Top Stories
ప్రధాన వార్తలు
మన విశ్వసనీయతే పునర్వైభవానికి పునాది: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ విశ్వసనీయతే పార్టీ పునర్వైభవానికి పునాదిగా నిలుస్తుందని, గత ఐదేళ్ల సుపరిపాలనను రాబోయే పాలనతో ప్రజలు కచ్చితంగా బేరీజు వేసుకుంటారని పలువురు పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట మీద నిలిచిన పార్టీగా వైఎస్సార్ సీపీకి ప్రజల మనసులో ఎప్పటికీ చోటు ఉంటుందని, పార్టీ పునర్ వైభవానికి ఇదే గట్టి పునాది అని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పలువురు ఎమ్మెల్సీలు, నేతలు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి ఫలితాలపై ఒక్కొక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే... ⇒ మన ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేయడంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ⇒ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. మేనిఫెస్టో హామీలను 99 శాతానికిపైగా అమలు చేయడంతో పేద వర్గాల్లో సంతోషం వ్యక్తమైంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలు పెంపొందేలా వైఎస్ జగన్ చేసిన విశేష కృషి కచ్చితంగా ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రజల జీవితాలను మార్చే దిశగా గొప్ప అడుగులు వేశాం. ప్రతి గడపకూ మంచి చేశాం. పార్టీ కచ్చితంగా పునర్ వైభవం సాధిస్తుందని మాకు గట్టి విశ్వాసం ఉంది. ⇒ రాజకీయ ఒత్తిళ్లకు ఈసీ తలొగ్గడం, కొందరు పోలీసు అధికారులు కుట్రల్లో కుమ్మక్కు కావడం, ఈవీఎంల మేనేజ్మెంట్పై అనుమానాలు, పోలింగ్ బూత్ల వద్ద మన ఓటర్లను కట్టడి చేయడంతో సీట్లు గణనీయంగా తగ్గినా వైఎస్సార్సీపీకి 40 శాతం ఓట్లు రావడం వెనుక ఐదేళ్ల పాటు వైఎస్ జగన్ చేసిన కృషి ఉంది. గత ఐదేళ్లలో అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే కనిపిస్తున్నాయి. మేమంతా నిస్సంకోచంగా మళ్లీ ప్రజల్లోకి వెళ్తాం. గడచిన ఐదేళ్లు సుపరిపాలనకు ఒక గీటురాయిలా నిలుస్తాయి. కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలు తీరుపై కచ్చితంగా ప్రజలు దృష్టి సారిస్తారు. ఎన్నికల తీరుపై అనుమానాలుఎన్నికలు జరిగిన తీరుపై పలువురు నేతలు జగన్ వద్ద అనుమానాలు వ్యక్తం చేశారు. పార్టీకి గట్టి పట్టున్న గ్రామాల్లో సైతం ఓట్లు రాకపోవడం సందేహించాల్సిన అంశమని, ఈవీఎంల వ్యవహారంపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడిన తరువాత ఎన్నికల్లో తీవ్ర అక్రమాలకు పాల్పడ్డాయన్నారు. ఈసీ ఒత్తిళ్లకు లొంగిపోయి హడావుడిగా పోలీసు అధికారులను బదిలీ చేసి కూటమికి అనుకూలంగా వ్యవహరించే వారిని నియమించడంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లను భయ భ్రాంతులకు గురి చేశారని చెప్పారు. పోలీసుల అండతో టీడీపీ నేతలు పోలింగ్ సమయంలో భయానక పరిస్థితులు సృష్టించారన్నారు.పార్టీ శ్రేణులకు అండగా నిలవాలి: వైఎస్ జగన్కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ మూకలు ఉన్మాదంతో స్వైర విహారం చేస్తున్నాయని, పలుచోట్ల దాడులకు తెగబడుతున్నాయని వైఎస్సార్సీపీ నేతలు ప్రస్తావించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ప్రాణాలకు హాని తలపెట్టడమే కాకుండా ఆస్తుల విధ్వంసానికి తెగబడుతున్నాయన్నారు. దీనిపై వెంటనే స్పందించిన వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు అండగా నిలిచి భరోసా కల్పించాలని నాయకులను ఆదేశించారు. పార్టీ తరపున న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే ప్రక్రియ మొదలైందని తెలిపారు. ఈ ఘటనలను రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి తెచ్చి పార్టీ తరఫున ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు, వైస్ ఛైర్మన్ జకియా ఖానమ్, నూతనంగా గెలిచిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, తాటిపత్రి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, రేగం మత్స్యలింగం, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎంపీలు మద్దిల గురుమూర్తి, తనూజ రాణి తదితరులున్నారు. ఎమ్మెల్సీలు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, మొండితోక అరుణ్కుమార్, రూహుల్లా, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, విడదల రజని, పేర్ని నాని, ఉషా శ్రీచరణ్, కె.నాగేశ్వరరావు, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్రావు, కైలే అనిల్ కుమార్, పార్టీ నాయకులు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, మాజీ ఎంపీ కేశినేని నాని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Israel-Hamas war: శరణార్థుల శిబిరంపై దాడి.. 33 మంది మృతి
డెయిర్ అల్ బలాహ్(గాజా): ఇజ్రాయెల్ బలగాలు సెంట్రల్ గాజాలో వరుస దాడులు కొనసాగిస్తున్నాయి. నుసెయిరత్లోని అల్–సర్డి స్కూల్పై గురువారం వేకువజామున జరిపిన దాడుల్లో 14 మంది చిన్నారులు, 9 మంది మహిళలు సహా మొత్తం 33 మంది చనిపోయారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అల్–సర్డి స్కూల్లో శరణార్థి శిబిరం నడుస్తోంది. ఉత్తర గాజాలోకి ఇజ్రాయెల్ ఆర్మీ ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి ప్రాణాలరచేతిలో పట్టుకుని వచ్చిన వారంతా ఈ శిబిరంలో తలదాచుకుంటున్నారు. అయితే, హమాస్ మిలిటెంట్లు ఈ స్కూల్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ మిలటరీ ఆరోపిస్తోంది. కాగా, గురువారం ఇజ్రాయెల్ ఆర్మీ నుసెయి రత్లోనే మరో నివాస భవనంపై జరిపిన దాడిలో మరో ఆరుగురు మృత్యువాత పడ్డారు. అల్–అక్సా మార్టిర్స్ ఆస్పత్రి క్షతగా త్రులతో కిటకిటలాడుతోందని స్థానికులు తెలిపారు. విద్యుత్ సరఫరా కూడా ఆస్పత్రి లోని కొన్ని ముఖ్యమైన వార్డుల్లోనే ఉందని చెప్పారు. మృతదేహాలతో కూడిన ప్లాస్టిక్ బ్యాగులు ఆవరణలో వరుసగా పడేసి ఉన్నాయని, బాధితుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోందన్నారు.
ఢిల్లీలో కలకలం.. పార్లమెంట్లోకి చొరబడేందుకు..
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. నకిలీ ఆధార్తో పార్లమెంట్లోకి ప్రవేశించేందుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఖసిం, మోనిస్, షోయాబ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గేట్ నెంబర్ 3 నుంచి లోనికి వెళ్లేందుకు యత్నించగా.. అనుమానం రావడంతో అక్కడి భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు.పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురిని స్టేషన్ కు తరలించి.. విచారిస్తున్నారు. ఈ రోజు ఢిలీలో పలు కీలక సమావేశాలు, ఎంపీలతో ఎన్డీఏ కూటమి సమావేశాలు ఉన్న ఈ క్రమంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ఏపీ కొత్త సీఎస్గా నీరబ్కుమార్ ప్రసాద్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుత సీఎస్ జవహర్రెడ్డి బదిలీ అయ్యారు. 1987 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి నీరబ్కుమార్ ప్రసాద్.. ప్రస్తుతం అటవీ, పర్యావరణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు, హ్యాకర్స్ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఈ కారణంగా చాలామంది డబ్బు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో కూడా యూరప్కు చెందిన ఓ వ్యక్తి.. దాదాపు పోయిందన్న డబ్బు తిరిగి పొందాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సుమారు 11 సంవత్సరాల క్రితం యూరప్కు చెందిన ఒక వ్యక్తి బిట్కాయిన్ వాలెట్ పాస్వర్డ్ మర్చిపోయారు. పాస్వర్డ్ మర్చిపోవడం వల్ల ఎలాంటి లావాదేవీలు చేయలేకపోయారు. అప్పట్లో (2013) తన వాలెట్లో తక్కువ బిట్కాయిన్లు మాత్రమే ఉండేవి. ఆ సమయంలో బిట్కాయిన్లకు పెద్దగా విలువ లేకపోవడంతో అతడు కూడా పట్టించుకోలేదు.ఇటీవల బిట్కాయిన్ విలువ ఏకంగా 2000 శాతం పెరిగింది. ఇది గమనించిన వ్యక్తి.. ఎలాగైన తన బిట్కాయిన్లను పొందాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం హ్యాకర్లలో కింగ్పిన్ అయిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ 'జో గ్రాండ్'ను ఎంచుకున్నారు. అతడు అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీ NSA అభివృద్ధి చేసిన రివర్స్ ఇంజనీరింగ్ టూల్ను ఉపయోగించి పాస్వర్డ్ రికవర్ చేసాడు.సుమారు దశాబ్దంలో బిట్కాయిన్ ధర 20,000 శాతానికి పైగా పెరగడంతో, కోల్పోయిన మరుగున పడ్డ బిట్కాయిన్ విలువ సంపదగా పెరిగింది. అది సుమారు రూ. 25 కోట్ల రూపాయలకు చేరింది. దీంతో ఆ వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయి.
కేంద్ర కేబినెట్ కూర్పు.. ఏపీకి ఎన్ని?
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్లో ఏపీకి నాలుగు లేదా ఐదు మంత్రి పదవులు దక్కే అవకాశం అవకాశముంది. టీడీపీ నుంచి మగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి ఒకరికి ఛాన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. నాలుగు మంత్రి పదవులు, లోక్ సభ స్పీకర్ కోసం టీడీపీ యత్నాలు సాగిస్తోంది.టీడీపీకి రెండు మంత్రి పదవులు, ఒక సహాయ మంత్రి పదవి లేదా డిప్యూటీ స్పీకర్ ఇచ్చే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలిసింది. టీడీపీకి కేంద్రంలో చక్రం తప్పే అవకాశం వచ్చినా కీలక శాఖలు దక్కటం అనుమానమే. ఉక్కు శాఖ, పౌర విమానయాన శాఖలు టీడీపీకి దక్కుతాయని ప్రచారం జరుగుతోంది.ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన నాయుడు, గోదావరి జిల్లాల నుంచి గంటి హరీష్, పుట్టా మహేష్ యాదవ్, కోస్తా జిల్లాల నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయులు, వేముల ప్రభాకర రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్, రాయలసీమ నుంచి బికె పార్ధసారధి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఏపీ బీజేపీ నుంచి ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. మహిళా కోటాలో పురందేశ్వరి పేరు బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది. చంద్రబాబు లాబీయింగ్తో కేంద్ర మంత్రి వర్గంలో సీఎం రమేష్ చోటు కోసం యత్నిస్తున్నారు. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.
‘సత్యభామ’ మూవీ రివ్యూ
టైటిల్: సత్యభామనటీనటులు: కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, అంకిత్ కోయా, అనిరుథ్ పవిత్రన్, సంపద, సత్య ప్రదీప్త, హర్షవర్థన్, రవివర్మ తదితరులునిర్మాణ సంస్థ: అవురమ్ ఆర్ట్స్స్క్రీన్ ప్లే,ప్రెజెంటర్:శశి కిరణ్ తిక్క నిర్మాతలు : బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లిదర్శకత్వం: సుమన్ చిక్కాలసంగీతం: శ్రీ చరణ్ పాకాలసినిమాటోగ్రఫీ : బి విష్ణువిడుదల తేది: జూన్ 7, 2024కథేంటంటే.. సత్య అలియాస్ సత్యభామ(కాజల్)షీ టీమ్ డిపార్ట్మెంట్లో ఏసీపీగా పని చేస్తుంది. అమ్మాయిలకు ఇబ్బంది కలిగించేవారిని మఫ్టీలో వెళ్లి మరీ రెడ్హ్యాండెడ్గా పట్టుకొని శిక్ష పడేలా చేస్తుంది. అంతేకాదు షీ సేఫ్ యాప్ ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పిస్తూ..తమకు ఎలాంటి సమస్యలు వచ్చినా,సత్యభామ ఉందనే నమ్మకం మహిళల్లో కలిగించేలా చేస్తుంది. అలా ఓ సారి హసీనా అనే యువతి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త యాదు(అనిరుథ్ పవిత్రన్)చిత్రహింసలకు గురి చేస్తున్నాడని సత్యతో చెబుతుంది. యాదుకి సత్య వార్నింగ్ ఇవ్వగా..అదే కోపంతో అతను హసీనాను చంపేసి పారిపోతాడు. ఎలాగైన అతన్ని పట్టుకొని శిక్షించాలనేది సత్య కోరిక. యాదు కోసం వెతుకుతూనే ఉంటుంది.ఈ క్రమంలో ఓ రోజు హసీనా తమ్ముడు, వైద్యవిద్యార్థి ఇక్బల్(ప్రజ్వల్) మిస్ అవుతాడు. ఈ కేసును సత్య పర్సనల్గా తీసుకుంటుంది. పై అధికారులు అడ్డుకున్నా లెక్కచేయకుండా విచారణ చేస్తుంది. ఈ మిస్సింగ్ కేసుకి లోకల్ ఎంపీ కొడుకు రిషి(అంకిత్ కోయా)కి లింక్ ఉందని తెలుస్తుంది. అతన్ని పట్టుకునే క్రమంలో విజయ్, నేహాలు ఇందులో భాగమైనట్లు తెలుస్తుంది. అసలు ఇక్బల్ని కిడ్నాప్ చేసిందెవరు? సత్య, విజయ్లు ఎవరు? వీరిద్దరు రిషికి ఎలా పరిచయం అయ్యారు? సత్య ఈ కేసును ఎందుకు పర్సనల్గా తీసుకుంది? ఇన్వెస్టిగేషన్లో ఆమెకు తెలిసిన నిజాలు ఏంటి? ఇంతకీ యాదు దొరికాడా లేదా? దివ్య ఎవరు? ఆమెకి ఇక్బల్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఇక్బల్ మిస్సింగ్ కేసుని సత్య ఎలా ఛేదించింది? భర్త అమరేందర్(నవీన్ చంద్ర)తనకు ఎలా తోడుగా నిలిచాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపే జోనర్స్ లో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఒకటి. కథలో ఇంట్రెస్ట్, సస్పెన్స్ లు, ట్విస్ట్ లు ఉంటే ప్రేక్షకులు ఆ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ‘సత్యభామ’ కూడా అదే జోనర్లో తెరకెక్కిన మూవీ. అయితే ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా కథనం సాగుతుంది. సాధారణంగా సస్సెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఓ హత్య జరగడం.. ఆ హత్య ఎవరు చేశారనేది తెలియకపోవడం..దాన్ని ఛేదించే క్రమంలో పోలిసులకు(హీరో/హీరోయిన్) కొన్ని నిజాలు తెలియడం.. క్లైమాక్స్లో ఊహించని ట్విస్ట్ ఉంటుంది. కానీ సత్యభామలో హత్య ఎవరు చేశారనేది ముందే తెలుస్తుంది. అతన్ని పట్టుకోవడమే హీరోయిన్ పని. ఈ సినిమా కథ పాతదే కానీ, హీరోయిన్ అలాంటి పాత్ర చేయడం..కథనం సస్పెన్స్తో పాటు ఎమోషనల్గా సాగడంతో కొత్తగా అనిపిస్తుంది.‘కాళికా దేవి కోపం...సీతాదేవి శాంతం’అంటూ సినిమా ప్రారంభంలోనే హీరోతో ఓ డైలాగ్ చెప్పించి, సత్యభామ పాత్ర ఎలా ఉంటుందో మొదట్లోనే క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఆమె పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్ అనే చేప్పేలా ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆ తర్వాత ఆమె పర్సనల్ లైఫ్ గురించి చూపించి.. హసీనా హత్యతో అసలు కథలోకి వెళ్లాడు. యాదుని వెతికే క్రమంలో వచ్చే సన్నివేశాలు రొటీన్గా ఉండడంతో కథనం నెమ్మదిగా సాగుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే మధ్య మధ్యలో వచ్చే ఉపకథలు ఆకట్టుకున్నా.. మెయిన్ స్టోరీని పక్కదారి పట్టిస్తాయి. షీ సేఫ్ యాప్ ప్రాధాన్యత గురించే తెలియజేసే సన్నివేశాలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. సెకండాఫ్లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఊహించలేరు. ఆ పాత్ర చెప్పే ప్లాష్బ్యాక్ స్టోరీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే కథలో అనేక పాత్రలు ఉండడం, అవసరం లేకున్నా కొన్ని ఉప కథలను జోడించడం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. కథను ఇంకాస్త బలంగా రాసుకొని, ఇంకాస్త ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే..ఇన్నాళ్లు గ్లామర్ పాత్రలకే పరిమితమైన కాజల్..తొలిసారి ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్లో నటించింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక అమ్మాయికి సాయం చేసే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్యభామ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేసింది. సినిమా మొత్తం తన భుజాన వేసుకొని నడిపించింది. ఈ సినిమా కోసం ఆమె పడిన కష్టం తెరపై కనిచించింది. కాజల్లోని మరో యాంగిల్ని ఈ మూవీలో చూస్తారు. ఇక సత్యభామ భర్త, రచయిత అమరేందర్గా నవీన్ చంద్ర తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. ఇక్బల్గా ప్రజ్వల్ యాద్మ బాగా చేశాడు. ప్రకాశ్రాజ్, హర్షవర్ధన్, నాగినీడు పాత్రలు తెరపై కనిపించేది చాలా తక్కువ సమయే అయినా..ఉన్నంతగా బాగానే నటించారు. అయితే కాజల్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో.. సినిమాలోని ఇతర పాత్రలు ఏవీ మనకు గుర్తిండిపోలేవు. సాంకేతికపరంగా సినిమా చాలా బాగుంది. శశికిరణ్ తిక్క స్క్రీన్ప్లే సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం పెద్ద అసెట్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. రేటింగ్: 2.75/5
టీ20 వరల్డ్కప్లో సంచలనం.. పాక్ను చిత్తు చేసిన అమెరికా
డాలస్: టి20 ప్రపంచకప్లో పెను సంచలనం... టోర్నీ 11వ మ్యాచ్లో ‘సూపర్ ఓవర్’ ద్వారా అనూహ్య ఫలితం వచి్చంది. తొలిసారి వరల్డ్ కప్ బరిలోకి దిగిన ఆతిథ్య అమెరికా జట్టు అద్భుతం చేసింది. అటు బౌలింగ్లో, ఇటు బ్యాటింగ్లో సత్తా చాటి మాజీ చాంపియన్ పాకిస్తాన్ను చిత్తు చేసింది. 20 ఓవర్ల సమరంలో ఇరు జట్లు సమంగా నిలవడంతో ‘సూపర్ ఓవర్’ అనివార్యమైంది. గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో యూఎస్ఏ ‘సూపర్ ఓవర్’లో 5 పరుగులతో పాక్ను ఓడించింది. 2009 విజేత పాకిస్తాన్ సమష్టి వైఫల్యం కారణంగా పరాభావంతో టోర్నీని మెుదలు పెట్టగా...తొలి మ్యాచ్లో కెనడాపై నెగ్గిన యూఎస్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. పాక్ తరఫున ఆమిర్ వేసిన సూపర్ ఓవర్లో అమెరికా 18 పరుగులు చేయగా... గెలవాలంటే ‘సూపర్ ఓవర్’లో 19 పరుగులు చేయాల్సిన పాక్... అమెరికా బౌలర్ సౌరభ్ నేత్రావల్కర్ వేసిన సూపర్ ఓవర్లో ఒక వికెట్ కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (43 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్లు), షాదాబ్ ఖాన్ (25 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్స్లు) రాణించగా... షాహిన్ అఫ్రిది (16 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) చివర్లో కీలక పరుగులు చేశాడు. అమెరికా బౌలర్లలో నాస్తుష్ కెన్జిగే 3 వికెట్లు పడగొట్టగా, సౌరభ్ నేత్రావల్కర్ 2 వికెట్లు తీశాడు. అనంతరం అమెరికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు సాధించింది. కెప్టెన్ మోనాంక్ పటేల్ (38 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్), ఆరోన్ జోన్స్ (26 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు), గూస్ (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఒక దశలో చేతిలో 9 వికెట్లతో 8 ఓవర్లలో 56 పరుగులు చేయాల్సిన మెరుగైన స్థితిలో నిలిచిన అమెరికా ఆ తర్వాత పాక్ బౌలింగ్ ముందు తడబడింది. అయితే 19వ ఓవర్ వరకు పట్టు బిగించిన పాక్...చివరి ఓవర్లో వెనుకంజ వేసింది. రవూఫ్ వేసిన ఈ ఓవర్లో గెలుపు కోసం 15 పరుగులు చేయాల్సి ఉండగా యూఎస్ ఫోర్, సిక్స్ సహా 14 పరుగులు రాబట్టింది. టి20 ప్రపంచకప్లో నేడుఐర్లాండ్ X కెనడావేదిక: న్యూయార్క్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
ఆగుతున్న అభిమానుల గుండెలు
సాక్షి, నెట్వర్క్: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమిని తట్టుకోలేక గురువారం కూడా పలువురు గుండెపోటుతో మృతిచెందారు. మృతుల కుటుంబాలను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులకు సమీపంలోని గాం«దీగనర్కు చెందిన వైఎస్సార్సీపీ నేత కిల్లో మోహన్ తండ్రి కిల్లో అప్పారావు(55) ఈ నెల నాలుగో తేదీన ఓట్ల లెక్కింపులో జగన్కు వ్యతిరేకంగా వస్తున్న ఎన్నికల ఫలితాలను చూసి గుండె నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి.. మెరుగైన వైద్యం కోసం 108లో పాడేరు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.తిరుపతి జిల్లాలో..తిరుపతి జిల్లా చియ్యవరం గ్రామానికి చెందిన శ్రీరాములు(24) వైఎస్సార్సీపీకి వీరాభిమాని. ఆయన తన తల్లి పోలమ్మతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి పాలవడం, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బియ్యపు మధుసూదన్రెడ్డికి విజయం లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై అన్నం తినడం మానేశాడు. తల్లి ఎంత బతిమాలినా మెతుకు ముట్టలేదు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. అబ్బయ్యచౌదరి ఓటమితో అభిమాని ఆత్మహత్యదెందులూరులో మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఓటమితో వైఎస్సార్సీపీ వీరాభిమాని రామారావుగూడెం యువకుడు సూరవరపు సాయిలింగాచార్యులు(23) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావుగూడేనికి చెందిన సాయిలింగాచార్యులు వైఎస్సార్సీపీకి, కొఠారు అబ్బయ్యచౌదరికి వీరాభిమాని. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. జూన్ నాలుగో తేదీన వెలువడిన ఫలితాలు చూసి మనస్తాపానికి గురయ్యాడు. గురువారం ఉదయం అబ్బయ్యచౌదరిని కలుస్తానని చెప్పి బయలుదేరగా వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల దాడులు జరుగుతున్న నేపథ్యంలో రెండు రోజులు ఆగి వెళదామని స్థానిక వైఎస్సార్సీపీ నేతలు నచ్చజెప్పారు. ఈ క్రమంలో అభిమాన నేత ఓటమిని భరించలేక.. తీవ్ర మనోవేదనతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి ఆత్మహత్య సమాచారం అందుకున్న అబ్బయ్యచౌదరి ఏలూరు వైద్యశాలకు వెళ్లి సాయి భౌతికకాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.వైఎస్సార్ జిల్లాలో..వైఎస్సార్ జిల్లా తెల్లపాడుకు చెందిన వైఎస్సార్సీపీ అభిమాని మాలేపాటి పెద్దనరసింహులు (65) గురువారం మృతిచెందాడు. ఈ నెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తన స్వగృహంలో టీవీ చూస్తూ వైఎస్సార్సీపీ ఓటమిని చూసి తట్టుకోలేక ఒక్కసారికి గుండెపోటుకు గురయ్యారు. వెంటనే 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. మృతుడికి భార్య పార్వతి, కుమార్తె, ముగ్గురు కుమారులున్నారు. గుంటూరు జిల్లాలో.. గుంటూరు జిల్లా కొమ్మూరు ఎస్సీ కాలనీకి చెందిన మూకిరి ఏషయ్య(46)వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ అంటే ఎంతో అభిమానంగా ఉండేవాడు. మూడు రోజుల కిందట వెలువడిన ఎన్నికల ఫలితాలను చూసి అన్యాయం జరిగిందంటూ తీవ్ర మనో వేదనకు లోనవుతూ బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యుడు చెప్పాడు. ఆటో నడుపుకొనే ఏషయ్యకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.అనకాపల్లి జిల్లాలో.. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ములగపూడికి చెందిన చిరుకూరి రాజుబాబు(72) వైఎస్సార్సీపీ అభిమాని. వైఎస్ జగన్ రెండోసారి సీఎం అవుతారని గ్రామంలో అందరితో చెబుతుండేవాడు. కౌంటింగ్ పూర్తయ్యాక వైఎస్సార్సీపీకి ఎక్కువ సీట్లు రాలేదని తెలియడంతో ఆందోళన చెందాడు. ఇక వలంటీర్లు పెన్షన్లను ఇంటికి తీసుకువచ్చి ఇవ్వరంటా.. అనే ప్రచారం జరగడంతో రెండు రోజులుగా దిగాలుగా ఉన్నాడు. గురువారం గుండెల్లో మంట వస్తుందంటూ కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ప్రకాశం జిల్లాలో.. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేములకు చెందిన వైఎస్సార్ వీరాభిమాని అన్నపురెడ్డి చినగురవారెడ్డి(71) వైఎస్సార్సీపీ అభిమాని. దర్శి ఎమ్మెల్యేగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి గెలవడంతో బుధవారం గ్రామస్తులతో కలిసి దర్శి వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డితో చినగురవారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎవరికీ అన్యాయం చేయలేదని, అందరికీ న్యాయం చేశారని, ఆయనకు ఇంత అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే దిగులుతో ఇంటికి చేరుకున్న చినగురవారెడ్డి గురువారం రాత్రి గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. మృతుడి కుటుంబానికి కొడాలి నాని రూ.5 లక్షల సాయం తన ఓటమిని జీర్ణించుకోలేక ఆత్మహత్యచేసుకున్న కుటుంబానికి భరోసాసార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కొడాలి నాని ఓటమిని జీర్ణించుకోలేక కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని సైదేపూడికి చెందిన పిట్టా అనిల్కుమార్(26) ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. కాగా గురువారం రాత్రి అనిల్ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, పార్టీ నాయకులతో కలసి వెళ్లి పరామర్శించారు. రూ.5 లక్షల సాయమందించారు. మృతుడి భార్య, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనిల్ పిల్లల చదువుకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని హామీ ఇచ్చారు.
స్టాక్ మార్కెట్ కుంభకోణంలో మోదీ, షా: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్కుంభకోణంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రత్యక్షంగా భాగస్వాములయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటూ వారిచి్చన సలహాలు నమ్మి రిటైల్ ఇన్వెస్టర్లు రూ.30 లక్షల కోట్లు పోగొట్టుకున్నారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఫేక్’ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన రోజు స్టాక్ మార్కెట్ సూచీలు విపరీతంగా పెరిగిపోయాయని, ఈ నెల 4న ఎన్నికల అసలు ఫలితాలు వెల్లడయ్యాక సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో మోదీ, అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడారని, షేర్లు కొనాలంటూ ప్రజలకు సూచించారని చెప్పారు. స్టాక్ మార్కెట్లు, షేర్ల గురించి ప్రధానమంత్రి, హోంమంత్రి బహిరంగంగా మాట్లాడడం దేశంలో ఇదే మొదటిసారి అని గుర్తుచేశారు. ప్రధానమంత్రి, హోంమంత్రి చేసే పని స్టాక్ మార్కెట్ సలహాలు ఇవ్వడమేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఎందుకిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు లెక్క తప్పుతాయని బీజేపీ నేతలకు ముందే తెలుసని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 220 సీట్ల వరకు వచ్చే అకాశం ఉందని అంతర్గత అధికారిక సర్వేలో తేలిందన్నారు. 200 నుంచి 220 సీట్లు వస్తాయంటూ నిఘా సంస్థలు మోదీ ప్రభుత్వానికి నివేదించాయని తెలిపారు. ఇదంతా తెలిసి కూడా 5 కోట్ల కుటుంబాలకు పెట్టుబడి సలహాలు ఎందుకిచ్చారని మోదీ, అమిత్ షాపై రాహుల్ మండిపడ్డారు. రిటైల్ ఇన్వెస్టర్లను ముంచేశారు షేర్ల విలువను తారుమారు చేసిన ఆరోపణలపై సెబీ దర్యాప్తును ఎదుర్కొంటున్న బిజినెస్ గ్రూప్నకు చెందిన మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మోదీ, అమిత్ షా స్టాక్ మార్కెట్ పెట్టుబడి సలహాలను ఇచ్చారని రాహుల్ పేర్కొన్నారు. తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేసిన వారికి, బీజేపీకీ, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు ఒక్కరోజు ముందు పెట్టుబడి పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లకు మధ్య ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. దీని వెనుక భారీ కుట్ర ఉందన్నారు. మోదీ, అమిత్ షా సలహాలను విశ్వసించి పెట్టుబడిన పెట్టిన భారత రిటైల్ ఇన్వెస్టర్ల సంపదను కొందరు బడాబాబులు కాజేశారని ఆరోపించారు. ఇన్వెస్టర్లను ముంచేసి రూ.వేల కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. మోదీ, అమిత్ షాతోపాటు తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించిన వారిపై దర్యాప్తు జరపాలని రాహుల్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో రాహుల్ వెల్లడించిన ప్రకారం ఎప్పుడేం జరిగిందంటేమే 13: జూన్ 4 (ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే రోజు) కంటే ముందే షేర్లు కొనేసి పెట్టుకోండి అని అమిత్ షా సూచించారు. మే 19: జూన్ 4న స్టాక్ మార్కెట్ రికార్డులు బద్ధలవుతాయి. కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జూన్ 1: సార్వత్రిక ఎన్నికల్లో తుది దశ పోలింగ్ జరిగింది. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. జూన్ 3: కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం స్పష్టమైన మెజారీ్టతో అధికారంలోకి రాబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో పుంజుకుంది. సూచీలు ఆల్టైమ్ అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. జూన్ 4: ఓట్ల లెక్కింపు మొదలైంది. బీజేపీకి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం లేదని తేలింది. దాంతో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మార్కెట్లో పెట్టుబడి పెట్టిన చిన్నస్థాయి ఇన్వెస్టర్ల సంపద రూ.30 లక్షల కోట్ల మేర కరిగిపోయింది.పస లేని ఆరోపణలు పీయూష్ గోయల్ మండిపాటు స్టాక్ మార్కెట్లో అతిపెద్ద కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఖండించారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురైన ఓటమిని తట్టుకోలేక ఇలాంటి పస లేని ఆరోపణలు చేస్తున్నారని రాహుల్పై మండిపడ్డారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించడానికి పెద్ద కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఇన్వెస్టర్లను దగా చేయొద్దని సూచించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత మన మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారులు అధిక రేట్ల వద్ద భారీగా షేర్లు కొన్నారని, వాటిని భారత ఇన్వెస్టర్లు విక్రయించి, లాభం పొందారని పీయూష్ గోయల్ వివరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.67 లక్షల కోట్లు ఉన్న స్టాక్ మార్కెట్ విలువ ఇప్పుడు రూ.415 లక్షల కోట్లకు చేరిందని గుర్తుచేశారు. దేశీయ, రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా లబ్ధి పొందారని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో స్టాక్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందిందన్నారు. మార్కెట్లో నమోదైన ప్రభుత్వ రంగ సంస్థల విలువ 4 రెట్లు పెరిగిపోయిందని పేర్కొన్నారు. మోదీ పాలనలో భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని గుర్తుచేశారు.
తప్పక చదవండి
- హైదరాబాద్ పబ్ల్లో కొత్త రకం మోసం.. వ్యాపారవేత్తను బుట్టలోకి దింపి..
- ఊరూరా విధ్వంసం.. అదే టీడీపీ లక్ష్యం
- ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు
- 'లవ్ మౌళి' సినిమా రివ్యూ
- Association of Democratic Reforms: ఎంపీల్లో 46 శాతం నేర చరితులు
- పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగింపు
- మోదీకి ప్రత్యామ్నాయం అన్వేషిస్తున్న ఆర్ఎస్ఎస్: రౌత్
- జోసా కౌన్సెలింగ్కు సర్వం సిద్ధం!
- అరాచకాన్ని అరికట్టండి
- టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య ఘర్షణ
సినిమా
ప్రేమ ఉన్నప్పుడు గొడవలూ ఉంటాయి: శర్వానంద్
‘‘ఫొటోలు పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజులు ఇంకా గుర్తున్నాయి. ఇరవయ్యేళ్లు ... ముప్పైఐదు సినిమాలు ఎలా అయ్యాయో తెలియదు. స్టార్ స్టేటస్ రావడానికి ఇరవై ఏళ్లు పట్టింది. నాకు ‘చార్మింగ్ స్టార్’ అనే టైటిల్ ఇచ్చినందుకు విశ్వగారికి థ్యాంక్స్. నేను చేసిన సినిమాల పట్ల నేను గర్వంగా ఫీలవుతున్నాను’’ అని శర్వానంద్ అన్నారు. శర్వానంద్, కృతీ శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్సే స్టూడియోస్ప్రోడక్షన్తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మనమే’.ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ‘మనమే’ ప్రీ రిలీజ్ వేడుకలో శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘మనమే’ సినిమాలో నేను కొత్తగా కనిపించినా, కొత్తగా పెర్ఫార్మ్ చేసినా ఆ క్రెడిట్ శ్రీరామ్కే వెళ్తుంది. ప్రతి ఒక్కరం చాలా కష్టపడి గొడవలు పడుతూ ఈ సినిమాను పూర్తి చేశాం. ప్రేమ ఉన్నప్పుడు గొడవలూ ఉంటాయి. ఒక మనిషికి మరో మనిషి ఇవ్వగలిగే గొప్ప బహుమతి టైమ్. ఈ పాయింట్నే శ్రీరామ్ ఈ సినిమాలో చెప్పారు’’ అని అన్నారు.‘‘శర్వానంద్ తన ఎనర్జీతో ఈ సినిమాను మరో లెవెల్కు తీసుకు వెళ్లారు’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. ‘‘శర్వానంద్ నటన అద్భుతంగా ఉంటుంది. తన చార్మింగ్ లుక్స్, పెర్ఫార్మెన్స్ చూసి తనకి ‘చార్మింగ్ స్టార్’ అనే టైటిల్ ఇస్తున్నాను’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ఇంకా డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి కూడా మాట్లాడారు.
అందుకే రక్షణ టైటిల్ పెట్టాం: ప్రణదీప్ ఠాకోర్
‘‘ఓ పోలీసాఫీసర్ జీవితంలో జరిగిన ఘటనను స్ఫూర్తిగా తీసుకుని కల్పిత కథతో ‘రక్షణ’ తీశాను. ఈ సినిమాలో చిన్న సందేశం కూడా ఉంది. సినిమా మొత్తం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లా ఉంటుంది. బాధితుల కోసం పోరాడటంతో పాటు వారిని రక్షించేలా ఉంటుంది కాబట్టి ‘రక్షణ’ అని టైటిల్ పెట్టాం’’ అన్నారు దర్శక–నిర్మాత ప్రణదీప్ ఠాకోర్. పాయల్ రాజ్పుత్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘రక్షణ’. ప్రణదీప్ ఠాకోర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.ఈ సందర్భంగా ప్రణదీప్ ఠాకోర్ మాట్లాడుతూ– ‘‘గుణశేఖర్గారి వద్ద ‘ఒక్కడు, సైనికుడు, రుద్రమ దేవి’ సినిమాలకు అసిస్టెంట్ కో డైరెక్టర్గా పని చేశాను. ఆనంద్ రంగా ‘ఓయ్’ చిత్రానికి, భాస్కర్ ‘ఆరెంజ్’ సినిమాకి కో–డైరెక్టర్గా చేశాను. ఓ పెద్ద కథ పట్టుకుని చాలామంది వద్దకు వెళ్లాను... కానీ కుదరలేదు. అందుకే చిన్న సినిమా తీసి, నిరూపించుకోవాలని ‘రక్షణ’ తీశాను. ఇందులో పాయల్ అద్భుతంగా నటించారు. ‘రక్షణ’ తర్వాత ఆమెకు మరింత పవర్ఫుల్ రోల్స్ వస్తాయి. సినిమా తీయడం క్రియేటివ్... రిలీజ్ చేయడం మార్కెటింగ్ థింగ్. నేను సినిమా బాగానే తీశా. కానీ, మార్కెటింగ్లో పూర్. ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని రిలీజ్ చేయడమే కష్టంగా మారింది’’ అన్నారు.
అతిగా తినను... ఉపవాసం ఉండను
సిల్వర్ స్క్రీన్పై మెరుపు తీగలా కనిపించడానికి కథానాయికలు కఠినమైన కసరత్తులు చేస్తారు... డైట్ ఫాలో అవుతారు. అయితే ఒక్కొక్కరిది ఒక్కో డైట్... చేసే వ్యాయామాలు కూడా వేరుగా ఉంటాయి. హీరోయిన్ కియారా అద్వానీ తానేం చేస్తారో ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. ‘‘నేను ఎంత త్వరగా బరువు పెరగగలనో అంతే త్వరగా తగ్గగలను. బరువు పెరగడం, తగ్గడం రెండూ నాకు సులభమే. డ్యాన్స్, స్విమ్ చేయడం చాలా ఇష్టం.స్కూల్ డేస్లో అప్పుడప్పుడూ ఈ రెండూ చేసేదాన్ని. కానీ ఎప్పుడైతే సినిమా రంగంలోకి వచ్చానో అప్పట్నుంచి వీటిని నేను నా దినచర్యలో భాగంగా ప్లాన్ చేసుకుని చేస్తున్నాను. జిమ్, డ్యాన్స్, స్విమ్మింగ్.. ఇవన్నీ ఫిట్నెస్లో భాగమే. వీటిని మనం ఇష్టంగా చేస్తే సరదాగా ఉంటుంది’’ అని చెప్పకొచ్చారు కియారా. ఇంకా తన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ– ‘‘నచ్చిన ఆహారాన్ని అతిగా తినడం, ఉపవాసాలు చేయడం వంటివి పాటించను. మసాలా ఎక్కువగా ఉండని ఇంటి భోజనం తినడానికే ఇష్టపడతాను’’ అన్నారు.
సెప్టెంబరులో స్టార్ట్
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఇటీవల ఓ సందర్భంలో ఈ చిత్ర కథారచయిత విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఫారెస్ట్ అడ్వెంచరస్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమా కోసం మహేశ్బాబు సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు.మహేశ్ జుట్టు పెంచుతున్నారు. అలాగే బరువు కూడా పెరుగుతున్నారట. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ను పూర్తి చేసి, సెప్టెంబరులో చిత్రీకరణను మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందని, ఈ రెండు భాగాలను ఒకేసారి చిత్రీకరించేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని భోగట్టా.
ఫొటోలు
రెడ్ డ్రస్లో మెస్మరైజ్ చేస్తున్న'చాందిని చౌదరి' లేటెస్ట్ (ఫొటోలు)
T20 WC 2024 : సంచలనం..పాక్ను చిత్తు చేసిన అమెరికా (ఫొటోలు)
జలసంద్రంగా మారిన హైదరాబాద్.. వాహనదారులకు చుక్కలు (ఫొటోలు)
వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ భేటీ (ఫొటోలు)
Hamida: నటి బర్త్డే పార్టీలో బిగ్బాస్ సెలబ్రిటీల హంగామా (ఫోటోలు)
క్రీడలు
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్ చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా డల్లాస్ వేదికగా యూఎస్ఎతో జరిగిన మ్యాచ్లో 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బాబర్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 120 టీ20 మ్యాచ్లు ఆడిన ఆజం 4067 పరుగులు సాధించాడు. ఇక ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. విరాట్ 117 టీ20 మ్యాచ్ల్లో 4037 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో కోహ్లిని బాబర్ అధిగమించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో బాబర్ ఆజం, విరాట్ కోహ్లి తర్వాత రోహిత్ శర్మ(4026) మూడో స్ధానంలో నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్కు అమెరికా ఊహించని షాకిచ్చింది. సూపర్ ఓవర్లో పాకిస్తాన్పై అమెరికా విజయం సాధించింది.
అదే మా కొంపముంచింది.. మా కంటే వారే బెటర్: బాబర్ ఆజం
టీ20 వరల్డ్కప్-2024లో పాకిస్తాన్కు ఘోర పరాభావం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా డల్లాస్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు సమంగా పోరాడనప్పటికి.. సూపర్ ఓవర్లో మాత్రం పాక్కు భంగపాటు తప్పలేదు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేయగా, పాకిస్తాన్ 13 మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పాక్ను కెప్టెన్ బాబర్ ఆజం(44), షాదాబ్ ఖాన్(40) పరుగులతో ఆదుకున్నారు. అమెరికా బౌలర్లలో నాస్తుష్ కెన్జిగే 3 వికెట్లు పడగొట్టగా, సౌరభ్ నేత్రావల్కర్ 2 వికెట్లు తీశాడు.అనంతరం బ్యాటింగ్ దిగిన యూఎస్ఎ నిర్ణీత 20 ఓవర్లలో కూడా 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్లో నిర్ణయించాల్సి వచ్చింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం స్పందించాడు. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో విఫలమయ్యామని బాబర్ తెలిపాడు."తొలుత బ్యాటింగ్ పరంగా విఫలమయ్యాం. పవర్ ప్లేను సద్వినియోగం చేసుకోలేపోయాము. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడం మమ్మల్ని దెబ్బతీసింది. ఏ మ్యాచ్లోనైనా గెలవాలంటే భాగస్వామ్యాలు చాలా కీలకం. ఈ మ్యాచ్లో మేము అది చేయలేకపోయాం.మరోవైపు బంతితో కూడా మేము నిరాశపరిచాం. మా స్పిన్నర్లు కూడా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేదు. ఇలా అన్ని విభాగాల్లో విఫలమైనందన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇక యూఎస్ఎ చాలా కష్టపడింది. కాబట్టి వారికి క్రెడిట్ ఇవ్వాలనకుంటున్నాను. వారు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో మా కంటే మెరుగ్గా ఆడారని" పోస్ట్మ్యాచ్ ప్రేజంటేషన్లో బాబర్ పేర్కొన్నాడు.
టైటిల్ పోరుకు స్వియాటెక్, జాస్మిన్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్లో నాలుగో టైటిల్ గెలిచేందుకు పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్ విజయం దూరంలో నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన స్వియాటెక్ గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో 6–2, 6–4తో మూడో ర్యాంకర్ కోకో గాఫ్ (అమెరికా)పై గెలిచింది. రెండో సెమీఫైనల్లో 12వ సీడ్ జాస్మిన్ పావ్లిని (ఇటలీ) 6–3, 6–1తో రష్యాకు చెందిన 17 ఏళ్ల మిరా ఆండ్రీవాపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 5–7, 6–2, 2–6తో బొలెలీ–వావసోరి (ఇటలీ) జోడీ చేతిలో ఓడింది.
సునీల్ ఛెత్రి వీడ్కోలు
కోల్కతా: రెండు దశాబ్దాలుగా భారత ఫుట్బాల్ ముఖచిత్రంగా ఉన్న సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు. ఫుట్బాల్ ప్రపంచకప్–2026 ఆసియా జోన్ క్వాలిఫయర్స్లో భాగంగా గురువారం కువైట్తో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్ను సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు 0–0తో ‘డ్రా’ చేసుకుంది.నిర్ణీత సమయంలోపు రెండు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. నాలుగో నిమిషంలో కువైట్ ప్లేయర్ ఈద్ అల్ రషీది కొట్టిన షాట్ను భారత గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ నిలువరించాడు. అనంతరం 11వ నిమిషంలో అన్వర్ అలీ కొట్టిన హెడర్ షాట్ లక్ష్యాన్ని చేరలేకపోయింది. 48వ నిమిషంలో భారత ప్లేయర్ రహీమ్ అలీ ‘డి’ ఏరియాలోకి వెళ్లినా అతను కొట్టిన షాట్లో బలం లేకపోవడంతో బంతి నేరుగా కువైట్ గోల్కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఆ తర్వాత రెండు జట్లకు గోల్ చేసేందుకు ఒకట్రెండు అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాయి. భారత్ తన చివరి మ్యాచ్ను జూన్ 11న ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో ఆడనుంది. 2005లో జాతీయ సీనియర్ జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం వహించిన సునీల్ ఛెత్రి ఓవరాల్గా భారత్ తరఫున 151 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 94 గోల్స్ సాధించాడు. ఇందులో నాలుగు ‘హ్యాట్రిక్’లున్నాయి. జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఫుట్బాలర్స్ జాబితాలో ఛెత్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్; 206 మ్యాచ్ల్లో 128 గోల్స్), అలీ దాయ్ (ఇరాన్; 149 మ్యాచ్ల్లో 109 గోల్స్); లయనెల్ మెస్సీ (అర్జెంటీనా; 180 మ్యాచ్ల్లో 106 గోల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. రికార్డుస్థాయిలో ఏడుసార్లు జాతీయ ఉత్తమ ఫుట్బాల్ ప్లేయర్ అవార్డు గెల్చుకున్న సునీల్ ఛెత్రికి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్రత్న’ (2021లో)... అర్జున అవార్డు (2011లో), పద్మశ్రీ (2019లో) లభించాయి.
బిజినెస్
ఆరు సంస్థలుగా వేదాంతా
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ బిజినెస్ల విడదీతకు రుణదాతలు ఆమోదముద్ర వేశారు. దీంతో ఆరు స్వతంత్ర లిస్టెడ్ కంపెనీలుగా ఆవిర్భవించేందుకు వేదాంతాకు వీలు చిక్కనుంది. ఎస్బీఐసహా రుణదాతలు అంగీకరించడంతో 52 శాతానికిపైగా అను మతి లభించినట్లేనని వేదాంతా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు. అధిక శాతం రుణదాతలు విడదీతను సమరి్ధంచినట్లు వెల్లడించారు. విడదీత ప్రణాళికకు 75% ఆమోదం లభించవలసి ఉండగా.. వారం, పది రోజుల్లో మిగిలిన లక్ష్యాన్ని సైతం చేరుకోగలమని తెలియజేశారు. కొన్ని అనుమతులకు కమిటీ మీటింగ్, బోర్డు సమావేశాల కోసం చూస్తున్నట్లు తెలియజేశారు. వీటి తదుపరి ఎన్సీఎల్టీకి దరఖాస్తు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రధాన రుణదాత ఎస్బీఐ ఇప్పటికే సమ్మతించగా.. 20 బిలియన్ డాలర్ల విలువైన విడదీత ప్రణాళికకు దారి ఏర్పడినట్లు వివరించారు. గత జనవరి–మార్చిలో రూ. 6,155 కోట్ల నికర రుణభారాన్ని తగ్గించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో రుణ భారం రూ. 56,388 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. వేదాంతా రుణదాతల జాబితాలో ఎస్బీఐ, బీవోబీ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, ఐవోబీ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతోపాటు.. ప్రయివేట్ బ్యాంకులైన యస్ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్, ఐడీఎఫ్సీ ఫస్ట్, కొటక్ మహీంద్రా ఉన్నాయి. విడదీతలో భాగంగా వేదాంతా.. అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్, విద్యుత్, స్టీల్, ఫెర్రస్ మెటీరియల్స్, బేస్ మెటల్స్ సంస్థలుగా ఏర్పాటు కానుంది. ఇవన్నీ స్వతంత్ర కంపెనీలుగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కానున్నాయి
రెండో రోజూ మార్కెట్ ర్యాలీ
ముంబై: అనిశి్చతికి తెరదించుతూ మూడోసారి బీజేపీ కూటమి అధికారాన్ని చేపట్టనుండటంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దౌడు తీశాయి. సెన్సెక్స్ 692 పాయింట్లు జంప్చేసింది. 75,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి 75,075 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 201 పాయింట్లు ఎగసి 22,821 వద్ద నిలిచింది. తొలుత ఒక దశలో గరిష్టంగా సెన్సెక్స్ 75,298కు చేరగా.. నిఫ్టీ 22,910ను తాకింది. వెరసి సెన్సెక్స్ 915 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్లు చొప్పున దూసుకెళ్లాయి. దీంతో బీజేపీకి మెజారిటీ లభించకపోవడంతో మంగళవారం నమోదైన రూ. 31 లక్షల కోట్ల మార్కెట్ విలువ నష్టంలో చాలావరకూ రికవరైంది. గత రెండు రోజుల్లో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 21 లక్షల కోట్లకుపైగా బలపడింది. ఫలి తంగా బీఎస్ఈ మార్కెట్ క్యాప్ దాదాపు రూ. 416 లక్షల కోట్లకు(4.98 ట్రిలియన్ డాలర్లు) చేరింది. నేటి ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టినేడు(శుక్రవారం) ఆర్బీఐ పాలసీ సమీక్ష నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో ఇకపై ఇన్వెస్టర్ల దృష్టి వడ్డీ రేట్లవైపు మళ్లనున్నట్లు మార్కెట్ నిపుణులు వివరించారు. కాగా.. రియలీ్ట, మీడియా, పీఎస్యూ బ్యాంక్స్, ఐటీ, ఆయిల్, మెటల్ రంగాలు 5–1.5 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు హిందాల్కో, హీరోమోటో కార్ప్, ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్ఎం, నెస్లే, ఇండస్ఇండ్, సిప్లా, బ్రిటానియా 2.4–1% మధ్య నీరసించాయి.కాగా, బీఎస్ఈలో ట్రేడైన షేర్లలో 2,981 లాభపడితే.. కేవలం 878 నష్టపోయాయి. నగదు విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) మరోసారి అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు. రూ. 6,868 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీ ఫండ్స్ మాత్రం రూ. 3,718 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. గత 2 రోజుల్లో ఎఫ్పీఐలు రూ. 18,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసు కున్నారు.బీహెచ్ఈఎల్ 9% జంప్ అదానీ పవర్ రూ. 3,500 కోట్ల భారీ ఆర్డర్ నేపథ్యంలో బీహెచ్ఈఎల్ షేరు తాజాగా 9 శాతం జంప్చేసింది. రూ. 278 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 15% దూసుకెళ్లి రూ. 292ను అధిగమించింది. మార్కెట్ విలువ రూ. 7,974 కోట్లు బలపడి రూ. 96,854 కోట్లకు చేరింది. అదానీ షేర్లు జూమ్ వరుసగా రెండో రోజు అదానీ గ్రూప్ కౌంటర్లకు డిమాండ్ నెలకొంది. గ్రూప్లోని 10 లిస్టెడ్ కంపెనీలలో అదానీ పోర్ట్స్ స్వల్ప వెనకడుగు వేయగా.. ఎనర్జీ సొల్యూషన్స్, టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ, పవర్, విల్మర్, ఏసీసీ, ఎంటర్ప్రైజెస్, గ్రీన్ ఎనర్జీ, అంబుజా 5– 2 శాతం మధ్య ఎగశాయి. గ్రూప్ మార్కెట్ విలువ రూ. 17 లక్షల కోట్లను అధి గమించింది.
అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలపై ఆగ్రహం.. కారణం ఇదే..
ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, సంపన్న పారిశ్రామికవేత్త రాధికా మర్చంట్ల రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక సముద్రంపై విలాసవంతమైన క్రూయిజ్లో నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీలోని పాలెర్మో నుంచి సౌత్ ఫ్రాన్స్ వరకు సుమారు 4,380 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన విలాసవంతమైన క్రూయిజ్ లైనర్లో సుమారు 800 మంది ప్రముఖులు పాల్గొన్నారు. రోమ్, పోర్టోఫినో, జెనోవా, కేన్స్ లలో ఈ నౌకకు ప్రత్యేకంగా స్టాప్లు ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించారు.అయితే ఈ వేడుక పోర్టోఫినోలోని వ్యాపారులు, స్థానిక ప్రజలకు కోపం తెప్పించింది. అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం స్థానిక బేను తీసుకుని స్థానికులకు, సందర్శకులకు అందుబాటులో లేకుండా చేయడమే ఇందుకు కారణం. ఇంతకు ముందెన్నడూ ఒక కార్యక్రమం కోసం ఇలా మొత్తం బేను మూసివేయలేదు. ఇక్కడ చాలా మంది సెలబ్రిటీల వివాహ వేడుకలు జరిగాయి. ఆస్ట్రేలియన్ సంగీతకారిణి సియా, రియాలిటీ టీవీ స్టార్ కోర్ట్నీ కర్దాషియాన్ వెడ్డింగ్ ఇక్కడే జరిగింది.మరో వైపు అనంత్ - రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలో పలు రకాల వంటకాల కోసం స్థానిక ప్రసిద్ధ రెస్టారెంట్లకు ఆర్డర్లు ఇచ్చారు. తమను లోబ్స్టర్ శాండ్విచ్లు తయారు చేయమని అడిగారిని, కానీ వేడుకలకు 20 రోజుల ముందు మాత్రమే తమకు సమాచారం ఇచ్చారని స్టీవెన్ స్పీల్బర్గ్, సర్ ఎల్టన్ జాన్, డెంజెల్ వాషింగ్టన్ మరియు సిల్వియో బెర్లుస్కోనీ వంటివారికి సేవలందించిన ప్రసిద్ధ రెస్టారెంట్ ఇల్ పునీ మేనేజర్ ఆండ్రియా మిరోలి తెలిపారు. ఈ చర్య అవమానకరంగా, అనుచితంగా ఉందని ఆయన వెల్లడించారు.ఇక సోషల్ మీడియాలో స్థానికులు, సందర్శకులు పలు పోర్టోఫినో ప్రదేశాలు తమకు అందుబాటులో లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. "చాలా మంది ఇతర సెలబ్రిటీలు, బిలియనీర్లు పోర్టోఫినోలో సంబరాలు చేసుకున్నారు, వారిలో ఎవరూ ఇతరులకు ప్రధాన పాయింట్కు యాక్సెస్ లేకుండా చేయలేదు" అని ఎక్స్ యూజర్లలో ఒకరు రాసుకొచ్చారు.
అదానీ వారి క్రెడిట్ కార్డు.. అదిరిపోయే బెనిఫిట్స్!
అదానీ గ్రూప్కు చెందిన డిజిటల్ ప్లాట్ఫామ్ అదానీ వన్ (Adani One).. ఐసీఐసీఐ బ్యాంక్తో కలిసి ఎయిర్పోర్ట్ -లింక్డ్ ప్రయోజనాలతో దేశీయ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టింది. అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్, అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ అనే రెండు ఆప్షన్లలో ఈ క్రెడిట్ కార్డు అందుబాటులో ఉంది.ఫీజు వివరాలుఅదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు వార్షిక ఛార్జీ రూ .5,000. దీనికి జాయినింగ్ బెనిఫిట్స్ రూ .9,000 ఉంటాయి. అలాగే అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డు వార్షిక ధర రూ .750 కాగా జాయినింగ్ బెనిఫిట్స్ రూ .5,000.ప్రయోజనాలు (అపరిమిత అదానీ రివార్డు పాయింట్లు)అదానీ వన్, విమానాశ్రయాలు, గ్యాస్, విద్యుత్, ట్రైన్మ్యాన్ సహా అదానీ సంస్థలలో 7 శాతం వరకు తగ్గింపు.ఇతర స్థానిక, విదేశీ ఖర్చులపై 2 శాతం వరకు తగ్గింపుఎయిర్పోర్ట్ బెనిఫిట్స్ ప్రీమియం లాంజ్ లతో సహా దేశీయ లాంజ్ లకు సంవత్సరానికి 16 వరకు యాక్సెస్లుసంవత్సరానికి రెండు వరకు ఇంటర్నేషనల్ లాంజ్ విజిట్లు8 వరకు వాలెట్, ప్రీమియం ఆటోమొబైల్ పార్కింగ్ స్థలాలకు యాక్సెస్లుఇతర ప్రయోజనాలువిమానాలు, హోటళ్లు, విహార యాత్రలకు కూపన్లతో సహా రూ.9,000 వరకు వెల్మమ్ బెనిఫిట్.సినిమా టిక్కెట్లు ఒకటి కొంటే ఒకటి ఉచితం1 శాతం ఇంధన సర్ ఛార్జీ రద్దుఅదానీ వన్ రివార్డ్స్ అల్ట్రా లాయల్టీ స్కీమ్ కు ఎక్స్క్లూజివ్ యాక్సెస్
వీడియోలు
EVMలు హ్యాక్ ?.. ఆన్నాడు చంద్రబాబు వ్యాఖ్యలు..అనుమానాలు నిజమేనా !
ఏపీ వ్యాప్తంగా ఆగని టీడీపీ దాడులు
మోదీ కొత్త క్యాబినెట్ కూర్పుపై ఉత్కంఠ..
పార్లమెంట్ లోకి చొరబడేందుకు ముగ్గురు వ్యక్తుల యత్నం
మూడోసారి సునీత అంతరిక్ష ప్రయాణం
ఎన్నికల ఫలితాలపై పిల్లి సూర్యప్రకాష్ రియాక్షన్
ఎన్నికల ఫలితాలపై పిల్లి సుభాష్ చంద్రబోస్ షాకింగ్ రియాక్షన్
టీడీపీ దౌర్జన్యకాండ..
రాహుల్ గాంధీ ఏ సీటు వదులుకుంటారనే దానిపై ఉత్కంఠ
పవన్ గెలుపుపై వంగా గీత సంచలన వ్యాఖ్యలు
ఫ్యామిలీ
Aria: ‘మా కలలు, కన్నీళ్లు, కష్టాలు.. ఈ ఆల్బమ్లో ఉంటాయి’
డిజిటల్ సింగిల్ ‘కీపింగ్ ది ఫైర్’తో ఆరంగేట్రం చేసింది ‘ఎక్స్: ఇన్’ అనే అయిదుగురు సభ్యుల మల్టీనేషనల్ గర్ల్ గ్రూప్. ఈ గ్రూప్లోని సభ్యుల పేర్లు.. ఇషా, నిజ్, హన్నా, నోవ, ఆరియా (ఇండియా) సెకండ్ మినీ ఆల్బమ్ ‘ది రియల్’తో మరోసారి సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది ‘ఎక్స్:ఇన్’ బృందం.‘మా కలలు, కన్నీళ్లు, కష్టాలు ఈ ఆల్బమ్లో ఉంటాయి’ అంటుంది మెయిన్ ర్యాపర్, లీడ్ డ్యాన్సర్ నోవ. ఈ ఆల్బమ్ తమ పర్సనల్ స్టోరీలకు సంబంధించిన ‘మ్యూజికల్ ఎక్స్ప్రెషన్’ అని కూడా అంటుంది నోవ. ‘ది రియల్’లో నో డౌట్, మై ఐడల్, విత్డ్రా, నెవర్ సారీ అనే పాటలు ఉన్నాయి. సవాళ్లు, ఆటుపోట్లను అధిగమించి ఉన్నతస్థానానికి చేరడమే ఆల్బమ్లోని పాటల సారాంశం.‘కష్టాలు ఉన్నట్లే వాటిని అధిగమించే దారులు ఉన్నాయి. అయితే ఆ దారి గురించి ఎంత త్వరగా తెలుసుకుంటామనేది మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది’ అంటుంది ఆరియా.ఇవి చదవండి: Aditya Dadia: అతను.. అక్షరాలా ఆల్రైట్!
Aditya Dadia: అతను.. అక్షరాలా ఆల్రైట్!
బీమా రంగాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త డిజిటల్ సాఫ్ట్వేర్ను రూపొందించాడు ఆదిత్య దాదియ. ముంబైకి చెందిన ఆదిత్య స్టార్టప్ ‘ఆల్ రైట్’ సూపర్ సక్సెస్ అయింది. ఎన్నో చిక్కుముడులకు పరిష్కార మార్గం చూపించింది. ‘ఆల్రైట్’ సృష్టించిన సాఫ్ట్వేర్, ఇన్సూరెన్స్ కంపెనీల పనితీరును సులభతరం చేస్తుంది. సమయాన్ని ఆదా చేస్తుంది.వాణిజ్య బీమా విభాగం పాత దారిలోనే నడుస్తోంది. ఇంటర్నల్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఇప్పటికీ మాన్యువల్గానే ఉంది. ఈ నేపథ్యంలో బీమా కంపెనీలను కొత్త దారిలో నడిపించడానికి ముందుకు వచ్చింది నెక్స్›్ట–జెనరేషన్ టెక్ ΄్లాట్ఫామ్ ఆల్రైట్. కోవిడ్ మహమ్మారి కాలంలో ‘ఆల్రైట్’పై దృష్టి పెట్టాడు కార్పొరేట్ లాయర్ అయిన ఆదిత్య దాదియ.ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఫిన్టెక్ స్టార్టప్లతో కలిసి పనిచేసిన ఆదిత్య ఆ టైమ్లో గమనించిన విషయం ఏమిటంటే.... కమర్షియల్ ఇన్సూరెన్స్ స్పేస్లో పని పూర్తిగా మాన్యువల్గానే జరుగుతుందని. ఈ నేపథ్యంలోనే ‘ఆల్రైట్’పై దృష్టి పెట్టాడు. అయితే ఇది అంత తేలికైన విషయం కాదనేది ఆదిత్యకు తెలుసు. రకరకాల ప్రయత్నాల తరువాత విజయం సాధించాడు. బీమా కంపెనీల పనిని సులభతరం చేసే సాఫ్ట్వేర్ను సక్సెస్ఫుల్గా రూపొందించాడు."సమయాన్ని ఆదా చేయగలిగే సాఫ్ట్వేర్ ఇది. ఉదాహరణకు..రెండు వారాలు పట్టే పనిని నిమిషాల్లో చేయవచ్చు. ఈ సాఫ్ట్వేర్కు తక్కువ కాలంలోనే మార్కెట్ నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇన్నోవేటివ్ స్టార్టప్గా గుర్తింపు పొందిన ‘ఆల్రైట్’ గత సంవత్సరం సీడ్ ఫండింగ్ రౌండ్లో విజయవంతంగా పది కోట్లు సమీకరించింది". జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పాటు ఏజెంట్లు, ఇన్సూరెన్స్ బ్రోకర్స్, కార్పొరేట్ ఏజెంట్స్ తమ ‘టార్గెట్ కన్జ్యూమర్స్’ అంటున్నాడు ఆదిత్య.బీమా కంపెనీలు, బ్రోకర్లు, ఏజెంట్లు, కార్పొరెట్ ఇంటర్మీడియరీస్, బ్యాంకుల మధ్య అంతరాన్ని తగ్గించే సొల్యూషన్స్ అందించాలని ‘ఆల్రైట్’ లక్ష్యంగా పెట్టుకుంది. కోట్ ప్రొక్యూర్మెంట్, ప్లేస్మెంట్, అండర్ రైటింగ్, యూజర్ మేనేజ్మెంట్, నాలెడ్జ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ టూల్....స్థూలంగా చె΄్పాలంటే బీమా ప్రక్రియను సులభతరం చేయడాన్ని లక్ష్యంగా నిర్ణయించుకుంది ఆల్రైట్.‘ఫోర్స్బ్ 30 అండర్ 30–ఆసియా’ జాబితాలో చోటు సంపాదించిన ఆదిత్య తన కంపెనీ మరింత విస్తరించే ప్రణాళికలతో బిజీగా ఉన్నాడు. ‘ఇది ఇలాగే ఉంటుంది. అంతే’ అనుకునేవారు కొందరు. ‘అలాగే ఎందుకు ఉండాలి? మరోలా కూడా ఉండవచ్చు కదా’ అని అడిగే వాళ్లు కొందరు. ఆదిత్య రెండో కోవకు చెందిన యువకుడు. కొత్తగా ఆలోచిస్తే విజయం ఖాయం అని అక్షరాలా ‘ఆల్రైట్’తో నిరూపించిన యువకుడు.
అడవిని డిజైన్ చేసింది..
చీరకట్టును అందమైన పదాలతో కవితలను అల్లుతుంటారు కవులు. కానీ, సయంతీ ఘోష్ చీరల డిజైన్స్ చూస్తే మాత్రం పచ్చని అడవి తల్లి చెప్పే జ్ఞాపకాల కథల గొలుసును అల్లుకోవచ్చు. రంగు రంగుల పక్షులు, జంతువులు,పెద్ద పెద్ద వృక్షాలు, దట్టమైన ΄÷దలు, అందమైన లతలు... ఇవన్నీ డిజైన్లుగా చేరి సయంతీ కలెక్షన్ను ఆకర్షణీయంగా మార్చేశాయి. ఆ కథల డిజైన్ల సృజన వెనకాల కృషి మనమూ తెలుసుకుందాం.ఫ్యాషన్ డిజైనర్ సయంతీ ఘోష్ కలకత్తావాసి. తనపేరు మీదుగానే డిజైనర్ స్టూడియోను నడుపుతున్నారు ఆమె. అడవి, అందులోని జంతుజాలం నుంచి స్ఫూర్తి పొంది వైల్డ్ లైఫ్ను చీరలు, బ్లౌజుల మీదకు తీసుకువస్తున్నారు. ప్రకృతి అందాన్ని ఎంబ్రాయిడరీ ద్వారా చూపుతూ ఫారెస్ట్ డిజైన్స్ని ఆకట్టుకునేలా చూపుతోంది.‘‘సంప్రదాయ చేనేతలు, భారతీయ వస్త్రాలపైన థ్రెడ్వర్క్తో కూడిన హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్స్ రూపొందించడమే మా ప్రత్యేకత. డిజైన్ల ద్వారా కథలు చెప్పడం మా బ్రాండ్ గొప్పతనం. చిన్నతనంలో అందరం జంతువుల బొమ్మల పట్ల ఆకర్షితులం అయ్యేవాళ్లం. ఆ చిన్ని మనసు ఎప్పుడూ నాటి ఆనందాల చుట్టూతానే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ చిన్ననాటి జ్ఞాపకాలను సజీవంగా తీసుకు రావాలని చేసిన ప్రయత్నమే ఈ డిజైనర్ చీరలు, బ్లౌజులు.సృజనకు మొదటి కిటికీ..ముడి సిల్క్, మస్లిన్, ఆర్గన్జా, టస్సర్, ముగా సిల్క్.. వంటి ఫ్యాబ్రిక్స్ వాడుతున్నాం. అడవిని భూమికి ఊపిరితిత్తులుగా పిలుస్తారు. చిన్నప్పుడు మోగ్లీ (ది జంగిల్ బుక్) జీవితం, ప్రయాణాన్ని గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపేదానిని. ఆ యానిమేషన్ అందమైన, సృజనాత్మక ప్రపంచం నా ముందు తెరుచుకున్న మొదటి కిటికీ. జంగిల్ బుక్ మా ఇంటికి చాలా దగ్గరే అనిపించేది. అడవి, అందులోని జంతువులపై నా అభిమానాన్ని పెంచుకున్నాను.ఆ అడవి అందాన్ని చెక్కు చెదరకుండా ఉంచుతూ, చిన్ననాటి జ్ఞాపకాలు, ప్రకృతి పట్ల ప్రేమతో ప్రతిధ్వనించేలా నా కొత్త సేకరణ ఉండేలా చూసుకున్నాను. అంతేకాదు, చిన్నతనంలో మన హృదయాలలో గూడుకట్టుకున్న అడవిలోని స్నేహితులను ఇప్పటికీ ప్రేమించడం చాలా ముఖ్యం. ఆ అడవిలోని స్నేహితులు అంతరించి ΄ోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన అడవులు ఇంకా పచ్చదనంతో నిండాలి. ఈ ఆలోచనే నా డిజైన్స్ సృష్టికి మూలం.తొమ్మిదేళ్ల క్రితం..మొదట్లో మా హోమ్ గ్యారేజ్ స్పేస్లోనే బ్లౌజుల రూపకల్పనతో ఈ బ్రాండ్ను మొదలుపెట్టాను. అక్కణ్ణుంచి ఈ రోజు వరకు భారతదేశం అంతా ప్రత్యేక యూనిట్లను నడుపుతున్నాను. మెషిన్ ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, జమ్దానీ, కలంకారీ, ఎకో–ప్రింటింగ్, మధుబని, హ్యాండ్ పెయింటింగ్, బాతిక్, పిచ్వాయి.. వంటి పన్నెండు టెక్నిక్లతో డిజైన్ చేస్తాను. నా రోజువారి జీవితమంతా ప్రకృతి, వాస్తు శిల్పం నుంచి స్ఫూర్తిæ పొందుతూ ఈ డిజైన్స్ సృష్టిస్తుంటాను’’ అని వివరిస్తుంది సయంతీ.– సయంతీ ఘోష్
చదువు ఎంపికలో పిల్లల మాట కూడా వినండి
మార్కులు రాలేదని తల్లి పెద్ద ర్యాంకు రాలేదని తండ్రి ఫలానా కోర్సు చదవాలని తల్లి ఆ కాలేజీలోనే చేర్పిస్తానని తండ్రి టీనేజ్ పిల్లలకు ఇది కీలక సమయం. వారు ఇంటర్లో, డిగ్రీలో చేరాలి. కాని పిల్లల మాట వింటున్నారా? మీరే గెలవాలని పట్టుబడుతున్నారా? అప్పుడు పిల్లలు లోలోపల నలిగి పోవడం కన్నా ఏం చేయలేరు. పత్రికల్లో వస్తున్న ఘటనలు హెచ్చరిస్తున్నాయి. ఆచితూచి అడుగు వేయండి.‘నువ్వు ఆ కోర్సు చేయాలనేది మా కల’ అనే మాట తల్లిదండ్రుల నుంచి వెలువడితే అది పిల్లల నెత్తిమీద ఎంత బరువుగా మారుతుందో పిల్లలకే తెలుసు. టీనేజ్ మొదలయ్యి టెన్త్ క్లాస్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ‘కలలు వ్యక్తపరచడం’ తల్లిదండ్రులు మొదలెడతారు. టెన్త్లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలో, ఇంటర్లో ఏ స్ట్రీమ్లోకి వెళ్లాలో, అందుకు ఏ కాలేజీలో చేరాలో, ఆ కాలేజీ ఏ ఊళ్లో ఉంటే బాగుంటుందో ఇన్ని డిసైడ్ చేసి పిల్లలకు చెబుతుంటారు. పిల్లలు వినాలి. వారికి ఏ అభిప్రాయం లేకుండా ఆ కోర్సు పట్ల ఆసక్తి ఉంటే మంచిదే. వారికి మరేదో ఇంటరెస్ట్ ఉండి, ఇంకేదో చదవాలని ఉంటే... ఆ సంగతి చెప్పలేకపోతే ఇబ్బంది. అది భవిష్యత్తును కూడా దెబ్బ కొట్టగలదు.ఏంటి... ఆ కోర్సా?ఆ ఇంట్లో తండ్రి అడ్వకేట్, తల్లి గవర్నమెంట్ ఉద్యోగి. కుమార్తెకు మేథ్స్గాని, బయాలజీగాని చదవాలని లేదు. హాయిగా టీచర్గా సెటిల్ అవ్వాలని ఉంది. తన స్కూల్లో చక్కగా తయారై వచ్చే టీచర్ పిల్లల పేపర్లు దిద్దే సన్నివేశం ఆ అమ్మాయికి ఇష్టం. తాను కూడా టీచరయ్యి పేపర్లు దిద్దాలని అనుకుంటుంది. టెన్త్ అవుతున్న సమయంలో ‘టీచర్ అవుతాను’ అని కూతురు అంటే తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ‘మన హోదాకు టీచర్ కావడం ఏం బాగుంటుంది... మన ఇళ్లల్లో టీచర్లు ఎవరూ లేరే’ లాంటి మాటలు చెప్పి ఎంపీసీలో చేర్పించారు. ఆ అమ్మాయి ఆ లెక్కలు చేయలేక తల్లిదండ్రులకు చెప్పలేక కుమిలిపోయింది. డిప్రెషన్ తెచ్చుకుంది. అదే ‘టీచర్ కావాలనుకుంటున్నావా? వెరీగుడ్. అక్కడితో ఆగకు. నువ్వు హార్వర్డ్లో ప్రోఫెసర్ అవ్వాలి. అంత ఎదగాలి’ అని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే హార్వర్డ్కు వెళ్లకపోయినా ఒక మంచి యూనివర్సిటీలో లెక్చరర్ అయినా అయ్యేది కదా.అన్నీ మాకు తెలుసుతల్లిదండ్రులకు అన్నీ మాకు తెలుసు అనే ధోరణి ఉంటుంది. నిజమే. కాని వాళ్లు ఇప్పుడున్న స్థితి రకరకాల ప్రయోగాలు చేసి రకరకాల దారుల్లో ప్రయత్నించి ఒక మార్గంలో సెటిల్ అయి ఉంటారు. తమ లాగే తమ పిల్లలు కూడా కొన్ని దారుల్లో నడవాలని అనుకోవచ్చు అని భావించరు. అన్నీ తమ ఇష్టప్రకారం జరగాలనుకుంటారు, ఓవర్ కన్సర్న్ చూపించి ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఉదాహరణకు ఒకబ్బాయికి ‘నీట్’లో మెడిసిన్ సీటు వచ్చే ర్యాంకు రాలేదు. కాని డెంటిస్ట్రీ సీటు వచ్చే ర్యాంకైతే వచ్చింది. అబ్బాయికి ఆ కోర్సు ఇష్టమే. కాని తల్లిదండ్రులకు తమ కొడుకు ఎలాగైనా ఎంబిబిఎస్ మాత్రమే చదవాలనేది ‘కల’. ‘లాంగ్ టర్మ్ తీసుకో’ అని సూచించారు. లాంగ్ టర్మ్ అంటే ఒక సంవత్సరం వృథా అవుతుంది... పైగా ఈసారి ఎంట్రన్స్లో కూడా మంచి ర్యాంక్ వస్తుందో రాదో అనే భయం ఆ అబ్బాయికి ఉన్నా బలవంతం చేస్తే ఎంత చెప్పినా వినకపోతే ఆ అబ్బాయి ఉక్కిరిబిక్కిరి అవ్వడా?ప్రతిదీ నిర్ణయించడమేతల్లిదండ్రుల స్తోమత పిల్లలకు తెలుసు. వారు చదివించ దగ్గ చదువులోనే తమకు ఇష్టం, ఆసక్తి, ప్రవేశం ఉన్న సబ్జక్టును చదవాలని కోరుకుంటారు. పైగా తమ స్నేహితుల ద్వారా వారూ కొంత సమాచారం సేకరించి ఫలానా కాలేజీలో ఫలానా కోర్సు చదవాలని నిశ్చయించుకోవచ్చు. అయితే తల్లిదండ్రులు పిల్లల ఆసక్తికి ఏ మాత్రం విలువ లేకుండా ఎలాగైనా చేసి రికమండేషన్లు పట్టి తాము ఎంపిక చేసిన కాలేజీలోనే చదవాలని శాసిస్తారు. ఇది అన్నివేళలా సమంజసం కాదు. ఒత్తిడి వద్దుటీనేజ్ సమయంలో పిల్లల భావోద్వేగాలు పరిపక్వంగా ఉండవు. కొంత తెలిసీ కొంత తెలియనితనం ఉంటుంది. ఆసక్తులు కూడా పూర్తిగా షేప్ కావు. ఇంటర్, గ్రాడ్యుయేషన్ కోర్సులకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి వారికి ఎన్నో సందేహాలుంటాయి. ఎంపికలు ఉంటాయి. ఇవాళ రేపు తల్లిదండ్రులు ‘తాము చదివించాలనుకున్న కోర్సు’ కోసం ఏకంగా పంజాబ్, హర్యాణ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు పంపుతున్నారు. ఇంట్లో ఉండి చదివే వీలున్నా రెసిడెన్షియల్ కాలేజీల్లో పడేస్తున్నారు. అంతంత మాత్రం చదువు చెప్పినా పర్లేదని మెడిసన్ పట్టా ఉంటే చాలని ఆసియా దేశాలకు సాగనంపుతున్నారు. పిల్లలతో ఎంతో మాట్లాడి, కౌన్సెలింగ్ చేసి, మంచి చెడ్డలన్నీ చర్చించి, వారికి సంపూర్ణ అవగాహన కలిగించి రెండు ఆప్షన్లు ఇచ్చి వారి ఆప్షన్లు కూడా పరిగణించి సానుకూలంగా ఒక ఎంపిక చేయడం ఎప్పుడూ మంచిది. లేదంటే ‘కోటా’ లాంటి కోచింగ్ ఊర్లలో జరుగుతున్న విషాదాలు, హైదరాబాద్లాంటి చోట్ల ఇల్లు విడిచి పోతున్న సంఘటనలు ఎదుర్కొనాల్సి వస్తుంది.
న్యూస్ పాడ్కాస్ట్
ప్రధానమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ... నేడు ఎన్డీఏ ఎంపీల సమావేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవ ఎన్నిక.. శనివారం లేదా ఆదివారం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించిన ఎన్డీయే.. బీజేపీకి కూటమికి 292 స్థానాలు, ఇండియా కూటమికి 234 స్థానాలు.. 240 సీట్లకే పరిమితమైన బీజేపీ, మెజారిటీ కంటే 32 స్థానాలు తక్కువ.. 99కి పెరిగిన కాంగ్రెస్ బలం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా ఈరోజే వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి, రీప్లేస్మెంట్ మనమే.. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
మళ్లీ విజయం మనదే, ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం... ‘ఎక్స్’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు కేరళకు నైరుతి రుతుపవనాల రాక.. రెండు రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నాయకులు చల్లే బురదలోనే కమలాలు విరగబూస్తాయి.. ప్రధాని మోదీ ధీమా.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
మా ప్రాణాలు కాపాడండి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు, సానుభూతిపరులపై ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై రాజకీయ ప్రత్యర్థులు, అసాంఘిక శక్తులు దాడులతో వ్యవస్థీకృత హింసకు పాల్పడుతుండటంపై బాధితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గ్రామాలు, ఆస్తులను వదిలేసి కట్టుబట్టలతో వెళ్లకుంటే హతమారుస్తామంటూ హెచ్చరిస్తున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తూ పిల్లలు, మహిళలను సైతం హింసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ ఘటనలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయని విన్నవించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న వ్యవస్థీకృత హింసను సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా స్వీకరించి ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించాలని అభ్యర్థించారు. వ్యవస్థీకృత హింసకు సంబంధించి మీడియా కథనాలు, సోషల్ మీడియా వీడియోల సాక్ష్యాధారాలతో బాధితులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి గురువారం ఈ–మెయిల్ ద్వారా పిర్యాదు చేశారు. బాధితుల ఆక్రందన ఇదీ..⇒ ప్రస్తుతం రాష్ట్రంలోని పాలనా యంత్రాంగంలో నెలకొన్న అస్థిర పరిస్థితులను ఆసరాగా చేసుకుని అసాంఘిక శక్తులు వైఎస్సార్సీపీ మద్దతుదారులు, సానుభూతిపరులు, పిల్లలు, మహిళలపై వ్యవస్థీకృత హింసకు పాల్పడుతున్నాయి. ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. ⇒ పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించడంతో అసాంఘిక శక్తులు యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడుతున్నాయి. గత 24 గంటల్లో హింసాత్మక సంఘటనలు భారీగా పెరిగాయి. ⇒ సర్వోన్నత న్యాయస్థానం తక్షణమే స్పందించి చర్యలకు ఆదేశించకుంటే ఈ వ్యవస్థీకృత హింస నుంచి బాధితులకు రక్షణ లభించదు. ఈ అంశాన్ని సుమోటో పిల్గా స్వీకరించి విచారించాలి. రాష్ట్ర ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడాలి.
క్రికెట్ ఆడుతూ.. యువకుడి విషాదం!
నిజామాబాద్: క్రికెట్ ఆడేందుకు వెళ్లిన ఓ యువకుడు ఆట మధ్యలోనే గుండెపోటుతో కుప్పకూలిన ఘటన నగరంలోని వినాయక్నగర్లో ఉన్న అమ్మవెంచర్లో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.నగరంలోని గౌతమ్నగర్కు చెందిన విజయ్(30) తన స్నేహితులతో కలిసి అమ్మవెంచర్లో ఉన్న క్రికెట్ మైదానానికి వచ్చాడు. అక్కడ క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్నేహితులు వెంటనే జీజీహెచ్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.విజయ్ మృతితో కుటుంబీకులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ విషయమై నాలుగో టౌన్ ఎస్సై సంజీవ్కు వివరణ కోరగా ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.ఇవి చదవండి: Low blood pressure : ఈ చిట్కాలను పాటిస్తే మేలు!
వివాహిత ఆత్మహత్య
కొత్తూరు: మండలంలోని కర్లెమ్మ పంచాయతీ ఎన్ఎన్ కాలనీలో నివాసం ఉంటున్న వన్నాల రేవతి(27) బుధవారం ఇంటిలో ఉన్న ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రేవతి భర్త కృష్ణారావు స్థానిక ఫైర్ స్టేషన్లో ఫైర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. సారవకోట మండలం కుమ్మరిగుంటకు చెందిన కృష్ణారావుకు పాతపట్నం మండలం పాచిగంగుపేటకు చెందిన రేవతితో తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే ఎప్పటి మాదిరిగానే కృష్ణారావు విధుల నుంచి మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చాడు. ఇంటిలోకి వెళ్లే సరికి రేవతి ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించింది. దీంతో వెంటనే ఆమెకు కిందకు దించి స్థానికుల సహకారంతో స్థానిక సీహెచ్సీకి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాతపట్నం ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వీరికి ఆరేళ్ల వయసు గల కుమార్తె ఉంది. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఏంఏ ఆహ్మద్ తెలిపారు.
టీడీపీ వేధింపులకువైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బలి
పెదవేగి: టీడీపీ కార్యకర్తల వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా మండల కన్వీనర్ యలమంచిలి ప్రవీణ్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ సూర్యారావుపేటకి చెందిన ప్రవీణ్ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దుర్ఘటన మండలంలో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి అహర్నిశలు శ్రమించాడన్న కక్షతో ఓట్ల లెక్కింపు రోజు (ఈనెల 4న) సాయంత్రం ప్రవీణ్ ఇంటి మీద తెలుగుదేశం కార్యకర్తలు దాడిచేశారు. రాళ్లు, బీరు సీసాలు విసిరి, దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించారు. పెదవేగి పెట్రోల్ బంక్ వైపు వస్తే కొడతామని, బైక్, కారు తగలబెట్టేస్తామని హెచ్చరించారు. బుధవారం ఉదయం ప్రవీణ్ విజయరాయి పెట్రోల్ బంక్కి వెళ్లగా.. బండిపై మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఫొటోతో ఉన్న వైఎస్సార్సీపీ స్టిక్కర్ తీసేవరకు బీభత్సం సృష్టించి దాడిచేశారు. టీడీపీ వారి బెదిరింపులకు భయపడి, వేధింపులు భరించలేక ప్రవీణ్.. తన ఇంటి సమీపంలోని తోటలో చెట్టుకు ఉరేçÜుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రవీణ్ తల్లిదండ్రులు యలమంచిలి ఝన్సీరాణి, ప్రకాశరావు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దాడుల సంస్కృతి కొనసాగితే ఉరుకోం టీడీపీ వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకున్న ప్రవీణ్ భౌతికకాయానికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి నివాళులర్పించారు. కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్ను బలితీసుకున్న టీడీపీ కార్యకర్తల అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని, వారి ఇళ్ల మీదకు వెళ్లి భౌతికదాడులు చేస్తూ, వాహనాలు, ఇంట్లో వస్తువులు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల సంస్కృతి కొనసాగితే ఊరుకునేదిలేదని టీడీపీ శ్రేణులను హెచ్చరించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులంతా సంయమనం పాటించాలని కోరారు.