Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Abstract painting On YS Jagan Political life
గ్రామ స్వరాజ్యం నుంచి సమసమాజం వరకు..

పగిడిపాల ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని ఆవిష్కరిస్తూ మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట కొమ్ములవంచకు చెందిన ప్రముఖ చిత్ర కారుడు కందునూరి వెంకటేశ్‌ గీసిన ఆబ్‌స్ట్రాక్ట్‌ పెయింటింగ్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. వైఎస్‌ జగన్‌ బాల్యం, విద్యా భ్యాసం మొదలు వివాహం, వ్యాపారం, రాజకీయ ప్రస్థానం దాకా... తండ్రి వైఎస్సార్‌ అకాల మరణం మొదలుకొని నాటి ప్రభుత్వం అక్రమ కేసులు మోపడం, ఓదార్పు యాత్ర, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపన, సీఎంగా ఏపీని అభివృద్ధి, సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దిన తీరు వరకు అనేక అంశాలను ఒకే చిత్రంలో వెంకటేశ్‌ ఆవిష్కరించారు.జగన్‌ పాలనను చిత్రిక పట్టి..ఐదున్నర అడుగుల పొడవు, ఐదున్నర అడుగుల వెడల్పు ఉండే కాన్వాస్‌పై సుమారు 2 నెలలపాటు ఆయిల్‌ కలర్స్‌తో ఈ ఆబ్‌స్ట్రాక్ట్‌ పెయింటింగ్‌కు వెంకటేశ్‌ ప్రాణప్రతిష్ట చేశారు. ‘ధర్మాన్ని ఆచరించేవాళ్లు భయాన్ని ఎరుగరు. ధర్మమే ధైర్యంగా జగన్‌ పరిపాలిస్తున్నారు. పేద, బడుగు, బలహీనవర్గాల ఆశయాలను, కలలను సాకారం చేసిన జననేత స్ఫూర్తి దాయక జీవితాన్ని ఆవిష్కరిస్తూ ఆబ్‌స్ట్రాక్ట్‌ పెయింటింగ్‌ గీయడం నాకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తా’ అని వెంకటేశ్‌ చెప్పారు. గ్రామ స్వరాజ్యం నుంచి సమసమాజం దిశగా రాష్ట్రాన్ని నడిపించడమే ధ్యేయంగా సాగుతున్న వైఎస్‌ జగన్‌ పరిపాలనకు చిత్రిక పట్టినట్లు చెప్పారు.సచివాలయ పల్లకీ.. సంక్షేమ బోయలు‘రాజకీయ రంగంలో మాట తప్పడం, మడమ తిప్పడం సహజంగా కనిస్తాయి. కానీ వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ ఫలాలను సామాన్యుల దరికి చేర్చారు. అందుకే ఈ చిత్రంలో గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా సచివాల యం అనే పల్లకీని మోసేందుకు సంక్షేమ పథకాల బోయలను ఏర్పాటు చేశా. ఈ ఫలాలను ప్రతి కుటుంబానికి చేరుస్తున్న వాలంటీర్లను పథకాలకు కాపలాగా ఉన్న సైనికుడికి ప్రతీకగా పెట్టా. గాంధీ మహాత్ముడి అడుగు జాడల్లో నడుస్తూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశించినట్లుగా సమసమాజం దిశగా ఆయన ముందుకు సాగుతున్నారు’ అని వెంకటేశ్‌ చెప్పారు.అణగారిన వర్గాల అభ్యున్నతికి జగన్‌ అందిస్తున్న పథకాల స్ఫూర్తితో..‘వై.ఎస్‌. జగన్‌ జీవితాన్ని ఆవిష్కరిస్తూ గీసిన చిత్రం నాకు ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే నేను ఒక అణగారిన వర్గానికి చెందిన వ్యక్తిని. ముఖ్యమంత్రిగా జగన్‌ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న పథకాలు నేను ఈ చిత్రం గీసేందుకు స్ఫూర్తినిచ్చాయి.’ అని సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టిస్ట్‌ వెంకటేశ్‌ జేఎన్‌టీయూలో ఫైన్‌ ఆర్ట్స్‌ పూర్తి చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మొదలుకొని వివిధ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖుల చిత్రాలను గీశారు. అగ్ర హీరోలు అమితాబచ్చన్, రజనీ కాంత్, ప్రభాస్‌ వంటి వారి నుంచి ప్రశంసలు అందుకున్నారు. అబ్‌స్ట్రాక్ట్‌ ఆర్ట్‌లో జాతీయ స్థాయి గుర్తింపు పొందారు.

TDP Chandrababu Naidu benami land grabs in Andhra pradesh
గ్యాంగ్‌ ఆఫ్‌ పెత్తందార్స్‌

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే అమరావతి అమరావతి రాజధాని నిర్మాణాన్నిచేపడతానని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు.. సంపద సృష్టించి, సంక్షేమ పథకాలను అమలు చేస్తానని బీరాలు పలికారు. కానీ.. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే చంద్రబాబు లెక్క ప్రకారం రూ.లక్ష కోట్లు అవసరం. జాప్యం జరిగితే ఆ వ్యయం మరింత అధికం కావచ్చు. రాష్ట్ర బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే మౌలిక సదుపాయాల కల్పనకే 20 ఏళ్లు పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగతా ప్రాంతాల ప్రజల నోట్లో మట్టి కొట్టి, అమరావతిలో మౌలిక సదుపాయాలకు ఆ స్థాయిలో నిధులు ఖర్చు చేసినా రాష్ట్రానికి సంపద పెరగదు.చంద్రబాబు, బినామీలు, వందిమాగధుల భూముల ధరలే పెరుగుతాయి. వాటిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుని రూ.లక్షల కోట్లు కొల్లగొట్టాలన్నదే చంద్రబాబు ఎత్తుగడ. సాక్షి, అమరావతి : నోరు తెరిస్తే చాలు సంపద సృష్టిస్తానని బీరాలు పలుకుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. అది తన బినామీల కోసమేనని ఎన్నికల ప్రచారంలో పరోక్షంగా చాటిచెబుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో భూముల ధరలు అమాంతం పెరిగితే.. ఇప్పుడు పడిపోయాయని గుంటూరులో బుధవారం నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం.అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డును 185 కి.మీల పొడవున నిర్మించడానికి ప్రణాళిక రచించానని చెబుతూ రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే ఈపాటికి ప్రపంచ స్థాయి నగరం కళ్ల ముందుకు వచ్చేదని గ్రాఫిక్స్‌ కథలు వల్లె వేశారు. సీఎం జగన్‌ తన కలలను వమ్ము చేశారని.. అధికారంలోకి రాగానే అమరాతి నిర్మాణం చేపట్టడమే తన సంకల్పమని పునరుద్ఘాటించారు.అంటే.. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.లక్ష కోట్లను వెదజల్లి అమరావతిలో మౌలిక సదుపాయాలను కల్పించి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా తాను, తన బినామీలు, వందిమాగధులు కాజేసిన భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి రూ.లక్షల కోట్లు కొల్లగొట్టడానికి కట్టుబడి ఉన్నట్లుగా చంద్రబాబు తేటతెల్లం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్‌ సిటీ ముసుగులో మురళీమోహన్‌ వంటి బినామీలతో కలిసి కాజేసిన భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి రూ.వేలాది కోట్లు నొక్కేసిన తరహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్‌ వేశారు. రహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్‌ వేశారు. అంతర్జాతీయ కుంభకోణం రాజధాని లేకుండా విభజించి రాష్ట్రాన్ని కేంద్రం సంక్షోభంలోకి నెట్టిందని.. దాన్ని అవకాశంగా మల్చుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం మాటేమోగానీ ఆ ముసుగులో అంతర్జాతీయ కుంభకోణానికి పాల్పడ్డారు. 2014 జూన్‌ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. ఓత్‌ ఆఫ్‌ సీక్రసీకి తుట్లూ పొడిచి, రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతంపై బినామీలు, వందిమాగధులకు లీకులు ఇచ్చారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా రైతుల నుంచి తక్కువ ధరలకే తన గ్యాంగ్‌ ద్వారా భారీ ఎత్తున భూములు కాజేశాక రాజధానిని ప్రకటించారు.ఆ ప్రాంతానికి కనీసం రహదారి సౌకర్యం కల్పించకుండానే.. భూముల ధరలు పెంచడం కోసం తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం చేపట్టి కమీషన్లు దండుకున్నారు. స్విస్‌ ఛాలెంజ్‌ విధానానికి తూట్లు పొడుస్తూ 1691 ఎకరాల్లో రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు నిర్మాణ పనులను సింగపూర్‌ ప్రైవేటు సంస్థల కన్సార్షియంకు కట్టబెట్టి.. ఆ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి రూ.లక్ష కోట్లు కాజేయడానికి స్కెచ్‌ వేశారు.మూడు రాజధానులతో సమగ్రాభివృద్ధి భూ సమీకరణలో రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాలు, అటవీ భూములు సహా మొత్తం 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని గత టీడీపీ సర్కార్‌ నిర్ణయించింది. నల్లరేగడి భూములతో కూడిన ఆ ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్‌ సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించి, అభివృద్ధి చేయడానికి ఎకరాకు రూ.2 కోట్లు వ్యయం అవుతుందని అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంటే అమరావతిలో కేవలం కనీస మౌలిక సదుపాయాల కల్పనకే రూ.లక్ష కోట్లు అవసరం.కానీ.. రాష్ట్ర బడ్జెట్‌ నుంచి ఆ మేరకు కేటాయింపులు చేయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇదే అంశాన్ని 2024 ఎన్నికల మేనిఫెస్టోలోనూ సీఎం జగన్‌ పొందుపరిచారు.

AP Elections 2024: May 12th Politics Latest News Updates Telugu
May 12th: ఏపీ ఎన్నికల సమాచారం

ఏపీ ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు..

TDP Leader Chandrababu Fake Promises Of Manifesto
బాబూ.. నీ హామీల అమలు ఎలా సాధ్యం?

(సాక్షి, అమరావతి): మేనిఫెస్టో సహితంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన అలవికాని హామీలకు మొదటి సంవత్సరంలోనే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అక్షరాలా లక్షా అరవై ఐదువేల కోట్లు. అంటే... రూ. 1.65 లక్షల కోట్లు. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? అసలు రాష్ట్ర ఆదాయం ఎంత? అన్ని లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉందా అంటే? ఈ ప్రశ్నలకు ఆర్థిక నిపుణులనెవరిని సమాధానమడిగినా అలాంటి ఛాన్సే లేదని స్పష్టంగా చెబుతున్నారు. అయినా చంద్రబాబు మాత్రం అధికారమే లక్ష్యంగా నోటికి వచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చేశారు. ఎందుకంటే వాటిని అమలు చేసే ఆలోచన లేదు కాబట్టి నోటిమాటగా యధేచ్చగా ప్రజలకు మాయ హామీలు ఇచ్చేశారు. ప్రజలను మోసం చేయడం, వంచించడం ఈ వృద్ధ నేతకు వెన్నతో పెట్టిన విద్య కావడంతో ఈ ఎన్నికల్లోనూ అదే లైను ఎంచుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆయన ఇచ్చి­న హామీలు, ఇతర ఖర్చులు, ఎంత వరకు అప్పు చేయవచ్చు వంటి విషయాలను పరిశీలించిన నిపుణులు చంద్రబాబు హామీలు అమలు చేయడం అసాధ్యమని కుండబద్ధలు కొట్టినట్లు చెబుతున్నారు. ఆ వివరాలు చూస్తే... చంద్రబాబు కాపీ కొట్టి ప్రకటించిన తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, పింఛన్లు వంటి వివిధ పథకాలకు 2024–2025 సంవ­త్సరంలో రూ.1.65 లక్షల కోట్లు అవసరమనేది ఆర్థిక నిపుణుల అంచనా. ఇక 2029 సంవత్సరానికి అది రూ.1.76 లక్షల కోట్లకు పెరుగుతుంది. ఇక వీటితో పాటు ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చులు, మూలధన వ్యయం ఎలాగూ ఉండనే ఉంటుంది. అంటే ఉద్యోగులు, పెన్షనర్ల జీత భత్యాలు, ప్రభుత్వం అప్పులపై కట్టాల్సిన వడ్డీలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు చేయాల్సిన ఖర్చు, ఇతర బిల్లులు, చెల్లింపులు వంటివన్నీ కలిపి ఏడాదికి రూ.2 లక్షల కోట్లకుపైనే ఉంటుంది. 2024–2025­లో ఇందుకోసం రూ.2.10 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే, 2029 నాటికి అది రూ.2.85 లక్షలకు కోట్లకు పెరుగుతుందని నిపుణుల అంచనా. మొత్తంగా ఐదేళ్లలో రూ.12.23 లక్షల కోట్లు ఇందుకోసం అవసరమవుతుంది. మొత్తంగా చంద్రబాబు ప్రకటించిన పథకాలు, ప్రభుత్వ ఖర్చు కలిపి 2024–2025లో రూ.3.75 లక్షల కోట్లు అవసరమని అంచనా. 2028–29 నాటికి అది రూ.4.61 లక్షల కోట్లకు ఎగబాగనుంది. ఇంత ఖర్చును భరించే సామర్థ్యం రాష్ట్రానికి సాధ్యమయ్యే అవకాశమే లేదని ఆర్థిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఖర్చు 3.75 లక్షల కోట్లయితే... ఆదాయం రూ.2.03 లక్షల కోట్లేప్రభుత్వానికి పన్నులు, పన్నేతర ఆదాయాలన్నీ కలిపి 2025లో రూ.2.03 లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉంది. 2029 నాటికి ఈ ఆదాయం రూ.2.82 లక్షల కోట్లు పెరిగే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఆర్థిక నిపుణులు చెప్పేదేమిటంటే ఆదాయ–వ్యయాల మధ్య తేడా గరిష్ఠంగా 10–12 శాతం వరకూ ఉన్నా పర్వాలేదు. పరిస్థితి గాడి తప్పకుండా ఉంటుంది. పన్నుల వసూళ్లలో సమర్థతను పెంచుకోవటం, వ్యయాన్ని పక్కాగా నియంత్రించుకోవటం వంటి చర్యలతో ఈ మాత్రం వ్యత్యాసాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఆదాయ – వ్యయాల మధ్య తేడా మరీ ఎక్కువగా ఉంటే చేతులెత్తేయటం తప్ప ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. ఈ లెక్కన చూసుకుంటే చంద్రబాబు హామీలను బట్టి చూసినపుడు ప్రభుత్వ ఆదాయానికి.. పథ­కాలు, ఇతర ఖర్చులకు మధ్య వ్యత్యాసం 2024–­2025 సంవత్సరంలో రూ.1.72 లక్షల కోట్లు ఉంటుంది. 2028–2029 నాటికి అది రూ.1.78 లక్షల కోట్లకు పెరుగుతుంది. ఇంత డబ్బును సమకూర్చుకోవాలంటే అప్పులు దొరికే అవకాశం ఉండదు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం, లేదా ఉద్యోగుల జీతభత్యాలను పూర్తిగా నిలిపేయటం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివి చేయలేని పక్షంలో పథకాలను అమలు చేయటం మానేయాలి. అంటే... అయితే మేనిఫెస్టో­ను చెత్తబుట్టలో పడేసి జనాన్ని మోసం చెయ్యాలి... లేదంటే ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ల వంటి తప్పనిసరి వ్యయాలను ఎగ్గొట్టాలి. ఇది అరాచకానికి దారి తీస్తుందనేది నిపుణుల మాట. ఏడాదికి రూ.1.72 లక్షల కోట్ల అప్పులు తెస్తారా?తాజా లెక్కల ప్రకారం చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.72 లక్షల కోట్ల అప్పు తప్పనిసరిగా తేవాల్సి ఉంటుంది. ఈ అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ)లో 10.5 శాతాన్ని దాటేస్తాయి. అది కూడా ఆయా సంవత్సరాల్లో రెండంకెల వృద్ధి రేటు సాధిస్తారు అని ఊహిస్తేనే. అలాకాకుండా వృద్ధి రేటు తగ్గితే పరిస్థితి మరింత అధ్వాన్నం. అసలు ఇంత అప్పు తేవడం నిజంగా సాధ్యమా అంటే కానే కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఇంతకుముందు ఎప్పుడూ ఈ స్థాయి అప్పు చేయలేదు. కాగ్‌ లెక్కలు, ఆర్‌బీఐ అంచనాలు, రాష్ట్ర బడ్జెట్‌ పత్రాలన్నింటినీ పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం 2019–2024 మధ్య సగటున రూ.44 వేల కోట్లకు మించి అప్పులు చేయలేదు. జీఎస్‌డీపీలో (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) 3 శాతానికి మించి అప్పు చేయడానికి ఏ కేంద్ర ప్రభుత్వమూ అనుమతించదు. ఆ పరిమితిని పూర్తిగా ఉపయోగించుకుని... కేంద్రం అనుమతించిన మేరకు గరిష్ఠంగా అప్పులు తెచ్చినా తొలి ఏడాదే ఇంకా రూ.1.13 లక్షల కోట్లు కావాలి. ఐదేళ్లలో రూ.5.40 లక్షల కోట్లు సమకూరిస్తేనే చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం కుదురుతుంది. ఇవికాకుండా అమరావతి నిర్మాణం ఖర్చు మరో రూ.1.09 లక్షల కోట్లు. మొత్తం కలిపి రూ.6.50 లక్షల కోట్లను చంద్రబాబు ఎక్కడి నుంచి తెస్తారు? రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం కడుతున్న పన్నుల్ని నాలుగు రెట్లు పెంచి, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ గతంలో ఎన్నడూ లేనివిధంగా అయిన కాడికి అమ్మేస్తే కొంత మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. అంటే ప్రజలపై నాలుగు రెట్ల పన్నుల్ని చంద్రబాబు పెంచుతారా? లేకపోతే చంద్రబాబు హామీల అమలు కోసం ఏటా రూ.లక్ష కోట్లకు పైగా ఆస్తుల్ని అమ్మేస్తారా? ఇవేమీ సాధ్యమయ్యే అవకాశమే లేదు. అంటే చంద్రబాబు హామీలు అమలు చేయడానికి ఏమాత్రం ఛాన్సే లేదని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. గతంలో రుణమాఫీ హామీని అమలు చేయకుండా ఎగ్గొట్టినట్టే ఈ హామీలను తుంగలో తొక్కడం తప్ప బాబుకు వేరే ఆప్షన్‌ లేదని, ఆయనను నమ్మి ఓటేస్తే జరిగేది అదేనని వారు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. నిజానికి ఈ సంగతులన్నీ జనానికి తెలుసు. ఎలాగంటే... బాబు ట్రాక్‌ రికార్డు అలాంటిది మరి. అందుకే అలవికాని హామీలిచ్చిన చంద్రబాబును ప్రజలు నమ్మడంలేదు.

Jagan Mohan Reddy Vs Chandrababu Naidu in Andhra pradesh
మీ ఓటు దేనికి?

సీఎం జగన్‌ వ్యక్తిత్వంసీఎం వైఎస్‌ జగన్‌ నిజాలే మాట్లాడతారు. అబద్ధాలు చెప్పరు. చేయగలిగిందే చెప్పడం.. ఇచ్చిన మాటకు కట్టుబడటం.. దాన్ని నిలబెట్టు కోవడం కోసం ఎందాకైనా పోరాటం చేయడం.. జనంతో మమేకమవడం సీఎం జగన్‌ విధానం. మిగిలిన సమయాన్ని కుటుంబంతో గడుపుతారు. ప్రైవేటు జీవితం అంటూ సీఎం జగన్‌కు లేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడూ.. అధికారంలోకి వచ్చాక కూడా ఇదే విధానం. తన తండ్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించాక.. ఆ వార్త విని తాళలేక గుండె పగిలి మరణించిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు ఓదార్పు యాత్ర చేపట్టారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాం«దీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించి.. 16 నెలలపాటు జైల్లో అక్రమంగా నిర్బంధించినా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం సీఎం జగన్‌ వెనక్కి తగ్గలేదు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేశారు.ప్రతిపక్ష నేతగా ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో 14 నెలలపాటు ప్రజల్లోనే గడిపారు. అధికారంలోకి వచ్చాక.. రోజువారీ పరిపాలన.. సమీక్షలు, ప్రజలతో మమేకమవడం.. మిగిలిన సమయం కుటుంబంతో గడపడం సీఎం దినచర్య. కుటుంబ రాజకీయాలకు సీఎం జగన్‌ వ్యతిరేకం. వీటి వల్ల అనవసరమైన ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది సీఎం జగన్‌ నిశి్చతాభిప్రాయం.చంద్రబాబు వ్యక్తిత్వంమచ్చుకైనా నిజాన్ని చెప్పకపోవడం.. ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పడం ద్వారా నిజం చేయవచ్చునన్నది చంద్రబాబు విధానం. సెల్‌ ఫోన్‌ను నేనే కనిపెట్టా.. కంప్యూటర్‌ను నేనే తెచ్చా.. హైదరాబాద్‌ను నేనే కట్టా.. అంటూ బీరాలు పలకడమే అందుకు నిదర్శనం. ఇచ్చిన మాటకు కట్టుబడకపోవడం.. ఎనీ్టఆర్‌కు వెన్నుపోటు పొడవడంలో సహకరించిన కుటుంబ సభ్యులు హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి వారితోపాటు ఎవరినైనా నమ్మించి నట్టేట ముంచడం చంద్రబాబు నైజం.వారసత్వ రాజకీయాలకు.. కుటుంబ రాజకీయాలకు చంద్రబాబు ఆద్యుడు. సర్పంచుగా కూడా గెలవని తన కుమారుడు నారా లోకేశ్‌ను 2017లో ఏకంగా మంత్రిని చేసి.. నాలుగు కీలక శాఖలను కట్టబెట్టారు. వియ్యంకుడు బాలకృష్ణను హిందూపురం శాసనసభ స్థానం.. లోకేశ్‌ తోడల్లుడు భరత్‌ను విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించారు. సీఎం జగన్‌ఓదార్పు యాత్ర నుంచి ప్రజాసంకల్ప పాదయాత్ర వరకు నిత్యం జనంతో మమేకమవుతూ వచ్చిన వైఎస్‌ జగన్‌.. ప్రజా సమస్యలను, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించారు. విద్య, వైద్యం కోసం అధిక శాతం కుటుంబాలు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవడం వల్ల రుణాల ఊబిలో కూరుకుపోతున్నారని పసిగట్టారు. అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరించి మెరుగైన సమాజాన్ని నిరి్మంచడమే లక్ష్యంగా.. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రూపొందించుకున్న ప్రణాళికలను అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డబ్బులను పేదలకు పంచి పెడుతున్నారని పెత్తందార్లు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదు. సీఎం జగన్‌ ప్రారంభించిన ప్రతి పథకానికి ఒక లక్ష్యం ఉంది. ఆర్థిక వేత్తలంతా ఇదే సరైన విధానమని ప్రశంసిస్తున్నారు. విద్యారంగం⇒ ప్రజాసంకల్ప పాదయాత్రలో పేదరికంతో పిల్లలను చదివించలేని తల్లిదండ్రుల పరిస్థితిని గమనించారు. ప్రతి ఇంట్లో ప్రతి అబ్బాయి.. అమ్మాయి ఉన్నత చదువులు చదివితే.. ఉద్యోగాలు, ఉపాధి పొందుతారని, అప్పుడు ఆ కుటుంబం పేదరికాన్ని అధిగమిస్తుందని భావించారు. మీ పిల్లలను బడికి పంపితే చాలు అమ్మ ఒడి పథకం కింద ఏడాదికి తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తానని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి.. కార్పొరేట్‌ స్థాయికి దీటుగా అభివృద్ధి చేశారు. ఇంగ్లిష్‌ మీడియం భోదనను, సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టారు. ⇒ నాణ్యమైన పౌష్టికాహారాన్ని, మధ్యాహ్న భోజనం, చిక్కీని అందించేందుకు గోరుముద్ద పథకాన్ని ప్రారంభించారు. పాఠశాల తెరిచిన రోజే పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగ్, బూట్లు, సాక్స్‌లను విద్యా కానుక కింద పిల్లలకు అందిస్తున్నారు. మూడో తరగతి నుంచే టోఫెల్‌ శిక్షణ ఇస్తున్నారు. తద్వారా పిల్లలను పాఠశాలలకు పంపడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి సగటు నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) 2018 నాటికి 84.48 శాతం ఉంటే.. ఇప్పుడు వంద శాతానికి చేరుకుంది. అంటే.. బడి ఈడు పిల్లలందరూ బడుల్లోనే ఉండాలన్న లక్ష్యం సాధించారు. పిల్లల చదువుల కోసం సీఎం జగన్‌ తీసుకుంటున్న చర్యలను బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడుతున్న ప్రముఖ సంఘ సంస్కర్త, నోబెల్‌ శాంతిపురష్కార గ్రహీత, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత కైలాస్‌ సత్యార్థి దేశ, అంతర్జాతీయ వేదికలపై ప్రశంసించారు. ⇒ అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లలు పోటీ పడేలా చేయాలనే లక్ష్యంతో సీఎం జగన్‌.. ఐబీ (ఇంటర్నేషనల్‌ బకలారియేట్‌) సిలబస్‌ను 2025 జూన్‌ నుంచి ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 2035 నాటికి పదో తరగతి పరీక్షలు ఐబీ సిలబస్‌లో మన విద్యార్థులు రాస్తారు. ఆ తర్వాత ఉన్నత విద్యను ఐబీ సిలబస్‌లోనే ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, కేంబ్రిడ్జి, ఎంఐటీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ వంటి యూనివర్సిటీల ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో అభ్యసించనున్నారు. ఆ సరి్టఫికెట్లతో బయటకొచ్చిన మన విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కార్పొరేట్‌ సంస్థలు క్యూ కట్టడం ఖాయం. ⇒ ప్రాథమిక స్థాయి నుంచి విద్యారంగాన్ని పటిష్టం చేస్తున్న సీఎం జగన్‌.. బీటెక్, ఎంటెక్, ఎంబీబీఎస్‌ వంటి ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు విద్యాదీవెన పథకం ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నారు. వసతి, భోజన ఖర్చుల కోసం వసతి దీవెన కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తున్నారు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా చూశారు. బీటెక్, ఎంటెక్‌ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకు నైపుణ్యాలను పెంచుతూ శిక్షణ ఇస్తున్నారు. దాంతో 2022–23లో క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా గరిష్టంగా 1.80 లక్షల మంది విద్యార్థులు కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. ఎవరు విజనరీ?వైద్య రంగం ⇒ ఇంట్లో ఒకరికి జబ్బు చేస్తే.. చికిత్స కోసం చేసిన అప్పులు తడిసి మోపెడై ఇబ్బందులు పడుతున్న లక్షలాది కుటుంబాలను పాదయాత్రలో గుర్తించిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక నిర్జీవమైన ఆరోగ్యశ్రీకి జీవం పోశారు. ఆరోగ్యశ్రీలో చికిత్స విధానాలను 1,059 నుంచి 3,257కి పెంచారు. రూ.25 లక్షల వరకు వైద్య ఖర్చుల పరిమితిని పెంచారు. చికిత్స వ్యయం రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపజేశారు. ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఆరోగ్య ఆసరా కింద నెలకు గరిష్టంగా రూ.5 వేలను సహాయంగా అందిస్తూ జీవనోపాధులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. తద్వారా ప్రజారోగ్యానికి భరోసా కల్పించారు. ⇒ నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పించి, కార్పొరేట్‌ స్థాయికి అభివృద్ధి చేశారు. ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు ఖాళీ ఉండడానికి వీలు లేకుండా చర్యలు తీసుకుని.. 54 వేల పోస్టులను భర్తీ చేశారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ ఆవిష్కరణే లక్ష్యంగా ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి.. ప్రజల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ⇒ బీపీ, షుగర్, ఇతర అనారోగ్య సమస్యలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి.. చికిత్సలు అందిస్తున్నారు. తద్వారా ప్రజలు గుండె, మెదడు, కిడ్నీ, క్యాన్సర్‌ వంటి ఇతర పెద్ద జబ్బుల బారిన పడకుండా నియంత్రిస్తున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక మెడికల్‌ కాలేజ్‌ చొప్పున.. కొత్తగా 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టారు. వందేళ్ల చరిత్రలో రాష్ట్రంలో 11 మెడికల్‌ కాలేజీలు ఉంటే.. మూడేళ్ల వ్యవధిలోనే కొత్తగా 17 కాలేజ్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. తాజాగా రాజంపేటలో మరో కాలేజీ నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఐదు కాలేజీలు గతేడాది ప్రారంభమయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు కాలేజీలు ప్రారంభించనున్నారు. వ్యవసాయ రంగం ⇒ రాష్ట్రంలో 70 శాతం ప్రజల జీవనాధారం వ్యవసాయం. పాదయాత్రలో రైతులు పడుతున్న వెతలను కళ్లారా చూసిన వైఎస్‌ జగన్‌.. పంట పండినా, ఎండినా కర్షకులకు నష్టం లేకుండా చేయడం ద్వారా వ్యవసాయాన్ని పండుగగా మార్చాలని నిర్ణయించారు. అధికారంలోకి వచ్చాక విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు గ్రామ స్థాయిలో ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు) వ్యవస్థను తీసుకొచ్చారు. ⇒నకిలీలకు తావులేకుండా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతు ముంగిటకు అందించారు. ఇచ్చిన హామీ కంటే మిన్నగా రైతు భరోసా కింద ప్రతి ఏటా పెట్టుబడి సహాయం అందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత పంటల బీమా, తొమ్మిది గంటలపాటు పగటిపూటే ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ అందించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆ సీజన్‌ ముగిసేలోగా పరిహారం అందించి దన్నుగా నిలబడటం ద్వారా వ్యవసాయాన్ని పండుగగా చేశారు. దేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 16 శాతం ఉంటే.. రాష్ట్ర వ్యవసాయ రంగం వాటా 36 శాతంపైనే (దేశంలో రెండో స్థానం) ఉండటమే అందుకు తార్కాణం. రాష్ట్రంలో సీఎం జగన్‌ అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలను ఐక్యరాజ్య సమితి, నీతి ఆయోగ్, నాబార్డు, ప్రపంచ బ్యాంకు ప్రశంసించాయి. పారిశ్రామిక రంగం ⇒ పాదయాత్రలో ఉద్యోగం, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న యువత కష్టాలను తెలుసుకున్న వైఎస్‌ జగన్‌.. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించి, నిరుద్యోగాన్ని తగ్గించాలని నిర్ణయించారు. అధికారం చేపట్టాక విప్లవాత్మక సంస్కరణల ద్వారా సులభతర వాణిజ్యం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో ఏటా రాష్ట్రాన్ని దేశంలో నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపారు. ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య చిన్నతరహా పరిశ్రమలు)లకు ప్రోత్సాహకాలు ఇచ్చి, చేయిపట్టి నడిపించారు. దాంతో 2018–19 నాటికి రాష్ట్రంలో 1.9 లక్షలు ఉన్న ఎంఎస్‌ఎంఈలు ఇప్పుడు ఏడు లక్షలకు చేరుకున్నాయి. ⇒ పారదర్శక పారిశ్రామిక విధానం వల్ల టాటాలు, బిర్లాలు, అదానీ, అంబానీ, భజంకా, భంగర్, సింఘ్వీ, మిట్టల్‌ వంటి పారిశ్రామిక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు పోటీలు పడుతున్నాయి. ఐదేళ్లలో రూ.3,02,085 కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాల్చాయి. టీడీపీ సర్కార్‌ హయాంలో కేవలం రూ.59,970 కోట్ల పెట్టుబడులే రావడం గమనార్హం. ఎంఎస్‌ఎంఈలు, భారీ పరిశ్రమల వల్ల కొత్తగా 15.88 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్రంలో పీఎఫ్‌ ఖాతాల సంఖ్య 2018–19 నాటికి 44.85 లక్షలు ఉంటే.. 2022–23 నాటికి 60.73 లక్షలకు పెరగడమే అందుకు నిదర్శనం. ⇒ రాష్ట్రానికి 974 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పారిశ్రామికాభివృద్ధి వేగవంతం చేయడం కోసం సీఎం జగన్‌ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. కొత్తగా నాలుగు పోర్టులు (మూలపేట, కాకినాడ గేట్‌వే, మచిలీపట్నం, రామాయపట్నం), పది ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్లను నిరి్మస్తున్నారు. మూడు పారిశ్రామిక కారిడార్లు (వైజాగ్‌–చెన్నై, చైన్నై–బెంగళూరు, హైదరాబాద్‌–బెంగళూరు), పది ఇండస్ట్రియల్‌ నోడ్స్‌ను నిర్మిస్తున్నారు. అప్పుడే రామాయపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో ఇండోసోల్‌ పరిశ్రమల ఉత్పత్తులను ప్రారంభించడం గమనార్హం. సేవా రంగం ⇒ హైదరాబాద్, బెంగుళూరు వంటి మెట్రోపాలిటన్‌ నగరాలతో పోటీ పడే నగరం రాష్ట్రంలో లేకపోయినా ఇన్ఫోసిస్, రాండ్‌స్టాడ్, అదానీ డేటా సెంటర్, బీఈఎల్, అమెజాన్‌ వంటి ఐటీ పరిశ్రమలను సీఎం జగన్‌ రాష్ట్రానికి రప్పించారు. ఐటీ పరిశ్రమల వల్ల 59 నెలల్లో రాష్ట్రంలో 47,908 మందికి ఉద్యోగాలు వచ్చాయి. విశాఖపట్నంలో రూ.పది వేల కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తే హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రోపాలిటన్‌ నగరాలతో పోటీ పడే స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు భారీ ఎత్తున విశాఖపట్నంకు ఐటీ పరిశ్రమలతోపాటు అంతర్జాతీయ ప్రతిష్టాత్మక హోటల్స్‌ వంటివి వస్తాయి. తద్వారా సేవా రంగం ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఏలేరు భూ కుంభకోణం నుంచి ఐఎంజీ భారత్‌ కుంభకోణం వరకు అనేక స్కాంలకు పాల్పడ్డారు. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం చంద్రబాబును ఎల్లో మీడియా విజనరీగా చిత్రీకరిస్తూ వచ్చింది. దాన్ని అందిపుచ్చుకున్న చంద్రబాబు విభజన తర్వాత తానో విజనరీ అంటూ ఊదరగొడుతూ వస్తున్నారు. రామోజీరావుకు చెందిన ఈటీవీకి ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో తానో విజనరీనని సెల్ఫ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చుకున్నారు. అమరావతిలో ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించేందుకు సెంట్రల్‌ కూలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించానని చంద్రబాబు చెప్పడంతో మీడియా ప్రతినిధి నిర్ఘాంతపోయారు. విద్యా రంగం 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పలుమార్లు వివిధ వేదికలపై మాట్లాడుతూ విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదని ప్రకటించారు. నారాయణ వంటి ప్రైవేటు విద్యా సంస్థలు అడ్డగోలు ఫీజులతో దోచుకోవడం.. పంచుకోవడమే చంద్రబాబు విజన్‌. ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం జగన్‌ ఇంగ్లిష్‌ మీడియం బోధనను ప్రవేశపెడితే.. తెలుగు మీడియంలోనే బోధన సాగాలని అడ్డుకునే దుస్సాహసం చేసిన విజనరీ చంద్రబాబు. ఫీజు ఎంతైనా కేవలం రూ.35 వేల రీయింబర్స్‌ మాత్రమే చేస్తామంటూ చంద్రబాబు షరతులు విధించడంతో.. వేలాది మంది విద్యార్థులు మిగతా ఫీజు చెల్లించలేక ఉన్నత చదువులు మానేశారు. వైద్య రంగం మౌలిక సదుపాయాలు కల్పించకుండా.. ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వ ఆస్పత్రులను చంద్రబాబు భ్రష్టు పట్టించారు. ఆరోగ్యశ్రీని నీరుగార్చారు. బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులు నిరాకరించడంతో పేదలు తల్లడిల్లిపోయారు. వైద్యం కోసం లక్షలకు లక్షలు అప్పులు చేసిన లక్షలాది కుటుంబాలు అప్పుల పాలై రోడ్డున పడేలా చేసిన విజనరీ చంద్రబాబు. పారిశ్రామిక రంగం రాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా తీరం మన బలం.. 974 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానంటూ బీరాలు పలికారు. కానీ.. ఐదేళ్లలో కనీసం ఒక్క పోర్టు కడతామనిగానీ.. ఒక ఫిషింగ్‌ హార్బరైనా నిర్మిద్దామనిగానీ ఆలోచన చేయని విజనరీ చంద్రబాబు. సేవా రంగం దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలకు తెరతీశారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఆ సమయంలోనే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నేదరుమల్లి జనార్ధనరెడ్డి హైటెక్‌ సిటీకి శంకుస్థాపన చేశారు. కానీ.. హైటెక్‌ సిటీని తానే నిర్మించినట్లు చంద్రబాబు ఇప్పటికీ అబద్ధాలు వల్లె వేస్తుంటారు. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దినట్లు బీరాలు పలుకుతుంటారు. కానీ.. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు అధికారం కోల్పోయే నాటికి 2003–04 నాటికి ఐటీ ఎగుమతుల విలువ కేవలం రూ.5,025 కోట్లు మాత్రమే. కానీ.. మహానేత వైఎస్సార్‌ అధికారం చేపట్టిన తర్వాత ఐటీ ఎగుమతులు ఏటా సుమారు రెట్టింపు వృద్ధిని నమోదు చేస్తూ 2009–10 నాటికి రూ.33,482 కోట్లకు చేరాయి. అంటే వైఎస్సార్‌ హయాంలో ఐటీ ఎగుమతులు 566 శాతం పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో 900 ఐటీ కంపెనీలు వస్తే.. వైఎస్సార్‌ ఐదేళ్ల పాలనలో ఏకంగా 1,400కు పైగా కంపెనీలు రావడం గమనార్హం. చంద్రబాబు హయాంలో ఐటీ రంగం ద్వారా 85,000 మందికి ఉపాధి లభిస్తే.. వైఎస్సార్‌ హయాంలో 2,85,000 దాటింది. విభజన తర్వాత రాష్ట్రంలో 2014–19 మధ్య ఐటీ పరిశ్రమల వల్ల వచ్చిన ఉద్యోగాల సంఖ్య కేవలం 27,643 మాత్రమే. విశ్వసనీయత సీఎం జగన్‌ ⇒ ‘రాజకీయ నాయకుడు విశ్వసనీయత కోల్పోతే.. రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం లేకపోతే రాజకీయాలు ఎందుకు చేయడం? ఎవరి కోసం? దేనికోసం?’ అంటారు సీఎం జగన్‌. చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి ఇంట్లో తన ఫొటో.. ప్రతి పేదవాడి గుండెల్లో తాను బతికి ఉండాలన్నదే సీఎం జగన్‌ సిద్ధాంతం. అమలు చేయగలిగిన హామీలు మాత్రమే ఇవ్వడం.. ఇచ్చిన మాటకు కట్టుబడటం సీఎం జగన్‌ నైజం. ⇒ విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించిన సందర్భంలో.. వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేయోభిలాషులు పలువురు రూ.50 వేల వరకు రుణ మాఫీ ప్రకటించాలని వైఎస్‌ జగన్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆచరణ సాధ్యం కాని హామీని తాను ఇవ్వలేనని అప్పట్లో వైఎస్‌ జగన్‌ తేల్చి చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన అలవికాని హామీల వల్ల కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో వైఎస్‌ జగన్‌ అప్పట్లో అధికారంలోకి రాలేకపోయారు. ⇒ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. ఇది సీఎం జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే అన్న నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోవడానికి దారితీసింది. ప్రస్తుత ఎన్నికల్లో కూడా అమలు చేయదగిన హామీలతోనే ఎన్నికల మేనిఫెస్టోను సీఎం జగన్‌ విడుదల చేశారు. చంద్రబాబు ⇒ మోసమే ఆస్తిగా.. వెన్నుపోటే పెట్టుబడిగా రాజకీయాల్లో ఎదిగిన నేత చంద్రబాబు. ఎన్నికలప్పుడు అలవికాని హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కి ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజం. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాక 1999 ఎన్నికల్లో కోటి మందికి ఉపాధి, 35 లక్షల ఇళ్లు నిరి్మస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. వాజ్‌పేయిపై వీచిన సానుభూతి పవనాల్లో అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. ⇒ విభజన నేపథ్యంలో చంద్రబాబు 2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలు మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి వంటి 650 హామీలు ఇచ్చారు. మోదీ ప్రభంజనంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన ఘనత ఈ పెద్దమనిíÙదే. చెప్పిన మాటకు కట్టుబడి ఉండకపోవడం చంద్రబాబు నైజం. చంద్రబాబు అంటే మోసం చేస్తాడనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. నైతిక విలువలు సీఎం జగన్‌: నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నది సీఎం జగన్‌ విధానం. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించాక.. ఆ మరణవార్త విని గుండెలు పగిలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని వైఎస్‌ జగన్‌ అప్పట్లో మాట ఇచ్చారు. ఓదార్పు యాత్ర చేపట్టడానికి కాంగ్రెస్‌ నిరాకరించడంతో ప్రజలకు ఇచ్చిన మాట కోసం, మహానేత వైఎస్‌ ఆశయ సాధన కోసం కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్‌సీపీని స్థాపించారు. వైఎస్సార్‌సీపీలో చేరాలంటే.. ఎవరైనా ఆ పార్టీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామాలు చేయాలని షరతు విధించారు. అదే విధానానికి కట్టుబడ్డారు. చంద్రబాబు: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిందే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి. ఓటుకు నోటును అలవాటు చేసి రాజకీయాలను ఫక్తు వ్యాపారం చేసిన ఘనత చంద్రబాబుదే. దేశంలో తొలి సారిగా 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఓటుకు నోటును ఎరగా వేసి.. ఆ తర్వాత అలవాటు చేసిన చరిత్ర బాబుది. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చి.. వైఎస్సార్‌సీపీని దెబ్బ తీసేందుకు 23 మంది ఎమ్మె ల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేయడమే కాకుండా, ఏకంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించి రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు కేసులో కోట్ల కట్టలు, ఆడియో వీడియో టేపులతో తెలంగాణ ప్రభుత్వానికి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ చంద్రబాబు.. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి రాత్రికి రాత్రే హైదరాబాద్‌ నుంచి పారిపోయివచ్చి ఉండవల్లిలోని కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడంలో తల దాచుకున్నారు. అంతెందుకు ఆర్నె ల్ల క్రితం శాసనసభ్యుల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటుకు కోట్లను ఎరవేశారు. నిబద్ధత.. సీఎం జగన్‌ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన (ఏవోబీ) వై.రామవరం మండలం చాపరాయిలో 2017 జూన్‌ 30న విష జ్వరాలు ప్రబలి 17 మంది గిరిజనులు మృత్యువాత పడ్డారు. కానీ.. ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పటి ప్రతిపక్ష నేత అయిన వైఎస్‌ జగన్‌ 2017 జూలై 1న పోలీసులు వారిస్తున్నా వినకుండా అటవీ ప్రాంతంలో సముద్ర మట్టానికి 1750 మీటర్ల ఎత్తులో ఉన్న చాపరాయికి వెళ్లారు. విష జ్వరాలు ప్రబలి 17 మంది గిరిజనులు కన్ను మూయడానికి దారితీసిన పరిస్థితులను వెలుగులోకి తెచ్చారు. తాను అధికారంలోకి వస్తే.. గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలను మెరుగు పరుస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచడంతోపాటు ఖాళీలను భర్తీ చేశారు. స్పెషలిస్టు డాక్టర్లను నియమించారు. గిరిజన ప్రాంతాల్లో ఐదు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఒక మెడికల్‌ కాలేజ్‌ని నిరి్మస్తున్నారు. సీఎం జగన్‌ నిబద్ధతకు ఇదో తార్కాణం మాత్రమే. చంద్రబాబు గోదావరి పుష్కరాల ప్రారంపోత్సవం రోజున అంటే 2015 జూలై 14న రాజమహేంద్రవరంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రచార పిచ్చితో స్నానాలు చేసేందుకు ఒకేసారి భక్తులను వదలడంతో తొక్కిసలాట జరిగి 29 మంది దుర్మరణం పాలయ్యారు. కనీసం ఈ దుర్ఘటనపై చంద్రబాబు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదు. మీ ప్రచార పిచ్చితో 29 మందిని బలిగొన్నారు కదా.. అని చంద్రబాబును మీడియా ప్రశి్నస్తే.. కుంభమేళాలో చచ్చిపోవడం లేదా.. గోదావరి పుష్కరాల్లోనే చచ్చిపోయారా? గోరంతలు కొండంతలు చేస్తారా? అంటూ రంకెలేయడం విస్మయానికి గురిచేసింది. ప్రచారపిచ్చితో 2022 డిసెంబర్‌ 29న కందుకూరులో ఇరుకుసందులో చంద్రబాబు సభ నిర్వహించడం వల్ల తొక్కిసలాటలో 9 మంది మరణించారు. అయినా సరే ఆ సభను నిర్వహించడం ద్వారా ప్రజల పట్ల తనకు ఎంత నిబద్ధత ఉందో చంద్రబాబు చాటి చెప్పుకున్నారు. సంస్కర్త (రిఫార్మర్‌) సీఎం జగన్‌విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన సీఎం జగన్‌.. పాలనలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ.. జిల్లాలను పునర్‌ వ్యవస్థీకరించడం ద్వారా ప్రజల ఇంటి ముంగిటకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో నేరుగా అత్యంత పారదర్శకంగా రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. మరో అడుగు ముందుకేసి వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీన వృద్ధులకు పెన్షన్‌ పంపిణీ చేస్తున్నారు. పాలనా సంస్కరణల ద్వారా సీఎం జగన్‌ ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరించారని నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. ఇంజనీరింగ్‌ పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టి.. చంద్రబాబు నిర్జీవంగా మార్చిన టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చి, ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.7,500 కోట్లు ఆదా చేశారు. చంద్రబాబు సంస్కరణ అంటే చంద్రబాబు దృష్టిలో ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయడం.. ఉద్యోగులను రోడ్డున పడేయడం.. వాటిని అత్తెసరు ధరకే బినామీలకు కట్టబెట్టడం. ఉమ్మడి రాష్ట్రంలో 1999–2004 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో నిజాం షుగర్స్, ఆల్విన్, హెచ్‌ఎంటీ వంటి 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసి.. వేలాది మంది ఉద్యోగులను రోడ్డున పడేశారు. వాటి ఆస్తులను అస్మదీయులకు కట్టబెట్టి దోచుకున్నారు. 2014–19 మధ్య టెండర్ల వ్యవస్థను నీరుగార్చి.. అస్మదీయ కాంట్రాక్టర్లకు సగటున 4.85 శాతం అధిక ధరలకు కట్టబెట్టి ప్రభుత్వ ఖజానాకు రూ.20 వేల కోట్లకుపైగా నష్టం చేసిన చంద్రబాబు.. వాటిని కాంట్రాక్టర్లతో కలిసి దోచుకున్నారు. రూ.16 వేల కోట్లకుపైగా విలువైన పనులను నామినేషన్‌ పద్ధతిలో అస్మదీయులకు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. సామాజిక సాధికారత సీఎం జగన్‌సామాజిక న్యాయం చేయడంలో సీఎం జగన్‌ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచారు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలు అంటూ అక్కున చేర్చుకునే సీఎం జగన్‌.. మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులు (70 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. ఐదు డిప్యూటీ సీఎం పదవులు ఉంటే.. నాలుగు పదవులు ఆ వర్గాల వారికే ఇచ్చారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ.. శాసనమండలి చైర్మన్‌గా ఎస్సీ, డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా మైనార్టీ మహిళకు అకాశం ఇచ్చారు. రాజ్యసభ, శాసన మండలి సభ్యులుగా సింహ భాగం ఆ వర్గాలకే అవకాశం ఇచ్చారు. స్థానిక సంస్థల్లో అధిక శాతం పదవులు వారికే ఇచ్చారు. దేశ చరిత్రలో తొలి సారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలు, మహిళలకు నామినేషన్‌ పనుల్లో, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు పట్టం కట్టారు. డీబీటీ, నాన్‌ డీబీటీ పథకాల ద్వారా రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చితే.. అందులో అధిక భాగం వాటా ఆ వర్గాలకే దక్కింది. రాజకీయ, ఆర్థిక సాధికారతతో ఆ వర్గాలు సామాజిక సాధికారత సాధించాయి. సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్‌ మరో అడుగు ముందుకేసి, 175 శాసనసభ, 25 లోక్‌సభ వెరసి 200 స్థానాల్లో వంద స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారినే బరిలోకి దించారు. చంద్రబాబు ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా.. అంటూ ఎస్సీలను.. తోకలు కత్తరిస్తా, తాటతీస్తా, జడ్జీలుగా పనికి రారంటూ బీసీలను.. దేశ ద్రోహం కేసులు బనాయించి ముస్లింలను.. కోడలు మగపిల్లాన్ని కంటానంటే అత్త వద్దంటుందా అంటూ మహిళలను అపహాస్యం చేసిన చంద్రబాబు సామాజిక అన్యాయానికి పాల్పడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రివర్గంలో ఆ వర్గాలకు సముచిత స్థానం కల్పించిన చంద్రబాబు.. ఒక్కరినంటే ఒక్క బీసీనిగానీ, ఎస్సీనిగానీ, ఎస్టీనిగానీ, మైనారీ్టనిగానీ రాజ్యసభకు పంపలేదు. చివరకు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ వర్గాలకే టికెట్ల కేటాయింపుల్లో అన్యాయం చేసి సామాజిక విద్రోహానికి పాల్పడ్డారు. ఆర్థికవేత్త సీఎం జగన్‌సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చే నాటికి అంటే 2019 మే 30కి ప్రభుత్వ ఖజానాలో రూ.వంద కోట్లు మాత్రమే మిగిలాయి. చంద్రబాబు దోపిడీతో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టిన సీఎం వైఎస్‌ జగన్‌.. సంక్షేమ, అభివృద్ధి పథకాలను పరుగులు పెట్టించారు. పేదల ఖాతాల్లో సంక్షేమ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లను జమ చేశారు. వాటిని సద్వినియోగం చేసుకున్న పేదలు జీవనోపాధిని మెరుగుపరుచు కోవడంతో పేదరికం తగ్గింది. రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు హయాంలో 11.77 శాతం ఉంటే.. ఇప్పుడు 4.19 శాతానికి తగ్గింది. రాష్ట్ర తలసరి ఆదాయం చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.1,51,173 ఉంటే.. సీఎం జగన్‌ హయాంలో 2022–23 నాటికి రూ.2,19,518కి పెరిగింది. కేంద్రం జీడీపీలో రాష్ట వాటా చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ సగటున 4.47 శాతం ఉంటే.. సీఎం జగన్‌ హయాంలో 4.82 శాతానికి పెరిగింది. చంద్రబాబు హయాంలో అప్పుల కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌ 21.87 శాతం ఉంటే.. ఇప్పుడు 12.13 శాతానికి తగ్గింది. సంపద సృష్టించిందీ సీఎం జగనే. చంద్రబాబు హయాం (2014–19)లో మూల ధన వ్యయం ఏటా సగటున రూ.15,227 కోట్లు ఖర్చు చేస్తే.. సీఎం జగన్‌ గత ఐదేళ్లు ఏటా సగటున రూ.17,757 కోట్లు ఖర్చు చేశారు. కోవిడ్‌ ఆర్థిక సంక్షోభంలో ప్రజల ఖాతాలకు నగుదు జమ చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజలు ఆకలితో అలమటించకుండా ఆదుకున్నారు. చంద్రబాబు ఆర్థిక శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదివానని, తానో ఆర్థికవేత్తనని, సంపద సృష్టించానని చంద్రబాబు బీరాలు పలుకుతారు. ఇందులో చదువొక్కటే నిజం.. మిగతావన్నీ అసత్యాలే. ఎడాపెడా అధిక వడ్డీలకు రుణాలు చేయడం.. వాటిని అస్మదీయులతో కలిసి దోచుకోవడం, పంచుకోవడం.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమే చంద్రబాబు ఆర్థిక విధానం. పరిపాలన దక్షత సీఎం జగన్‌విభజిత రాష్ట్రాన్ని 2014–19 మధ్య చంద్రబాబు అడ్డగోలుగా దోచేసి ఛిన్నాభిన్నం చేశారు. కుంగి కుదేలైన రాష్ట్రాన్ని సీఎం జగన్‌ తన పరిపాలన దక్షతతో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపారు. 2020 ఫిబ్రవరి నుంచి 2022 జనవరి వరకు కరోనా మహమ్మారి దాదాపు రెండేళ్లు ప్రపంచాన్ని గజగజ వణికించింది. ఈ మహమ్మారి విజృంభించినప్పుడే.. దానితో సహజీవనం చేయాల్సిందేనని.. ట్రేస్‌.. టెస్ట్‌.. ట్రీట్‌మెంట్‌ మినహా మరో మార్గం లేదని సీఎం జగన్‌ ప్రకటించారు. దీన్ని చంద్రబాబు సహా ఆయన ఎల్లో గ్యాంగ్‌ అప్పట్లో అపహాస్యం చేసింది. సీఎం జగన్‌.. వైద్యారోగ్య శాఖను సమర్థవంతంగా పని చేయించడం ద్వారా కరోనా మహమ్మారిని గట్టిగా ఎదుర్కొన్నారు. కోట్లాది మంది ప్రజల ప్రాణాలను రక్షించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, సంక్షేమ పథకాలు ఆపకుండా.. పేదల ఖాతాల్లో నిధులు జమ చేశారు. దాంతో కోట్లాది మంది ప్రజల జీవనోపాధికి ఇబ్బంది లేకుండాపోయింది. పరిపాలన దక్షతతో కరోనాను సీఎం జగన్‌ సమర్థవంతంగా ఎదుర్కొన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ, నీతి ఆయోగ్‌ ప్రశంసించాయి. చంద్రబాబు హుద్‌హుద్‌ తుఫాన్‌ 2014 అక్టోబర్‌ 12న విశాఖపట్నంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసింది. సర్వం కోల్పోయి.. ఆకలి కేకలతో ఉత్తరాంధ్ర దద్దరిల్లింది. తుఫాన్‌ తగ్గిన వెంటనే విశాఖపట్నంకు చేరుకున్న అప్పటి సీఎం చంద్రబాబు.. ప్రచార పిచ్చితో రంపం పట్టుకుని చెట్లను తొలగిస్తున్నట్లు ఫొటోలకు ఫోజులు ఇస్తూ.. సహాయక చర్యలు చేపట్టకుండా ఆటంకం కలిగించారు. బాధితులను ఆదుకోకుండానే హుద్‌హుద్‌ తుఫాన్‌ను జయించినట్లు ప్రగల్భాలు పలికారు. ప్రతిపక్షంలోకి మారాక 2020 మార్చిలో తాను అధికారంలో ఉంటే కరోనా మహమ్మారి వచ్చేదా.. అంటూ బీరాలు పలకడంతో ప్రజలు నిర్ఘాంతపోయారు. – సాక్షి అమరావతి

Land Titling Act - Lies vs Truths
లాండ్‌ టైట్లింగ్‌ చట్టం - అబద్దాలు vs నిజాలు

“మీ దస్తావేజు మీకు ఇవ్వరు” అనేది పూర్తి సత్యదూరం-👉: గత సంవత్సర కాలంగా 9,58,296 క్రయ విక్రయ దస్తావేజులు రిజిస్టర్ చేసి రైతులకు అందజేయడం జరిగింది.👉: అలాగే 15,91,814 ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసి పత్రాలను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇంకా 17,5,000 లబ్ధిదారులకు TIDCO HOUSES రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మిగిలిన రిజిస్ట్రేషన్స్ కూడా చేయడం జరుగుతుంది👉: e.Stamping 2016 లోనే మొదలైంది. 2016 నుంచి 2019 వరకు 2,27,492 డాక్యుమెంట్స్ జారీ చేయడం జరిగింది. 2019 నుంచి ఇప్పటివరకు 60,66,490 డాక్యుమెంట్స్ జారీ చేయబడ్డాయి.ఇవి ఏవి జిరాక్స్ కాపీలు కాదు అన్నీ ఒరిజినల్సే.👉: “మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారు. న్యాయం కోసం స్థానిక కోర్టులకు వెళ్లలేరు”మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారు అనేది చట్టానికి వక్ర భాష్యం చెప్పే వాళ్ల మాట. ఇంకా అమలులోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ Section 25 (3) ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కి సదరు వారసత్వ నిర్ధారణ లో ఏదేని డిస్ప్యూట్ ఉందని తలచిన సంబంధిత సివిల్ కోర్టుకు వారే రిఫర్ చేస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్నరికార్డ్ ఆఫ్ రైట్స్(RoR) చట్ట ప్రకారం వారసత్వ నిర్ధారణలో డిస్ప్యూట్ ఉన్నట్లయితే దరఖాస్తుదారులు కోర్టుకు వెళ్లి కేసును ఫైల్ చేయవలసి ఉంటుంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ చట్ట ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సంబంధిత సివిల్ కోర్టుకు రిఫర్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకా వారసులకు వెసులుబాటుగా ఉంటుంది.👉: “మీ ఆస్తి మీది కాదు అని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ చెప్తే మీరు ఏమి చేయలేరు”ప్రస్తుతం చేస్తున్నటువంటి రీ సర్వే ప్రకారం రికార్డుల్లో ఒక సారి రైతు పేరు వస్తే ల్యాండ్ టైటిల్ ఆక్ట్ ప్రకారం వారు ఏ రకమైనటువంటి రికార్డు సమర్పించ వలసిన అవసరం లేదు. ఈ రకంగా నిర్ధారించిన డేటా పై ఆ గ్రామంలో నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత 90 రోజుల వరకు క్లైమ్స్, objections సమర్పించవచ్చు ఆ రకంగా నిర్ధారించబడిన వారి పేర్లు టైటిల్ రిజిస్టర్లో నమోదు చేయబడతాయి. అప్పుడు వాటికి Presumptive Title ఉంటుంది ఈ రకం గా నమోదు చేయబడిన పేర్లపై రెండు సంవత్సరంలోగా ఏ రకమైనటువంటి ఆపిల్ గాని డిస్ప్యూట్ కానీ రాకపోతే అప్పుడు Conclusive titile నిర్ధారణ చేయడం జరుగుతుంది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (TRO) ఇచ్చిన ఆర్డర్ పై ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్కు (LTAO) అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. వీరి ఉత్తర్వులపై సంతృప్తి చెందకపోతే హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది.👉: “సరైన కాగితాలు లేవని యజమానులనే జైల్లో పెట్టవచ్చు.” “తాతల నాటి భూములైన నేతల దయ ఉండాల్సిందే.” “జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చు.”ఇవన్నీ చట్టాలకు వక్రభాష్యాలు చెప్పేవారు మాట్లాడే మాటలు. సరైన పత్రాలు లేవని యజమానులను జైల్లో పెట్టే స్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ప్రజల్లో ఒక రకమైన భయానక స్థితిని కల్పించాలనే ఉద్దేశంతో చేసే ప్రకటనలు.ఇంతకుముందే IVR calls / Voice Recordings ద్వారా ఈరకంగా తప్పుడు ప్రచారం చేస్తే ఎలక్షన్ కమిషన్ వారి ఉత్తర్వులు Memo No 974/Elecs. Spl.cell.2/A5/2024-48 of Addl. Chief Election Officer, & E.O. Joint Secretary to the Government of AP, Dt. 04.05.2024 ప్రకారం సిఐడి కేసు రిజిస్టర్ చేశారు. దీనిపై విచారణ జరుగుతూ ఉంది. ఈ రకమైన ప్రచారం ప్రింట్ మీడియాలో చేస్తే ఎలక్షన్ కమిషన్ Media Certification and Monitoring Committees(MCMC) పర్మిషన్ అవసరం లేదు అనేటువంటి లొసుగును అడ్డం పెట్టుకుని ప్రభుత్వం పై బురద చల్లేందుకు చేసేటటువంటి ప్రయత్నం ఇది. ఇది ఎంతవరకు సమంజసం?జగనన్న భూహక్కు, భూరక్షఈ ప్రభుత్వం వంద సంవత్సరాల తర్వాత రీ సర్వే అనే బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. Survey and Boundaries Act 1923 ప్రకారం ముందస్తు నోటీసు ద్వారా భూయజమానికి సర్వే గురించి తెలియపరిచి భూయజమాని సమక్షంలోనే సర్వే చేయడం జరుగుతుంది. సర్వే సమయం లో పట్టాదారు నకు ఈ క్రింది నోటీసులు ఇవ్వటం జరిగింది.Notice in form 14 (Ground Truthing)Notice in form 33A (Ground Validation)Notice in form 42 (Providing copy of LPM)Notice in form 43 (Section 10(2)ఈ సర్వే కోసం డ్రోన్ టెక్నాలజీని వాడడం జరిగింది. ఈ సరిహద్దులు నిర్ధారించే క్రమంలో ఏర్పడిన వివాదాలను పరిష్కరించడం జరిగింది. GPS టెక్నాలజీని ఉపయోగించి సరిహద్దు రాళ్ళు పాతడం కూడా జరిగింది. ఈ రకంగా సరిహద్దులు నిర్ధారించిన తర్వాత Land Parcel Maps (LPMs) తయారు చేయడం జరిగింది. ఈ రకంగా మొత్తం రెవిన్యూ రికార్డ్స్ ను అప్డేట్ చేయడం జరిగింది. ఇంతవరకు రాష్ట్రంలోని మొత్తం 17,460 గ్రామాలకు గాను 6000 గ్రామాలు సర్వే పూర్తి అయ్యింది. ఈ రీ సర్వే వలన పూర్తి అయిన 6000 గ్రామాల్లో సరిహద్దు భూవివాదాలు చాలా మట్టుకు తగ్గాయి.సమగ్ర రీ సర్వే పూర్తి అయిన తర్వాతే ఏపీ ఎల్ టి చట్టం అమలులోకి వస్తుంది. ఈ చట్టం అమలు లోకి వస్తే ప్రజల నుంచి ముఖ్యంగా అమరావతిలో, విశాఖపట్నంలో, తిరుపతిలో బలవంతంగా లాక్కున్న, బినామీ పేర్ల పై పెట్టిన ఆస్తులు ఎక్కడ బయటికి వస్తాయో అనే భయంతో ఈ చట్టాన్ని కామన్ పబ్లిక్ కి ముడిపెట్టి అమలు చేయకుండా ఉండేందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చట్టాలను చేస్తూ ఉంటాయి. ఆ చట్టాలవల్ల ప్రజలకు ఏ రకంగా అయినా ఇబ్బంది కలిగించేలా ఉంటే వాటిలో సవరణలు తెచ్చేందుకు ప్రతిపాదిస్తారు కాని, ఫలానా చట్టాన్ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం మనం ఎప్పుడైనా చూసామా? విపక్షాలు మేనిఫెస్టోలో అనేక అమలు చెయ్యలేని హామీలు ఇవ్వడం జరిగింది.ఈ ఒక్క హామీపై ఇంత దృష్టి పెట్టి గందరగోళం సృష్టించాలి అనేటువంటి ప్రయత్నాన్ని చూస్తే, పసుపు బ్యాచ్ వారు దాచుకున్న, దోచుకున్న, ఆక్రమించిన బినామీ భూములు, ఆస్తులు ఎక్కడ బయట పడతాయో అనేటువంటి భయం స్పష్టంగా కనబడుతోంది. ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకత్వం లో ఎవ్వరైనా ఈ చట్టం మంచిది కాదు అని ఒక్క మాటైనా చెప్పారా? ఇప్పుటి దాకా అనేకసార్లు ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్, అనేక ముఖ్య బిజేపి నేతలు మన రాష్ట్రానికి వచ్చి ప్రసంగాలు చేసినప్పుడు ఈ చట్టం గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? పసుపు బ్యాచ్‌కి ఇప్పుడు ఒక ముఖ్య ప్రశ్న.ఇప్పుడైనా ఈ ఎలక్షన్లో వారితో కలిసి ముందుకు వెళుతున్న బీజేపీ నాయకత్వం చేత “ఈ చట్టం మంచిది కాదు” అని ఒక్క మాటైనా చెప్పించగలరా? ఈ పరిస్థితి చూస్తేనే ఇక్కడి పసుపు పార్టీ నాయకులకు ఈ చట్టం అంటే ఎంత భయం ఉందో తెలుస్తోంది. కేవలం వాళ్ళ బినామీ ఆస్తులను రక్షించుకోవడం కోసం చేసే గందరగోళం ఇది కాదా? ఇప్పటికైనా విస్తృతమైన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, బుద్ధి తెచ్చుకుని ప్రజలకు మంచి జరిగే ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపక పోయినా పర్వాలేదు కానీ మోకాలు అడ్డ కుండా ఉండే విజ్ఞతను ఆ దేవుడు వీరికి ప్రసాదించాలి.

All Set For Telangana Elections 2024
Telangana: సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికకు రంగం సిద్ధం

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధం అయ్యింది. సార్వత్రిక ఎన్నికలు 4వ ఫేజ్‌లో భాగంగా.. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో రేపే(మే 13 సోమవారం) పోలింగ్‌ జరగనుంది.తెలంగాణలో మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లలో సగానికి పైగా మహిళలే ఉన్నారు. ఇక ఎన్నికల బరిలో 525 మంది అభ్యర్థులు నిల్చున్నారు. వీళ్లలో 50 మంది మహిళా అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6గం. వరకు పోలింగ్‌ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందుగానే పోలింగ్‌ పూర్తి కానుంది. అయితే సమయం ముగిసినా.. క్యూలో నిల్చున్న వాళ్లకు ఓటేసేందుకు అనుమతి ఇస్తారు.ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,809 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 9,900 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 175 కంపెనీల కేంద్ర బలగాలు, తెలంగాణ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.మరోవైపు.. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లోనూ ఉప ఎన్నిక రేపే జరగనుంది. ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్‌ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాణంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్‌ఎస్‌ తరఫున నందిత సోదరి నివేదిత, బీజేపీ నుంచి వంశీ తిలక్‌, కాంగ్రెస్‌ తరఫున శ్రీ గణేష్‌ నారాయణన్‌లు ప్రధాన పార్టీల తరఫు నుంచి బరిలో నిలిచారు.

Sakshi Editorial On TDP Political Alliance And Yellow Media
పౌర సమాజమా... పారాహుషార్‌!

అఖిలాంధ్ర జనులారా! అప్రమత్తంగా ఉండండి! గోముఖ వ్యాఘ్రాలు అంబారావాలు చేస్తున్నాయ్, తప్పుదోవ పట్టిస్తున్నాయ్‌. తేనె పూసిన కత్తులు కోలాటమాడు తున్నాయ్, కనికట్టు చేస్తున్నాయ్‌. జన తటాకపు గట్టు మీద మూడు కొంగలు నిలబడి దొంగజపం చేస్తున్నాయ్‌. జాగ్తే రహో!మతోన్మాదులు – కులోన్మాదులు జెండా గుడ్డలతో కొంగులు ముడేసుకొని అడుగులు వేస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి.నాజీలను మించిన కులోన్మాదులు, ఫాసిస్టులను తల దన్నే మతోన్మాదులు ఉమ్మడిగా, కలివిడిగా ఉన్మత్త ప్రచారపు విషవాయువులను ప్రయోగిస్తున్నారు, తస్మాత్‌ జాగ్రత్త!విష ప్రచారపు ప్రయోగ వేదికలైన యెల్లో మీడియా కార్ఖానాల్లోంచి రోజుకు లక్ష క్యూబిక్‌ మీటర్ల పాయిజనస్‌ గ్యాస్‌ వెలువడుతున్నది. ఆ గాలి సోకితే జ్ఞానేంద్రియాలు పనిచేయవు, జరభద్రం!మన జ్ఞానేంద్రియాలు పని చేయకూడదనేదే వారి కోరిక. పని చేస్తే వారి నిజస్వరూపం మనం గుర్తిస్తామన్న భయం.ఈ మతోన్మాద, కులోన్మాద ఉమ్మడి ముఠాను నడిపించేది అంతా కలిపి పిడికెడు మందే! వారే పెత్తందార్లు. వారే పెట్టుబడిదార్లు. ముఠాలోని మిగిలిన పరివారంలో మతం అనే మత్తుమందుకు బానిసలు కొందరు. కులం అనే దురద రోగపు బాధితులు కొందరు.ఈ బానిసల్నీ, బాధితుల్నీ వెంటేసుకొని పెత్తందారీ కాలకూట విషకూటమి దండయాత్రకు బయల్దేరింది. ప్రపంచ యుద్ధాల్లో కూడా కొన్ని రకాల కెమికల్‌ వెపన్స్‌ వాడకంపై నిషేధాలుంటాయి. కానీ రోగ్‌ కంట్రీస్‌ ఖాతరు చేయవు. మన హెజెమోనిక్‌ రోగ్స్‌ కూడా అంతే! ప్రచారపు విధి నిషేధాలను ఖాతరు చేయరు, చేయట్లేదు.మన పెత్తందారీ కూటమి యుద్ధానికి తెగబడింది ఎవరి మీద? ఎవరిని తెగటార్చడానికి భగభగమండే పగతో సెగలుగక్కుతున్నారు?ఇంకెవరి మీద? పేదసాదల మీద, వారి సాధికారతా స్వప్నాల మీద! బడుగు బలహీన వర్గాల మీద, వారి జీవన వికాసపు ఆకాంక్షల మీద! కోట్ల జతల కనురెప్పల మాటు నున్న కలల మీద ఒకేసారి దాడి చేయడం ఎట్లా?వారికి ఆలంబనగా నిలబడిన వెన్నెముకను విరి చేయాలి. ఆ వెన్ను ఎముకే... వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.ఇంకెందుకు ఆలస్యం. బొంబార్డ్‌ ది హెడ్‌ క్వార్టర్స్‌. ప్రజల పక్షాన నిలబడిన ప్రభుత్వాన్ని కూలదోస్తే సరిపోతుంది. ఈ ఎన్నికల్లో కూల్చివేయాలి. పెత్తందారీ కూటమి తలపోత ఇది.తలపోసినంత మాత్రాన కుదురుతుందా? కోట్లాది మంది జీవితాలను క్రాంతి మార్గానికి మళ్లిస్తున్న సర్కార్‌కు వారు అండగా నిలబడరా? అశేష జనావళి మద్దతున్న జగన్‌ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఎలా ఓడించగలరు?బలరామదేవుడి ముక్కోపానికి విరుగుడు మంత్రం ఉండనే ఉన్నది కదా ముఖస్తుతి అంటాడు ‘మాయాబజార్‌’ శకుని మామ. ఆ లెక్కన ప్రజాభిమానానికీ విరుగుడు ఉంటుంది కదా! ప్రజల్లో అపోహలు సృష్టించడం, అను మాన బీజాలు నాటడం! అసత్య ప్రచారంతో చీలికలు తేవడం వగైరా. కూటమిలోని శకుని మామలు పాచికలు విసరడంలో ఆశ్చర్యమేమున్నది?ప్రజలను ఆకట్టుకోగల నినాదం ఈ కూటమికి ఒక్కటి కూడా లేదు. ప్రజలకు మేలు చేసే విధానమూ లేదు. అరువు తెచ్చుకున్న అతుకుల బొంత మేనిఫెస్టో మాత్రం ఉన్నది. అందులోని అంశాలు అరచేతిలో వైకుంఠాన్ని చూపే టక్కు టమారం బాపతు. ఈ గారడీ సంగతి ముందే తెలిసిన జనం దాన్ని బొత్తిగా పట్టించుకోలేదు. క్రెడిబిలిటీ టెస్ట్‌లో కూటమి మేనిఫెస్టో డకౌటయింది.కూటమి నేతలు కూడా మేనిఫెస్టోను నమ్ముకోలేదు. యెల్లో మీడియా నేతృత్వంలో వెలువడే విషవాయు ప్రచా రాన్నే ఆయుధంగా ఎక్కుపెట్టారు. జగన్‌ పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనమైపోయిందంటారు. ఎలా అని అడగ కూడదు. తర్కానికి తావులేదు. సర్వనాశనం అనే మాటను అష్టోత్తర శతనామంలా ప్రతివాడూ నూటా ఎనిమిది సార్లు జపించాలి. అంతే!జగన్‌ హయాంలో అభివృద్ధి శూన్యమంటారు. దాని పైనా చర్చ ఉండదు. ఆధారాలుండవు. గణాంకాల జోలికి వెళ్లొద్దు. ఫీల్డ్‌ విజిట్‌ చేయొద్దు. రోజూ ఓపికున్నంత సేపు రామకోటి రాసుకున్నట్టుగా ‘అభివృద్ధి లేదు’ అనే మాటను రాసుకోవాలి. పంచాక్షరి మంత్రంలా పవిత్రంగా ఉచ్ఛరించి నెత్తిన నీళ్లు చల్లుకోవాలి.సర్వనాశనం, అభివృద్ధి శూన్యం అనే రెండు మాటల్ని మన యెల్లో మీడియా, టీడీపీ నేతలు నమలడం మొదలు పెట్టి ఇప్పటికి నాలుగేళ్లు దాటింది. నమలడం, నెమరు వేయడం అనే కార్యక్రమం అప్పటి నుంచి నిరాటంకంగా సాగుతూనే ఉన్నది. చూసేవాళ్లకు రోత పుట్టినా వాళ్లు మాత్రం ఈ పాచిపాటను ఆపలేదు.ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచీ మరీ ఘోరం. ఆ పత్రికలు చదవాలన్నా, ఆ ఛానెళ్లు చూడాలన్నా అల్ప ప్రాణులకు జడుపు జ్వరం వచ్చే పరిస్థితిలోకి తీసుకెళ్లారు. అభూతకల్పనలు, అభాండాలు, బట్టకాల్చి మీద వేయడం నిత్యకృత్యంగా మారింది.‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’ అనే నల్ల చట్టాన్ని జగన్‌ మోహన్‌రెడ్డి తీసుకొచ్చారట. దాని ఆధారంతో ఆయన అర్ధరాత్రి వేళల్లో గ్రామాలకు కన్నంవేసి కంటికి నచ్చిన భూమినల్లా తవ్వుకొని, మూట కట్టుకొని వెళ్లిపోతారట! ఇదీ వీళ్లు ప్రచారం చేస్తున్న వార్త సారాంశం.మనిషి జన్మ ఎత్తిన వాడికి కొన్ని లక్షణాలు తప్పని సరిగా ఉంటాయని ఆశిస్తాము. సిగ్గూ–లజ్జ, మానము– మర్యాద, అభిమానం – గౌరవం వంటివి వాటిలో మచ్చుకు కొన్ని! యెల్లో మీడియా, దేశం కూటమి ఈ తరహా లక్షణా లను పూర్తిగా విసర్జించాయి. విలువల్నీ, వలువల్నీ విప్పేసి అవతలపారేశారు. దిగంబర వీరంగాలతో జుగుప్సాకరంగా తయారయ్యారు. నడివీధుల్లో నగ్నంగా నర్తిస్తున్నారు.ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అనేది భూయజమానులకు మేలు చేస్తుందనీ, ఇంతకాలం ఈ చట్టాన్ని తేకపోవడమే పొరపాటనీ ఈ దేశంలోని బుద్ధిజీవులందరూ అభిప్రాయ పడుతున్నారు. ప్రపంచంలో సగానికి పైగా దేశాల్లో ఇప్పటికే ఈ చట్టం అమల్లో ఉన్నది.ఏపీ శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఈ చట్టానికి మద్దతు ప్రకటించింది. ఇప్పటికింకా మూడో వంతు గ్రామా ల్లోనే భూసర్వే పూర్తయింది. అన్ని గ్రామాల్లో సర్వే పూర్త యితే తప్ప మరో రెండేళ్లకు గానీ ఈ చట్టం అమల్లోకి రాదు.చట్టం లక్ష్యమే యజమానికి భూమిపై సర్వహక్కులు కల్పించడం. ఆ హక్కులకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం. అందుకు గుర్తుగానే సర్వే పూర్తయిన చోట ఇచ్చే పాస్‌ పుస్తకాలపై సీఎం బొమ్మను ముద్రిస్తున్నారు. అది ఆ యజ మాని హక్కుకు ప్రభుత్వ గ్యారంటీ. దాని మీద జరిగిన వక్రప్రచారం, చంద్రబాబు నోటి వెంట వచ్చిన బూతులు కూటమి దివాళాకోరుతనానికి రుజువు.అవ్వాతాతల పెన్షన్ల పంపిణీ విషయంలో కూటమి – యెల్లో మీడియా ఎంత అమానవీయంగా ప్రవర్తించాయో రాష్ట్ర ప్రజలు గమనించారు. వలంటీర్ల విషయంలో ఎన్ని పిల్లిమొగ్గలు వేశాయో గమనించారు.ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, ఇన్‌పుట్‌ సబ్సిడీ లబ్ధిదారులకు దక్కకుండా ఈసీపై నెరిపిన ఒత్తిడి రాజ కీయం కూటమి వారి దింపుడు కళ్లెం ఆశల దిగజారుడు తనాన్ని ఎత్తిచూపింది.ఇసుక సరఫరాపై విషం చిమ్ముతూ గత నాలుగేళ్లుగా చందమామ కథలు నెలనెలా ప్రచారం చేయడాన్ని ఎలా మర్చిపోగలం?మద్యం వ్యాపారుల మాఫియా కోసం మద్య నియంత్రణపై వెళ్లగక్కిన అక్కసు గుర్తు చేసుకోండి. తను అధికా రంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని చంద్రబాబు అంది స్తారట. ప్రాణాలకు హానికరమైన లిక్కర్‌కు నాణ్యతా ప్రమాణాలేమిటి?విచ్చలవిడి లాభాల కోసం వ్యాపారులు వేలాది బెల్ట్‌ షాపులు కూడా నడిపి మద్యాన్ని డోర్‌ డెలివరీ చేసినప్పుడు ప్రజల ఆరోగ్యం అద్భుతంగా ఉందట. మద్యాన్ని అందు బాటులో లేకుండా చేసి, బెల్టుషాపులు ఎత్తివేసి నియంత్రిత వేళల్లో మాత్రమే, లాభాపేక్ష లేని ప్రభుత్వ షాపుల్లోనే అమ్ముతుంటే మాత్రం కాలేయాలు, కిడ్నీలు పాడైపోతు న్నాయనే కాకమ్మ కథలను ప్రచారంలో పెట్టిన వైనాన్ని గమనించండి.పరిశ్రమల విషయంలోనూ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేశారు. గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణా త్మకం చేస్తే సహించలేకపోయారు. ఏ వివక్ష లేకుండా, పుట్టిన ప్రతిబిడ్డకూ నాణ్యమైన విద్యను ప్రాథమిక హక్కుగా మార్చితే పెత్తందారీ కూటమి భరించలేకపోతున్నది. ప్రభు త్వంపై యుద్ధం ప్రకటించింది.పేద వర్గాల ప్రజలు, మహిళలు నిటారుగా నిలబడ టానికి సాధికారతను సంతరించుకోవడానికి ఉపయోగపడే ఒక విప్లవకర ఎజెండాను జగన్‌ ప్రభుత్వం అమలుచేసింది. ఈ ఎజెండా కొనసాగవలసిన అవసరం పేదవర్గాలు, బలహీనవర్గాల ప్రజలకున్నది.ఈ ఎజెండా కొనసాగితే పెత్తందార్లకు ఆకలి తీరదు. అందుకే కట్టుకథలతో ముందుకు వస్తున్నారు. పేదవర్గాల ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారు. మభ్యపెట్టాలని చూస్తున్నారు. మరోసారి దారుణంగా మోసం చేయాలని కపట నాటకమాడుతున్నారు.వారు ప్రజలకు మిత్రులు కారు... శత్రువులు. మాన వీయ విలువలు లేశమాత్రం లేనివారు. పేద బిడ్డలు మంచి చదువులు చదివితే ఓర్చుకోలేరు.మిత్రులారా! ఏదైనా జరగరాని పొరపాటు జరిగి కూటమి గెలిస్తే సర్కారు బడులు మళ్లీ పాడుబడిపోతాయి. పేద బిడ్డలకు ఇంగ్లిష్‌ మీడియం రద్దవుతుంది. విద్య ప్రైవేట్‌ పరమవుతుంది.ఈ లక్ష్యం కోసమే కార్పొరేట్‌ విద్యా సంస్థల యజమా నులు కూటమి గెలుపు కోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నారు. అర్థం చేసుకోండి.ప్రభుత్వ వైద్యరంగం నిర్వీర్యమవుతుంది. ‘ఫ్యామిలీ డాక్టర్‌’ అదృశ్యమవుతాడు. కార్పొరేట్‌ మాఫియా వైద్యరంగాన్ని మళ్లీ ఆక్రమించుకుంటుంది. ‘రైతు భరోసా’ ఎగిరి పోతుంది. ఆర్‌బీకే సెంటర్లు అదృశ్యమవుతాయి.అధికార వికేంద్రీకరణకు అద్దం పట్టిన గ్రామ సచివాల యాలు మాయమవుతాయి. వలంటీర్‌ వ్యవస్థను ఎత్తి వేస్తారు. ఎందుకంటే అధికార వికేంద్రీకరణ అనేది పేద వర్గాలను బలోపేతం చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది. ఈ పరిణామం పెత్తందారీ వర్గాలకు గిట్టదు.అందుకే ఈ కూటమి పలుమార్లు వికేంద్రీకరణపై అవాకులు చెవాకులు పేలిన విషయం మరిచిపోరాదు.సమస్త వనరుల మీద తమ పెత్తనం కోసం పెత్తందార్లు పరితపిస్తారు. అందుకోసం నిరంతరం వేటాడుతూనే ఉంటారు. బలహీనవర్గాలకు అధికారంలో వాటా పెరిగితే ఈ వేటగాళ్ల ఆటలు సాగవు.అందుకే జగన్‌ ప్రభుత్వ విధానాలపై పెత్తందార్లు యుద్ధం ప్రకటించారు. వారి మాయ నాటకాలకు లొంగి పోతే పేదవర్గాల విజయ ప్రస్థానం ఆగిపోతుంది. సామా జిక విప్లవానికి ఎదురుదెబ్బ తగులుతుంది. పేద ప్రజల విచక్షణ మీద, ఆలోచనాశక్తి మీద పెత్తందార్లకు చిన్నచూపు. అందుకే మిమ్మల్ని ప్రలోభపెట్టాలని చూస్తున్నారు. మిత్రులారా! మీ చైతన్య స్థాయిని చాటిచెప్పండి. విప్లవకర ఎజెండాను జెండాగా ఎగరేయండి! వర్దెల్లిమురళి

Ksr Comments on Pawan kalyan Pithapuram Constituency Campaign
పవన్‌ వ్యూహానికి వంగా గీత కౌంటర్‌ వ్యూహమిదే..!

పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో ఎన్నికల బరిలో తలపడుతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి వంగా గీత చాలా వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తున్నారు. ఆమె తన పార్టీ గురించి, తన గురించి, తన ప్రభుత్వ స్కీముల గురించి చెబుతున్నారే తప్ప పవన్‌ను ఏ విధంగాను విమర్శించడం లేదు. అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆమె తెలివిగా ప్రచారం చేపట్టారు. వంగా గీత.. గత మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్నారు. విద్యార్ధి దశలో ఉన్నప్పుడే ఆమె రాజకీయాలపై ఆసక్తితో ఉండేవారు. సామాజిక స్పృహతో ఉండేవారు. పవన్‌తో పోల్చితే పెద్ద ధనికురాలు కూడా కాదు. అయినా స్వయంశక్తితో, రాజకీయాలలోకి వచ్చారు. 1994లో శాసనసభ సీటు కోసం ప్రయత్నించారు కాని సఫలం కాలేదు. తదుపరి కాలంలో జడ్పి చైర్ పర్సన్ గాను, రాజ్యసభ సభ్యురాలిగా, శాసనసభ సభ్యురాలిగా, 2019లో లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.ఆయా సందర్భంలో ఆమె ప్రజల సమస్యలపై శ్రద్ద వహించేవారు. సాధ్యమైన మేరకు ఆ సమస్యలను తీర్చే యత్నం చేసేవారు. ప్రజలలో కలిసిపోతుంటారు. ఆమె తమకు అందుబాటులో ఉండరన్న మాట రానివ్వరు. కరోనా సమయంలో జబ్బుబారిన పడ్డవారికి ఆమె భయపడకుండా సేవలందించారు. వ్యాధి సోకినవారిని స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే, వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రులకు పంపించడానికి కృషి చేసేవారు. ఇవన్ని ఆమెకు ఇప్పుడు పాజిటివ్ పాయింట్లుగా ఉన్నాయి. బాగా విద్యాధికురాలు. రెండు పీజీలు, న్యాయశాస్త్ర పట్టభద్రురాలుగా ఉన్నారు. ఆమె లాయర్‌గా కూడా పేదలకు సేవలందించారు. ఆమె భర్త విశ్వనాద్ కూడా చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆమెకు చేదోడువాదోడుగా నిలబడడం కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎవరైనా ‘పవన్‌తో పోటీ పడుతున్నారు.. మరి గెలవడం సాధ్యమా?’ అని అడిగితే, 'ఆయనకు సినిమా రంగంలో పేరు ఉంది.. నాకు ప్రజాసేవ రంగంలో పేరు ఉంది. పవన్‌కు కూడా ప్రజా సేవ చేయాలని ఉండవచ్చు.. కాని ఆయనకు ఉన్న పరిస్థితులు అందుకు అవకాశం ఇవ్వవు" అని నేర్పుగా సమాధానం చెబుతున్నారు.పవన్ విద్య గురించి ఎవరైనా అడిగితే, దాని గురించి తాను మాట్లాడనని, ఆయన సినిమాలలో స్టార్ అయ్యారు కదా! అంటూ తనకు ఉన్న డిగ్రీలు, ఇతర అర్హతలను మాత్రమే వివరిస్తున్నారు. పవన్‌ చదువు తక్కువ అనే పాయింట్‌ను కూడా ప్రస్తావించడం లేదు. తాను ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తినని చెప్పడానికి పలు ఉదాహరణలు వివరిస్తుంటారు. ఎవరికైనా నియోజకవర్గ ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే, తాను పిఠాపురంలోనే అందుబాటులో ఉంటానని, అదే పవన్‌ అయితే ఎక్కడో షూటింగ్‌లలో బిజీగా ఉంటారని, అందువల్ల ఆయన చేయలేరని, ఆయన పీఏలను పెట్టుకున్నా ప్రజలకు సేవలందించడం కష్టమని అంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపట్ల ప్రజలు ఆకర్షితులయ్యారని, ముఖ్యంగా మహిళలు అయితే మరింతగా ఆదరిస్తున్నారని ఆమె చెబుతున్నారు. ప్రచారంలో ఎవరి ఇంటి వద్ద అన్నా ఆగకపోతే ప్రత్యేకించి పిలిచి మరీ తమ ఇళ్లవద్దకు తీసుకు వెళుతున్నారని ఆమె చెప్పారు. ఆయన ప్రచారానికి ఇప్పటికే నాగబాబు, జబర్దస్త్ టీమ్ తదితర నటులు వచ్చారని, బహుశా మెగాస్టార్ చిరంజీవి రాకపోవచ్చని అనుకుంటున్నానని గీత అభిప్రాయ పడ్డారు.లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని చెబుతున్న పవన్‌ వీరందరిని ఎందుకు తీసుకు వస్తున్నట్లు అని గీత ప్రశ్నిస్తున్నారు. మరో ఆసక్తికరమైన వాదన తెచ్చారు. పిఠాపురంలో ఏదైనా సమస్య ఉంటే తాను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించే అవకాశం ఉంటుందని, జనసేనకు ఆ అవకాశం ఉండదని, వారు వేరే పార్టీ వారి దగ్దరకు వెళ్లాల్సి ఉంటుందని, ఆ తేడాను కూడా ప్రజలు గుర్తించారని ఆమె చెబుతున్నారు. కాపు సామాజికవర్గం వారు పవన్ వైపు ఎక్కువగా ఉన్నారా అని ప్రశ్నిస్తే, అలా ఏమీ ఉండదని, తాను కాపువర్గానికి చెందిన వ్యక్తినే కదా అని అంటారు. తాను కాపు సామాజికవర్గానికి ఉపయోగపడే పనులు అనేకం చేయించానని, ప్రత్యేకించి కాపు కళ్యాణమండపాలు నిర్మించడానికి నిధులు సమకూర్చానని ఆమె గుర్తు చేస్తున్నారు. ఎవరైనా అన్ని సామాజికవర్గాల ఆదరణ పొందాలి తప్ప, ఏ ఒక్క వర్గమో సపోర్టు చేస్తే గెలిచే పరిస్థితి ఉండదని అన్నారు. కొంతమంది కావాలని బయట నుంచి వచ్చి అలజడులు సృష్టించడానికి యత్నిస్తున్నారని, ఇది చాలా ప్రశాంతమైన నియోజకవర్గమని, ప్రజలు వీటిని గమనిస్తున్నారని ఆమె అన్నారు.పవన్ కళ్యాణే పెద్ద సినిమా స్టార్ అయినప్పుడు, జబర్దస్త్ టీవీ నటులు వంటివారి ప్రచారంతో ఏమి అవసరం వచ్చిందోనని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా తాను విజయం సాధిస్తానన్న ధీమాను గీత వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో చాలామంది ఒక మాట చెబుతున్నారు. జగన్ చాలా తెలివిగా వంగా గీతను ఎంపిక చేసి పవన్‌ను ఆత్మరక్షణలో పడేశారని అంటున్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వంటివారు ఆమెకు మద్దతు ఇవ్వడం కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. పిఠాపురంలో సుమారు తొంభైవేల వరకు కాపుల ఓట్లు ఉండవచ్చని అంచనా. వాటి ఆధారంగా గెలవవచ్చన్న ఆశతో పవన్‌ అక్కడ పోటీలోకి దిగడం, వర్మ వంటి టీడీపీ నేతలను తనను గెలిపించాలని వేడుకున్న వైనం ఇవన్ని ఆయనకు కాస్త మైనస్ అయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తన అభ్యర్ధులను గెలిపించవలసిన నేత, తన గెలుపుకోసమే ఇతరులను అభ్యర్ధించవలసిన పరిస్థితి ఏర్పడడం చాలామందికి నచ్చడం లేదు.జనసేనకు స్వయంగా నియోజకవర్గం అంతటా పోల్ మేనేజ్ మెంట్ యంత్రాంగం లేదన్నది ఒక అభిప్రాయం. తెలుగుదేశం పార్టీవారి మద్దతు ఉన్నా, పిఠాపురాన్ని జనసేనకు ఇస్తారని ప్రకటన రాగానే, టీడీపీ శ్రేణులు భగ్గుమనడం కూడా పవన్‌కు నష్టం చేసింది. పవన్‌కు పిఠాపురం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదని, అక్కడ ఉన్న సమస్యలు తెలియవని, తాను ఏమి చేస్తానో చెప్పలేకపోతున్నారని వైస్సార్‌సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం సినిమా గ్లామర్ ఆకర్షణతో గెలవాలన్నది పవన్‌ వ్యూహం అయితే, ప్రజాసేవ ద్వారా వచ్చిన గ్లామర్‌తో పాటు జగన్ ప్రభుత్వం అమలు చేసిన స్కీముల ప్రభావంతో విజయం సాధించాలన్నది వంగా గీత వ్యూహంగా ఉంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all