లి.. వధువు బ్యాక్గ్రౌండ్ ఇదే!
ప్రముఖ తమిళ దర్శకుడు గంగై అమరన్ రెండో కుమారుడు, నటుడు ప్రేమ్జీ 45 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కాడు. తిరుత్తణి మురుగన్ సాక్షిగా తన ప్రేమికురాలు ఇందు మెడలో మూడు ముళ్లు వేశాడు. ఆదివారం (జూన్ 9న) నిరాడంబరంగా జరిగిన వివాహ వేడుకల్లో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా ప్రేమ్జీ.. సేలం నగరానికి చెందిన బ్యాంకు ఉద్యోగి ఇందును కొన్నేళ్లగా ప్రేమిస్తూ వచ్చాడు. గుడిలో సింపుల్గా పెళ్లివీరి ప్రేమకు ఇరుకుటుంబాలు పచ్చజెండా ఊపాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు తమిళనాడు తిరువళ్లూరులోని తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి సాక్షిగా వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు సినీ తారలు రావడంతో తిరుత్తణి ఆలయంలో సందడి నెలకొంది. వారిని చూసేందుకు, సెల్పీ దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. గంగై అమవరన్, అతడి పెద్ద కుమారుడు, సినీ దర్శకుడు వెంకట్ప్రభు సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది. కమెడియన్ ప్రేమ్జీ పెళ్లి ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపీటలపై ప్రియురాలికి ముద్దుతన ప్రేమికురాలు జీవిత భాగస్వామి కావడంతో ప్రేమ్జీ పెళ్లిపీటలపైనే ఇందును ముద్దాడి తన ఆనందాన్ని పంచుకున్నాడు. అనంతరం నూతన దంపతులు సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుని, స్వామివారి ఆశీస్సులు పొందారు. వివాహ వేడుకల్లో సినీ నటులు శివ, జయ్, వైభవ్, సంతాన భారతి, కార్తీక్రాజ, సంగీత, గాయకులు ఎస్పీబీ. చరణ్, క్రిష్ సహా ప్రముఖులు పాల్గొన్నారు.చదవండి: కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్న నిమిషా సజయన్.. నిజమేనా?
నిర్మాతగా బాలకృష్ణ కూతురు.. సినిమా ప్రకటించిన బోయపాటి
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. నేడు 65వ పుట్టినరోజును ఆయన జరపుకోనున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో మరోసారి రిపీట్ కానుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో 3 చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. నేడు (జూన్ 10) బాలయ్య పుట్టినరోజు సందర్భంగా BB4 పేరుతో ఒక పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ రామ్ ఆచంట,గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.2014లో లెజెండ్ చిత్రాన్ని ఇదే నిర్మాణ సంస్థ నిర్మించింది. సింహా,లెజండ్, అఖండ చిత్రాల తర్వాత బోయపాటి శ్రీను మరోసారి బాలయ్యతో ప్రాజెక్ట్ ఫిక్స్ చేశాడు. అయితే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాలకృష్ణ కూతురు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్లో ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నట్లు ఆమె పేరు ఉంది. తొలిసారిగా ఆమె చిత్రనిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. The Lethal Combo that sets the screens on fire is Back 🔥🔥The two Forces - 'GOD OF MASSES' #NandamuriBalakrishna & #BoyapatiSreenu reunite for #BB4 🌋🌋Happy Birthday Balayya Babu ❤️🔥Produced by @RaamAchanta #GopiAchanta under @14ReelsPlus banner ❤️Presented by… pic.twitter.com/Oj9b1j9bvS— 14 Reels Plus (@14ReelsPlus) June 10, 2024
కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్న నిమిషా సజయన్.. నిజమేనా?
నిమిషా సజయన్.. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ నల్లకలువ తెలుగు వారందరికి కూడా పరిచయమే. చామనఛాయ, కుదురైన ఆకృతి, నటన తెలిసిన కళ్లు ఆమె ప్రత్యేకత. ముంబైలో పుట్టిపెరిగినా తన మూలాలు మాత్రం మలయాళంలోనే ఉన్నాయి. తన టాలెంట్తో సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లోనూ నటిస్తుంది. 2017లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా జిగర్తాండ డబుల్ ఎక్స్, చిన్నా, నాయట్టు (కోట బొమ్మాళి పీఎస్) వంటి చిత్రాలతో టాలీవుడ్ వారికి బాగా దగ్గరైంది.తాజాగా ఈ బ్యూటీ కాస్మెటిక్ సర్జరీ చేపించుకున్నారని ప్రచారం జరుగుతుంది. నటి నిమిషా సజయన్ ప్రస్తుతం కాస్మెటిక్ సర్జరీ చర్చల అంశం మలయాళ పరిశ్రమలో చర్చ జరుగుతుంది. కెరీర్ ప్రారంభంలో ఆమెను చూసిన క్షణం నుంచి ప్రస్తుతం ఆమె ముఖం కొద్దిగా మారిపోయిందని వారు అంటున్నారు. దీనిపై కాస్మోటాలజిస్టుల అభిప్రాయం అందరినీ ఆకర్షిస్తోంది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా దృష్టిని ఆకర్షించిన డాక్టర్ శిఖా, తాను కాస్మెటిక్ సర్జరీలు చేయించుకోలేదని చెప్పింది. నిమిషా ముఖంలో వచ్చిన మార్పులకు కారణాన్ని కూడా పంచుకున్నారు.నిమిషా సజయన్ మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ బరువు తగ్గిందని ఆమె తెలిపింది. రింగులుగా ఉన్న ఆమె జుట్టు స్ట్రెయిట్ చేయబడింది. ఆమె పెదవిలోనూ ఏమీ మార్పులేదు. తన మొహంలో కూడా ఎలాంటి మార్పూ లేదని తాను అనుకుంటున్నట్లు డాక్టర్ శిఖా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన అందానికి ఫిదా అయిన చాలామంది నిమిషా సోషల్మీడియా ఖాతా కామెంట్ బాక్స్లో ప్రశంసిస్తున్నారు. సహజ సౌందర్యం ఉన్న గొప్ప నటి నిమిషా అని పలువురు వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా నిమిషాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సైబర్ ఎటాక్ జరుగుతోంది.మలయాళ ప్రముఖ నటుడు సురేష్ గోపి త్రిసూర్ ఎన్నికల్లో గెలవలేరని ఆమె పబ్లిక్ ఫోరంలోనే కామెంట్ చేసింది. అయితే, తాజాగా సురేష్ గోపీ విజయం సాధించారు. దీంతో పాత ప్రస్తావన పేరుతో ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఆమె సోషల్ మీడియా కామెంట్ బాక్స్ను ఆఫ్ చేసింది. View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan)
ప్రియుడితో సినీ నటి ప్లాన్.. స్నేహితురాలిని బర్త్డే పార్టీకి పిలిచి ఆపై..
బర్త్డే పార్టీకి వెళ్లిన బాలికకు మత్తు మందు ఇచ్చి, లైంగికదాడి జరిగిన ఘటన తమిళనాడులో జరిగింది. ఈ కేసులో సహయనటి, విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. చైన్నెలోని పెరంబూర్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక చేత్తుపట్టులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. విద్యార్థిని తన స్నేహితులతో కలిసి అన్నానగర్ ప్రాంతంలోని ఓ కాఫీ షాప్నకు వెళ్లింది. ఆ సమయంలో పెరుంగళత్తూరు ప్రాంతానికి చెందిన సహాయ నటి ప్రతిషా అకీరాతో విద్యార్థినికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ స్నేహితులయ్యారని తెలుస్తుంది. ఈ క్రమంలో గత నెల 13వ తేదీన సాలీగ్రామంలోని ఓ హోటల్లో జరిగిన తన పుట్టినరోజు వేడుకలకు హాజరు కావాలని విద్యార్థినిని అకీరా ఆహ్వానించింది. ఆ తర్వాత అక్కడికి వెళ్లిన విద్యార్థినికి అకీరా, ఆమె ప్రియుడు సహా ఇద్దరు యువకులు మిఠాయిలు ఇచ్చారు. విద్యార్థి నిరాకరించినప్పటికీ, వారు ఆమెకు బలవంతంగా మిఠాయిలు తినిపించారు. అందులో కొంచెం తినగానే విద్యార్థిని స్పృహతప్పి పడిపోయింది. అనంతరం ఇద్దరు యువకులు ఆ బాలికను పడక గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. చాలా సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన ఆ బాలిక నిద్ర లేచి తనపై లైంగికదాడి జరిగిందని గ్రహించి దిగ్భ్రాంతి చెందింది. దీని గురించి అడిగితే జరిగిన సంఘటన గురించి బయట చెప్పవద్దు. అలా అయితే, నీకు, మీ కుటుంబానికి పరువు పోతుందని సహాయ నటి అకీరా విద్యార్థినిని బెదిరించింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం తెలుపలేదు. ఈ స్థితిలో రెండు రోజుల క్రితం తనపై లైంగికదాడి జరిగిన విషయాన్ని విద్యార్థిని తన సోదరికి చెప్పింది. వెంటనే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బర్త్ డే పార్టీ అంటూ తన కుమార్తెకు మత్తు మందు కలిపిన మిఠాయిలు ఇచ్చి లైంగికదాడి చేశారంటూ విద్యార్థిని తల్లిదండ్రులు విరుగంబాక్కం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నటి అకీరా, వడపళనికి చెందిన కాలేజీ విద్యార్థి సోమేశ్ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న విలియమ్స్ కోసం వారు తీవ్రంగా వెతుకుతున్నారు. బర్త్ డే పార్టీకి వెళ్లిన విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన చైన్నెలో సంచలనం సృష్టించింది.
ఫొటోలు
అందాల రాణివే... నీవెంత జాణవే యాంకర్ శ్రీముఖి ఫోటోలు
పచ్చందనమే పచ్చదనమే.. పచ్చిక నవ్వుల డిజైన్స్ (ఫోటోలు)
వరదరాజు గోవిందం మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
IND Vs PAK Photos: ఉత్కంఠ పోరులో పాక్ను చిత్తు చేసిన భారత్ (ఫోటోలు)
నయన్- విఘ్నేశ్ పెళ్లి రోజు.. తమ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్న స్టార్ కపుల్! (ఫోటోలు)
క్రీడలు
మరోసారి భారత్, పాకిస్తాన్ మ్యాచ్..!
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య నిన్న (జూన్ 9) హైఓల్టేజీ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఈ సమరంలో భారత్.. పాక్పై 6 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇరు జట్ల పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగినప్పటికీ అంతిమంగా టీమిండియానే విజయం వరించింది.ఈ ఓటమి అనంతరం పాక్ సూపర్-8 అవకాశాలను (వరల్డ్కప్లో తదుపరి దశ) సంక్లిష్టం చేసుకుంది. ఒకవేళ పాక్ సూపర్-8కు అర్హత సాధించకపోతే ఈ టోర్నీలో మరోసారి భారత్-పాక్ జరిగే అవకాశం ఉండదు.క్రికెట్ అభిమానులు తిరిగి దాయాదుల సమరాన్ని చూడాలంటే మరో ఎనిమిది నెలల పాటు వేచి చూడాలి. అది కూడా పాక్లో ఆడేందుకు భారత్ సమ్మతిస్తేనే ఈ మ్యాచ్ జరుగుతుంది.వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ వేదికగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లాహోర్ మైదానాన్ని పరిశీలిస్తుంది. ఎనిమిది జట్లు పాల్గొనే ఈ ఐసీసీ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్యలో జరుగనుంది. అయితే దీనికి ముందు ఓ ముఖ్య విషయం తేలాల్సి ఉంది. పాక్లో అడుగుపెట్టేందుకు భారత ప్రభుత్వం అనుమతిస్తేనే ఈ మ్యాచ్ సాధ్యపడుతుంది. పీసీబీ ప్రతిపాదనకు భారత్ ఒప్పుకోకపోతే హైబ్రిడ్ పద్దతిలో (తటస్థ వేదికలపై) ఈ టోర్నీ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అన్నీ పాక్ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది మార్చిలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, చివరిసారిగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో (2017) పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఆ టోర్నీలో ఫైనల్లో పాక్.. భారత్ను ఓడించి టైటిల్ను సాధించింది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో భారత్, పాక్ సహా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడతాయి.
చెత్త షాట్లు.. బుమ్రా విషయంలో ఇలా చేస్తారా?: రోహిత్పై విమర్శలు
T20 WC 2024- India vs Pakistan: పాకిస్తాన్తో మ్యాచ్లో టీమిండియా మేనేజ్మెంట్ అనుసరించిన బౌలింగ్ వ్యూహాలను భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ తప్పుబట్టాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మూడో ఓవర్లో బంతిని ఇవ్వడమేమిటని ప్రశ్నించాడు.కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టాపార్డర్లో బ్యాటింగ్ చేసినట్లే.. బుమ్రాను కూడా తొలి ఓవర్లోనే ఉపయోగించుకోవాలని సూచించాడు. నిజానికి పాక్తో మ్యాచ్లో టీమిండియాను బౌలర్లే గట్టెక్కించారని.. ఈ విజయంలో క్రెడిట్ వాళ్లకే ఇవ్వాలని గావస్కర్ పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా భారత్- పాకిస్తాన్ ఆదివారం తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారీ అంచనాలతో బ్యాటింగ్కు దిగిన టీమిండియా 119 పరుగులకే కుప్పకూలింది.ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ (13), విరాట్ కోహ్లి(4) పూర్తిగా నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ రిషభ్ పంత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. 31 బంతుల్లో 42 పరుగులతో పంత్ దుమ్ములేపగా.. అక్షర్ పటేల్ 20 పరుగులతో రాణించాడు.మిగతా వాళ్లంత సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ బ్యాటర్లను.. టీమిండియా బౌలర్లు ఆది నుంచే కట్టడి చేశారు. వీరి దెబ్బకు పాక్ బ్యాటింగ్ ఆర్డర్ 113 పరుగులకే కుప్పకూలింది.‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (3/14), హార్దిక్ పాండ్యా (2/24) అద్భుతంగా రాణించగా.. అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అయితే, ఈ మ్యాచ్లో బౌలింగ్ అటాక్ను అర్ష్దీప్ సింగ్ ప్రారంభించడం విశేషం. తొలి ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి బంతిని అందించాడు. మహ్మద్ సిరాజ్ రెండో ఓవర్ వేయగా.. బుమ్రా మూడో ఓవర్లో యాక్షన్లోకి దిగాడు. View this post on Instagram A post shared by ICC (@icc) బుమ్రాకు తొలి ఓవర్ ఇవ్వకపోవడమేమిటి?ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ భారత్- పాక్ మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత క్రికెట్లో బౌలర్లూ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.వాళ్లు తిరిగి పుంజుకోవడం అద్భుతంగా అనిపించింది. అయినా.. బుమ్రాకు తొలి ఓవర్ ఇవ్వకపోవడమేమిటి? మూడో ఓవర్లో అతడికి చేతికి బంతినిస్తారా?మొదటి 12 బంతులు ఎందుకు వృథా చేశారు? మీ జట్టులో ఉన్న అత్యుత్తమ బౌలర్కే కదా మొదటగా బంతిని ఇవ్వాల్సింది. రోహిత్ శర్మ లేదంటే విరాట్ కోహ్లిని ఐదు లేదంటే ఆరో స్థానంలో బ్యాటింగ్కు రమ్మని చెప్తారా?చెప్పరు కదా?!.. వాళ్లిద్దరు అత్యుత్తమ బ్యాటర్లు కాబట్టి టాపార్డర్లోనే వస్తారు. మరి ఈ ప్రధాన బౌలర్ విషయంలో మాత్రం ఎందుకిలా?’’ అని గావస్కర్ టీమిండియా సారథి రోహిత్ వ్యూహాలను విమర్శించాడు.చెత్త షాట్లతో వికెట్లు కోల్పోయిఅదే విధంగా టీమిండియా బ్యాటర్ల తీరుపైనా గావస్కర్ విమర్శలు గుప్పించాడు. అనవసరపు షాట్లకు యత్నించి వికెట్లు పారేసుకోవడం ఏమిటని మండిపడ్డాడు. ఏదేమైనా పాక్పై టీమిండియా మ్యాచ్ గెలవడం మాత్రం సంతోషంగా ఉందంటూ స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.చదవండి: Ind vs Pak: కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్
టీ20 వరల్డ్కప్లో ఇవాళ (జూన్ 10) మరో ఆసక్తికర సమరం
టీ20 వరల్డ్కప్ 2024లో ఇవాళ (జూన్ 10) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. గ్రూప్-డి నుంచి తొలి రెండు స్థానాల్లో ఉన్న సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ న్యూయార్క్ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.ఈ వేదికపై నిన్న (జూన్ 9) భారత్, పాక్ హోరాహోరీగా తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్కు ఆదిలో వరుణుడు అడ్డు తగిలినా ఆతర్వాత నిరాటంకంగా సాగింది. రసవ్తరతంగా సాగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్లో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. ఈ పిచ్పై ఇరు జట్ల పేసర్లు చెలరేగిపోయారు. ఫలితంగా ఇరు జట్ల బ్యాటర్లు ఒక్కో పరుగు కోసం కఠోరంగా శ్రమించారు.ఈ పిచ్పై ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్ల్లో ఏ జట్టు ఒక్కసారి కూడా 150 పరుగుల మార్కు దాటలేదు. దీన్ని బట్టి చూస్తే పిచ్ ఎంత కఠినంగా ఉందో అర్దమవుతుంది. ఇదే పిచ్పై ఇవాళ సౌతాఫ్రికా-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో కూడా పెద్ద స్కోర్లు నమోదయ్యే అవకాశాలు లేవని తెలుస్తుంది. ఇక్కడ బ్యాటర్లకు మరోసారి గడ్డు పరిస్థితులు తప్పవని అంచనా.సౌతాఫ్రికాదే సంపూర్ణ ఆధిపత్యంటీ20 వరల్డ్కప్ టోర్నీల్లో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులు పరిశీలిస్తే.. బంగ్లాదేశ్పై సౌతాఫ్రికాకు సంపూర్ణ ఆధిపత్యం కనిపిస్తుంది. మెగా టోర్నీల్లో ఇరు జట్లు ఇప్పటివరకు తలపడిన 3 సందర్భాల్లో సౌతాఫ్రికానే విజయం సాధించింది. ప్రస్తుత బలాబలాల ప్రకారం చూసినా సౌతాఫ్రికానే మరోసారి జయకేతనం ఎగురవేసే అవకాశం ఉంది.
కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు ఆ జట్టు మాజీ ఆటగాళ్లు. బాబర్ ఆజం బృందం ఆట తీరును విమర్శిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఐసీసీ ఈవెంట్లలో దాయాది పాక్పై భారత జట్టు విజయపరంపర కొనసాగుతోంది. న్యూయార్క్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో రోహిత్ సేన మరోసారి పాక్ను విజయానికి దూరం చేసింది.చివరి వరకు నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్లో ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పాకిస్తాన్.. భారత్ను 119 పరుగులకే కట్టడి చేసింది.నసీం షా, హ్యారిస్ రవూఫ్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. ఆమిర్ రెండు, షాహిన్ ఆఫ్రిది ఒక్కో పడగొట్టారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(31) శుభారంభం అందించినా.. మిగిలిన వాళ్ల నుంచి అతడికి సహకారం అందలేదు.టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా అద్భుత రీతిలో బౌలింగ్ చేస్తూ.. పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వీరి దెబ్బకు పరుగులు రాబట్టడం పక్కనపెడితే వికెట్ను ఎలా కాపాడుకోవాలో తెలియక బ్యాటర్లు తలలు పట్టుకున్నారు.ఉద్దేశపూర్వకంగానే?ఈ క్రమంలో నత్తనడకన సాగిన పాక్కు ఇన్నింగ్స్ 113 పరుగుల వద్ద ముగిసిపోయింది. ఫలితంగా ఆరు పరుగుల తేడాతో పాక్కు ఓటమి తప్పలేదు. ఇక పాకిస్తాన్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచిన రిజ్వాన్ 44 బంతుల్లో 31 పరుగులు చేయగా.. ఇమాద్ వసీం అతడి తర్వాతి స్థానంలో నిలిచాడు.ఇమాద్ వసీం 23 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులే చేశాడు. మిగతా వాళ్లు కూడా బుమ్రా ‘డాట్’ మ్యాజిక్కు చిత్తై చెత్త స్ట్రైక్రేటు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్ ఇమాద్ వసీంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇమాద్ ఇన్నింగ్స్ గమనిస్తే.. అతడు ఉద్దేశపూర్వకంగానే బంతులు వృథా చేసినట్లు అనిపించిందని ఆరోపించాడు. అతడి వల్లే లక్ష్య ఛేదన మరింత సంక్లిష్టంగా మారిందని సలీం మాలిక్ విమర్శించాడు. చదవండి: వాళ్ల నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం.. రెండు గెలిస్తేనే: బాబర్ ఆజం View this post on Instagram A post shared by ICC (@icc)
బిజినెస్
గోల్డ్ బాండ్లకు ఇన్వెస్టర్ల ఆదరణ...
న్యూఢిల్లీ: 2023–24 ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్లలో ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ భారీగా పెరిగి రూ.27,031 కోట్లకు చేరింది. పరిమాణంలో ఈ విలువ 44.34 టన్నులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 2022–23లో ఈ విలువ, పరిమాణం వరుసగా రూ.6,551 కోట్లు, 12.26 టన్నులుగా ఉంది. అధికారిక సమాచారం ప్రకారం.. 2015లో ఈ పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి 67 విడతల్లో విక్రయాలు జరిగాయి. రూ.72,274 కోట్లు సమకూరగా, పరిమాణంలో 146.96 టన్నులకు ఈ విలువ ప్రాతినిధ్యం వహిస్తోంది. వార్షికంగా పసిడి ధర 10 గ్రామలుకు (పూర్తి స్వచ్ఛత) రూ.62,300 నుంచి రూ.73,200కు ఎగసింది.
అమెజాన్ చేతికి ఎంఎక్స్ ప్లేయర్ ’అసెట్స్’
న్యూఢిల్లీ: టైమ్స్ ఇంటర్నెట్ గ్రూప్లో భాగమైన వీడియో ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫాం ఎంఎక్స్ ప్లేయర్కి చెందిన కొన్ని అసెట్స్ను అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 80–100 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 664 కోట్లు – రూ. 830 కోట్లు) వెచ్చించనుంది. ఇందుకోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, లావాదేవీ ఇంకా పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నాయి. ఇది పూర్తయితే ఎంఎక్స్ ప్లేయర్లో పని చేసే కొందరు సీనియర్ ఉద్యోగులు అమెజాన్లో చేరనున్నట్లు వివరించాయి. సిమిలర్వెబ్ గణాంకాల ప్రకారం భారత్లో వినియోగంరీత్యా టాప్ 50 ఆండ్రాయిడ్ వీడియో ప్లేయర్స్, ఎడిటర్స్ యాప్ కేటగిరీలో ఎంఎక్స్ ప్లేయర్ టాప్ 3లో ఉంది. దీన్ని 2018లో టైమ్స్ ఇంటర్నెట్ కొనుగోలు చేసింది.
డెలివరీ పార్ట్నర్స్కు శీతల పానీయాలు
న్యూఢిల్లీ: ఎండ వేడిమి నుంచి ఉపశమనానికి డెలివరీ పార్ట్నర్స్ సేద తీరేందుకు ఫుడ్ డెలివరీ, ఈ–కామర్స్ కంపెనీలు పలు చర్యలకు శ్రీకారం చుట్టాయి. దేశవ్యాప్తంగా 450 రెస్ట్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్టు జొమాటో ప్రకటించింది. డెలివరీ పార్ట్నర్స్ ఈ కేంద్రాల్లో సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. మొబైల్ చార్జింగ్, మంచి నీరు, వాష్రూమ్స్ ఏర్పాట్లు ఉంటాయి. 250 నగరాలు, పట్టణాల్లో 450 కేంద్రాల్లో డెలివరీ పార్ట్నర్స్కు అందించేందుకు శీతల పానీయాలు, పళ్ల రసాలు, గ్లూకోస్ వంటి 5 లక్షల ప్యాక్లను కంపెనీ కొనుగోలు చేసింది. అత్యవసర వైద్యం అవసరమైతే 15 నిముషాల్లో చేరుకునేలా 530కిపైగా నగరాలు, పట్టణాల్లో అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేసింది. ఫుల్ స్లీవ్, డ్రై ఫిట్ టీ–షర్టులను అందుబాటులోకి తెచి్చనట్టు జొమాటో సీఈవో రాకేశ్ రంజన్ తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ఎండ తీవ్రత ఉన్న సమయంలో ఫుడ్ ఆర్డర్ చేయకూడదని కంపెనీ తన కస్టమర్లకు ఎక్స్ వేదికగా విన్నవించింది. బీమా కవరేజ్ సైతం.. స్విగ్గీ ఇన్స్టామార్ట్ 900లకుపైగా రీచార్జ్ జోన్స్ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో సీటింగ్, మొబైల్ చార్జింగ్, మంచి నీరు, వాష్రూమ్స్ ఏర్పాట్లు ఉంటాయి. అత్యవసర వైద్యం కోసం జొమాటోకు చెందిన క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ బ్లింకిట్ తన యాప్లో ఎస్వోఎస్ సపోర్ట్ ప్రవేశపెట్టింది. డెలివరీ పార్ట్నర్స్ వేచి ఉండే ప్రాంతాల్లో ఎయిర్ కూలర్స్ను ఏర్పాటు చేసినట్టు బ్లింకిట్ సీఈవో అల్బీందర్ ధిండ్సా తెలిపారు. జొమాటో, బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్స్ ఆసుపత్రిలో చేరితే రూ.1 లక్ష వరకు, ఔట్ పేషెంట్ సేవలు పొందితే రూ.5,000 వరకు బీమా కవరేజ్ ఆఫర్ చేస్తోంది. గ్లూకోస్ పానీయాలను అందిస్తున్నట్టు ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఫెసిలిటీస్ వద్ద ఫ్యాన్స్, కూలర్స్ను అదనంగా ఏర్పాటు చేసినట్టు వివరించింది.
ఐపీవోకు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. తద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా రూ. 4,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 3,000 కోట్ల విలువైన షేర్లను మాతృ సంస్థ బజాజ్ ఫైనాన్స్ విక్రయానికి ఉంచనుంది. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు సన్నాహాలు ప్రారంభించింది. ఎగువ స్థాయి(అప్పర్ లేయర్) ఎన్బీఎఫ్సీగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 2025 సెపె్టంబర్కల్లా పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంది. కాగా.. భవిష్యత్ అవసరాలరీత్యా ఐపీవో నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వద్ద 2015లోనే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిజిస్టర్ అయ్యింది. డిపాజిట్లు స్వీకరించని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా కొనసాగుతోంది. రెసిడెన్షియల్, కమర్షియల్ ఆస్తుల కొనుగోలు, ఆధునీకరణ తదితరాలకు ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. ఆర్బీఐ వద్ద అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీగా గుర్తింపు పొందింది. గృహ రుణాలు, మారి్టగేజ్, లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ తదితర సేవలు సమకూర్చుతోంది. గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో 38 శాతం వృద్ధితో రూ. 1,731 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇటీవల గృహ రుణ కంపెనీలు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే.
వీడియోలు
ఈ గ్రామంలో పెన్షన్లు లేపేస్తున్న.. టీడీపీ బెదిరింపులు
రైతులకు గుడ్ న్యూస్..తొలి సంతకం చేసిన ప్రధాని మోదీ
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రెచ్చిపోతున్న TNSF నేతలు
విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు... విచారణ వేగవంతం
ఏపీలో జోక్యం చేసుకుంటారా ?
పార్టీ మార్పుపై పాడేరు ఎమ్మెల్యే క్లారిటీ
ఇదేనా ప్రజాస్వామ్యం !
మీలాంటి కార్యకర్తలు దొరకడం జగనన్న అదృష్టం బైరెడ్డి ఎమోషనల్..
టీడీపీపై కొడాలి నాని ఫైర్
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఫ్యామిలీ
ఆ విజయానికి అయిదు శతాబ్దాలు..
దక్షిణ భారత చరిత్రలో స్వర్ణయుగం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయల కాలం. అప్పట్లో కళింగరాజ్యం అత్యంత బలమైనది. దీన్ని గజపతులు పాలిస్తూ ఉండేవారు. వారి రాజ్యం ఒరిస్సా నుంచి ప్రస్తుత నెల్లూరు జిల్లా ఉదయగిరి వరకూ విస్తరించి ఉండేది. ఉదయగిరి విజయనగర రాజ్య సరిహద్దుల్లో ఉండి రాజ్య ముఖద్వారంగా ఉండేది. ప్రతాపరుద్ర గజపతి కళింగాధిపతి. అతడు రాహుత్త రాయలను ఉదయగిరి కోట రక్షకునిగా నియమించాడు.ఉదయగిరిపై కొండవీటి రెడ్డిరాజులు, మహమ్మదీయ రాజులూ ఒక కన్నేసి ఉంచారు. కానీ బలమైన గజపతులతో తలపడలేక అదను కోసం ఎదురు చూశారు. ఇదే సమయంలో విజయనగర పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరిని ఎలాగైనా జయించాలని క్రీ. శ. 1513లో బయలుదేరాడు. గుత్తి, గండికోట మీదుగా తన సేనతో ఉదయగిరి రాజ్యంలో ప్రవేశించాడు. ఉదయగిరిలో ఘోర యుద్ధం జరిగింది. దుర్గ రక్షకుడు రాహుత్త రాయలకు అండగా ప్రతాపరుద్ర గజపతి తన సైనికులను పంపి కృష్ణరాయలను ఎదుర్కొన్నాడు.రాయలు తన చతురంగ బలగాలను ఎంతో చాకచక్యంగా నడిపినా దుర్గం వశం కాకపోవడంతో అసహనంతో ఊగిపోయాడు. చివరికి ఒక రోజు సైనికులకు ఉత్తేజాన్ని కలిగిస్తూ... దుర్గాధిపతి తలను రేపటి కల్లా కాలితో తంతానని శపథం చేశాడు. యుద్ధాన్ని ఉద్ధృతపర్చి సైనికులను ఉత్సాహపరిచాడు. తాను స్వయంగా యుద్ధరంగంలో దూకి సైనికులను కోట గోడల మీదికి ఎగబాకించాడు. దీనితో గజపతి సైనికులు హహాకారాలు చేస్తూ శరణు వేడారు. అలా అతి కష్టం మీద దుర్గాన్ని రాయలు చేజిక్కించుకొన్నాడు. శరణు కోరిన అందరినీ రక్షించాడు.దుర్గాధిపతి రాహుత్త రాయలు తన స్వర్ణ కిరీటాన్ని బంగారు పళ్లెరంలో పెట్టి శ్రీకృష్ణదేవరాయలకు సమర్పించాడు. అన్నట్లుగానే రాయలు దాన్ని కాలితో తన్ని తన పంతం నెగ్గించుకున్నాడు. రాహుత్త రాయలను బంధించాడు. 1514 జూన్ 9న సాధించిన ఈ విజయాన్ని రాయలు తన ‘ఆముక్తమాల్యద’లో చెప్పుకున్నాడు. చారిత్రక దృష్టి గల నంది తిమ్మన తన ‘పారిజాతాపహరణం’లోనూ, అల్లసాని పెద్దన ‘మనుచరిత్ర’లోనూ ఉదయగిరి ముట్టడిని అభివర్ణించారు. పాశ్చాత్య చరిత్రకారులు కృష్ణరాయల ఉదయగిరి ముట్టడి 18 నెలలు సాగిందని పేర్కొన్నారు. ఉదయగిరి విజయంతో రాయలు పూర్వ విజయనగర సామ్రాజ్యాన్ని పునరుద్ధరించినట్లయింది.ఉదయగిరి విజయం శ్రీ వెంకటేశ్వస్వామి దయ వల్లనే లభించిందని నమ్మిన రాయలు ఇక్కడి నుండి నేరుగా తిరుమలకు బయలుదేరాడు. క్రీ.శ. 1514 జూలై 6న స్వామి వారిని దర్శించుకున్నాడు. 30 వేల వరహాలతో స్వామి వారికి కనకాభిషేకం చేయించాడు. విలువైన ఆభరణాలు సమర్పించాడు. తాళ్ళపాక గ్రామాన్ని రాయలు స్వామి వారి పేరిట ధర్మంగా ఇచ్చాడు. విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఉదయగిరి దుర్గాన్ని సాధించటం అత్యంత ప్రతిష్ఠాత్మక విజయంగా భావిస్తారు. – ఈతకోట సుబ్బారావు, 94405 29785 (శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి రాజ్యాన్ని జయించి 510 ఏళ్లు)
సైబర్ ఫ్రాడ్ : కొడుకు చదువుకోసం వాలంటరీ రిటైర్మెంట్, రూ. 85 లక్షలు హాంఫట్
ఆంధ్రప్రదేశ్లో షాకింగ్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ సీబీఐ, కస్టమ్స్, నార్కోటిక్స్ అండ్ ఇన్కంటాక్స్ ఆఫీసర్ల ముఠా ఒక రిటైర్డ్ ఉద్యోగిని నిలువునా ముంచేసింది. ఒకటీ, రెండూ కాదు ఏకంగా రూ.85 లక్షలను స్వాహా చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.ఒక ఎంఎన్సీ(జర్మనీకి చెందిన ఫార్మా)లో అసోసియేట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి తన కొడుకు చదువుకోసం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. మే 2న రిటైర్మెంట్ సెటిల్మెంట్ డబ్బులు అతని ఉత్తమ్ నగర్ బ్రాంచ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న ఆయన కుమారుడి వీసా అపాయింట్మెంట్ మే 17న ఉంది. ఇక్కడే ముఠా తమ పథకాన్ని పక్కాగా అమలు చేసింది. మే 14న, తండ్రి రికార్డులను తనిఖీ చేస్తామంటూ నకిలీ ముఠా రంగంలోకి దిగింది. పథకం ప్రకారమే రెండు రోజుల పాటు స్కైప్లో 'ఇంటరాగేషన్’ చేసి, ఫేక్ ఐడీ కార్డులు చూపించి ఆయన్ను నమ్మించింది. నకిలీ సైబర్ క్రైమ్ డీసీపీ అంటూ బాధితుడికి మరో వ్యక్తి ఫోన్ చేశాడు. మాదక ద్రవ్యాలు , మనీలాండరింగ్ అలాంటి అనేక కేసుల్లో నీ పేరు వచ్చిందని, ఈ కేసులన్నింటికీ తన ఆధార్ లింక్ చేసి ఉన్నట్టు బెదించారు. అంతేకాదు మరొక వ్యక్తికి డయల్ చేసి,ఇతనిపై (రిటైర్డ్ ఉద్యోగి)ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా అంటూ నాటకమాటాడు. ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు అంటూ ఆదేశించాడు. లేదంటే జైలుకెళతావని కూడా బెదిరించాడు. దీంతో తీవ్ర భయానికి, ఒత్తిడికి లోనైనాడు. ఇంతలోనే నకిలీ డీసిపీ మళ్లీ ఫోన్ చేసి మీరు నిర్దోషిగా కనిపిస్తున్నారు, కాబట్టి. రూ.85 లక్షలు తక్షణమే చెల్లించండి. వెరిఫికేషన్ తర్వాత 15 నిమిషాల్లో తిరిగి ఇస్తానని నకిలీ అధికారులు హామీ ఇవ్వడంతో దీన్ని నమ్మిన బాధితుడు చెక్కు ద్వారా చెల్లింపు చేశారు. విశాఖపట్నంలో పోలీసులకు దాఖలు చేసిన ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) ప్రకారం ఈ నగదును ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో హెచ్డిఎఫ్సి ఖాతాను నిర్వహిస్తున్న 'రాణా గార్మెంట్స్' అనే కంపెనీకి బదిలీ చేసింది. తరువాత దేశవ్యాప్తంగా ఉన్న మరో 105 ఖాతాలకు ఈ సొమ్మును బదిలీ చేసినట్టు తేలింది. విశాఖ బ్యాంకులోని కొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉందని, రిటైర్మెంట్ తర్వాత అతను పొందిన డబ్బులు, తన ఖాతా గురించి మొత్తం సమాచారం ఈ ముఠాకు తెలుసునని ఆరోపించారు. అలాగే రాణా గార్మెంట్స్ KYC వివరాలు బ్యాంకు దగ్గర లేవా ఆయన అని ప్రశ్నించారు.హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉత్తమ్ నగర్ బ్రాంచ్ కూడాపోలీసులకు ఫిర్యాదు చేసింది. విశాఖ క్రైం బ్రాంచ్ ఈ కేసును టేకోవర్ చేసింది. కేసు దర్యాప్తులో ఉందని, తమకు కొన్ని ఆధారాలు లభించాయని పోలీసు వర్గాలు తెలిపాయి.
సరైన చోటు..?
మనం బస్సులో ఎక్కినప్పుడు కూర్చోవటానికి చోటు ఉందా లేదా అని వెతుక్కుంటాం. అది కూడా వెనక్కి అయితే కుదుపులు ఉంటాయని ముందు వరసల్లోనే కూర్చోవటానికి పోటీ పడతాం. రైల్లో ఎక్కినప్పుడు కూడా సౌకర్యంగా కిటికీ దగ్గర చోటుకు ఇష్టపడతాం. అంతేకాదు... సభలకు, సమావేశాలకు వెళ్ళినప్పుడు బాగా వినటానికి, చూడటానికి బాగుంటుందని ముందు వరుసల్లో చోటు చూసుకుంటాం. చదువుకునే రోజుల్లో విద్యార్థులు ముందు బెంచీల్లో చోటు కోసం ప్రతిరోజూ పోటీ పడుతుంటారు.కొన్ని గంటల సేపు ప్రయాణం చేయటానికే సౌకర్యవంతమైన చోటును చూసుకుంటున్నాం. ఆ కాసేపు అదేదో మన సొంత చోటులా భావిస్తూ అందులోకి ఎవరూ రాకుండా జాగ్రత్త పడుతున్నాం. మరి, శాశ్వతమైన చోటు సంపాదించుకోవాలంటే ఎంత ప్రయత్నించాలి? ఆ శాశ్వతమైన చోటు ఎక్కడుంది? దాని నెలా పొందాలి?శాశ్వతుడు, నిత్య సత్యుడు అయిన భగవంతుని హృదయంలో చోటు సంపాదించుకోవాలి. తరతరాలుగా వచ్చే ధన ధాన్యాలు, బంగారం వంటి సంపదలు వదలలేక మానవుడు పూర్తిగా సంసారంలో పడిపోతాడు. కష్టాలు కోరకుండానే వచ్చినట్లు, సుఖాలు ఆ సమయానికి అవే వస్తాయి. అందుకోసం ఎంతో విలువైన జీవితాన్ని వృ«థా చేసుకోకూడదంటాడు భాగవతంలో ప్రహ్లాదుడు. ధర్మాన్ని ఆచరించటానికి తగిన మానవ జన్మను పొందటం చాలా కష్టం. ఈ అవకాశాన్ని మనుషులు సార్థకం చేసుకోవాలి.ధర్మాన్ని, సత్యాన్ని శ్రద్ధగా పాటించే వ్యక్తులకు దైవం హృదయంలో చోటు లభిస్తుంది. ఆ పరమ పురుషుని పాద పద్మాలను మన హృదయాలలో నిలుపుకోవాలి. మంచితనం, సత్ప్రవర్తన, సత్సాంగత్యం, భక్తి, పరిపూర్ణ విశ్వాసం వంటి వానితో దైవం హృదయంలో చోటు పొందాలి. అదే నిజమైన పొందవలసిన చోటు. భగవంతుడు మెచ్చుకుంటే మనకు లభించనిది ఏదీ లేదు. – డా. చెంగల్వ రామలక్ష్మి
అందాల రాణివే... నీవెంత జాణవే యాంకర్ శ్రీముఖి ఫోటోలు
న్యూస్ పాడ్కాస్ట్
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం... 72 మందితో కొలువుదీరిన నూతన మంత్రివర్గం, ఆంధ్రప్రదేశ్కు 3, తెలంగాణకు 2 పదవులు.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రధానమంత్రిగా నేడే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం.. మంత్రివర్గం కూర్పుపై కొనసాగుతున్న కసరత్తుతి.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రధానమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ... నేడు ఎన్డీఏ ఎంపీల సమావేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవ ఎన్నిక.. శనివారం లేదా ఆదివారం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించిన ఎన్డీయే.. బీజేపీకి కూటమికి 292 స్థానాలు, ఇండియా కూటమికి 234 స్థానాలు.. 240 సీట్లకే పరిమితమైన బీజేపీ, మెజారిటీ కంటే 32 స్థానాలు తక్కువ.. 99కి పెరిగిన కాంగ్రెస్ బలం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా ఈరోజే వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి, రీప్లేస్మెంట్ మనమే.. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
గ్రూప్–1 పరీక్ష రాసి వస్తుండగా విషాదం
ధారూరు: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన జూనియర్ పంచాయతీ కార్యదర్శి తిరుగుప్రయాణంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మండల పరిధిలోని తాండూరు–హైదరాబాద్ ప్రధాన మార్గంలో గట్టెపల్లి బస్స్టేజీ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ధారూరు ఎస్ఐ వేణుగోపాల్గౌడ్ తెలిపిన ప్రకారం.. బొంరాస్పేట మండలం బొట్లోనితండా పంచాయతీ పరిధిలోని దేవులానాయక్ తండాకు చెందిన బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు నెహ్రూనాయక్కు, దుద్యాల మండలం ఈర్లపల్లి తండాకు చెందిన సుమిత్రాబాయి(29) తో మూడేళ్ల క్రితం వివాహమైంది. సుమిత్రాబాయి యాలాల మండలం అచ్యుతాపూర్ జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తోంది. వీరిద్దరూ ప్రిలిమినరీ పరీక్ష రాసి తండాకు తిరిగి వెళ్తున్నారు. ధారూరు మండలం గట్టెపల్లి సమీపంలో వర్షం కురుస్తుండడంతో సుమిత్రబాయి గొడుగు తెరిచి పట్టుకుంది. ఈ క్రమంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో గొడుగు గాలికి ఉల్టా అవ్వడంతో బైక్ అదుపుతప్పింది. సుమిత్రాబాయి కిందపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెను వెంటనే తాండూరు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Medical Student Dies: ఆరిపోయిన ఆశల దీపం
కర్నూలు(హాస్పిటల్)/ రొళ్ల: ఆశల దీపం ఆరిపోయింది. రోడ్డు ప్రమాదం ఓ వైద్య విద్యార్థిని బలితీసుకుంది. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న ఆర్.తేజేశ్వర్రెడ్డి(22) ఆదివారం మృత్యువాత పడ్డాడు. ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండలం పిల్లిగుండ్ల గ్రామానికి చెందిన రంగనాథ్ (రత్నగిరి జెడ్పీ హైసూ్కల్ టీచర్), గీతాలక్ష్మి (పిల్లిగుండ్ల గొల్లహట్టి ప్రాథమిక పాఠశాల టీచర్) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు తేజేశ్వర్రెడ్డి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఇక చిన్న కుమారుడు వర్షిత్రెడ్డి బెంగళూరులో ఇంజినీరింగ్ కోర్సు చేస్తున్నాడు. తేజేశ్వర్రెడ్డి ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో కాలేజీలోని రీడింగ్ రూమ్లో చదవడం ముగించుకుని.. వసతిగృహానికి బుల్లెట్ బండి (ద్విచక్రవాహనం)పై బయల్దేరాడు. కళాశాల గేటు దాటి బయటకు రాగానే పెట్రోల్ బంక్ దాటిన తర్వాత అదే రోడ్డులో నందికొట్కూరు నుంచి కర్నూలుకు వేగంగా వస్తున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. కిందపడిన తేజేశ్వర్రెడ్డిని దాదాపు 50 మీటర్ల వరకు బస్సు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో తేజేశ్వర్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన వైద్యశాల మార్చురీకి తరలించారు. మధ్యాహ్నం తల్లిదండ్రులు రావడంతో పోలీసులు పంచనామా చేసి మృతదేహాన్ని అప్పగించారు. చదువు పూర్తయ్యాక పెద్ద డాక్టర్ అయి తమకు అండగా ఉంటాడని భావించిన ఆ తల్లిదండ్రులు.. కుమారుని మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. 20 రోజుల కిందటే కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుని వచ్చారు. ఇంతలోనే ఎంత ఘోరం జరిగిపోయిందంటూ బంధువులు, స్నేహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో పిల్లిగుండ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు, వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు విద్యార్థి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
వేల్పూరు ఎస్సీ కాలనీవాసులపై టీడీపీ కార్యకర్తల దాడి
వినుకొండ (నూజెండ్ల): మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్వగ్రామమైన శావల్యాపురం మండలం వేల్పూరులోని ఎస్సీ కాలనీ వాసులపై ఆదివారం టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. వైఎస్సార్సీపీకి ఓటు వేశారనే అక్కసుతో 50 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు దాడిచేసి నలుగురిని గాయపరిచారు. ఎన్నికల అనంతరం బూత్ల వారీగా ఓట్లు లెక్కేసుకున్న టీడీపీ నాయకులు ఎస్సీ కాలనీలో వైఎస్సార్సీపీకి ఎక్కువ ఓట్లు పడ్డాయని ఆ కాలనీ వాసులతో గొడవకు దిగారు. అదేమని ప్రశ్నించిన బీర్నీడి దినేష్ కుమార్, తిరుపతి, రోశయ్య, నాగమ్మపై దాడిచేసి కొట్టి గాయపరిచారు. గాయపడిన వారిని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతున్నారు. వినుకొండ రూరల్ సీఐ సుధాకర్, టౌన్ సీఐ సాంబశివరావు గ్రామానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.పెరికీడులో వైఎస్సార్సీపీ నేత ఇంటిపై రాళ్ల దాడి» రాళ్లదాడితో కిటికీ అద్దాలు ధ్వంసం»ఘటనపై హనుమాన్జంక్షన్ » పోలీసులకు బాధితుల ఫిర్యాదుహనుమాన్జంక్షన్ రూరల్ (గన్నవరం): కృష్ణాజిల్లా బాపులపాడు మండలం పెరికీడులో వైఎస్సార్సీపీకి చెందిన వైస్ ఎంపీపీ పండు రాణి, మాజీ ఉప సర్పంచ్ పండు నాగార్జున దంపతుల నివాసంపై ఆదివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు దాడిచేసి బీభత్సం సృష్టించారు. ఇంటిపైకి రాళ్లు విసురుతూ దుర్భాషలాడారు. మద్యంతాగి బైక్లపై వచ్చిన టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ భయానక వాతావరణం సృష్టించారు. బైక్లపై చక్కర్లు కొడుతూ ఇంట్లో ఉన్న పండు రాణి, వారి కుమార్తెను తీవ్ర భయాందోళనలకు గురిచేశారు. టీడీపీ కార్యకర్తల రాళ్లదాడితో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో గ్రామాంతరం వెళ్లిన పండు నాగార్జున ఈ ఘటనపై హనుమాన్జంక్షన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టీడీపీ కార్యకర్తలు వెళ్లిపోయారు. ఎస్ఐ–2 పి.ఆర్జమ్మ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని ఎస్ఐ తెలిపారు. వణుకూరులో టీడీపీ, జనసేన దాడి, బెదిరింపు పెనమలూరు: కృష్ణాజిల్లా పెనమలూరు మండలం వణుకూరులో వైఎస్సార్సీపీ అభిమానులపై టీడీపీ, జనసేన నేతలు దాడులు చేశారు. ఆలస్యంగా అందిన సమాచారం ప్రకారం.. వణుకూరులో తాపీమే్రస్తిగా పనిచేస్తూ మసీదు సమీపంలో నివాసం ఉంటున్న మైనార్టీ వ్యక్తి ఇంటిపై రెండురోజుల కిందట టీడీపీ నేతలు రాళ్లువేశారు. ఇంట్లో ఉన్న వారిని అంతుచూస్తామంటూ బెదిరించారు. ఇంటి బయట ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అంతుచూస్తామని హెచ్చరించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. వణుకూరు గ్రామంలో ఉంటున్న వైద్యుడి ఇంటికి జనసేన నేతలు వెళ్లి బెదిరించారు. మహిళలను అసభ్య పదజాలంతో దూషించారు. టీడీపీ, జనసేన నేతల వైఖరి పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై దాడిచిత్తూరు జిల్లా చిన్నరెడ్డిపల్లిలో ఎనిమిది మందికి గాయాలు యాదమరి (పూతలపట్టు): చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలంలోని చిన్నరెడ్డిపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై టీడీపీ కార్యకర్తలు ఆదివారం దాడికి పాల్పడ్డారు. చిన్నరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైన ఓ యువకుడు పనికి వెళుతుండగా అడ్డగించి టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. ఆ యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి టీడీపీ కార్యకర్తలను ప్రశ్నించడంతో మరింత రెచ్చిపోయి కర్రలతో వారిని కూడా చితకబాదారు. ఈ ఘటనలో ఎనిమిదిమంది గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు యాదమరి పోలీసులు గ్రామానికి వచ్చి పరిశీలించారు. గాయపడిన యువకుడిని, అతని కుటుంబ సభ్యులను టీడీపీ కార్యకర్తలు కొన్నిరోజులుగా ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు తెలిసింది. కాగా, మంగళవారం ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలో దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. మద్యం తాగి వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లపై రాళ్లు విసరడం, ఇళ్లలోని వస్తువులు, బైక్లను ధ్వంసం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని వైఎస్సార్సీపీ సానుభూతిపరులు కోరుతున్నారు.వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడికదిరి అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కౌలేపల్లిలో ఆదివారం టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ నాయకుడు హిదయతుల్లాపై దాడిచేసి గాయపరిచారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. హిదయతుల్లా ప్రెసిడెంట్గా ఉన్న కౌలేపల్లి దేవరచెరువు సొసైటీలో 40 మంది సభ్యులున్నారు. వీరంతా చెరువులో చేపలు వదిలి జీవనం సాగిస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ గెలవగానే గ్రామానికి చెందిన ఆ పార్టీ కార్యకర్తలు చంద్ర, అతడి అనుచరులు సాంబశివ, మధు, చిరంజీవి, నారాయణస్వామి తదితరులు చెరువులో వలలు తీసేయాలని హిదయతుల్లాను రెండు రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం చెరువు వద్దనున్న హిదయతుల్లా వద్దకు వీరంతా వెళ్లి టీడీపీ అధికారంలోకి వచ్చినందున చెరువు తమకే సొంతమని, ఇక్కడ మీరెవరూ చేపలు పట్టరాదని హెచ్చరించారు. పరుష పదజాలంతో దూషిస్తూ హిదయతుల్లాపై దాడిచేసి గాయపరిచారు. బాధితుడిని కుటుంబ సభ్యులు కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
‘పోలీస్’ హ్యాకర్..20 ఏళ్ల విద్యార్థి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పోలీస్యాప్లు హాక్ఐ, టీఎస్కాప్లను హ్యాక్ చేసిన నిందితుడిని ఢిల్లీలో శనివారం అరెస్టు చేశారు. నిందితుడు యూపీలోని ఝాన్సీకి చెందిన విద్యార్థి జతిన్కుమార్(20) అని డీజీపీ రవిగుప్తా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలీస్ యాప్ల హ్యాకింగ్తో ఏ వినియోగదారుడికి సంబంధించిన సున్నితమైన, ఆర్థిక పరమైన సమాచారం లీక్ కాలేదని డీజీపీ స్పష్టం చేశారు. నిందితుడిని ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తరలించినట్టు తెలిపారు. హాక్ఐ యాప్ హ్యాక్ అయినట్టు గుర్తించిన వెంటనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగిందన్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. హ్యాకర్ పోలీస్ యాప్లలోని సమాచారాన్ని పబ్లిక్ ప్లాట్పారంలలో అమ్మకానికి పెట్టినట్టు ఉంచిన పోస్టులను ఆధారంగా చేసుకొని దర్యాప్తులో ముందుకు వెళ్లారని, పక్కా సమాచారంతో టీజీసీఎస్బీ అధికారులు ఢిల్లీకి వెళ్లి, అక్కడ హ్యాకర్ జతిన్కుమార్ను గుర్తించి అరెస్టు చేశారని డీజీపీ తెలిపారు. నిందితుడికి సైబర్ నేరచరిత్ర ఉందని, గతంలో ఇలాంటి హ్యాకింగ్ కేసులో ప్రమేయం ఉందన్నారు.న్యూఢిల్లీలోని స్పెషల్ సెల్ ద్వారక పోలీస్సే్టషన్లో క్రైం. నంబర్ 291/2023లో ఇంతకముందు అక్కడి పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. నిందితుడు ఆధార్ కార్డులకు సంబంధించిన డేటా, ఇతర ఏజెన్సీలకు సంబంధించిన క్లిష్టమైన సమాచారాన్ని కూడా లీక్ చేశారని డీజీపీ వెల్లడించారు. తెలంగాణ పోలీస్యాప్ల డేటా చోరీ కేసులో ప్రమేయమున్న అదనపు నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని డీజీపీ తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో గుర్తింపు హ్యాకింగ్ సమాచారం అందిన వెంటనే టీజీసీఎస్బీ అధికారులు రంగంలోకి దిగారని, అధునాతన సాధనాలను ఉపయోగించి, హ్యాకర్ జాడను విజయవంతంగా తెలుసుకోగలిగారని డీజీపీ రవిగుప్తా తెలిపారు. హ్యాకర్ పోలీస్ యాప్ల నుంచి చోరీ చేసిన వివరాలను databreachforum.st లో పోస్ట్ చేశాడని, చోరీ చేసిన డేటాను ు150 డాలర్లకు అమ్మకానికి పెట్టాడని పేర్కొన్నారు. ఆసక్తిగల కొనుగోలుదారులు హాక్ ఐ ,టీఎస్కాప్ డేటాను కొనేందుకు తనను సంప్రదించవచ్చని టెలిగ్రామ్ ఐడీలు Adm1nfr1end , Adm1nfr1 ends ఇచ్చాడని తెలిపారు. సోషల్ ఇంజినీరింగ్ పద్ధతులను ఉపయోగించి నిందితుడి వివరాలు తెలుసుకున్నామన్నారు. పౌరుల సమాచారం సురక్షితం హాక్ఐ, టీఎస్కాప్ యాప్లు హ్యాకింగ్ గురైనా పౌరులందరి సమాచారం సురక్షితంగానే ఉందని, ఎలాంటి ఆందోళన వద్దని డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు. డేటా లీక్ అయినట్టు మీడియాలో వచ్చిన వార్తలు వాస్తవం కాదని పేర్కొన్నారు. హాక్ఐ యాప్లో డేటా రిపోజిటరీలో భాగంగా మొబైల్ నంబర్లు, చిరునామాలు, ఈమెయిల్ ఐడీల వంటి వినియోగదారు సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటుందని డీజీపీ తెలిపారు. అయితే బలహీనమైన పాస్వర్డ్ల కారణంగా హ్యాకర్ హాక్ఐ డేటాలోకి యాక్సెస్ పొంది ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు తెలిపారు.టీఎస్కాప్ యాప్ అనేది పూర్తిగా పోలీస్ విధుల్లో అంతర్గత పనుల కోసం వాడతామని తెలిపారు. ఇందులో సందర్శకులు, హోటళ్ల డేటా సేకరిస్తారన్నది అవాస్తవం అని డీజీపీ తెలిపారు. టీస్కాప్ ద్వారా థర్డ్పారీ్టలకు డేటా వెళ్లే ఆస్కారమే లేదన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఎస్ఎంస్ సర్వర్ యూఆర్ఎల్ విషయంలో, చొరబాటుదారుడి క్లెయిమ్లు పూర్తిగా అబద్ధమని, ఈ యూఆర్ఎల్ ఏప్రిల్ 2022 నుంచి పనిచేయలేదని స్పష్టం చేశారు. హ్యాక్ అయినట్టు చెబుతున్న యూఆర్ఎల్ను హైదరాబాద్ సిటీ పోలీసులు చాలా కాలం ముందు నిలిపివేశారని పేర్కొన్నారు. భవిష్యత్లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు అన్ని పోలీసు అంతర్గత, బాహ్య నెట్వర్క్లు, వెబ్, మొబైల్ అప్లికేషన్లు, క్లౌడ్ , ఎండ్ పాయింట్లలో ఏవైనా సైబర్ సెక్యూరిటీ లోపాలు ఉంటే గుర్తించి పరిష్కరిస్తామని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. భవిష్యత్లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ విషయంలో ఎవరైనా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే వారిపై పోలీస్శాఖ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని డీజీపీ హెచ్చరించారు. పోలీస్యాప్ల హ్యాకింగ్ కేసును టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ పర్యవేక్షణలో రికార్డు సమయంలోనే అధికారులు ఛేదించారన్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన ఎస్పీలు భాస్కరన్, విశ్వజిత్ కంపాటి, డీఎస్పీలు, కేవీఎం ప్రసాద్, ఏ.సంపత్, ఇన్స్పెక్టర్ ఆశిషిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సురే‹Ùలను డీజీపీ రవిగుప్తా ప్రత్యేకంగా అభినందించారు.