Top Stories
ప్రధాన వార్తలు
మా ఓట్లు ఏమయ్యాయి? టీడీపీ ఓడిపోతుందనుకున్న చోట భారీ మెజారిటీలా..?
ఈ ఫలితాలపై ఎన్నో అనుమానాలు ఈ ఫలితాలపై ఎవ్వరికీ నమ్మకం కలగడం లేదు. మా గ్రామంలో అత్యధిక శాతం మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత చూస్తే తారుమారైనట్లు కనిపించింది. సంక్షేమ పథకాలు అందుకున్న అనేక కుటుంబాలు వైఎస్సార్సీపీకి ఓట్లు వేశాయి. కానీ ప్రతిరౌండులోనూ మెజార్టీ ఓట్లు ఏకపక్షంగా టీడీపీకి వచ్చాయి. జగన్ను అధికంగా అభిమానించే గ్రామాల్లోనే ఇలా టీడీపీకి ఓట్లు పడటం చూస్తుంటే ఎన్నో అనుమానాలున్నాయి. – దుంపల ఉమ (రైతు), కమలనాభపురం, కోట»ొమ్మాళి మండలం, శ్రీకాకుళం జిల్లాసాక్షి, అమరావతి: ‘‘మేం జగన్కే ఓటేశాం.. మా ఓట్లన్నీ ఏమైపోయాయి.. ఏదో జరిగింది.. లేకపోతే అధికార పార్టీకి ఇంత దారుణంగా సీట్లు రావడమేంటి? బంపర్ మెజారిటీతో గెలుపొందుతాం అనుకున్న చోట టీడీపీకి మెజారిటీ రావడం ఏమిటి? వైఎస్సార్సీపీ ఓట్లు పక్కాగా 90 శాతంపైగా ఉన్న ఒక బూత్ పరిధిలో టీడీపీకి మెజారిటీ రావడాన్ని ఏమనుకోవాలి? ఏదో జరిగింది.. ఆ ఓటింగ్ మిషన్లను ఏదో చేశారు.. లేకపోతే ఇంత దారుణంగా ఫలితాలెలా వస్తాయి?’’ అని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ చర్చే నడుస్తోంది. ఇంతలా ఫలితాలను తాము కలలో కూడా ఊహించలేదని టీడీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారంటే ఏం జరిగి ఉంటుందనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. కూటమి గెలిచిందనే ఆనందం కంటే జగన్ ఓడిపోయారనే బాధ అత్యధికుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ‘మా గ్రామంలో 3 వేల ఓట్లు ఉంటే అందులో కనీసం 2100 ఓట్లు వైఎస్సార్సీపీకే పడ్డాయి.. ఇలా ఒక నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ జరిగితే జగన్ ఓడిపోవడమేంటి’ అంటూ అనేక గ్రామాల్లో ప్రజలు లెక్కలు వేస్తున్నారు. పలువురు రైతులు పల్లెల్లో ఒక చోట చేరి ‘మనకు ఎంతో మేలు చేసిన జగన్కే కదా మనం ఓటేశాం. ఇలా అన్ని ఊళ్లలోనూ జరిగింది.. మరి మనందరి ఓట్లు ఏమైపోయాయి?’ అని ఆవేదన పంచుకుంటున్నారు. జగనన్నకే మేమూ ఓటేశాం అన్నకు మరీ ఇంత తక్కువ సీట్లు రావడమేంటంటూ అక్కచెల్లెమ్మలు కన్నీరు మున్నీరవుతున్నారు. బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వారికి ఫోన్లు చేసి ఏం జరిగి ఉంటుందంటూ ఆరా తీస్తున్నారు. ఉద్యోగులు సైతం ఈ ఫలితాల పట్ల విస్మయం చెందుతున్నారు. సచివాలయాల ఉద్యోగులు, కొన్ని సామాజిక వర్గాల ఉద్యోగులు, వలంటీర్లు వైఎస్సార్పార్టీకి ఓటేశారని, వీరందరి ఓట్ల వల్ల అనేక సీట్లు వచ్చే అవకాశం ఉందని వారు చర్చించుకుంటున్నారు.
సంకీర్ణంతో సామరస్యం నెలకొనేనా?
‘ఇండియా’ కూటమి కుల జనగణనను అంగీకరిస్తూ, బీజేపీ 400 సీట్లతో గెలిచి ఏకంగా రాజ్యాంగాన్ని మార్చెయ్యాలని చూస్తున్నదనీ, మొత్తం రిజర్వేషన్లను రద్దు చెయ్యాలనుకుంటోందనీ పెద్దఎత్తున ప్రచారం చేసింది. ఇది కచ్చితంగా ఓటర్ల మీద ప్రభావాన్ని చూపించింది. దాంతో ఫలితాలు బీజేపీని సంకీర్ణంలోకి నెట్టాయి. మోదీ సంకీర్ణ ప్రభుత్వాన్ని వారి సిద్ధాంతంతోనైనా వాజ్పేయిలా నడిపే వ్యక్తి కాదు. మోదీని ముస్లిం దేశాలు బద్దశత్రువుగా చూసే అవకాశముంది. ఆరెస్సెస్/బీజేపీ ఆయనను కాక మరో వ్యక్తిని ప్రధానిగా ప్రతిపాదించి కాస్త సామరస్య వాతావరణంలో దేశాన్ని నడవనిచ్చే అవకాశమున్నది. కానీ మోదీ తప్పుకొనే అవకాశం కనబడటం లేదు. అందుకు ప్రత్యర్థి కూటమి ప్రత్యామ్నాయంగా బలపడటం తప్ప మార్గం లేదు.2024 ఎన్నికలు దేశ చరిత్రలో చాలా విచిత్రమైనవి. దేశస్థాయిలో మోదీ నాయకత్వంలోని బీజేపీని సంకీర్ణంలోకి నెట్టాయి. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల్లో పరిపాలిస్తున్న రెండు పార్టీలూ ఓడిపోయాయి. ముఖ్యంగా వైసీపీ ఓటమి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే దేశం ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డ ఎన్నిక కూడా ఇది. బీజేపీ 240కి పడిపోవడం ఒక రక్షణ కవచం.ఈ ఎన్నికతో చాలా ఘోరంగా పతనమైపోతుందనుకున్న కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు దేశాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ వ్యవస్థకు చెక్ పడింది. మొత్తం బీజేపీ శక్తులు ‘పప్పు, పప్పు’ అని ఎద్దేవా చేసిన రాహుల్ గాంధీ... ఒక దళిత మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో ఎవరూ ఊహించనట్టు మ్యానిఫెస్టోను దేశం ముందు పెట్టి మోదీ, అమిత్షాల 400 సీట్లు తెస్తారన్న బీజేపీని 240 సీట్లకు పడేసి దేశాన్ని చాలా పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు.‘ఇండియా’ కూటమి కాంగ్రెస్ మ్యానిఫెస్టోను సొంతం చేసుకొని దేశమంతటా ప్రచారం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ఈ ఎన్నికల ‘హీరో’ అన్నారు. ‘ఇండియా’ కూటమి కుల జనగణనను అంగీకరిస్తూ, బీజేపీ 400 సీట్లతో గెలిచి ఏకంగా రాజ్యాంగాన్ని మార్చెయ్యాలని చూస్తున్నదనీ, మొత్తం రిజర్వేషన్లను రద్దు చెయ్యాలనుకుంటోందనీ పెద్దఎత్తున ప్రచారం చేసింది. ఈ ప్రచారం కచ్చితంగా చాలామంది ఓటర్ల మీద ప్రభావాన్ని చూపించింది. నరేంద్ర మోదీ దీన్ని తట్టుకోవడానికి ముస్లింల రిజర్వేషన్లు ఎత్తేసి బీసీలకు ఇస్తామని పదేపదే మాట్లాడారు. కానీ చంద్రబాబు, నితీష్ కుమార్ వంటివారు దాన్ని అంగీకరించలేదు. ఇప్పుడు ఈ ఇద్దరు లేకుండా బీజేపీ ప్రభుత్వం నిలబడదు. అయితే అటు నితీష్ గానీ, ఇటు చంద్రబాబు గానీ మోదీకి మంచి మిత్రులు కారు. ఇద్దరూ మోదీని, షాని వ్యతిరేకించి శత్రుస్థానంలో పెట్టి, వారితో పోరాడినవాళ్లే. అయితే ఆ ఇద్దరు ఇప్పుడు ‘ఇండియా’ కూటమి దేశానికి, రాజ్యాంగానికి ప్రమాదకరమైనదని ప్రచారం చేస్తున్న మోదీని ప్రధానమంత్రిని, షాను మళ్లీ హోంమంత్రిని చేసి దేశ అభద్రతకు బాధ్యులవుతారా? లేక బీజేపీలోని మరో వ్యక్తిని ప్రధానమంత్రిని చెయ్యమని సలహా ఇస్తారా? చూడాలి.మోదీ ప్రభుత్వం చంద్రబాబుకు దూరమైన గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్కు ఎన్నో తీవ్ర నష్టాలను చేసింది. ఆంధ్ర పెట్టుబడిదారులనెవ్వరినీ నిర్మాణం రంగంలో గానీ, పెద్ద బిజినెస్లలో గానీ నిలువనివ్వలేదు. బ్యాంకుల విలీనం చేసినప్పుడు బరోడా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి వాటిని ఆ పేర్లతోనే ఉంచి ఆంధ్రా బ్యాంక్ను మాత్రం యూనియన్ బ్యాంక్లో విలీనం చేశారు. మొదటి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ అన్నింటి రీత్యా ఇప్పుడు చంద్రబాబుపై ఆధారపడే కేంద్ర ప్రభుత్వానికి బాబు ఎటువంటి కండిషన్లు పెడతారు?అటు కాంగ్రెస్తో 2019లో తెలంగాణలో పొత్తులో పోటీ చేసింది టీడీపీ. కాంగ్రెస్ తమ ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తామంటోంది. చంద్రబాబు, నితీష్కుమార్ ఒక నిర్ణయం తీసుకుంటే, మోదీ, అమిత్ షాలను ఇంటికి పంపగలరు. అయితే చంద్రబాబుకు ఇప్పుడున్న స్థితిలో అది చిన్న నిర్ణయం కాదు. మోదీ సంకీర్ణ ప్రభుత్వాన్ని వారి సిద్ధాంతంతోనైనా వాజ్పేయిలా నడిపే వ్యక్తి కాదు. ఎన్నికల ప్రచారంలో ఆయన దేశంలోని మొత్తం ముస్లింల మీద అక్కసు కక్కారు.గుజరాత్లోని 2002 మత కల్లోలం తరువాత జరిగిన ఈ ముస్లింల వ్యతిరేక ప్రచారం ఆయన్ని ఇంకా పెద్ద ముస్లిం వ్యతిరేకిగా నిలబెడుతుంది. ప్రపంచ పత్రికలన్నీ ఆయన్ని ‘గ్రేట్ డివైడర్’ అని రాశాయి. ముస్లిం దేశాలు ఈ ఎన్నికల తరువాత ఆయన్ని బద్ధశత్రువుగా చూసే అవకాశముంది. ఆరెస్సెస్/బీజేపీ ఆయన్ని కాక మరో వ్యక్తిని ప్రధానిగా ప్రతిపాదించి కాస్త సామరస్య వాతావరణంలో దేశాన్ని నడవనిచ్చే అవకాశమున్నది. కానీ ఆరెస్సెస్/బీజేపీ క్యాడర్ మోదీ, అమిత్ షాల పరిపాలనలో సుఖాలను అనుభవించడం నేర్చుకున్నారు. వారికి ఈ భోగం మరో నాయకుల నేతృత్వంలో దొరకదు. అందువల్ల ఆరెస్సెస్లో కూడా వారు చెప్పిందే నడుస్తుంది.గుజరాత్ పెట్టుబడి దేశాన్ని మొత్తం తన గుతా«్తధిపత్యంలోకి తీసుకుంది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రం నుండి కూడా గుజరాత్ పెట్టుబడిదారులకు ధీటుగా పోటీపడే పరిస్థితి లేదు. తెలుగు రాష్ట్రాల నుండి నిర్మాణ రంగంలో గుజరాతీ పెట్టుబడిదారులకు ధీటుగా ఎదిగిన జీవీకే కంపెనీని బొంబాయి ఎయిర్పోర్ట్ నుండి తప్పించి మోదీ, షాలు అదానీకి అప్పజెప్పారు. తమకు ఎదురు తిరిగిన రాజకీయ నాయకులపై సీబీఐ, ఈడీలను ప్రయోగించి జైలుపాలు చేశారు. ఈ పరిస్థితి నుండి దేశం బయట పడాలంటే మోదీ, షాలు అధికారం నుండి పోవడమొక్కటే మార్గం. అందుకు ప్రత్యర్థి కూటమి ప్రత్యామ్నాయంగా బలపడటం తప్ప మరో మార్గం లేదు. అందుకు ‘ఇండియా’ కాస్త దారి చూపింది. ఈ స్థితిలో ‘ఏ కూటమితోనూ ఉండను’ లాంటి నిర్ణయాలు నష్టం చేస్తాయి. ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయి వ్యవస్థల్ని శాసించలేవు. నిజానికి, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేనతో – బీజేపీ చేరి ఎన్నికల కమిషన్ను అటు తిప్పింది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. కీలక స్థలాల్లో వైసీపీ కీళ్లు విరిచే ప్రయత్నం చేసింది.రాహుల్ గాంధీ దేశంలో అన్ని సభల్లో ఎన్నికల సంఘం నిష్పక్షపాత్రను ప్రశ్నిస్తూ వచ్చారు. సీబీఐ, ఈడీ, ఎలెక్టోరల్ బాండ్స్, ఇతర పార్టీల ఆదాయాలను అడ్డుకోవడం, ఉన్న పార్టీ డబ్బును ఎన్నికల్లో వాడకుండా చూడటం, ఇన్కమ్టాక్స్ వంటి సంస్థల ద్వారా బంధించడం... ఈ స్థితిలో అన్ని ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవాలంటే ఒక జాతీయ కూటమిలో చేరి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే నిర్ణయాల్లో, పోరాటాల్లో భాగం కాకపోతే ముందు ముందు బీజేపీ ప్రాంతీయ పార్టీలను తమ బందీలను చేస్తుంది.కాంగ్రెస్ ముఖ్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర తరువాత ఆరెస్సెస్/బీజేపీలను నిలువరించే ప్రయత్నం చేశారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలు డీఎంకే లాగ ఒక ప్రత్యామ్నాయ తాత్విక పునాదితో నిర్మించినవి కావు. అందుకే డీఎంకేని బీజేపీ సనాతన ధర్మం చుట్టూ రాద్దాంతం చేసి ఓడించాలని చూసింది. కానీ దాని ద్రావిడ, శూద్ర సిద్ధాంతరంగం కాపాడింది. బీజేపీ అక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇప్పుడు పార్లమెంట్ పోరాటం... రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రిజర్వేషన్లను కాపాడాలనే ‘ఇండియా’ కూటమికీ, ఆరెస్సెస్ సిద్ధాంతాన్ని దేశంలో నాటి, మత సమస్యను ముందు పెట్టి దేశంలో ఉత్పత్తి కులాలను అణగదొక్కే ఎన్డీఏలోని ఆధిపత్య బీజేపీకీ మధ్య జరుగుతుంది. ఎన్డీయే కూటమిలోని నితీష్ కుమార్, చంద్రబాబుకు బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలకు చెక్ పెట్టే అవకాశమొచ్చింది. ఈ ఇద్దరు నాయకులు ఏం చేస్తారనేది చూడాలి. చంద్రబాబు 2002లో మోదీని ముఖ్యమంత్రి పదవి నుండి దింపే స్థితిలో ఉండి కూడా ఆయన్ని కొనసాగించే బీజేపీ నిర్ణయానికి మద్దతిచ్చారు. మళ్లీ ఈ కీలకదశలో ఆయనకు ఒక అవకాశమొచ్చింది. ‘ఇండియా’ కూటమి దేశంలోని మొత్తం ప్రతిపక్ష పార్టీలను తమ పక్కన చేర్చుకోవాల్సిన అవసరముంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో మెరుపు అర్ద సెంచరీ చేసిన హిట్మ్యాన్.. అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) 600 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.2007 నుంచి ఇప్పటివరకు 473 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రోహిత్ 499 ఇన్నింగ్స్ల్లో 600 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ తర్వాతి స్థానంలో క్రిస్ గేల్ (553), షాహిద్ అఫ్రిది (476), బ్రెండన్ మెక్కల్లమ్ (398), మార్టిన్ గప్తిల్ (383) టాప్-5లో ఉన్నారు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ 330 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఆతర్వాత వార్నర్ 312 సిక్సర్లతో 11వ స్థానంలో.. 294 సిక్సర్లతో విరాట్ కోహ్లి 12వ స్థానంలో ఉన్నారు.కాగా, ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్తో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఐర్లాండ్ను 96 పరుగులకే (16 ఓవర్లు) ఆలౌట్ చేశారు. హార్దిక్ పాండ్యా (4-1-27-3), అర్ష్దీప్ సింగ్ (4-0-35-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్ పటేల్ (1-0-3-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc)ఐర్లాండ్ ఇన్నింగ్స్లో లోర్గాన్ టక్కర్ (10), కర్టిస్ క్యాంపర్ (12), గెరాత్ డెలానీ (26), జాషువ లిటిల్ (14) రెండంకెల స్కోర్ చేయగా.. ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), హ్యారీ టెక్టార్ (4), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అదైర్ (3), బ్యారీ మెక్ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో రోహిత్ (37 బంతుల్లో 52 రిటైర్డ్ హర్ట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), పంత్ (26 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించి టీమిండియాను గెలిపించారు. వీరిద్దరు సత్తా చాటడంతో భారత్ 12.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఐసీసీ ఈవెంట్లలో రోహిత్తో కలిసి తొలిసారి ఓపెనింగ్ చేసిన కోహ్లి 5 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. పంత్ సిక్సర్తో మ్యాచ్ ఫినిష్ చేశాడు. అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మోచేతికి బంతి బలంగా తాకడంతో రోహిత్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు.
వెలుగులోకి మరో ‘కౌంటింగ్’ మాయ
అచ్చంపేట: ఎన్నికల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఈవీఎం మారిపోయిన సంఘటన ఇప్పటికే బయటపడగా, తాజాగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఓ పోలింగ్ బూత్లో ఈవీఎంలో నమోదైన ఓట్లను లెక్కించకుండానే అధికారులు పక్కన పడేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ నియోజకవర్గంలోని అచ్చంపేట జెడ్పీ హైస్కూల్లో ఉన్న 56వ పోలింగ్ బూత్లో ఈవీఎంలో ఓట్లను లెక్కించకుండానే అధికారులు పక్కన పెట్టేశారని కౌంటింగ్ ఏజెంట్లు తెలిపారు.దీనిపై అధికారులను ప్రశ్నించగా, ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తిందని, అది ఓపెన్ కావడంలేదని, అందువల్ల లెక్కింపు సాధ్యం కావడంలేదని చెప్పారని ఏజెంట్లు చెప్పారు. ఈ బూత్లో మొత్తం 737 ఓట్లు ఉన్నాయి. అందులో 357 మంది పురుషులు, 380 మంది మహిళలు ఉన్నారు. అచ్చంపేట మండలంలో 2019 ఎన్నికలలో వైఎస్సార్సీపీకి 7,597 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈసారి టీడీపీకి ఈ మండలంలో 161 ఓట్ల మెజార్టీ వచ్చింది.అయితే, 56వ పోలింగ్ బూత్లో ఓట్లను లెక్కించకుండానే టీడీపీకి 161 ఓట్ల మెజార్టీ వచ్చినట్లు అధికారులు ఎలా ధృవీకరిస్తారని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడి మేరకే అధికారులు ఈ విధంగా, చేశారని, వైఎస్సార్సీపీని దెబ్బ తీయడానికి ఇంకా బయటపడని ఘోరాలు ఇంకెన్ని జరిగాయోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ రాశివారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: అమావాస్య సా.5.49 వరకు, తదుపరి జ్యేష్ఠ, శుద్ధ పాడ్యమి, నక్షత్రం: రోహిణి రా.8.25 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: ప.12.38 నుండి 2.11 వరకు, తదుపరి రా.2.00 నుండి, 3.35 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.40 వరకు, తదుపరి ప.3.01 నుండి 3.53 వరకు, అమృతఘడియలు: సా.5.27 నుండి 6.18 వరకు. మేషం...పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ తప్పదు. ఆప్తులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.వృషభం...నూతన పరిచయాలు. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకం.మిథునం...బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.కర్కాటకం...కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో ఆదరణ. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. దైవదర్శనాలు.సింహంæ...కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ఇంటర్వ్యూలు రాగలవు. సోదరులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. దైవదర్శనాలు.కన్య..మిత్రులతో వివాదాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.తుల.......రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో విభేదాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.వృశ్చికం...పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.«ధనుస్సు....ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజకనంగా ఉంటాయి.మకరం....పనులలో జాప్యం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.కుంభం..కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.మీనం...దూరపు బంధువుల కలయిక. ఆస్తి వివాదాల పరిష్కారం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
ఎన్నికల ఫలితాలు తారుమారు.. భారీగా తగ్గిన అంబానీ, అదానీల సంపద
లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అంచనాలు తారుమారయ్యాయి. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా క్రాష్ అయ్యాయి. దీంతో భారత చెందిన అదానీ ఎంటర్ ప్రైజెస్ అధినేత గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నికర సంపద భారీగా తగ్గింది.దేశంలో లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. లోక్సభ ఫలితాలకు ముందు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగా.. బీజేపీ ఆ స్థాయిలో సీట్లులో రాణించకపోవడం.. అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడంతో స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. దీంతో అంబానీ, అదానీ నికర సంపద క్షీణించినట్లు తెలుస్తోంది. ముఖేష్ అంబానీ 8.99 బిలియన్ డాలర్ల సందప క్షీణించింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద 106 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు.గౌతమ్ అదానీ నికర విలువ ఒక్క రోజులో 24.9 బిలియన్ డాలర్లు పడిపోయింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బుధవారం నాటికి అయన సంపద 97.5 బిలియన్ డాలర్లుగా ఉంది. గౌతమ్ అదానీ ప్రస్తుతం ప్రపంచ సంపన్నుల జాబితాలో 15వ స్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ తర్వాత భారత్లో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.
Kajal Aggarwal: పెళ్లయితే కెరీర్ మారాలా?
‘‘నన్ను టాలీవుడ్ చందమామ అని పిలుస్తుంటారు. ‘సత్యభామ’ విడుదల తర్వాత సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. చందమామ అందమైన పేరు. సత్యభామ పవర్ఫుల్ నేమ్. ఈ రెండూ నాకు ఇష్టమే’’ అని కాజల్ అగర్వాల్ అన్నారు. సుమన్ చిక్కాల దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సత్యభామ’. నవీన్ చంద్ర కీలక పాత్ర చేశారు. ‘మేజర్’ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరించి, స్క్రీన్ ప్లే అందించారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ పంచుకున్న విశేషాలు... ⇥ ‘సత్యభామ’ కథని సుమన్ చెప్పిన వెంటనే ఒప్పుకున్నా. ఈ స్టోరీ అంత నచ్చింది. ఈ మూవీని నా వ్యక్తిగత జీవితంతో ΄ోల్చుకోవచ్చు. సమాజంలో ఏదైనా ఘటన జరిగితే నిజ జీవితంలో నేనూ స్పందిస్తుంటా. బయటకు వచ్చి ర్యాలీలు చేయకున్నా ఆ ఘటన గురించి ఆలోచనలు వస్తుంటాయి.. డిస్ట్రబ్ చేస్తుంటాయి. ‘సత్యభామ’ సినిమా లాంటి భావోద్వేగాలున్న చిత్రం చేయడం ఇదే తొలిసారి. ఈ మూవీలో నటిస్తున్నప్పుడు ఇప్పటిదాకా ఫీల్ కాని కొన్ని భావోద్వేగాలను అనుభూతి చెందాను. ⇥ ‘సత్యభామ’లో ఎమోషన్, యాక్షన్ ఉన్న పవర్ఫుల్ ΄ోలీస్ ఆఫీసర్గా కనిపిస్తా. యాక్షన్ సీక్వెన్సుల కోసం ఎంతో కష్టపడ్డా. ఆ ఫైట్స్ సహజంగా ఉంటాయి. రామ్ చరణ్లా (మగధీర మూవీని ఉద్దేశించి) వంద మందిని నేను కొడితే ప్రేక్షకులు నమ్మరు.. నా ఇమేజ్కు ప్రేక్షకులు ఇష్టపడేలా స్టంట్స్ ఉంటాయి. ఈ మూవీలో యువత, బెట్టింగ్ అంశంతో పాటు ఓ మతం గురించిన కీ పాయింట్స్ ఉంటాయి. ⇥ పెళ్లయ్యాక ఒక హీరోయిన్ కెరీర్ ఎందుకు మారాలో అర్థం కాదు. అందరికీ వ్యక్తిగత జీవితం ఉంది. అలాగే హీరోయిన్లకు కూడా. గతంలో పెళ్లయ్యాక కథానాయికలకి అవకాశాలు తగ్గాయేమో? కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లయ్యాక ఎంతోమంది హీరోయిన్లు అంతకుముందు కంటే బిజీగా సినిమాలు చేస్తున్నారు. నేను నా వ్యక్తిగత జీవితాన్ని, సినీ కెరీర్ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నా భర్త గౌతమ్ కిచ్లు, నా ఫ్యామిలీ స΄ోర్ట్ ఎంతో ఉంది. నా భర్తకు ఇష్టమైన కథానాయికల్లో నాతోపాటు సమంత, రష్మిక మందన్న, రాశీ ఖన్నా ఉన్నారు. ‘భారతీయుడు 2’ విడుదల కోసం ఎగ్జయిటెడ్గా ఎదురు చూస్తున్నాను. ‘భారతీయుడు 3’ లోనూ నా పాత్ర ఉంటుంది. ప్రస్తుతం రెండు కొత్త సినిమాలు ఒప్పుకున్నాను.
టీడీపీ వేధింపులకువైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బలి
పెదవేగి: టీడీపీ కార్యకర్తల వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా మండల కన్వీనర్ యలమంచిలి ప్రవీణ్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ సూర్యారావుపేటకి చెందిన ప్రవీణ్ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దుర్ఘటన మండలంలో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి అహర్నిశలు శ్రమించాడన్న కక్షతో ఓట్ల లెక్కింపు రోజు (ఈనెల 4న) సాయంత్రం ప్రవీణ్ ఇంటి మీద తెలుగుదేశం కార్యకర్తలు దాడిచేశారు. రాళ్లు, బీరు సీసాలు విసిరి, దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించారు. పెదవేగి పెట్రోల్ బంక్ వైపు వస్తే కొడతామని, బైక్, కారు తగలబెట్టేస్తామని హెచ్చరించారు. బుధవారం ఉదయం ప్రవీణ్ విజయరాయి పెట్రోల్ బంక్కి వెళ్లగా.. బండిపై మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఫొటోతో ఉన్న వైఎస్సార్సీపీ స్టిక్కర్ తీసేవరకు బీభత్సం సృష్టించి దాడిచేశారు. టీడీపీ వారి బెదిరింపులకు భయపడి, వేధింపులు భరించలేక ప్రవీణ్.. తన ఇంటి సమీపంలోని తోటలో చెట్టుకు ఉరేçÜుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రవీణ్ తల్లిదండ్రులు యలమంచిలి ఝన్సీరాణి, ప్రకాశరావు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దాడుల సంస్కృతి కొనసాగితే ఉరుకోం టీడీపీ వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకున్న ప్రవీణ్ భౌతికకాయానికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి నివాళులర్పించారు. కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్ను బలితీసుకున్న టీడీపీ కార్యకర్తల అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని, వారి ఇళ్ల మీదకు వెళ్లి భౌతికదాడులు చేస్తూ, వాహనాలు, ఇంట్లో వస్తువులు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల సంస్కృతి కొనసాగితే ఊరుకునేదిలేదని టీడీపీ శ్రేణులను హెచ్చరించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులంతా సంయమనం పాటించాలని కోరారు.
ఒకేసారి రెండు పాత్రలు పోషించడం సాంకేతికంగా ఎలా సాధ్యం?
సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే అంశంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కూటమి నుంచి 164 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో మంత్రి పదవులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే కొందరికి మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇవ్వడం, చాలామంది సీనియర్లు గెలుపొందడం, బీజేపీ, జనసేనకు అవకాశం ఇవ్వాల్సినందున మంత్రివర్గ కూర్పు కత్తిమీద సాములా మారనుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని ఎన్నికలకు ముందు నుంచే ప్రచారం సాగుతుండగా బుధవారం పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వంలోనూ భాగస్వాములుగా ఉంటామని చెప్పుకొచ్చారు. అయితే ఈ రెండు ఎలా సాధ్యమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలని నిర్ణయించుకుంటే మంత్రివర్గంలో జనసేన చేరడం కుదరదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటూ తన పార్టీకి చెందిన వారికి మంత్రి పదవులు ఇప్పించాలనుకున్నా సాంకేతికంగా అది సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. దీంతో ఎలా ముందుకు వెళతారనే అంశం ఆసక్తికరంగా మారింది. జనసేన మంత్రివర్గంలో చేరితే నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాస్కు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలనే విషయంపై వెనక్కి తగ్గితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునే అవకాశం ఉంది. ఇక బీజేపీ నుంచి అసెంబ్లీకి గెలిచిన వారిలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. సత్యకుమార్, విష్ణుకుమార్రాజుకు కూడా అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు.పాతవారికే పెద్దపీటటీడీపీలో మంత్రి పదవుల ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. 135 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి గెలుపొందడంతో ఎవరికి అవకాశం దక్కుతుందోననే చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణలు, సీనియారిటీ ప్రాతిపదికన పలువురు నేతలు తమకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని గట్టిగా నమ్ముతున్నారు. చంద్రబాబు ఇప్పటికే దీనిపై ప్రాథమికంగా కొంత కసరత్తు చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నారా లోకేష్, పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకు కచ్చితంగా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని చెబుతున్నారు.
లోక్సభ ఎన్నికల్లో లెక్కలు తారుమారు
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు భిన్నంగా లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెప్పారు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన కొన్ని స్థానాల్లో, బీఆర్ఎస్ గెలిచిన చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు బీజేపీ పైచేయి సాధించింది. రాష్ట్రంలోని 17 పార్ల మెంటు స్థానాలకు గాను హైదరాబాద్లో ఎంఐఎం విజయం సాధించగా, మిగతా 16 సీట్లను బీజేపీ, కాంగ్రెస్ సమానంగా పంచుకున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ గెలి చిన 8 పార్లమెంటు స్థానాల్లోని 56 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కొన్నిచోట్ల మినహా కాంగ్రెస్సే ఆధిక్యతను కనబరిచింది. కాగా బీజేపీ గెలిచిన 8 లోక్సభ నియోజకవర్గాల్లోని 56 సెగ్మెంట్లలో బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో నిలిచింది. మూడు చోట్ల బీఆర్ఎస్ మొదటి స్థానంలో నిలిచింది. అయి తే చివరికి స్వల్ప తేడాతోనైనా బీజేపీనే విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన 39స్థానాల్లో గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక మినహా మిగతా 36 సెగ్మెంట్లలో ఆపార్టీ ఓట్లను కాంగ్రెస్, బీజేపీ పంచుకొన్నాయి. దీంతో బీఆర్ఎస్ 2,3 స్థానాలకే పరిమితమైంది. బీఆర్ఎస్కు 2 స్థానాల్లోనే రెండో స్థానం లోక్సభ ఎన్నికల్లో ఒక్కచోట కూడా గెలవలేకపోయిన బీఆర్ఎస్ కేవలం మహబూబాబాద్, ఖమ్మం లోక్సభ స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ తరువాత రెండోస్థానంలో నిలిచింది. హైదరాబాద్ ఎంపీ స్థానంలో నాలుగో స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ మిగతా 14 చోట్ల మూడో స్థానం దక్కించుకుంది. మెదక్ పార్లమెంటు పరిధిలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ కన్నా అధిక ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో గజ్వేల్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కాగా, సిద్దిపేట స్థానం మాజీ మంత్రి హరీశ్రావు కంచుకోట. అయితే బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన రఘునందన్ రావు సొంత నియోజకవర్గం అయిన దుబ్బాకలో కూడా బీఆర్ఎస్కే మెజారిటీ రావడం గమనార్హం. బీజేపీ వైపు బీఆర్ఎస్ ఓటర్ల మొగ్గు బీజేపీ గెలిచిన 8 ఎంపీ సీట్లలో చాలాచోట్ల కాంగ్రెస్ రెండోస్థానంలో నిలవగా, బీఆర్ఎస్ మూడోస్థానానికి పరిమితమైంది. 2023లో బీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో కూడా ఈసారి బీజేపీకి మెజారిటీ వచ్చింది. అంటే జాతీయ స్థాయి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ ఓటర్లు కూడా ఈసారి బీజేపీ వైపే మొగ్గు చూపారన్న మాట. కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ ఎంపీ పరిధిలోని సిరిసిల్ల నియోజకవర్గంలో సైతం బీఆర్ఎస్ రెండోస్థానంలో నిలిచింది. ఇక్కడ బీజేపీకి మెజారిటీ ఓట్లు రావడం గమనార్హం. కరీంనగర్ లోక్సభ పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కరీంనగర్, హుజూరాబాద్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ మూడోస్థానంలో నిలిచింది. కరీంనగర్ పరిధిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుస్నాబాద్ సెగ్మెంట్లో మాత్రం కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలవగా, బీజేపీ, బీఆర్ఎస్ రెండు, మూడుస్థానాలు దక్కించుకున్నాయి. నిజామాబాద్ లోక్సభ పరిధిలో బీజేపీ విజయం సాధించగా, ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధించిన బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో సైతం మూడో స్థానానికే పరిమితమైంది. ఇక హైదరాబాద్ పరిసరాల్లోని చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించగా, 2023 నవంబర్లో ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ గెలిచిన 18 సీట్లలోనూ లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితమవడం గమనార్హం. కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో బీజేపీకే రెండో స్థానం కాంగ్రెస్ గెలిచిన 8 ఎంపీ స్థానాల పరిధిలోని 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చాలావరకు బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. కానీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో సీన్ మారింది. బీజేపీ బలం ఏమ్రాతం లేని ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాలలో మాత్రమే బీఆర్ఎస్ రెండోస్థానంలో నిలవగా, మిగతా ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ ప్రధాన ప్రత్యరి్థగా ఉంది. దాదాపు 50 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉండి భారీగా ఓట్లు సాధించడం గమనార్హం. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో ధర్మపురిలో మాత్రమే కాంగ్రెస్ కన్నా బీజేపీ స్వల్ప ఆధిక్యత సాధించగా, మిగతా ఆరు చోట్ల కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలిచింది. జహీరాబాద్ ఎంపీ పరిధిలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో బీజేపీ మొదటి స్థానంలో నిలవగా, కాంగ్రెస్కు రెండో స్థానం దక్కింది. నాగర్కర్నూల్ ఎంపీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యత సాధించగా, గద్వాలలో మాత్రం కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఎక్కువ ఓట్లు పోలవడం గమనార్హం. ఇక వరంగల్, మహబూబాబాద్, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, పార్లమెంటు స్థానాల్లో దాదాపు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ మొదటి స్థానంలోనే నిలవగా, రెండోస్థానంలో బీజేపీ, మూడోస్థానంలో బీఆర్ఎస్ నిలిచింది.
తప్పక చదవండి
- AP: అప్పుడే మొదలైంది.. ఆరోగ్యశ్రీలో 134 చికిత్సలకు కోత
- మంత్రి పదవులపై మొదలైన చర్చ
- గుంటూరులో జనసేన కార్యకర్తల దాష్టీకం
- T20 World Cup 2024: రికార్డుల మోత మోగించిన రోహిత్ శర్మ
- ఒకసారి.. పదహారో శతాబ్దంలోకి వెళ్లివద్దామా?!
- లక్ష మందికిపైగా నోటాకే ఓటేశారు
- ఫ్యాన్కే వేశాం.. కానీ?
- హేమను ఒక్కరోజు విచారించండి చాలు: కోర్టు
- ఏం మాయ చేశారో..
- Stock market: మార్కెట్ యూటర్న్..
సినిమా
ఓటీటీకి వచ్చేస్తోన్న తమన్నా హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అరణ్మైనై-4. ఈ సినిమాను తెలుగులో బాక్ పేరుతో విడుదల చేశారు. సుందర్ సి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. గత నెల మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. తమిళంలో విజయవంతమైన హారర్ కామెడీ ఫ్రాంచైజీ 'అరణ్మనై 4' నుంచి వచ్చిన 4వ చిత్రంగా నిలిచింది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాదిలో రూ. 100 కోట్లు కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం జూన్ 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వెల్లడించింది. ఈ మేరకు కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, కోవై సరళ కీలక పాత్రలు పోషించారు.Oru semma Family entertainer!Aranmanai 4 Streaming From June 21 On Disney +Hotstar#Aranmanai4 #StreamingFromJune21 #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/9rz8wBBqNx— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 5, 2024
విడుదలకు ముందే ఓటీటీ ఫిక్స్ చేసుకున్న స్టార్ హీరో!
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం మహారాజా. ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా..ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. విజయ్ సేతుపతి కెరీర్లో ఇది 50వ చిత్రంగా నిలవనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ టాక్ వినిపిస్తోంది. విడుదలకు ముందే ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఫిక్స్ చేసుకుంది.ఈ మూవీని ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన తెలుగు ట్రైలర్ మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే తెలుగు వర్షన్ విడుదలపై మేకర్స్ ఇంకా స్పందించలేదు. కాగా.. ఈ సినిమా జూన్ 14న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని తెలియజేస్తూ చిత్ర బృందం పోస్టర్ విడుదల చేసింది. #MaharajaFrom June 14th@VijaySethuOffl #VJS50 pic.twitter.com/zASbuIUjxy— Nithilan Saminathan (@Dir_Nithilan) June 5, 2024
షారుక్తో సినిమా.. తన వల్ల కాదన్న స్టార్ డైరెక్టర్!
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ స్టార్ హీరోపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనురాగ్ కశ్యప్.. షారుక్ ఖాన్ గురించి అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సరిచ్చారు. మీరు షారుక్తో కలిసి ఎందుకు పని చేయలేదని ఆయను ప్రశ్నించగా.. అనురాగ్ స్పందించారు. అతనికున్న స్టార్ క్రేజ్, అభిమానులను చూసి తాను భయపడుతున్నట్లు తెలిపారు. షారుక్ ఫ్యాన్స్ అంచనాలను అందుకునే సామర్థ్యం తనకు లేదన్నారు.అనురాగ్ మాట్లాడుతూ..'సోషల్ మీడియా యుగంలో పెద్ద పెద్ద స్టార్స్కు భారీగా అభిమానులు ఉన్నారు. వారి క్రేజ్ చూస్తే నాకు భయం. స్టార్ హీరోల అభిమానులకు తమ నటుడిపై భారీ అంచనాలు ఉంటాయి. ప్రతిసారి ఫ్యాన్స్ వారి నుంచి మళ్లీ మళ్లీ అదే కోరుకుంటారు. ఒకవేళ వారి అంచనాలు అందుకోలేకపోతే అభిమానులు విమర్శిస్తారు. అందుకే హీరో కూడా కొత్తగా ప్రయత్నించడానికి భయపడతారు. షారుఖ్ ఖాన్ లాంటి స్టార్తో సినిమా తీసే సామర్థ్యంలో నాకు లేదు.' అని అన్నారు. కాగా.. గతేడాది పఠాన్, జవాన్,డుంకీ చిత్రాల విజయాలతో షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్స్ సాధించారు. మరోవైపు అనురాగ్ తెరకెక్కించిన చిత్రం 'కెన్నెడీ' 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు.
మోదీకి శుభాకాంక్షలు తెలిపిన మహేశ్ బాబు
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. మరోసారి మోదీ ప్రధానిగా కోనసాగనున్నారు. ఈ నేపథ్యంలో మోదీకి టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. 'మా ప్రధానమంత్రిగా మరోసారి అఖండ విజయాన్ని అందుకున్న మోదీ సార్కు శుభాకాంక్షలు. బలమైన, ప్రకాశవంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో మీరు ఈ విజయాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను.' అని తన ఎక్స్ పేజీలో తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమితో గెలుపొందిన చంద్రబాబుకు కూడా మహేశ్ శుభాకాంక్షలు తెలిపారు. 'ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాబోతున్న చంద్రబాబు గారికి నా శుభాకాంక్షలు. మీరు APకి అభివృద్ధి కోసం శ్రేయస్సుతో నిండిన విజయవంతమైన పాలన అందిస్తారని, రాష్ట్ర అభివృద్ధి సాధిస్తారని కోరుకుంటున్నాను.' అని మహేశ్ అన్నారు.ఇదే కమ్రంలో ఎన్నికల్లో విజయం సాధించిన పవన్ కల్యాణ్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 'ప్రజలు మీపై ఉంచిన నమ్మకం,విశ్వాసానికి మీ విజయం ప్రతిబింబం. మా ప్రజల కలలను సాకారం చేయడంలో మీ పూర్తి పదవీకాలంతో పూర్తి చేస్తారని కోరుకుంటున్నాను.' అని ఆయన ట్వీట్ చేశారు. Congratulations @narendramodi Sir on your resounding victory as our Prime Minister! Wishing you continued success in building a stronger and brighter India.— Mahesh Babu (@urstrulyMahesh) June 5, 2024
ఫొటోలు
‘మనమే’.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిసిన అందాల భామలు (ఫొటోలు)
Manamey : శర్వానంద్ ‘మనమే’.. ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
టి20 వరల్డ్ కప్ : తొలి మ్యాచ్లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. భారీగా ట్రాఫిక్ జాం (ఫొటోలు)
పొట్టి గౌన్ లో బీచ్ దగ్గర అందాలు ఆరబోసిన శ్రీలీల (ఫొటోలు)
క్రీడలు
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో మెరుపు అర్ద సెంచరీ చేసిన హిట్మ్యాన్.. అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) 600 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.2007 నుంచి ఇప్పటివరకు 473 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రోహిత్ 499 ఇన్నింగ్స్ల్లో 600 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ తర్వాతి స్థానంలో క్రిస్ గేల్ (553), షాహిద్ అఫ్రిది (476), బ్రెండన్ మెక్కల్లమ్ (398), మార్టిన్ గప్తిల్ (383) టాప్-5లో ఉన్నారు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ 330 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఆతర్వాత వార్నర్ 312 సిక్సర్లతో 11వ స్థానంలో.. 294 సిక్సర్లతో విరాట్ కోహ్లి 12వ స్థానంలో ఉన్నారు.కాగా, ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్తో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఐర్లాండ్ను 96 పరుగులకే (16 ఓవర్లు) ఆలౌట్ చేశారు. హార్దిక్ పాండ్యా (4-1-27-3), అర్ష్దీప్ సింగ్ (4-0-35-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్ పటేల్ (1-0-3-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc)ఐర్లాండ్ ఇన్నింగ్స్లో లోర్గాన్ టక్కర్ (10), కర్టిస్ క్యాంపర్ (12), గెరాత్ డెలానీ (26), జాషువ లిటిల్ (14) రెండంకెల స్కోర్ చేయగా.. ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), హ్యారీ టెక్టార్ (4), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అదైర్ (3), బ్యారీ మెక్ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో రోహిత్ (37 బంతుల్లో 52 రిటైర్డ్ హర్ట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), పంత్ (26 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించి టీమిండియాను గెలిపించారు. వీరిద్దరు సత్తా చాటడంతో భారత్ 12.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఐసీసీ ఈవెంట్లలో రోహిత్తో కలిసి తొలిసారి ఓపెనింగ్ చేసిన కోహ్లి 5 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. పంత్ సిక్సర్తో మ్యాచ్ ఫినిష్ చేశాడు. అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మోచేతికి బంతి బలంగా తాకడంతో రోహిత్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు.
సబలెంకాకు చుక్కెదురు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్), నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్) క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. రష్యాకు చెందిన 17 ఏళ్ల మిరా ఆండ్రీవా 2 గంటల 29 నిమిషాల పోరులో 6–7 (5/7), 6–4, 6–4తో సబలెంకాను బోల్తా కొట్టించగా... ఇటలీకి చెందిన 12వ సీడ్ జాస్మిన్ పావ్లిని 2 గంటల 3 నిమిషాల్లో 6–2, 4–6, 6–4తో రిబాకినాను ఓడించింది. ఆండ్రీవా, జాస్మిన్ తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్కు చేరుకున్నారు. సెమీస్లో బోపన్న జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 7–6 (7/3), 5–7, 6–1తో సాండర్ గిలె–జొరాన్ వ్లీగెన్ (బెల్జియం) జంటను ఓడించింది. మరోవైపు పురుషుల సింగిల్స్లో మూడో ర్యాంకర్ అల్కరాజ్ (స్పెయిన్) సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–3, 7–6 (7/3), 6–4తో తొమ్మిదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై గెలిచి రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ)తో సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు.
భారత్ తరఫున చివరిసారి బరిలోకి సునీల్ ఛెత్రి... నేడు కువైట్తో భారత్ పోరు
ప్రపంచకప్ 2026 ఫుట్బాల్ టోర్నీ రెండో రౌండ్ ఆసియా జోన్ క్వాలిఫయర్స్లో భాగంగా నేడు కువైట్ జట్టుతో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే మూడో రౌండ్కు అర్హత పొందే అవకాశాలు మెరుగవుతాయి. కోల్కతాలోని సాల్ట్లేక్ స్టేడియంలో రాత్రి 7 గంటల నుంచి జరగనున్న ఈ మ్యాచ్ భారత దిగ్గజం, కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్లో చివరి మ్యాచ్ కానుంది. 2005లో తొలిసారి భారత సీనియర్ జట్టుకు ఆడిన 39 ఏళ్ల ఛెత్రి ఇప్పటి వరకు 150 మ్యాచ్లు పూర్తి చేసుకొని 94 గోల్స్ సాధించాడు. జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఫుట్బాలర్స్ జాబితాలో ఛెత్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్; 206 మ్యాచ్ల్లో 128 గోల్స్), అలీ దాయ్ (ఇరాన్; 149 మ్యాచ్ల్లో 109 గోల్స్); లయనెల్ మెస్సీ (అర్జెంటీనా; 180 మ్యాచ్ల్లో 106 గోల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఆసియా క్వాలిఫయర్స్ గ్రూప్ ‘ఎ’లో ప్రస్తుతం ఖతర్ 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత్, అఫ్గానిస్తాన్ జట్లు నాలుగు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి.
T20 World Cup 2024: ఆడుతూ పాడుతూ...
భారీ అంచనాలతో టి20 వరల్డ్ కప్ బరిలోకి దిగిన భారత్ తొలి పోరులో తమ స్థాయి ప్రదర్శనతో సత్తా చాటింది. సంచలనాల రికార్డు ఉన్న ఐర్లాండ్పై ఏమాత్రం ఉదాసీనత కనబర్చకుండా పూర్తిగా పైచేయి సాధించి భారీ విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్కు అంతగా అనుకూలించని పిచ్పై ప్రత్యరి్థని 96 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా ఆ తర్వాత మరో 46 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం చేరింది. మన బౌలర్లలో ఐదుగురు కనీసం ఒక్కో వికెట్తో తమ వంతు పాత్ర పోషించారు. అనంతరం రోహిత్, పంత్ చక్కటి బ్యాటింగ్ టీమిండియాను ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలిపించాయి. ఇక ఆదివారం పాకిస్తాన్తో మ్యాచ్ రూపంలో తర్వాతి సవాల్కు భారత్ సిద్ధమైంది. న్యూయార్క్: టి20 వరల్డ్ కప్లో రోహిత్ బృందం శుభారంభం చేసింది. బుధవారం నాసా కౌంటీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. గారెన్ డెలానీ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు)దే అత్యధిక స్కోరు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (2/6), అర్‡్షదీప్ చెరో 2 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లకు 97 పరుగులు సాధించి గెలిచింది. రోహిత్ శర్మ (37 బంతుల్లో 52 రిటైర్డ్హర్ట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు), రిషభ్ పంత్ (26 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రెండో వికెట్కు 44 బంతుల్లో 54 పరుగులు జోడించారు. టపటపా... స్వింగ్కు అనుకూల వాతావరణం, అనూహ్య బౌన్స్, నెమ్మదైన అవుట్ఫీల్డ్... ఇలాంటి స్థితిలో బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ ఏ దశలోనూ భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. మూడో ఓవర్లో కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (2), బల్బర్నీ (5)లను అవుట్ చేసి అర్‡్షదీప్ ముందుగా దెబ్బ కొట్టడంతో మొదలైన ఐర్లాండ్ పతనం వేగంగా సాగింది. పవర్ప్లేలో 26 పరుగులు రాగా, వాటిలో 9 ఎక్స్ట్రాలే ఉన్నాయి. పాండ్యా తన తొలి రెండు ఓవర్లలో టకర్ (10), కాంఫర్ (12)లను వెనక్కి పంపించగా, టెక్టర్ (4)ను బుమ్రా అవుట్ చేశాడు. సిరాజ్ ఖాతాలో డాక్రెల్ (3) వికెట్ చేరడంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ 49/6 వద్ద నిలిచింది. అక్షర్ పటేల్ కూడా తన తొలి ఓవర్లో మెక్కార్తీ (0) పని పట్టగా, బుమ్రా బౌలింగ్లో లిటిల్ (14) బౌల్డయ్యాడు. అయితే చివర్లో డెలానీ కొన్ని పరుగులు జోడించగలిగాడు. అర్‡్షదీప్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను అదే ఓవర్ చివరి బంతికి రనౌట్ కావడంతో ఐర్లాండ్ ఆట ముగిసింది. ఆకట్టుకున్న పంత్... ఓపెనర్గా వచి్చన విరాట్ కోహ్లి (1) ప్రభావం చూపలేకపోగా, మరోవైపు రోహిత్ ధాటిగా ఆడాడు. మూడో స్థానంలో బరిలోకి దిగిన పంత్ కూడా అదే తరహాలో వేగంగా బ్యాటింగ్ చేశాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 39 పరుగులకు చేరింది. లిటిల్ ఓవర్లో రెండు వరుస సిక్స్లతో జోరు పెంచిన రోహిత్ 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అంతకుముందు లిటిల్ వేసిన ఓవర్లో బంతి భుజానికి బలం తగిలిన కారణంగా నొప్పితో మైదానం వీడాడు. 21 పరుగులు చేయాల్సిన స్థితిలో బ్యాటింగ్కు వచి్చన సూర్యకుమార్ (2) విఫలమైనా... మెక్కార్తీ బౌలింగ్లో రివర్స్ స్కూప్ సిక్సర్తో పంత్ మ్యాచ్ ముగించాడు. ఇటీవలే ఐపీఎల్లో ఆడిన పంత్కు ఏడాదిన్నర తర్వాత ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. స్కోరు వివరాలు ఐర్లాండ్ ఇన్నింగ్స్: బల్బర్నీ (బి) అర్‡్షదీప్ 5; స్టిర్లింగ్ (సి) పంత్ (బి) అర్‡్షదీప్ 2; టకర్ (బి) పాండ్యా 10; టెక్టర్ (సి) కోహ్లి (బి) బుమ్రా 4; కాంఫర్ (సి) పంత్ (బి) పాండ్యా 12; డాక్రెల్ (సి) బుమ్రా (బి) సిరాజ్ 3; డెలానీ (రనౌట్) 26; అడెయిర్ (సి) దూబే (బి) పాండ్యా 3; మెక్కార్తీ (సి అండ్ బి) అక్షర్ 0; లిటిల్ (బి) బుమ్రా 14; వైట్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 15; మొత్తం (16 ఓవర్లలో ఆలౌట్) 96. వికెట్ల పతనం: 1–7, 2–9, 3–28, 4–36, 5–44, 6–46, 7–49, 8–50, 9–77, 10–96. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–35–2, సిరాజ్ 3–0–13–1, బుమ్రా 3–1–6–2, పాండ్యా 4–1–27–3, అక్షర్ పటేల్ 1–0–3–1, జడేజా 1–0–7–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (రిటైర్డ్హర్ట్) 52; కోహ్లి (సి) వైట్ (బి) అడెయిర్ 1; పంత్ (నాటౌట్) 36; సూర్యకుమార్ (సి) డాక్రెల్ (బి) వైట్ 2; దూబే (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (12.2 ఓవర్లలో 2 వికెట్లకు) 97. వికెట్ల పతనం: 1–22, 2–91. బౌలింగ్: అడెయిర్ 4–0–27–1, లిటిల్ 4–0–42–0 మెక్కార్తీ 2.2–0–8–0, కాంఫర్ 1–0–4–0, వైట్ 1–0–6–1. 600: 600 రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ టెస్టుల్లో 84, వన్డేల్లో 323, టి20ల్లో 193 సిక్స్లు బాదాడు. 4000: రోహిత్ అంతర్జాతీయ టి20ల్లో 4 వేల పరుగులు (4026) దాటాడు. కోహ్లి (4038), బాబర్ (4023) తర్వాత ఈ మైలురాయిని చేరిన మూడో ఆటగాడిగా నిలిచాడు.
బిజినెస్
బీహెచ్ఈఎల్కు జాక్ పాట్.. అదానీ పవర్ నుంచి భారీ ఆర్డర్
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ రూ.3,500 కోట్ల భారీ కాంట్రాక్ట్ను దక్కించుకుంది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో 1,600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ (టీపీపీ) ఏర్పాటు కోసం అదానీ పవర్ నుండి రూ. 3,500 కోట్ల ఆర్డర్ను అందుకున్నట్లు బీహెచ్ఈఎల్ తెలిపింది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో 2x800 మెగావాట్ల టీపీపీని ఏర్పాటు చేసేందుకు అదానీ పవర్ లిమిటెడ్ (ఏపీఎల్) నుంచి బీహెచ్ఈఎల్ ఆర్డర్ దక్కించుకున్నట్లు బీహెచ్ఈఎల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో పేర్కొంది.ఈ సందర్భంగా బీహెచ్ఈఎల్ సంస్థ తిరుచ్చి, హరిద్వార్ ప్లాంట్లలో బాయిలర్, టర్బైన్ జనరేటర్లను తయారు చేయనున్నట్లు వెల్లడించింది. కాగా, అదానీ-బీహెచ్ఈఎల్ మధ్య కుదిరిన ఒప్పందంతో జూన్ 5న బీహెచ్ఈఎల్ షేర్లు 3 శాతం లాభంతో రూ.253.85 వద్ద ముగియగా, అదానీ పవర్ షేర్లు రూ.723 వద్ద స్థిరపడ్డాయి.
2030 నాటికి ఏర్పాటు కానున్న మెగాసిటీలు ఇవే
1800లలో 10శాతం కంటే తక్కువ మంది ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు. నేడు ప్రపంచ జనాభాలో 55 శాతంతో 4.3 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ కేంద్రాలకు పెద్ద ఎత్తున వలసలు పెరగడం వల్ల 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్ని మెగాసిటీలు దేశంలో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయి. న్యూయార్క్, టోక్యోలు 1950లలో తొలిసారిగా మెగా సిటీలుగా గుర్తింపు పొందాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా 32 మెగాసిటీలు ఉన్నాయి. యూఎన్ వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్ (2018) డేటా ఆధారంగా 2030 నాటికి మెగాసిటీలుగా మారుతుందని అంచనా.తదుపరి మెగాసిటీలుఅమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, మధ్య ప్రాచ్య దేశాలతో సహా ఆదాయం అధిక సంఖ్యలో ఉన్న దేశాల జనాభాలో 80 శాతం పైగా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అయితే అందుకు విరుద్దంగా 2030 నాటికి తక్కువ ఆదాయ దేశాలు మెగాసిటీలుగా అవతరించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా మెగా సిటీల జాబితాలో పలు దేశాల్లోని నగరాలు ఇలా ఉన్నాయి.
కీలక వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయం ఇదేనా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో వడ్డీ రేట్లపై ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష (ఎంపీసీ) సమావేశం బుధవారం ప్రారంభమైంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ ఆర్బీఐ ఎంపీసీ సమావేశం మూడు రోజుల పాటు జరగనుంది. అనంతరం ఎంపీసీ సమావేశంలోని నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించనున్నారు. అయితే ఈ తరుణంలో ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా ఉంచనుందని పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ఎన్నికల ఫలితాలు తారుమారు.. భారీగా తగ్గిన అంబానీ, అదానీల సంపద
లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అంచనాలు తారుమారయ్యాయి. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా క్రాష్ అయ్యాయి. దీంతో భారత చెందిన అదానీ ఎంటర్ ప్రైజెస్ అధినేత గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నికర సంపద భారీగా తగ్గింది.దేశంలో లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. లోక్సభ ఫలితాలకు ముందు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగా.. బీజేపీ ఆ స్థాయిలో సీట్లులో రాణించకపోవడం.. అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడంతో స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. దీంతో అంబానీ, అదానీ నికర సంపద క్షీణించినట్లు తెలుస్తోంది. ముఖేష్ అంబానీ 8.99 బిలియన్ డాలర్ల సందప క్షీణించింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద 106 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు.గౌతమ్ అదానీ నికర విలువ ఒక్క రోజులో 24.9 బిలియన్ డాలర్లు పడిపోయింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బుధవారం నాటికి అయన సంపద 97.5 బిలియన్ డాలర్లుగా ఉంది. గౌతమ్ అదానీ ప్రస్తుతం ప్రపంచ సంపన్నుల జాబితాలో 15వ స్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ తర్వాత భారత్లో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.
వీడియోలు
తెలంగాణలో రైతులకు గడ్డు పరిస్థితి
కత్తిమీద సాముగా మంత్రి వర్గ విస్తరణ.. జనసేన పరిస్థితి..?
గెలుపు పై మాటల యుద్ధం
టాప్ 50 హెడ్లైన్స్@07:45 AM 06 June 2024
ఇండియా కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నాం: ఖర్గే
కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు NDA సిద్ధం
వర్షం బీభత్సం.. నిలిచిపోయిన ట్రాఫిక్
మోడీ నివాసంలో ఎన్డీయే సమావేశం
ఎన్నికల ఫలితాలపై తమ్మినేని రియాక్షన్
గెలుపు, ఓటములు సహజం కార్యకర్తలు అధైర్యపడొద్దు .. మీకు అండగా నేనుంటా
ఫ్యామిలీ
ఒకసారి.. పదహారో శతాబ్దంలోకి వెళ్లివద్దామా?!
రాజాంతఃపురాలను, కోటలను సినిమాలలో తప్ప స్వయంగా చూడటం సాధ్యం కాదేమో అని బెంగపడే వాళ్లకు ఆహ్వానం పలుకుతోందీ ప్యాలెస్. ఇది మహారాష్ట్రలోని సావంత్వాడిప్యాలెస్. గోవాకు దగ్గరలో ఉంది. పదహారవ శతాబ్దంలో నిర్మించిన ఈప్యాలెస్లోకి అతిథులకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు సావంత్ రాజవంశీకులు.యువరాజు లఖమ్ సావంత్ భోంస్లే, యువరాణి శ్రద్ధా సావంత్ భోంస్లేలు తమప్యాలెస్ను పర్యాటకులకు హోమ్స్టేగా మార్చారు. ‘‘మేము మాప్యాలెస్తో వ్యాపారం చేయడం లేదు, మనదేశ చరిత్రను తెలియచేస్తున్నాం. స్వాతంత్య్రోద్యమ సమయంలో గాంధీజీ ఆధ్వర్యంలో ఉప్పు సత్యాగ్రహం ఇక్కడ జరిగింది.మరో సందర్భంలో నెహ్రూ కూడా బస చేశారు. ఈప్యాలెస్లో అడుగుపెట్టిన క్షణం నుంచి మా కొంకణ సంప్రదాయ ఆహ్వానం, ఆత్మీయతలు, భోజనంతో పదహారవ శతాబ్దంలోకి వెళ్లి΄ోతారు’’ అని చెబుతున్నారు ఈ ఇంటి వాళ్లు.టైమ్ మెషీన్లో కాలంలో వెనక్కి వెళ్లడం సినిమాల్లో చూడడం కాదు ఇక్కడ స్వయంగా అనుభూతి చెందవచ్చు, అంతేకాదు... మొఘలులు పర్షియా నుంచి మన దేశానికి తీసుకువచ్చిన గంజిఫా ఆట ఆడడం వంటివి ఇక్కడివి వచ్చిన వాళ్లకు నేర్పిస్తామని చెబుతున్నారు.రాజసాన్ని చూపిస్తుంది. కళాత్మక లాలిత్యంతో కనువిందు చేస్తుంది. అమ్మ ఒడిలా ఆప్యాయతనిస్తుంది. అమ్మమ్మ చేతి స్పర్శలోని మృదుత్వాన్ని గుర్తు చేస్తుంది. పర్యటన రొటీన్కి భిన్నంగా ఉండాలని కోరుకునే వాళ్లకు చక్కటి వెకేషన్ అవుతుంది.
ఆమె మాట, పాట, నటన, నృత్యంలో.. ‘వాహ్వా’!
అల్లరి అమ్మాయిగా పేరు తెచ్చుకున్న చంద్రికా రవి డ్యాన్సర్గా అంతకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంది. మోడలింగ్లోనూ మంచి మార్కులు కొట్టేసింది. నటనలో ‘వాహ్వా’ అనిపించింది. ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన చంద్రికా రవి భారతీయ మూలాలను మాత్రం ఎప్పుడూ మరచిపోలేదు. ఆమె మాట, పాట, నటన, నృత్యంలో భారతీయత ప్రతిఫలిస్తుంది. తాజా విషయానికి వస్తే... యూఎస్ రేడియో షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తొలి భారతీయ నటిగా చంద్రికా రవి చరిత్ర సృష్టించింది. అమెరికన్ టాక్ షో ‘ది చంద్రికా రవిషో’కు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో పుట్టింది చంద్రికా రవి. మల్లిక, రవి శ్రీధరన్లు తల్లిదండ్రులు. మూడు సంవత్సరాల వయసులోనే డ్యాన్స్, యాక్టింగ్లలో చంద్రికకు శిక్షణ ఇప్పించారు తల్లిదండ్రులు. చిన్న వయసులోనే సింగపూర్లో నృత్య ప్రదర్శన ఇచ్చింది. కొత్త్ర పాంతాలకు వెళ్లడం అంటే చంద్రికకు ఎంతో ఇష్టం. టీనేజ్లోనే ఎన్నో దేశాలు చుట్టేసి వచ్చింది. ఆస్ట్రేలియా నుంచి లాస్ ఏంజెల్స్కు వెళ్లి యాక్టింగ్, మోడలింగ్లో కెరీర్ మొదలు పెట్టింది..‘సెయి’ అనే తమిళ చిత్రంతో భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో భారతీయ, పాశ్చాత్య సంస్కృతులపై బాగా పరిచయం ఉన్న యువతి పాత్రలో నటించింది. నిజానికి నిజజీవితంలోనూ ఆమెకు రెండు సంస్కృతులపై గాఢమైన పరిచయం ఉంది. ‘నా మూలాలు దక్షిణ భారతంలో ఉన్నాయి’ అని తనను తాను గర్వంగా పరిచయం చేసుకుంటుంది చంద్రిక. మోడలింగ్ చేసినప్పటికీ తన తొలి ్రపాధాన్యత మాత్రం నటనే.‘ఫిల్మ్ మేకింగ్, యాక్టింగ్లో యూఎస్లో శిక్షణ తీసుకున్నాను. విదేశాల్లో కొన్ని ఫీచర్ ఫిల్మ్లు చేశాను. నటన అంటే ఇష్టం అయినప్పటికీ ఒకేరకమైన పాత్రలు చేయడం ఇష్టం లేదు. వైవి«ధ్యం ఉన్న పాత్రలు చేయడానికే ్రపాధాన్యత ఇస్తాను’ అంటున్న చంద్రిక పాత్రల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. సిల్క్ స్మిత బయోపిక్లో లీడ్ రోల్లో నటించింది. ‘అచ్చం స్మితలాగే ఉంది’ అనిపించుకుంది.రేడియో టాక్ షో విషయానికి వస్తే...‘ది చంద్రికా రవి షో’లో తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన రకరకాల అనుభవాలు, సవాళ్లు, పోరాటాలను పంచుకోనుంది. చంద్రిక పోరాట నేపథ్యం గురించి విన్న రూక్స్ అవెన్యూ రేడియో వ్యవస్థాపకుడు సామీ చంద్ ఆమెకు వ్యాఖ్యాతగా అరుదైన అవకాశం ఇచ్చాడు.‘ఒత్తిడితో కూడుకున్నదైనప్పటికీ ఇదొక గొప్ప అనుభవం. నటిగా మాత్రమే పరిచయం అయిన నా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ షో ఉపయోగపడుతుంది’ అంటుంది చంద్రిక. అమెరికాలోని అతి పెద్ద నెట్వర్క్లలో ఒకటైన ‘ఐహార్ట్’ రేడియోలో ఈ షో ప్రసారం కానుంది. తన షోను ఆషామాషీగా తీసుకోవడం లేదు చంద్రిక. షో సక్సెస్ కోసం డిజైన్, ్ర΄÷డక్షన్, ప్రమోషన్లకు సంబంధించి బాగా కష్టపడింది.యూఎస్లో రేడియో షోను హోస్ట్ చేస్తున్న మొదటి భారతీయ నటిగా ప్రత్యేకత సాధించిన చంద్రిక.. ‘నన్ను నేను వ్యక్తీకరించుకోవడానికి, ప్రపంచంతో నా వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడానికి ఈ షో నాకు వరం లాంటిది’ అంటుంది."ఒత్తిడితో కూడుకున్నదైనప్పటికీ ఇదొక గొప్ప అనుభవం. నటిగా మాత్రమే పరిచయం అయిన నా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ రేడియో షో ఉపయోగపడుతుంది". – చంద్రికా రవి
మా చేతిలో ఉన్న పనికి.. సాంకేతిక పరిజ్ఞానం తోడైంది..!
‘‘ఇంట్లో మగ్గం ఉంది, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. నా గ్రామం నుంచి విదేశాలతో అనుసంధానం కావడానికి ఇవి చాలు. నేను నేసిన చీరను ఈ కామర్స్ వేదికల ద్వారా నేనే మార్కెట్ చేసుకోగలుగుతున్నాను. నా చేతుల్లో తయారైన చీరను ధరించే వారి చేతికి చేర్చే సాంకేతిక మార్గాలను నేర్చుకున్నాను. వందల మంది మహిళలం సంఘటితమయ్యాం. మాలోని నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నాం. మేము గౌరవప్రదమైన ఉపాధిని పొందుతున్నాం’’ అంటోంది తమిళనాడుకు చెందిన ముత్తులక్ష్మి. ఆమె మాటలు అక్షరసత్యాలు.వైవిధ్యతే ఉపాధి..భాషలు, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లలో మాత్రమే కాదు మనదేశంలో ఉన్న వైవిధ్యత... కళలు, కళాత్మకతల్లోనూ ఉంది. దాదాపుగా ప్రతి ఇంట్లోనూ ఆ కళాత్మకత ఉంటుంది. స్థానికంగా లభించే వస్తువులతో మహిళల చేతిలో రూపుదిద్దుకునే అనేక వస్తువులు ఇప్పుడు వారికి ఉపాధిమార్గాలవుతున్నాయి. దేశంలో దాదాపుగా ఏడు కోట్ల మంది చేతిలో కళ ఉంది. ఆ చేతుల్లో అందమైన హస్తకళాకృతులు తయారవుతున్నాయి. అందులో సగానికి పైగా మహిళలే.ఒకప్పుడు ఆ పని తమకు ఉపాధినిస్తుందని, గుర్తింపును తెస్తుందని తెలియదు వాళ్లకు. తెలిసినా సరే, మధ్య దళారుల దోపిడీకి గురవుతూ అరకొరగా లభించే రుసుముతోనే సంతృప్తి చెందేవాళ్లు. ఇప్పుడు మహిళలు చురుగ్గా ఉన్నారు. తమ ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశ పెట్టే మాధ్యమాల పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. హస్తకళాకృతులు తయారు చేసే కుటుంబాల్లోని మగవారు మెరుగైన ఉపాధి కోసం ఆ వృత్తులను వదిలేస్తున్న తరుణంలో ఆ ఇళ్లలోని మహిళలు తమ వారసత్వ కళను కొనసాగిస్తూ తమకంటూ ప్రత్యేకమైన గౌరవాన్ని, అదే స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.ముత్తులక్ష్మి ఇంట్లో పవర్లూమ్ ఉంది. ఆ మరమగ్గం మీద ఆమె నెలకు పది చీరలను నేయగలుగుతోంది. తమిళనాడులోని అరుపోకోటాయ్ బ్లాక్ చేనేత చీరలకు ప్రసిద్ధి. అక్కడ నేసే చీరలను కూడా అదే పేరుతో అరుప్పుకోటాయ్ చీరలుగానే పిలుస్తారు. ఆమె నేసిన చీరలను ఫొటో తీసి తానే స్వsయంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తుంది. ఉత్పత్తిదారులకు– వినియోగదారులకు మధ్య మరో వ్యక్తి అవసరం లేదని, సాంకేతికతను ఒంటపట్టించుకోవడానికి పెద్ద చదువులు అక్కరలేదని నిరూపిస్తోంది. సాధికారత సాధించాం!‘‘ఒక్కో ప్రాంతంలోని మహిళల్లో ఒక్కో కళ ఉంటుంది. మా దగ్గర మహిళలు చేనేతతోపాటు తాటి, కొబ్బరి ఆకులతో బుట్టలు అల్లుతారు. కర్ణాటక, రాయచూర్ వాళ్లు అందమైన దండలు, ఊలు, క్రోషియో వైర్తో ఇంటి అలంకరణ వస్తువులు అల్లుతారు. గుజరాత్, దహోద్ వాళ్లు ముత్యాల ఆభరణాలతోపాటు వెదురుతో రకరకాల వస్తువులు తయారు చేయడంలో నిష్ణాతులు.వాళ్లందరికీ డిజిటల్ లిటరసీ, ఫైనాన్షియల్ లిటరసీ, ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్తోపాటు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పిస్తే అద్భుతాలు చేయగలరని నమ్మాను. అది నిజమైంది కూడా. ఇప్పుడు మొత్తం తొమ్మిది వందల మందిమి నాస్కామ్ నిర్వహించిన పదిరోజుల నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సొంతంగా అన్ని పనులూ చక్కబెట్టుకోగలుగుతున్నాం. మహిళా సాధికారత సాధనకు మా చేతిలో ఉన్న పని, సాంకేతిక పరిజ్ఞానం తోడైంది’’ అన్నది ముత్తులక్ష్మి.
Kirloskar Group: సగౌరవంగా... గౌరీ విజయం
గోల్డెన్ స్పూన్తో పుట్టిన గౌరీ కిర్లోస్కర్ తమ కుటుంబ వ్యాపార విజయాల వెలుగులో మాత్రమే కనిపించాలనుకోలేదు. ‘కొత్తగా నేను ఏమీ చేయకపోయినా జీవితం సాఫీగా సాగిపోతుంది’ అనుకోలేదు. ‘ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యంలో నేను ఎక్కడ?’ అని ప్రశ్నించుకుంది. ఆ ప్రశ్నే ఆమెతో ఎన్నో ప్రయాణాలు చేయించింది. ప్రతి ప్రయాణంలో విలువైన పాఠాలు నేర్చుకునేలా చేసింది. తమ కుటుంబ వ్యాపార చరిత్రలో తనకంటూ కొన్ని పుటలు ఉండాలనుకుంది. ఆమె ప్రయత్నం, కష్టం ఫలించాయి. ఫిప్త్ జెనరేషన్ ఎంటర్ప్రెన్యూర్గా ప్రసిద్ధ వ్యాపార సామ్రాజ్యమైన ‘కిర్లోస్కర్’లోకి అడుగుపెట్టిన గౌరీ కిర్లోస్కర్ తనను తాను నిరూపించుకుంది. తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించింది.కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టినంత మాత్రానా ఎంటర్ప్రెన్యూర్గా వారిది నల్లేరు మీద నడక అనుకోవడానికి లేదు. తమను తాము నిరూపించుకొని ఫ్యామిలీ బిజినెస్కు మరింత బలాన్ని ఇచ్చేవారితో పాటు నిరూపించుకోలేక వెనుతిరిగేవారు కూడా ఉంటారు. గౌరీ కిర్లోస్కర్ మొదటి కోవకు చెందిన మహిళ.లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పోలిటికల్ సైన్స్(ఎల్ఎస్ఈ)లో చదువుకుంది. అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో ఫైనాన్స్లో డిగ్రీ చేసింది.చదువు పూర్తి కాగానే తమ కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టి పెద్ద హోదాలో వెలిగిపోవచ్చు. అలా కాకుండా ఉద్యోగం చేయాలనుకుంది గౌరి.ఉద్యోగం చేయాలనుకోవడానికి కారణం... తనను తాను నిరూపించుకోవడం..ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్గా ఉద్యోగ ప్రస్థానాన్ని ్రపారంభించింది. ఆ తరువాత ‘పియర్సన్ కార్పొరేట్ ఫైనాన్స్’లో స్ట్రాటజీ గ్రూప్లో చేరింది. ఉద్యోగజీవితంలో విలువైన అనుభవాలను సొంతం చేసుకుంది. ఈ అనుభవాలు ఎంటర్ప్రెన్యూర్గా తన విజయాలకు బలమైన పునాదిగా నిలిచాయి.మన దేశానికి తిరిగివచ్చిన గౌరి కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇక అప్పటినుంచి ‘కిర్లోస్కర్ గ్రూప్’లో వ్యూహాత్మక విధానాలపై దృష్టి పెట్టింది. బోర్డ్ మెంబర్గా సమీక్ష సమావేశాల్లో చురుగ్గా పాల్గొనడం ఒక కోణం అయితే ఎనర్జీ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను అన్వేషించడం మరో కోణం.‘ఆర్క్ ఫిన్ క్యాప్’కు సంబంధించి టీమ్ ఏర్పాటు, బిజినెస్ ΄్లానింగ్లో కీలకంగా వ్యవహరించింది.పుణెలో కంపెనీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రధాన బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వహించింది. ఇంటర్నేషనల్ ్రపాపర్టీ కన్సల్టెంట్స్తో కలిసి పనిచేసింది. హెచ్ఆర్, బ్రాండింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్లో తనదైన ముద్ర వేసింది. పర్యావరణ కోణంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)పై ప్రత్యేక దృష్టి పెట్టింది.గౌరీ నాయకత్వంలో కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ గణనీయమైన వృద్ధిని సాధించింది. ‘ఇది కుదరదు’ అనుకునే చోట ప్రత్యామ్నాయాలు అన్వేషించి విజయం సాధించే నైపుణ్యం గౌరీలోఉంది.‘మేము ఇంజిన్ మాన్యుఫాక్చరింగ్లోకి వచ్చినప్పుడు గ్లోబల్ కంపెనీలతో టై అప్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఉంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా ఇంజిన్లను స్థానికంగానే తయారు చేసుకునే పరిస్థితి ఉండేది. ఇలాంటి అవకాశం లేకపోవడంతో సొంతంగా మాన్యుఫాక్చరింగ్ మొదలుపెట్టాం. సొంతంగా ఏదైనా చేయడం మొదలుపెట్టినప్పుడు మనదైన ఇంటెలెక్చువల్ ్రపాపర్టీ వృద్ధి చెందుతుంది’ అంటుంది గౌరీ.గౌరీ కంపెనీ బీ2బీ, బీ2సి, ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే మూడు ప్రధానమైన బిజినెస్ సెగ్మెంట్లపై దృష్టి పెట్టింది. బీ2బీ బిజినెస్ ఇంటర్నల్ కంబాషన్ ఇంజిన్స్పై, బీ2సి బిజినెస్ వాటర్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలపై దృష్టి పెడుతుంది. ఇక ‘అర్క’ గ్రూప్ అనేది ఫైనాన్షియల్ సర్వీసెస్ సెగ్మెంట్.స్థూలంగా చెప్పాలంటే...ఉన్నత విద్యాలయాల్లో చదువుకున్న చదువు, ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు, వ్యూహాత్మక దృక్పథం వ్యాపార ప్రపంచంలో గౌరీని ఉన్నత స్థానంలో నిలిపాయి. మూలాలకు తిరిగి రావడం అనేది గణనీయమైన వ్యాపార విజయానికి ఎలా దారితీస్తుందో చెప్పడానికి గౌరీ కిర్లోస్కర్ పేరును ప్రముఖంగా ప్రస్తావించవచ్చు.ఉత్సాహ బలంవ్యాపార ప్రపంచానికి అవతలి విషయానికి వస్తే... గౌరీ కిర్లోస్కర్కు యోగా చేయడం, స్క్వాష్, డైవింగ్ అంటే ఇష్టం. ప్రకృతి ప్రేమికురాలైన గౌరీకి తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్లడం అంటే ఇష్టం. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ల గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాపై కూడా ఆసక్తి ప్రదర్శిస్తుంది. ఒక పుస్తకం చదివినప్పుడో, ఉపన్యాసం విన్నప్పుడో తనకు నచ్చిన వాక్యాన్ని, మాటను నోట్ చేసుకోవడం గౌరీకి ఇష్టం. ‘ఏ పని చేసినా ఉత్సాహంతో చేయాలి. ఉత్సాహమే అనంతమైన శక్తి’ అంటుంది గౌరీ కిర్లోస్కర్.
న్యూస్ పాడ్కాస్ట్
ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవ ఎన్నిక.. శనివారం లేదా ఆదివారం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించిన ఎన్డీయే.. బీజేపీకి కూటమికి 292 స్థానాలు, ఇండియా కూటమికి 234 స్థానాలు.. 240 సీట్లకే పరిమితమైన బీజేపీ, మెజారిటీ కంటే 32 స్థానాలు తక్కువ.. 99కి పెరిగిన కాంగ్రెస్ బలం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా ఈరోజే వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి, రీప్లేస్మెంట్ మనమే.. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
మళ్లీ విజయం మనదే, ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం... ‘ఎక్స్’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు కేరళకు నైరుతి రుతుపవనాల రాక.. రెండు రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నాయకులు చల్లే బురదలోనే కమలాలు విరగబూస్తాయి.. ప్రధాని మోదీ ధీమా.. ఇంకా ఇతర అప్డేట్స్
మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
టీడీపీ వేధింపులకువైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బలి
పెదవేగి: టీడీపీ కార్యకర్తల వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా మండల కన్వీనర్ యలమంచిలి ప్రవీణ్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ సూర్యారావుపేటకి చెందిన ప్రవీణ్ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దుర్ఘటన మండలంలో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి అహర్నిశలు శ్రమించాడన్న కక్షతో ఓట్ల లెక్కింపు రోజు (ఈనెల 4న) సాయంత్రం ప్రవీణ్ ఇంటి మీద తెలుగుదేశం కార్యకర్తలు దాడిచేశారు. రాళ్లు, బీరు సీసాలు విసిరి, దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించారు. పెదవేగి పెట్రోల్ బంక్ వైపు వస్తే కొడతామని, బైక్, కారు తగలబెట్టేస్తామని హెచ్చరించారు. బుధవారం ఉదయం ప్రవీణ్ విజయరాయి పెట్రోల్ బంక్కి వెళ్లగా.. బండిపై మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఫొటోతో ఉన్న వైఎస్సార్సీపీ స్టిక్కర్ తీసేవరకు బీభత్సం సృష్టించి దాడిచేశారు. టీడీపీ వారి బెదిరింపులకు భయపడి, వేధింపులు భరించలేక ప్రవీణ్.. తన ఇంటి సమీపంలోని తోటలో చెట్టుకు ఉరేçÜుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రవీణ్ తల్లిదండ్రులు యలమంచిలి ఝన్సీరాణి, ప్రకాశరావు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దాడుల సంస్కృతి కొనసాగితే ఉరుకోం టీడీపీ వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకున్న ప్రవీణ్ భౌతికకాయానికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి నివాళులర్పించారు. కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్ను బలితీసుకున్న టీడీపీ కార్యకర్తల అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని, వారి ఇళ్ల మీదకు వెళ్లి భౌతికదాడులు చేస్తూ, వాహనాలు, ఇంట్లో వస్తువులు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల సంస్కృతి కొనసాగితే ఊరుకునేదిలేదని టీడీపీ శ్రేణులను హెచ్చరించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులంతా సంయమనం పాటించాలని కోరారు.
విషాదం మిగిల్చిన విహారయాత్ర
ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి యాత్రకు వెళ్లారు. అనంతరం దైవ దర్శనానికి బయలు దేరారు. అంతలోనే అనుకోని ఉపద్రవం ఎదురైంది. ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్కు చెందిన ఓ కుటుంబం చేపట్టిన విహారయాత్ర విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదం రూపంలో బాలుడిని బలిగొన్న ఘటన స్థానికంగా కలచి వేస్తోంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తాళ్ల దర్శన్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మూడు కార్లల్లో విహారయాత్రకు వెళ్లారు. యాత్రలో భాగంగా భద్రాచలం నుంచి ములుగు జిల్లా మీదుగా తాడ్వాయి గుండా సమ్మక్క సారక్క వైపు వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో తాళ్ల అరుణ్ కుమారుడు శబరీశ్(9) అక్కడిక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న అరుణ్, అతడి తండ్రి దర్శన్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికంగా ప్రథమ చికిత్స అనంతరం ఇద్దరినీ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దర్శన్(60) పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తండ్రీతాతలు ఆస్పత్రిలో ఉండగా పిల్లాడి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు సిద్ధం చేశారు. దీంతో కొంగరకలాన్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సీనియర్ ఐఏఎస్ ఇంట్లో విషాదం : చందమామలాంటి కుమార్తె తిరిగి రాని లోకాలకు
భార్యభర్తలిద్దరూ ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. వీరికి అందమైన కుమార్తె. చదువులో కూడా బాగా రాణిస్తోంది. ఇంతలోనే అనూహ్య పరిణామం వారి జీవితాల్లో తీరని అగాథాన్ని నింపింది. ఉన్నత చదువులు చదువుకుని తమకు మంచి పేరు తెస్తుందనుకున్న కుమార్తె అర్థాంతరంగా తనువు చాలించిన ఘటన కలకలం రేపింది.పోలీసులు అందించిన సమాచారం మహారాష్ట్రలో ఉన్నత పదవుల్లో ఉన్నారు వికాస్రస్తోగి, ఆయన భార్య రాధికా రస్తోగి. వికాస్ రస్తోగి మహారాష్ట్ర విద్యా శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, రాధికా రస్తోగి రాష్ట్ర హోం శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. వీరికి లిపి రస్తోగి (27)అనే కుమార్తె ఉంది. ఈమె హర్యానాలోని సోనేపట్లో న్యాయశాస్త్రం చదువుతోంది అయితే పరీక్షలకు సంబంధించిన ఒత్తిడి నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ముంబైలోని అపార్ట్మెంట్లోని 10వ అంతస్తు నుంచి దూకింది. లిపిని వెంటనే జిటి ఆసుపత్రికి తరలించి నప్పటికీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదని మృతికి ఎవరినీ నిందించవద్దంటూ పేర్కొన్న సూసైడ్ నోట్ని అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు కాగా 2017లో ఇదే తరహాలో మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారులు మిలింద్, మనీషా మహీస్కర్ జంట 18 ఏళ్ల కుమారుడిని కోల్పోయారు.
‘పాపం..దొంగ గారు.. ఏసీ చూడగానే ఫ్లాట్!’ కట్ చేస్తే..!
దేశంలోఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోద వుతున్నాయి. ఏసీ, ఫ్యాన్లు లేనిదే క్షణం కూడా ఉండలేని పరిస్థితి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. చోరీకి వచ్చిన ప్రబుద్ధుడు, ఎంచక్కా ఏసి వేసుకొని ఆదమరిచి నిద్ర పోయిన ఘటన, ఫోటో వైరల్గా మారింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న ఇంట్లోకి చోరీకి చొరడ్డాడో వ్యక్తి. అసలే పగలూ రాత్రి తేడా లేకుండా మండే ఎండలు పైగా పూర్తిగా మద్యం మత్తులో ఉన్న అతగాడు, ఏసీ చూడగానే మైమరిచిపోయాడు. ఏసీ ఆన్ చేసుకొని, నేలమీదే ఒక దిండు వేసుకుని హాయిగా గుర్రు కొట్టి నిద్ర పోయాడు. తెల్లవారేక ఇంటి ముందు గేటు తెరిచి ఉండడంతో వారణాసిలో విధులు నిర్వహిస్తున్న సదరు ఇంటి యజమాని డాక్టర్ సునీల్ పాండేకు సమాచారం అందించారు పొరుగువారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి చ్చింది. సంఘటనా చేరుకున్న పోలీసులు కూడా విస్తుపోయారు. చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని అలాగే గాఢనిద్రలోకి జారుకున్నాడు. చిత్రం వైరల్గా మారింది. దొంగ తనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి నిద్రపోయాడని డీసీపీ నార్త్ జోన్ ఆర్ విజయ్ శంకర్ తెలిపారు. అతణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు.