Top Stories
ప్రధాన వార్తలు
మా ఓట్లు ఏమయ్యాయి? టీడీపీ ఓడిపోతుందనుకున్న చోట భారీ మెజారిటీలా..?
ఈ ఫలితాలపై ఎన్నో అనుమానాలు ఈ ఫలితాలపై ఎవ్వరికీ నమ్మకం కలగడం లేదు. మా గ్రామంలో అత్యధిక శాతం మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత చూస్తే తారుమారైనట్లు కనిపించింది. సంక్షేమ పథకాలు అందుకున్న అనేక కుటుంబాలు వైఎస్సార్సీపీకి ఓట్లు వేశాయి. కానీ ప్రతిరౌండులోనూ మెజార్టీ ఓట్లు ఏకపక్షంగా టీడీపీకి వచ్చాయి. జగన్ను అధికంగా అభిమానించే గ్రామాల్లోనే ఇలా టీడీపీకి ఓట్లు పడటం చూస్తుంటే ఎన్నో అనుమానాలున్నాయి. – దుంపల ఉమ (రైతు), కమలనాభపురం, కోట»ొమ్మాళి మండలం, శ్రీకాకుళం జిల్లాసాక్షి, అమరావతి: ‘‘మేం జగన్కే ఓటేశాం.. మా ఓట్లన్నీ ఏమైపోయాయి.. ఏదో జరిగింది.. లేకపోతే అధికార పార్టీకి ఇంత దారుణంగా సీట్లు రావడమేంటి? బంపర్ మెజారిటీతో గెలుపొందుతాం అనుకున్న చోట టీడీపీకి మెజారిటీ రావడం ఏమిటి? వైఎస్సార్సీపీ ఓట్లు పక్కాగా 90 శాతంపైగా ఉన్న ఒక బూత్ పరిధిలో టీడీపీకి మెజారిటీ రావడాన్ని ఏమనుకోవాలి? ఏదో జరిగింది.. ఆ ఓటింగ్ మిషన్లను ఏదో చేశారు.. లేకపోతే ఇంత దారుణంగా ఫలితాలెలా వస్తాయి?’’ అని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ చర్చే నడుస్తోంది. ఇంతలా ఫలితాలను తాము కలలో కూడా ఊహించలేదని టీడీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారంటే ఏం జరిగి ఉంటుందనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. కూటమి గెలిచిందనే ఆనందం కంటే జగన్ ఓడిపోయారనే బాధ అత్యధికుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ‘మా గ్రామంలో 3 వేల ఓట్లు ఉంటే అందులో కనీసం 2100 ఓట్లు వైఎస్సార్సీపీకే పడ్డాయి.. ఇలా ఒక నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ జరిగితే జగన్ ఓడిపోవడమేంటి’ అంటూ అనేక గ్రామాల్లో ప్రజలు లెక్కలు వేస్తున్నారు. పలువురు రైతులు పల్లెల్లో ఒక చోట చేరి ‘మనకు ఎంతో మేలు చేసిన జగన్కే కదా మనం ఓటేశాం. ఇలా అన్ని ఊళ్లలోనూ జరిగింది.. మరి మనందరి ఓట్లు ఏమైపోయాయి?’ అని ఆవేదన పంచుకుంటున్నారు. జగనన్నకే మేమూ ఓటేశాం అన్నకు మరీ ఇంత తక్కువ సీట్లు రావడమేంటంటూ అక్కచెల్లెమ్మలు కన్నీరు మున్నీరవుతున్నారు. బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వారికి ఫోన్లు చేసి ఏం జరిగి ఉంటుందంటూ ఆరా తీస్తున్నారు. ఉద్యోగులు సైతం ఈ ఫలితాల పట్ల విస్మయం చెందుతున్నారు. సచివాలయాల ఉద్యోగులు, కొన్ని సామాజిక వర్గాల ఉద్యోగులు, వలంటీర్లు వైఎస్సార్పార్టీకి ఓటేశారని, వీరందరి ఓట్ల వల్ల అనేక సీట్లు వచ్చే అవకాశం ఉందని వారు చర్చించుకుంటున్నారు.
సంకీర్ణంతో సామరస్యం నెలకొనేనా?
‘ఇండియా’ కూటమి కుల జనగణనను అంగీకరిస్తూ, బీజేపీ 400 సీట్లతో గెలిచి ఏకంగా రాజ్యాంగాన్ని మార్చెయ్యాలని చూస్తున్నదనీ, మొత్తం రిజర్వేషన్లను రద్దు చెయ్యాలనుకుంటోందనీ పెద్దఎత్తున ప్రచారం చేసింది. ఇది కచ్చితంగా ఓటర్ల మీద ప్రభావాన్ని చూపించింది. దాంతో ఫలితాలు బీజేపీని సంకీర్ణంలోకి నెట్టాయి. మోదీ సంకీర్ణ ప్రభుత్వాన్ని వారి సిద్ధాంతంతోనైనా వాజ్పేయిలా నడిపే వ్యక్తి కాదు. మోదీని ముస్లిం దేశాలు బద్దశత్రువుగా చూసే అవకాశముంది. ఆరెస్సెస్/బీజేపీ ఆయనను కాక మరో వ్యక్తిని ప్రధానిగా ప్రతిపాదించి కాస్త సామరస్య వాతావరణంలో దేశాన్ని నడవనిచ్చే అవకాశమున్నది. కానీ మోదీ తప్పుకొనే అవకాశం కనబడటం లేదు. అందుకు ప్రత్యర్థి కూటమి ప్రత్యామ్నాయంగా బలపడటం తప్ప మార్గం లేదు.2024 ఎన్నికలు దేశ చరిత్రలో చాలా విచిత్రమైనవి. దేశస్థాయిలో మోదీ నాయకత్వంలోని బీజేపీని సంకీర్ణంలోకి నెట్టాయి. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల్లో పరిపాలిస్తున్న రెండు పార్టీలూ ఓడిపోయాయి. ముఖ్యంగా వైసీపీ ఓటమి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే దేశం ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డ ఎన్నిక కూడా ఇది. బీజేపీ 240కి పడిపోవడం ఒక రక్షణ కవచం.ఈ ఎన్నికతో చాలా ఘోరంగా పతనమైపోతుందనుకున్న కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు దేశాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ వ్యవస్థకు చెక్ పడింది. మొత్తం బీజేపీ శక్తులు ‘పప్పు, పప్పు’ అని ఎద్దేవా చేసిన రాహుల్ గాంధీ... ఒక దళిత మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో ఎవరూ ఊహించనట్టు మ్యానిఫెస్టోను దేశం ముందు పెట్టి మోదీ, అమిత్షాల 400 సీట్లు తెస్తారన్న బీజేపీని 240 సీట్లకు పడేసి దేశాన్ని చాలా పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు.‘ఇండియా’ కూటమి కాంగ్రెస్ మ్యానిఫెస్టోను సొంతం చేసుకొని దేశమంతటా ప్రచారం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ఈ ఎన్నికల ‘హీరో’ అన్నారు. ‘ఇండియా’ కూటమి కుల జనగణనను అంగీకరిస్తూ, బీజేపీ 400 సీట్లతో గెలిచి ఏకంగా రాజ్యాంగాన్ని మార్చెయ్యాలని చూస్తున్నదనీ, మొత్తం రిజర్వేషన్లను రద్దు చెయ్యాలనుకుంటోందనీ పెద్దఎత్తున ప్రచారం చేసింది. ఈ ప్రచారం కచ్చితంగా చాలామంది ఓటర్ల మీద ప్రభావాన్ని చూపించింది. నరేంద్ర మోదీ దీన్ని తట్టుకోవడానికి ముస్లింల రిజర్వేషన్లు ఎత్తేసి బీసీలకు ఇస్తామని పదేపదే మాట్లాడారు. కానీ చంద్రబాబు, నితీష్ కుమార్ వంటివారు దాన్ని అంగీకరించలేదు. ఇప్పుడు ఈ ఇద్దరు లేకుండా బీజేపీ ప్రభుత్వం నిలబడదు. అయితే అటు నితీష్ గానీ, ఇటు చంద్రబాబు గానీ మోదీకి మంచి మిత్రులు కారు. ఇద్దరూ మోదీని, షాని వ్యతిరేకించి శత్రుస్థానంలో పెట్టి, వారితో పోరాడినవాళ్లే. అయితే ఆ ఇద్దరు ఇప్పుడు ‘ఇండియా’ కూటమి దేశానికి, రాజ్యాంగానికి ప్రమాదకరమైనదని ప్రచారం చేస్తున్న మోదీని ప్రధానమంత్రిని, షాను మళ్లీ హోంమంత్రిని చేసి దేశ అభద్రతకు బాధ్యులవుతారా? లేక బీజేపీలోని మరో వ్యక్తిని ప్రధానమంత్రిని చెయ్యమని సలహా ఇస్తారా? చూడాలి.మోదీ ప్రభుత్వం చంద్రబాబుకు దూరమైన గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్కు ఎన్నో తీవ్ర నష్టాలను చేసింది. ఆంధ్ర పెట్టుబడిదారులనెవ్వరినీ నిర్మాణం రంగంలో గానీ, పెద్ద బిజినెస్లలో గానీ నిలువనివ్వలేదు. బ్యాంకుల విలీనం చేసినప్పుడు బరోడా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి వాటిని ఆ పేర్లతోనే ఉంచి ఆంధ్రా బ్యాంక్ను మాత్రం యూనియన్ బ్యాంక్లో విలీనం చేశారు. మొదటి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ అన్నింటి రీత్యా ఇప్పుడు చంద్రబాబుపై ఆధారపడే కేంద్ర ప్రభుత్వానికి బాబు ఎటువంటి కండిషన్లు పెడతారు?అటు కాంగ్రెస్తో 2019లో తెలంగాణలో పొత్తులో పోటీ చేసింది టీడీపీ. కాంగ్రెస్ తమ ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తామంటోంది. చంద్రబాబు, నితీష్కుమార్ ఒక నిర్ణయం తీసుకుంటే, మోదీ, అమిత్ షాలను ఇంటికి పంపగలరు. అయితే చంద్రబాబుకు ఇప్పుడున్న స్థితిలో అది చిన్న నిర్ణయం కాదు. మోదీ సంకీర్ణ ప్రభుత్వాన్ని వారి సిద్ధాంతంతోనైనా వాజ్పేయిలా నడిపే వ్యక్తి కాదు. ఎన్నికల ప్రచారంలో ఆయన దేశంలోని మొత్తం ముస్లింల మీద అక్కసు కక్కారు.గుజరాత్లోని 2002 మత కల్లోలం తరువాత జరిగిన ఈ ముస్లింల వ్యతిరేక ప్రచారం ఆయన్ని ఇంకా పెద్ద ముస్లిం వ్యతిరేకిగా నిలబెడుతుంది. ప్రపంచ పత్రికలన్నీ ఆయన్ని ‘గ్రేట్ డివైడర్’ అని రాశాయి. ముస్లిం దేశాలు ఈ ఎన్నికల తరువాత ఆయన్ని బద్ధశత్రువుగా చూసే అవకాశముంది. ఆరెస్సెస్/బీజేపీ ఆయన్ని కాక మరో వ్యక్తిని ప్రధానిగా ప్రతిపాదించి కాస్త సామరస్య వాతావరణంలో దేశాన్ని నడవనిచ్చే అవకాశమున్నది. కానీ ఆరెస్సెస్/బీజేపీ క్యాడర్ మోదీ, అమిత్ షాల పరిపాలనలో సుఖాలను అనుభవించడం నేర్చుకున్నారు. వారికి ఈ భోగం మరో నాయకుల నేతృత్వంలో దొరకదు. అందువల్ల ఆరెస్సెస్లో కూడా వారు చెప్పిందే నడుస్తుంది.గుజరాత్ పెట్టుబడి దేశాన్ని మొత్తం తన గుతా«్తధిపత్యంలోకి తీసుకుంది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రం నుండి కూడా గుజరాత్ పెట్టుబడిదారులకు ధీటుగా పోటీపడే పరిస్థితి లేదు. తెలుగు రాష్ట్రాల నుండి నిర్మాణ రంగంలో గుజరాతీ పెట్టుబడిదారులకు ధీటుగా ఎదిగిన జీవీకే కంపెనీని బొంబాయి ఎయిర్పోర్ట్ నుండి తప్పించి మోదీ, షాలు అదానీకి అప్పజెప్పారు. తమకు ఎదురు తిరిగిన రాజకీయ నాయకులపై సీబీఐ, ఈడీలను ప్రయోగించి జైలుపాలు చేశారు. ఈ పరిస్థితి నుండి దేశం బయట పడాలంటే మోదీ, షాలు అధికారం నుండి పోవడమొక్కటే మార్గం. అందుకు ప్రత్యర్థి కూటమి ప్రత్యామ్నాయంగా బలపడటం తప్ప మరో మార్గం లేదు. అందుకు ‘ఇండియా’ కాస్త దారి చూపింది. ఈ స్థితిలో ‘ఏ కూటమితోనూ ఉండను’ లాంటి నిర్ణయాలు నష్టం చేస్తాయి. ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయి వ్యవస్థల్ని శాసించలేవు. నిజానికి, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేనతో – బీజేపీ చేరి ఎన్నికల కమిషన్ను అటు తిప్పింది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. కీలక స్థలాల్లో వైసీపీ కీళ్లు విరిచే ప్రయత్నం చేసింది.రాహుల్ గాంధీ దేశంలో అన్ని సభల్లో ఎన్నికల సంఘం నిష్పక్షపాత్రను ప్రశ్నిస్తూ వచ్చారు. సీబీఐ, ఈడీ, ఎలెక్టోరల్ బాండ్స్, ఇతర పార్టీల ఆదాయాలను అడ్డుకోవడం, ఉన్న పార్టీ డబ్బును ఎన్నికల్లో వాడకుండా చూడటం, ఇన్కమ్టాక్స్ వంటి సంస్థల ద్వారా బంధించడం... ఈ స్థితిలో అన్ని ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవాలంటే ఒక జాతీయ కూటమిలో చేరి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే నిర్ణయాల్లో, పోరాటాల్లో భాగం కాకపోతే ముందు ముందు బీజేపీ ప్రాంతీయ పార్టీలను తమ బందీలను చేస్తుంది.కాంగ్రెస్ ముఖ్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర తరువాత ఆరెస్సెస్/బీజేపీలను నిలువరించే ప్రయత్నం చేశారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలు డీఎంకే లాగ ఒక ప్రత్యామ్నాయ తాత్విక పునాదితో నిర్మించినవి కావు. అందుకే డీఎంకేని బీజేపీ సనాతన ధర్మం చుట్టూ రాద్దాంతం చేసి ఓడించాలని చూసింది. కానీ దాని ద్రావిడ, శూద్ర సిద్ధాంతరంగం కాపాడింది. బీజేపీ అక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇప్పుడు పార్లమెంట్ పోరాటం... రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రిజర్వేషన్లను కాపాడాలనే ‘ఇండియా’ కూటమికీ, ఆరెస్సెస్ సిద్ధాంతాన్ని దేశంలో నాటి, మత సమస్యను ముందు పెట్టి దేశంలో ఉత్పత్తి కులాలను అణగదొక్కే ఎన్డీఏలోని ఆధిపత్య బీజేపీకీ మధ్య జరుగుతుంది. ఎన్డీయే కూటమిలోని నితీష్ కుమార్, చంద్రబాబుకు బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలకు చెక్ పెట్టే అవకాశమొచ్చింది. ఈ ఇద్దరు నాయకులు ఏం చేస్తారనేది చూడాలి. చంద్రబాబు 2002లో మోదీని ముఖ్యమంత్రి పదవి నుండి దింపే స్థితిలో ఉండి కూడా ఆయన్ని కొనసాగించే బీజేపీ నిర్ణయానికి మద్దతిచ్చారు. మళ్లీ ఈ కీలకదశలో ఆయనకు ఒక అవకాశమొచ్చింది. ‘ఇండియా’ కూటమి దేశంలోని మొత్తం ప్రతిపక్ష పార్టీలను తమ పక్కన చేర్చుకోవాల్సిన అవసరముంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
ఒకేసారి రెండు పాత్రలు పోషించడం సాంకేతికంగా ఎలా సాధ్యం?
సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే అంశంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కూటమి నుంచి 164 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో మంత్రి పదవులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే కొందరికి మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇవ్వడం, చాలామంది సీనియర్లు గెలుపొందడం, బీజేపీ, జనసేనకు అవకాశం ఇవ్వాల్సినందున మంత్రివర్గ కూర్పు కత్తిమీద సాములా మారనుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని ఎన్నికలకు ముందు నుంచే ప్రచారం సాగుతుండగా బుధవారం పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వంలోనూ భాగస్వాములుగా ఉంటామని చెప్పుకొచ్చారు. అయితే ఈ రెండు ఎలా సాధ్యమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలని నిర్ణయించుకుంటే మంత్రివర్గంలో జనసేన చేరడం కుదరదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటూ తన పార్టీకి చెందిన వారికి మంత్రి పదవులు ఇప్పించాలనుకున్నా సాంకేతికంగా అది సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. దీంతో ఎలా ముందుకు వెళతారనే అంశం ఆసక్తికరంగా మారింది. జనసేన మంత్రివర్గంలో చేరితే నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాస్కు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలనే విషయంపై వెనక్కి తగ్గితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునే అవకాశం ఉంది. ఇక బీజేపీ నుంచి అసెంబ్లీకి గెలిచిన వారిలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. సత్యకుమార్, విష్ణుకుమార్రాజుకు కూడా అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు.పాతవారికే పెద్దపీటటీడీపీలో మంత్రి పదవుల ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. 135 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి గెలుపొందడంతో ఎవరికి అవకాశం దక్కుతుందోననే చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణలు, సీనియారిటీ ప్రాతిపదికన పలువురు నేతలు తమకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని గట్టిగా నమ్ముతున్నారు. చంద్రబాబు ఇప్పటికే దీనిపై ప్రాథమికంగా కొంత కసరత్తు చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నారా లోకేష్, పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకు కచ్చితంగా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని చెబుతున్నారు.
ఇండియా కూటమి కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ ముగిసింది. మిత్రపక్షాలతో కలిసి సుధీర్ఘ చర్చలు జరిపిన అనంతరం.. ప్రతిపక్షంలోనే కొనసాగాలని ఇండియా కూటమి తీర్మానం చేసుకుంది. బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా ఇండియా భాగస్వామ్యం ఏకతాటిపై పోరాటం చేస్తాయని ఖర్గే పేర్కొన్నారు. ప్రతిపక్షానికి మద్దతిచ్చిన దేశ ప్రజలందరికీ కూటమి తరపున ధన్యవాదాలు తెలిపారు.లోక్సభ ఫలితాల అనంతరం ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశమైన సంగతి తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో విపక్ష నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, డీ రాజా, ఏచూరి హాజరయ్యారు. ఇండియా కూటమి సంయుక్త ప్రకటననరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాంబీజేపీని గద్దె దింపేందుకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాంఇండియా కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నాం. ఈ ఎన్నికల ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయి. నైతికంగా ప్రధాని ఓడిపోయారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో కూటమి ఐక్యంగా పోరాడింది. రాజ్యాంగ విలువలను కాపాడాలనుకునే ఏ పార్టీ అయినా కూటమిలోకి రావొచ్చు. ఈ ఫలితాలు తనకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ.. మోదీ ప్రజల అభీష్టాన్ని మార్చాలని చూస్తున్నారు. :::ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే #WATCH | Delhi: Congress president Mallikarjun Kharge says "...The INDIA bloc will continue will fight against the fascist rule of the BJP led by PM Modi. We will take the appropriate steps at the appropriate time to realise the people's desire not to be ruled by the BJP's… pic.twitter.com/NhdnHYbbfI— ANI (@ANI) June 5, 2024ప్రతిపక్ష నేతలంతా కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్(272) దాటకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కసరత్తు లేదా ప్రతిపక్ష హోదా కొనసాగింపు వంటి వివిధ అంశాలపై లోతుగా చర్చించారు. చివరికి ప్రతిపక్షంలోనే కొనసాగాలని ఇండియా కూటమి నిర్ణయించింది.కాగా జూన్ 4న వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమికి 291, ఇండియా కూటమికి 232 స్థానాలు దక్కాయి. బీజేపీ స్వతహాగా 240 సీట్లు గెలుచుకుంది. అయితే ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు రాకపోవడంతో ప్రధాని మోదీ ఎన్డీయే మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రధాని పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతికి సమర్పించారు. జేడీయూ, టీడీపీ వంటి మిత్ర పక్షాలతో కలిసి జూన్ 8న మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
T20 World Cup 2024: ఆడుతూ పాడుతూ...
భారీ అంచనాలతో టి20 వరల్డ్ కప్ బరిలోకి దిగిన భారత్ తొలి పోరులో తమ స్థాయి ప్రదర్శనతో సత్తా చాటింది. సంచలనాల రికార్డు ఉన్న ఐర్లాండ్పై ఏమాత్రం ఉదాసీనత కనబర్చకుండా పూర్తిగా పైచేయి సాధించి భారీ విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్కు అంతగా అనుకూలించని పిచ్పై ప్రత్యరి్థని 96 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా ఆ తర్వాత మరో 46 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం చేరింది. మన బౌలర్లలో ఐదుగురు కనీసం ఒక్కో వికెట్తో తమ వంతు పాత్ర పోషించారు. అనంతరం రోహిత్, పంత్ చక్కటి బ్యాటింగ్ టీమిండియాను ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలిపించాయి. ఇక ఆదివారం పాకిస్తాన్తో మ్యాచ్ రూపంలో తర్వాతి సవాల్కు భారత్ సిద్ధమైంది. న్యూయార్క్: టి20 వరల్డ్ కప్లో రోహిత్ బృందం శుభారంభం చేసింది. బుధవారం నాసా కౌంటీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. గారెన్ డెలానీ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు)దే అత్యధిక స్కోరు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (2/6), అర్‡్షదీప్ చెరో 2 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లకు 97 పరుగులు సాధించి గెలిచింది. రోహిత్ శర్మ (37 బంతుల్లో 52 రిటైర్డ్హర్ట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు), రిషభ్ పంత్ (26 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రెండో వికెట్కు 44 బంతుల్లో 54 పరుగులు జోడించారు. టపటపా... స్వింగ్కు అనుకూల వాతావరణం, అనూహ్య బౌన్స్, నెమ్మదైన అవుట్ఫీల్డ్... ఇలాంటి స్థితిలో బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ ఏ దశలోనూ భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. మూడో ఓవర్లో కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (2), బల్బర్నీ (5)లను అవుట్ చేసి అర్‡్షదీప్ ముందుగా దెబ్బ కొట్టడంతో మొదలైన ఐర్లాండ్ పతనం వేగంగా సాగింది. పవర్ప్లేలో 26 పరుగులు రాగా, వాటిలో 9 ఎక్స్ట్రాలే ఉన్నాయి. పాండ్యా తన తొలి రెండు ఓవర్లలో టకర్ (10), కాంఫర్ (12)లను వెనక్కి పంపించగా, టెక్టర్ (4)ను బుమ్రా అవుట్ చేశాడు. సిరాజ్ ఖాతాలో డాక్రెల్ (3) వికెట్ చేరడంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ 49/6 వద్ద నిలిచింది. అక్షర్ పటేల్ కూడా తన తొలి ఓవర్లో మెక్కార్తీ (0) పని పట్టగా, బుమ్రా బౌలింగ్లో లిటిల్ (14) బౌల్డయ్యాడు. అయితే చివర్లో డెలానీ కొన్ని పరుగులు జోడించగలిగాడు. అర్‡్షదీప్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను అదే ఓవర్ చివరి బంతికి రనౌట్ కావడంతో ఐర్లాండ్ ఆట ముగిసింది. ఆకట్టుకున్న పంత్... ఓపెనర్గా వచి్చన విరాట్ కోహ్లి (1) ప్రభావం చూపలేకపోగా, మరోవైపు రోహిత్ ధాటిగా ఆడాడు. మూడో స్థానంలో బరిలోకి దిగిన పంత్ కూడా అదే తరహాలో వేగంగా బ్యాటింగ్ చేశాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 39 పరుగులకు చేరింది. లిటిల్ ఓవర్లో రెండు వరుస సిక్స్లతో జోరు పెంచిన రోహిత్ 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అంతకుముందు లిటిల్ వేసిన ఓవర్లో బంతి భుజానికి బలం తగిలిన కారణంగా నొప్పితో మైదానం వీడాడు. 21 పరుగులు చేయాల్సిన స్థితిలో బ్యాటింగ్కు వచి్చన సూర్యకుమార్ (2) విఫలమైనా... మెక్కార్తీ బౌలింగ్లో రివర్స్ స్కూప్ సిక్సర్తో పంత్ మ్యాచ్ ముగించాడు. ఇటీవలే ఐపీఎల్లో ఆడిన పంత్కు ఏడాదిన్నర తర్వాత ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. స్కోరు వివరాలు ఐర్లాండ్ ఇన్నింగ్స్: బల్బర్నీ (బి) అర్‡్షదీప్ 5; స్టిర్లింగ్ (సి) పంత్ (బి) అర్‡్షదీప్ 2; టకర్ (బి) పాండ్యా 10; టెక్టర్ (సి) కోహ్లి (బి) బుమ్రా 4; కాంఫర్ (సి) పంత్ (బి) పాండ్యా 12; డాక్రెల్ (సి) బుమ్రా (బి) సిరాజ్ 3; డెలానీ (రనౌట్) 26; అడెయిర్ (సి) దూబే (బి) పాండ్యా 3; మెక్కార్తీ (సి అండ్ బి) అక్షర్ 0; లిటిల్ (బి) బుమ్రా 14; వైట్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 15; మొత్తం (16 ఓవర్లలో ఆలౌట్) 96. వికెట్ల పతనం: 1–7, 2–9, 3–28, 4–36, 5–44, 6–46, 7–49, 8–50, 9–77, 10–96. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–35–2, సిరాజ్ 3–0–13–1, బుమ్రా 3–1–6–2, పాండ్యా 4–1–27–3, అక్షర్ పటేల్ 1–0–3–1, జడేజా 1–0–7–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (రిటైర్డ్హర్ట్) 52; కోహ్లి (సి) వైట్ (బి) అడెయిర్ 1; పంత్ (నాటౌట్) 36; సూర్యకుమార్ (సి) డాక్రెల్ (బి) వైట్ 2; దూబే (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (12.2 ఓవర్లలో 2 వికెట్లకు) 97. వికెట్ల పతనం: 1–22, 2–91. బౌలింగ్: అడెయిర్ 4–0–27–1, లిటిల్ 4–0–42–0 మెక్కార్తీ 2.2–0–8–0, కాంఫర్ 1–0–4–0, వైట్ 1–0–6–1. 600: 600 రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ టెస్టుల్లో 84, వన్డేల్లో 323, టి20ల్లో 193 సిక్స్లు బాదాడు. 4000: రోహిత్ అంతర్జాతీయ టి20ల్లో 4 వేల పరుగులు (4026) దాటాడు. కోహ్లి (4038), బాబర్ (4023) తర్వాత ఈ మైలురాయిని చేరిన మూడో ఆటగాడిగా నిలిచాడు.
HYD: కుండపోత వానతో ట్రాఫిక్ నరకం
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్ను కుండపోత వాన ముంచెత్తింది. దీంతో ట్రాఫిక్ నరకం చవిచూశారు వాహనదారులు. రెండు మూడు గంటలుగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయిన దృశ్యాలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. Heavy Rain now in Hitech City⛈️⚡️#HyderabadRains pic.twitter.com/98g0kor8Vo— Hyderabad Rains (@Hyderabadrains) June 5, 2024బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. కూకట్పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అంబర్పేట్, నాచారం, తార్నాక, కొండాపూర్, గచ్చిబౌలి, అఫ్జల్గంజ్, కోఠి తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. Hyderabad Rain 🤝 Hyderabad Traffic @balaji25_t #hyderabad #rain pic.twitter.com/G9r7otsxx9— Shivang🫡 (@theshivangahuja) June 5, 2024నగరం మీదుగా దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. పని వేళలు ముగిసి ఇంటికి వెళ్లే టైం కావడంతో ట్రాఫిక్రద్దీ నెలకొంది. మాదాపూర్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ నెమ్మదిగా ముందుకు కదిలింది. సికింద్రాబాద్, ప్యారడైజ్, బేగంపేట ఏరియాల్లో రెండు మూడు గంటలుగా ట్రాఫిక్లోనే చిక్కుకుపోయారు వాహనదారులు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలను పలువురు పోస్ట్ చేస్తున్నారు. నగరంలో వాన.. ట్రాఫిక్ నరకం: ఫొటోల కోసం క్లిక్ చేయండిThey are IT employees but when on road behaves like mindless without any road sense See how they occupied the other side of road within #raheja #hyderabad #hyderabadrains #telangana @CoreenaSuares2 @HiHyderabad @balaji25_t @Team_Road_Squad @swachhhyd pic.twitter.com/ZhCRD3DGoj— TGCitizen (@Citizen_TS) June 5, 2024#HYDTPinfoCommuters it's #Raining. Please #Drive carefully.#Mansoon #HyderabadRains pic.twitter.com/PVlStUmyqV— Hyderabad Traffic Police (@HYDTP) June 5, 2024#HYDTPinfoCommuters it's #Raining. Please #Drive carefully.#Mansoon #HyderabadRains pic.twitter.com/PVlStUmyqV— Hyderabad Traffic Police (@HYDTP) June 5, 2024
గెలుపు, ఓటములు సహజం.. నంబర్స్ గేమ్ కొనసాగుతుంది: మోదీ
లోక్సభ ఎన్నికల ఫలితాలతో కేంద్రంలో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్. అయితే గత రెండు పర్యాయాల్లోనూ (2014, 2019) సొంతంగా మెజార్టీ సాధించిన కాషాయ పార్టీ.. ఈసారి మెజార్టీ(272) కంటే తక్కువ స్థానాలకే పరిమితమైంది. కేవలం 240 సీట్లను గెలుచుకున్న బీజేపీ.. ఎన్డీయే కూటమి మిత్రపక్షాల సాయంతో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో బుధవారం మోదీ 2.0లో చివరి కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనని అన్నారు. అయితే నంబర్స్ గేమ్ మాత్రం కొనసాగుతుందని పేర్కొన్నారు. ‘గత పదేళ్లలో ఎన్నో మంచి పనులు చేశాం. అదే మంచిని ఇక ముందు కూడా కొనసాగిస్తాం. గెలుపు, ఓటములు రాజీకీయాల్లో భాగం నంబర్స్ గేమ్ కొనసాగుతుంది’ అని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్లోని మంత్రుల పనితనాన్ని మొచ్చుకున్నారు. పదేళ్లుగా ఎంతో కష్టపడి పనిచేసినందుకు, తమ విలువైన సేవలను అందించి ప్రభుత్వానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశం అనంతరం ప్రధాని పదవికి రాజీనామా సమర్పించేందుకు రాష్ట్రపతి భవన్కు మోదీ బయలుదేరారు. మోదీ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. అలాగే కొత్త ప్రభుత్వం కొలువు దీరేవరకు వరకు కొనసాగవలసిందిగా మోదీ, మంత్రిమండలిని కోరినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం మూడోసారి ప్రధానిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
చివరికి అబద్ధానిదే పైచేయి.. అసలేం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు సర్వత్రా నివ్వరపోయేలా చేశాయి. ఎవరూ ఊహించని విధంగా వచ్చిన ఈ రిజల్ట్స్ తో సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ షాక్కు గురి అవుతుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు సంబరపడతాయి. వీరి కూటమి సఫలం అయింది. ఒంటరిగానే గెలవగలనన్న ధీమాతో ఉన్న వైఎస్సార్సీపీకి గట్టి దెబ్బ తగిలింది. గతసారికి భిన్నంగా సామాజిక సమీకరణలు మారిపోవడం కూడా వైఎస్సార్సీపీకి నష్టం చేసింది. పాలనాపరంగా ముఖ్యమంత్రిగా జగన్ చేసిన తప్పు ఏమిటా అని ఆలోచిస్తే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమా? అన్న ప్రశ్న వస్తుంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి తేనన్ని సంస్కరణలు, వ్యవస్థలు జగన్ తెచ్చారు. ఎవరూ అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలు ఈయన చేపట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓడరేవులు, మెడికల్ కాలేజీలు మొదలైనవాటిని అభివృద్ది చేస్తున్నారు. అంతదాకా ఎందుకు! దశాబ్దాల తరబడి కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న వారికోసం ఉద్దానం వద్ద ఒక పెద్ద ఆస్పత్రిని, పరిశోధన కేంద్రాన్ని,నీటి పధకాన్ని తీసుకు వస్తే అక్కడ కూడా వైఎస్సార్సీపీ ఓడిపోయింది. రామాయం పట్నం వద్ద ఓడరేవు నిర్మాణం జరుగుతుంటే,ఆ ప్రాంతంలో కూడా వైఎస్సార్సీపీ ఓటమి చెందింది. మచిలీపట్నంలో ఓడరేవు, వైద్య కళాశాల ఏర్పాటు అవుతుంటే అక్కడా ఓటమి ఎదురైంది. విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని అవుతుందని ప్రకటించినా, అక్కడ పలు అభివృద్ది పనులు నిర్వహించినా జనం పట్టించుకోలేదు. కర్నూలు లో పలు లీగల్ ఆఫీస్ లు ఏర్పాటు చేసినా జనం ఓట్లు వేయలేదు. వైఎస్సార్సీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో దారుణ పరాజయం వచ్చింది. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలందరికి ఇళ్ల వద్దకే సేవలు అందిస్తుంటే, ఎంతో సంతోషపడ్డారు. వృద్దులకు చెప్పినట్లు పెన్షన్ మూడువేల రూపాయల చేశారు. అయినా జగన్ ప్రభుత్వం ఓడిపోయింది.చేయూత పేరుతో లక్షల మంది 18750 రూపాయల చొప్పున ఆర్ధిక సాయం చేస్తే వైఎస్సార్సీపీకి కేవలం నలభై శాతం ఓట్లతో అంత తక్కువ సీట్లు రావడమా! చివరికి ప్రతిపక్ష హోదా దక్కకపోవడమా!వినడానికే విడ్డూరంగా ఉంది. అయినా చేదు వాస్తవం భరించకతప్పదు. పార్టీ పరంగా జగన్ ఆత్మవిశ్లేషణ చేసుకోవచ్చు. ఎక్కడ తప్పు జరిగిందన్నది గమనించి, మళ్లీ పార్టీకి ఉత్తేజం తేవలసి ఉంది.కొందరు అభిమానులు ఈ ఓటమి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు, గుండెపోటుకు గురై మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. క్లిష్ట సమయాలలోనే ఎవరైనా ధైర్యంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని మనవి. ఎందుకింత ఘోర పరాజయం అని ఆలోచిస్తే కొన్ని కారణాలు కనిపిస్తాయి. జగన్ పేదలకు, బలహీనవర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. వారి అభ్యున్నతికి తోడ్పడ్డారు. వారు ఆర్ధికంగా మెరుగు అవ్వాలని ఆశించారు. రకరకాల స్కీములను అమలు చేశారు. అమ్మ ఓడి అనే కొత్త స్కీము తెచ్చి, బలహీనవర్గాల పిల్లలు ప్రభుత్వ బడులలో విద్య కొనసాగించేలా చేశారు. వారికి ఆంగ్ల మీడియం అందుబాటులోకి తెచ్చారు.ఐబి వంటి సిలబస్ ను తీసుకురావాలని తలపెట్టారు. ఇలా వివిధ కార్యక్రమాలను బలహీనవర్గాలకు అమలు చేయడం అగ్రవర్ణాలలోని కొందరికి అంతగా నచ్చలేదు. ఎస్సి,ఎస్టి, బిసి ,మైనార్టీలకే అన్నీ చేస్తున్నారన్న అపోహ ఏర్పడింది. దీంతో సమాజంలో వైరుద్యాలు పెరిగినట్లయింది. ఫలితంగా ఈ అగ్రవర్ణాలకు చెందిన వారిలో పలువురు కూటమి వైపు మొగ్గు చూపారన్న అభిప్రాయం కలుగుతుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చేమో! తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఎస్సి వర్గాల కోసం దళిత బంధు స్కీమును తెచ్చి ఒక్కో కుటుంబానికి పది లక్షల సాయం చేయాలని సంకల్పించారు. అది తెలంగాణ సమాజంలో ప్రత్యేకించి గ్రామాలలో వివిధ వర్గాల మధ్య వైరుధ్యాలకు దారి తీసింది. దాంతో ఇతర వర్గాలు దూరం అయ్యయని చెబుతారు. అంతేకాక ఎస్సిలలో కూడా లబ్ది పొందినవారిని చూసి, తమకు ఎందుకు రాలేదన్న అసంతృప్తి మరికొందరికి ఏర్పడింది. తత్ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో బిఆర్ఎస్ ఓటమికి దారితీసిందన్న విశ్లేషణ ఉంది. అలాగే జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్దితో నిమ్మవర్గాలకు మేలు చేయాలని అనుకున్నారు. ప్రత్యేకించి బిసిలకు ఆయా స్కీములతో పాటు రాజకీయంగా ఇతోధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇది కూడా రాజకీయంగా జగన్ కు నష్టం చేసిందా అన్న అభిప్రాయం వస్తోంది. అటు అగ్రవర్ణాలలో అసంతృప్తి ఉంటే, మరో వైపు బలహీనవర్గాల వారు పూర్తిగా ఓన్ చేసుకున్నారా? లేదా?అన్న సందేహం వస్తుంది. ఎందుకంటే వారిలో పలువురు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ లోని కొన్ని అంశాలకు ప్రభావితం అయినట్లు సమాచారం వస్తోంది.పెన్షన్ నాలుగు వేలు చేస్తామని అనడం, తల్లికి వందనం పేరుతో బడికి వెళ్లే పిల్లలు ఎంత మంది ఉంటే అంతమందికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పడం,మహిళలకు నెలకు 1500 చొప్పున ఇవ్వచూపడం,మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, బిసిలకు ఏభైఏళ్లు దాటితో పెన్షన్ హామీ మొదలైనవాటికి కొంత శాతం బలహీనవర్గాలు అట్రాక్ట్ అయ్యారని చెబుతున్నారు. ఈ రకంగా రెండువైపులా నష్టం జరిగి ఉండవచ్చు. పేదలు vs పెత్తందార్ల నినాదం ఫలించలేదని అనుకోవాలి. వలంటీర్ల వ్యవస్థ వల్ల లాభం జరిగిందా? నష్టం జరిగిందా? అన్నది చర్చనీయాంశంగా ఉంది. వీరివల్ల పార్టీ స్థానిక నేతలకు, క్యాడర్కు ప్రాధాన్యత తగ్గిపోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ వ్యవస్థ ప్రజలకు బాగా మేలు చేసిన అంశం. ఎవరికి ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అందించారు. గ్రామ, వార్డు సచివాలయాలు పెట్టడం ద్వారా ప్రజలకు పరిపాలనను బాగా దగ్గర చేశారు. అయినా జనం ఎందుకు ఓట్లు వేయలేదో అర్ధం కావడం లేదు. ప్రభుత్వపరంగా ఆర్ధిక ఇబ్బందులు ఉండడం వల్ల పార్టీ నేతలు చేపట్టిన వివిధ నిర్మాణాలకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో క్యాడర్ కొంత ఇబ్బంది పడిందని చెబుతారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినా, ఇరవై లక్షల మందికి ఇళ్లు కట్టిస్తున్నా, ప్రయోజనం కనిపించలేదు. మద్యం విధానం వల్ల ప్రభుత్వానికి కొంత నష్టం జరిగిందన్నది మరికొందరి భావన. మానిఫెస్టోలోని హామీలను దాదాపు అన్నిటిని అమలు చేసిన నేతగా, అందువల్లే ఓడిన నేతగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు. నేరుగా సుమారు మూడు లక్షల కోట్ల మేర నగదును పేదలకు బదిలీ చేయడం రాజకీయంగా జగన్కు పెద్దగా కలిసివచ్చినట్లు లేదు. పైగా కొన్ని వర్గాలు వ్యతిరేకించాయి. చంద్రబాబు ఇంకా ఎక్కువ హామీలు, ఏడాదికి లక్షన్నర కోట్లు ఖర్చుచేస్తానని సూపర్ సిక్స్ ప్రకటించారు కదా అని అంటే, ఆయన చేసినప్పుడు కదా! అని కొందరు భావించారు. పేదలేమో ఆ స్కీములకు కొంత ఆకర్షితులైతే, మధ్యతరగతి,ధనికవర్గాలేమో అవేవి చేయలేరులే అని అనుకున్నారు. జగన్ మాదిరి చంద్రబాబు మాటకు కట్టుబడి ఉండరన్నది వారి నమ్మకం. అమరావతి రాజధాని విషయంలో కూడా సరిగా హాండిల్ చేయలేదన్న అభిప్రాయం ఏర్పడింది. జగన్ ప్రభుత్వంపై జరిగినంత అబద్దపు ప్రచారం, దుష్ఫ్రచారం బహుశా దేశంలో ఏ ప్రభుత్వంపై జరగలేదు. చివరికి అబద్దపు ప్రచారానిదే పై చేయి అయింది. లాండ్ టైటిలింగ్ యాక్ట్ తో భూములు లాగేసుకుంటారు అంటూ చేసిన అసత్య ప్రచారం కూడా బాగా డామేజీ చేసిందని అంటున్నారు. 1955 ఆంద్ర శాసనసభ ఎన్నికలలో కమ్యూనిస్టుపార్టీ విజయం సాధిస్తుందన్న భావన ఉండేదట. కాని అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. ఒక వర్గం మీడియా ఒక వదంతిని సృష్టించి ప్రజలను భయాందోళనలకు గురి చేసిందట.భూస్వాముల భార్యల మెడలపై కాడివేసి దున్నిస్తామని ఒక కమ్యూనిస్టు నాయకుడు అన్నట్లు చేసిన ప్రచారంతో సిపిఐ పదిహేను సీట్లకే పడిపోయి అధికారంలోకి రాలేకపోయింది.రాజకీయాలలో ఒక్కోసారి అబద్దాలు ఎంతగా ప్రభావితం చేస్తాయనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పాలి. కాగా తెలుగుదేశం పార్టీకి చెందినవారు కొందరు విజయం సాధించామన్న అత్యుత్సాహంతో కొన్ని చోట్ల దాడులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది మంచిది కాదు. ఎన్నికలు అయిపోయాక కూడా ఘర్షణ వాతావరణం కొనసాగిస్తే,అది సమాజానికి హానికరం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
రెండు సార్లు ప్రపంచకప్ గెలిచినా, ఇంగ్లండ్కు ఆ కల తీరడం లేదు..!
టీ20 వరల్డ్కప్ల్లో తమ ఖండానికి (యూరప్) చెందిన జట్లపై విజయం సాధించడం ఢిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్కు తీరని కలగా మిగిలిపోయింది. ఇంగ్లండ్ ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్ పోటీల్లో సొంత ఖండానికి చెందిన జట్లపై ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేకపోయింది. పొట్టి ప్రపంచకప్లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్.. సొంత ఖండానికి చెందిన జట్లైన నెదర్లాండ్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లను ఇప్పటివరకు నాలుగు సందర్భాల్లో ఎదుర్కొంది.ఇందులో మూడింట ఊహించని పరాజయాలు ఎదుర్కోగా.. ఓ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. 2009, 2014 ఎడిషన్లలో నెదర్లాండ్స్ చేతిలో పరాభావాలు ఎదుర్కొన్న ఇంగ్లండ్.. 2022 ఎడిషన్లో ఐర్లాండ్ చేతిలో చావుదెబ్బ తింది. తాజాగా జరుగుతున్న ప్రపంచకప్లో ఇంగ్లండ్ నిన్న సహచర యూరప్ జట్టైన స్కాట్లాండ్తో తలపడింది.ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ప్రపంచకప్లో సొంత ఖండానికి చెందిన జట్టుపై గెలవాలన్న ఇంగ్లండ్ కల కలగానే మిగిలిపోయింది. యూరోపియన్ దేశాల్లో టెస్ట్ హోదా కలిగిన ఎకైక దేశమైన ఇంగ్లండ్ సొంత ఖండ జట్లు, క్రికెట్ పసికూనలపై ఇప్పటివరకు ఒక్క విజయం సాధించలేకపోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.కాగా, టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఇంగ్లండ్- స్కాట్లాండ్ మధ్య నిన్న జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్కు ముందే వర్షం ప్రారంభం కావడంతో టాస్ ఆలస్యంగా పడింది. టాస్ గెలిచిన స్కాట్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ఈ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ రద్దయ్యే సమయానికి జార్జ్ మున్సే (41), మైఖేల్ జోన్స్ (45) క్రీజ్లో ఉన్నారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ అనుమానాలున్నాయ్: కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైఎస్ జగన్ పాలన చేశారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ గెలవాలని కష్టపడ్డ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.‘‘మంచి కంటే చెడు ఈజీగా ప్రచారం అవుతుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ని భూతంలా చూపించి దుష్ప్రచారం చేశారు. జగన్ మీ ఆస్తులు తాకట్టు పెట్టేస్తాడంటూ నమ్మించారు. ఇన్ని లక్షలమందికి అన్ని హక్కులతో స్థలాలు ఇచ్చిన జగన్.. మీ ఆస్తులు ఎందుకు లాక్కుంటారు?. ప్రజలు, రైతులకు మంచి జరగాలని తపన పడ్డ మనిషి వైఎస్ జగన్. ఈవీఎంలపై రాష్ట్రమంతటా చర్చలు జరుగుతున్నాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని మాకు అనుమానం ఉంది’’ అని కారుమూరి చెప్పారు.భీమవరంలో ఈవీఎంలను ప్రైవేట్ కారులో తరలిస్తుంటే పట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఒక నియోజకవర్గంలో లక్ష ఎనభై వేల ఓట్లు పొలైతే ముప్పై వేలు అధికంగా కనబడ్డాయి. ఈవీఎంలు ఏదో తేడా జరిగిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం’’ అని కారుమూరి పేర్కొన్నారు.
తప్పక చదవండి
- బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ..: సీఎం రేవంత్రెడ్డి
- T20 World Cup 2024: హార్దిక్ సూపర్ డెలివరీ.. వైరల్ వీడియో
- శంషాబాద్: ఎయిరిండియా ప్రయాణికుల ఆందోళన
- T20 World Cup 2024: సెమీస్కు చేరేది ఆ నాలుగు జట్లే.. ఆసీస్కు నో ఛాన్స్..?
- ఓటీటీకి వచ్చేస్తోన్న తమన్నా హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- గుజరాత్లో రూ. 130 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- మోదీ 3.0 కేంద్ర కేబినెట్.. ఏపీ ఆశావహులు వీళ్లే!
- ఐపీఎల్ ఫామ్ను కొనసాగించిన రుతురాజ్.. మెరుపు ఇన్నింగ్స్తో విజృంభణ
- 'బలగం' మొగిలయ్యకు అస్వస్థత.. సాయం కోసం ఎదురుచూపు
- ఏపీ శాసనసభ రద్దు
సినిమా
మోదీకి శుభాకాంక్షలు తెలిపిన మహేశ్ బాబు
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. మరోసారి మోదీ ప్రధానిగా కోనసాగనున్నారు. ఈ నేపథ్యంలో మోదీకి టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. 'మా ప్రధానమంత్రిగా మరోసారి అఖండ విజయాన్ని అందుకున్న మోదీ సార్కు శుభాకాంక్షలు. బలమైన, ప్రకాశవంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో మీరు ఈ విజయాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను.' అని తన ఎక్స్ పేజీలో తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమితో గెలుపొందిన చంద్రబాబుకు కూడా మహేశ్ శుభాకాంక్షలు తెలిపారు. 'ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాబోతున్న చంద్రబాబు గారికి నా శుభాకాంక్షలు. మీరు APకి అభివృద్ధి కోసం శ్రేయస్సుతో నిండిన విజయవంతమైన పాలన అందిస్తారని, రాష్ట్ర అభివృద్ధి సాధిస్తారని కోరుకుంటున్నాను.' అని మహేశ్ అన్నారు.ఇదే కమ్రంలో ఎన్నికల్లో విజయం సాధించిన పవన్ కల్యాణ్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 'ప్రజలు మీపై ఉంచిన నమ్మకం,విశ్వాసానికి మీ విజయం ప్రతిబింబం. మా ప్రజల కలలను సాకారం చేయడంలో మీ పూర్తి పదవీకాలంతో పూర్తి చేస్తారని కోరుకుంటున్నాను.' అని ఆయన ట్వీట్ చేశారు. Congratulations @narendramodi Sir on your resounding victory as our Prime Minister! Wishing you continued success in building a stronger and brighter India.— Mahesh Babu (@urstrulyMahesh) June 5, 2024
ట్రెండ్ మారింది.. పెళ్లయిన హీరోయిన్స్ బిజీ అయ్యారు: కాజల్
‘పెళ్లయ్యాక ఒక హీరోయిన్ కెరీర్ ఎందుకు మారాలో అర్థం కాదు. అందరికీ పర్సనల్ లైఫ్ ఉంది. అలాగే హీరోయిన్స్కి కూడా. గతంలో పెళ్లయ్యాక హీరోయిన్స్ కు అవకాశాలు తగ్గుయోమో..ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లయ్యాక ఎంతోమంది హీరోయిన్స్ అంతకముందు కంటే బిజీగా సినిమాలు చేస్తున్నారు’అన్నారు కాజల్ అగర్వాల్. ఆమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సత్యభామ’. నవీన్ చంద్ర కీలక పాత్రను పోషించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కాజల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ నేను ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశాను గానీ సత్యభామ సినిమా లాంటి ఎమోషనల్ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా చేశాను. ఈ చిత్రంలో నటిస్తుంటే ఇప్పటిదాకా ఫీల్ కాని కొన్ని ఎమోషన్స్ అనుభూతిచెందాను. అవన్నీ మీకూ రియలిస్టిక్ గా అనిపిస్తాయి.⇢ నన్ను చాలాకాలం టాలీవుడ్ చందమామ అని పిలిచేవారు. ఇప్పుడు సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. నాకు రెండూ కావాలి. చందమామ బ్యూటిఫుల్ నేమ్, సత్యభామ పవర్ ఫుల్ నేమ్. నాకు రెండూ ఇష్టమే. ఈ కథ చెప్పినప్పుడు ఇన్ స్టంట్ గా ఓకే చెప్పాను. అంతలా నచ్చిందీ స్టోరి.⇢ శశికిరణ్ మంచి డైరెక్టర్. ఆయన సినిమాలు చూశాను. ఈ సినిమాకు డైరెక్షన్ ఎందుకు చేయడం లేదని శశిని అడిగాను. ఆయన తను ఈ మూవీకి స్క్రీన్ ప్లే ఇస్తూ ప్రెజెంటర్ గా ఉంటున్నానని చెప్పారు. మనం ఎప్పుడూ ఒకే పనిచేయనక్కర్లేదు. డిఫరెంట్ జాబ్స్ ఎక్స్ ప్లోర్ చేయాలి. శశి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించా. ఆయన ఈ ప్రాజెక్ట్ ను అన్ని విధాలా బాగా వచ్చేలా చూసుకున్నారు.⇢ దర్శకుడు సుమన్ చిక్కాల ఫస్ట్ టైమ్ డైరెక్షన్ చేస్తున్నా..ఎంతో కన్విక్షన్ తో వర్క్ చేశారు. ఆయనకు చాలా క్లారిటీ ఉంది. తను అనుకున్న స్క్రిప్ట్ అనుకున్నట్లు రూపొందించాడు. సుమన్ చిక్కాలతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మా ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్లైనా తమ ఫస్ట్ మూవీని ఓ బేబిని చూసుకున్నట్లు చూసుకున్నారు. ప్రతి రోజూ సెట్ లో ఉంటూ అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేవారు. తొలి సినిమాను ఎంతో జాగ్రత్తగా ప్రొడ్యూస్ చేశారు.⇢ గతంలో జిల్లా సినిమాలో పోలీస్ గెటప్ లో కనిపించా. అయితే అది సీరియస్ నెస్ ఉన్న రోల్ కాదు. సత్యభామలో మాత్రం ఎమోషన్, యాక్షన్ ఉన్న పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తా. పోలీస్ రోల్స్ గతంలో ఎంతోమంది హీరోయిన్స్ చేసి ఉంటారు. కానీ ఇది నాకు కొత్త. నా తరహాలో పర్ ఫార్మ్ చేశాను. మీకు నచ్చుతుందనే ఆశిస్తున్నా.⇢ సత్యభామలో యాక్షన్ సీక్వెన్సుల కోసం ఎంతో కష్టపడ్డా. ఆ ఫైట్స్ అన్నీ రియలిస్టిక్ గా ఉంటాయి. నేను రామ్ చరణ్ లా వంద మందిని కొడితే ప్రేక్షకులు నమ్మరు. నా ఇమేజ్ కు ప్రేక్షకులు ఇష్టపడేలా స్టంట్స్ ఉంటాయి. సుబ్బు యాక్షన్ సీక్వెన్సులు కొరియోగ్రాఫ్ చేశారు.⇢ యూత్, బెట్టింగ్ తో పాటు ఓ రిలీజియన్ గురించి సత్యభామలో కీ పాయింట్స్ ఉంటాయి. అయితే ఏ మతానికి పాజిటివ్ గా నెగిటివ్ గా ఏదీ చెప్పడం లేదు. జస్ట్ ఆ అంశం కథలో ఉంటుంది అంతే. మీరు ట్రైలర్ చూసిన దాని కంటే ఎన్నో ట్విస్ట్ లు, టర్న్స్ మూవీలో ఉంటాయి. అవన్నీ మూవీలో చూసి మీ రెస్పాన్స్ కు చెబుతారని కోరుకుంటున్నా.⇢ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల తన బెస్ట్ ఎఫర్ట్స్ సత్యభామ కోసం పెట్టాడు. మా ఇద్దరికీ రాక్ మ్యూజిక్ అంటే ఇష్టం. మేము ఆ పాటల గురించి, మ్యూజిక్ గురించి మాట్లాడుకునేవాళ్లం.⇢ నేను నా వ్యక్తిగతమైన లైఫ్ ను కెరీర్ ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఇది కష్టమైన పనే. కానీ నటన అంటే ప్యాషన్ కాబట్టి కష్టమైన ఇష్టంగా చేసుకుంటూ వస్తున్నా. ఈ జర్నీలో మా వారి సపోర్ట్, నా ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఉంది. సౌత్ లో నాతో పాటు సమంత, రాశీ ఖన్నా మా ఆయనకు ఫేవరేట్ హీరోయిన్స్.⇢ భారతీయుడు 2 సినిమా రిలీజ్ కోసం ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నా. భారతీయుడు 3లో నా క్యారెక్టర్ ఉంటుంది. ఈ సినిమాలో నేను చాలా కొత్తగా డిఫరెంట్ రోల్ లో కనిపిస్తా.⇢ వైవిధ్యమైన మూవీస్ చేస్తూ నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. కొత్త దర్శకులతోనూ పనిచేస్తా. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. ఏ రంగంలోనైనా కొత్త వారిని ఎంకరేజ్ చేయాలి. ప్రస్తుతం రెండు కొత్త సినిమాలు సైన్ చేశా. వాటి డీటెయిల్స్ ప్రొడక్షన్ కంపెనీస్ అనౌన్స్ చేస్తాయి.
హేమ సభ్యత్వం రద్దు చేసే యోచనలో ‘మా’?
మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ నటి హేమ మా సభ్యత్వం సస్పెండ్ చేయడానికి అభిప్రాయాలను కోరినట్లు తెలుస్తోంది. మా అసోసియేషన్ గ్రూప్లో మంచు విష్ణు ఇప్పటికే సందేశం పంపించారు. ఆమె సభ్యత్వం సస్పెండ్కు సంబంధించిన సభ్యుల అభిప్రాయాలు సేకరించారు. అయితే హేమను సస్పెండ్ చేయాల్సిందిగా సభ్యులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. దీంతో హేమకు క్లీన్ చిట్ వచ్చేంతవరకు సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ క్లీన్ చిట్ రాకపోతే మాత్రం శాశ్వతంగా రద్దు చేసే ఆస్కారం లేకపోలేదు. మా నిర్ణయం ఏంటన్నది రేపు మధ్యాహ్నం అధికారికంగా అధ్యక్షుడు మంచు విష్ణు వెల్లడించనున్నారు. కాగా.. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ దొరికిపోయారు. వైద్య పరీక్షల్లోనూ ఆమెకు పాజిటివ్గా తేలింది. ఇటీవలే ఆమెను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు రిమాండ్కు తరలించారు.
అందుకే బోల్డ్ సీన్స్ పెట్టాను : ‘లవ్ మౌళి’ దర్శకుడు
‘సాధారణంగా ఒక కథ రాస్తున్నప్పుడు ఒకరిని ఊహించుకుంటాం. కానీ లవ్మౌళి కథ రాస్తున్నప్పుడు అలా ఊహించుకోలేదు. ఒక నవలలా రాసేశాను. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరినీ ఈ కథకి ఊహించుకుంటూ వచ్చా. అయితే ఆ ఫొటోలలో అప్పుడు నవదీప్ ఫొటో లేదు. అప్పుడు నవదీప్ కూడా అంత యాక్టివ్గా సినిమాలు చేయడం లేదు. ఓసారి నాకెందుకో నవదీప్ అయితే అనే ఆలోచన వచ్చింది. నా ఆలోచనలన్నీ అతనిపై పెట్టి.. ఆ తర్వాత వెళ్లి కథ చెప్పా. కథ వినగానే ఎగిరి గంతేశాడు’అని అన్నాడు డైరెక్టర్ అవనీంద్ర. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘లవ్ మౌళి’. నవదీప్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్తో కలిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్కి అడ్డాగా మారిన సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జూన్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అవనీంద్ర మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ఈ కథ అనుకున్నప్పుడు నేను ‘ఆర్ఆర్ఆర్’ రైటింగ్లో ఉన్నాను. నేను ఆ సినిమాకు అసోసియేట్ రైటర్ని. అప్పుడే మా టీమ్ అంతా నువ్వు డైరెక్ట్ చేసే సమయం ఆసన్నమైందంటూ ప్రోత్సహించారు. అయితే నేను కమర్షియల్ కథలు ఎన్నో అప్పటికే రాసేశాను. ఏ కథ రాస్తే బాగుంటుందా? అని ఆలోచిస్తూ కొత్తగా ఏదైనా ప్రేక్షకులకు రిఫ్రెష్ అనిపించేలా ఉండాలని అనుకున్నాను. ఒకవైపు ఆర్ఆర్ఆర్ రాస్తున్నప్పుడే పేరలల్గా ఈ పాయింట్ అనుకున్నాను. ఆర్ఆర్ఆర్తో పాటు అప్పటికే ఓకే చేసిన కథలన్నీ పూర్తి చేసి ఈ కథపై కూర్చున్నా.→ ఈ కథలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కొంతమంది లొకేషన్స్, కొంతమంది హీరోయిన్ క్యారెక్టరైజేషన్.. ఇలా ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.→ ఇది నా ఫస్ట్ సినిమా. నిజాయితీగా ఓ మంచి కథను చెప్పాలని నిర్ణయం తీసుకున్నా. రిజల్ట్ తో సంబంధం లేదు.. 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నా.. ఫస్ట్ సినిమా నిజాయితీగా చేశానని చెప్పుకోవడానికి ఉంటుందని అనుకున్నా.→ ఈ సినిమాలో హీరోకి లో దుస్తుల్లో మందు తాగే సీన్ ఉంటుంది. లో దుస్తులని పబ్లిగ్గా ఆరేయడానికి సంకోచించే మైండ్ మనది. నాకున్న స్క్రీన్ప్లే టైమ్ని దృష్టిలో పెట్టుకుని.. హీరో క్యారెక్టర్ ఇదని చెప్పడం కోసమే.. హీరో ఇన్నర్ దుస్తుల్లో మందు తాగడం చూపించడం జరిగింది. ఇందులో హీరోకి ఎటువంటి సెన్సిబిలిటీస్ ఉండవు. నిజంగా అలాంటి సీన్ డిస్టర్బ్గా అనిపిస్తే సెన్సార్ వాళ్లు చూసుకుంటారు. వైజాగ్లో షోకి 50 శాతం అమ్మాయిలే వచ్చారు. ఎవరూ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. పోస్టర్లో అలా అనిపిస్తుంది కానీ.. సినిమా చూశాక అందరికీ ఆ సీన్ అర్థమవుతుంది. 18ప్లస్కి అవసరమైన కథ ఇది.→ ఇది ఫాంటసీ బేస్ స్టోరీ.. ఒక ఆర్టిస్ట్ తన కాన్వాస్ మీద ఊహా చిత్రం వేస్తే.. అందులో నుంచి ఆ అమ్మాయి బయటికి వచ్చేస్తుంది. అందుకే కొత్త హీరోయిన్లని తీసుకోవడం జరిగింది. ఆడియన్స్ కూడా నిజంగానే వచ్చేసిందనే ఫీల్ పొందాలి. ఒకవేళ తెలిసిన హీరోయిన్ అయితే.. ఆడియన్ ఆ ఫీల్ పొందలేరు. అందుకే కొత్తవాళ్లని తీసుకున్నాం.→ రిలేషన్లో ఒక జంట రెండు సంవత్సరాలు హ్యాపీగా ఉన్న తర్వాత.. వారిద్దరి మధ్య ఎందుకు అంత ప్రేమ ఉండటం లేదు. ఎందుకు ఆ రిలేషన్ బ్రేక్ అవుతుంది అన్నప్పుడు నాకో ఆలోచన వచ్చింది. ఈ పాయింట్ అందరికీ నచ్చుతుందని లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కించాను. లస్ట్ కోసం కాదు లవ్ కోసం చేసిన సినిమా ఇది.→ నా దృష్టిలో ప్రేమంటే నాకు నచ్చినట్టు ఉండమనడం కాదు.. నాకు నచ్చకపోయినా.. నిన్ను నీలా ఉండనీయడం ప్రేమ. అదే ఈ సినిమా ద్వారా చెప్పాను.→ విజయేంద్ర ప్రసాద్గారికి ఈ కథ చెప్పినప్పుడు బూతులు తిట్టారు. ఎందుకురా నీకు ఇది. కమర్షియల్గా వెళ్లకపోయావ్ అని అన్నారు. మా ఇద్దరి మధ్య తండ్రీ కొడుకుల అనుబంధం ఉంటుంది. నన్ను ఆయనకి దత్తపుత్రుడు అనే వారు. అంత చనువు ఉంది ఆయన దగ్గర. నా దృష్టిలో ఇది కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమాలు రాసిన అలవాటుతో ఈ కథ రాశాను. షూటింగ్ అయిన తర్వాత ఒక వీడియో ప్రసాద్గారికి చూపించాను. కీరవాణిగారికి చూపించాను.. ఆశ్చర్యపోయారు.→ ఇందులో బోల్డ్ డైలాగ్స్, లిప్ లాక్స్ బోలెడన్నీ ఉంటాయి. అవన్నీ కావాలని పెట్టినవి కాదు. కథకు అవసరమై పెట్టినవే. కమర్షియల్ మీటర్ తెలిసిన వాడిని కాబట్టి.. కథ రాసుకుంటున్నప్పుడు ఈ కథతో ఆడియన్స్ని రంజింపచేయడానికి అవసరమైన వన్నీ చేర్చడం జరిగింది. కరోనా తర్వాత జనాలు ప్రపంచ సినిమాను చూస్తున్నాను. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకా ఐటమ్ సాంగ్స్ దగ్గరే ఉంది. ఈ కథకి అన్ని అలా కుదిరాయ్.→ ప్రేమతో ప్రశాంతంగా లవ్ మూడ్లో కూర్చున్న శివుడిని మౌళి అంటారు. ఈ సినిమాకు ఆ పేరు పెట్టడానికి కూడా ఓ కారణం ఉంది. అది సినిమా చూసిన తర్వాత అందరికీ తెలుస్తుంది. ఈ స్టోరీకి చాలా ప్రత్యేకత ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ స్టోరీని మార్చడానికి ఏం ఉండదు.
ఫొటోలు
క్రీడలు
T20 World Cup 2024: రాణించిన హార్దిక్, రోహిత్.. ఐర్లాండ్ను చిత్తు చేసిన టీమిండియా
టీ20 వరల్డ్కప్ 2024లో టీమిండియా విజయంతో బోణీ కొట్టింది. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఐర్లాండ్ను 96 పరుగులకే కట్టడి చేయగా.. ఛేదనలో రోహిత్ (52 రిటైర్డ్ హర్ట్), పంత్ (36 నాటౌట్) సత్తా చాటి టీమిండియాను గెలిపించారు.వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్ 16 ఓవర్లలో ఐర్లాండ్ను 96 పరుగులకు ఆలౌట్ చేసింది. హార్దిక్ పాండ్యా (4-1-27-3), అర్ష్దీప్ సింగ్ (4-0-35-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్ పటేల్ (1-0-3-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు.ఐర్లాండ్ ఇన్నింగ్స్లో లోర్గాన్ టక్కర్ (10), కర్టిస్ క్యాంపర్ (12), గెరాత్ డెలానీ (26), జాషువ లిటిల్ (14) రెండంకెల స్కోర్ చేయగా.. ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), హ్యారీ టెక్టార్ (4), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అదైర్ (3), బ్యారీ మెక్ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. ఆదిలోనే ఓపెనర్ విరాట్ కోహ్లి వికెట్ కోల్పోయింది. రోహిత్తో జతగా తొలిసారి ఓపెనింగ్ చేసిన కోహ్లి 5 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. కోహ్లి.. మార్క్ అదైర్ బౌలింగ్లో బెంజమిన్ వైట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.కోహ్లి ఔటైనా ఏమాత్రం తగ్గని భారత్.. రోహిత్ (37 బంతుల్లో 52 రిటైర్డ్ హర్ట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), పంత్ (26 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 12.2 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పంత్ సిక్సర్తో మ్యాచ్ ఫినిష్ చేశాడు. అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మోచేతికి బంతి బలంగా తాకడంతో రోహిత్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు.
T20 World Cup 2024: తొలిసారి ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్-కోహ్లి
ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తొలిసారి ఓపెనర్లుగా బరిలోకి దిగారు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఐర్లాండ్తో ఇవాళ (జూన్ 5) జరుగుతున్న మ్యాచ్లో రోహిత్-కోహ్లి జోడీ భారత ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఐర్లాండ్ నిర్దేశించిన 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. నిరాశపరిచిన కోహ్లి..రోహిత్తో జతగా తొలిసారి ఓపెనింగ్ చేసిన కోహ్లి 5 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. కోహ్లి.. మార్క్ అదైర్ బౌలింగ్లో బెంజమిన్ వైట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. కోహ్లి.. రోహిత్కు జోడీగా ఓపెనర్గా బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే విఫలం కావడంతో భారత క్రికెట్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.దీనికి ముందు భారత బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించడంతో ఐర్లాండ్ 96 పరుగులకే కుప్పకూలింది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లలో ముఖ్యంగా పేసర్లు ఈ మ్యాచ్లో ఇరగదీశారు. హార్దిక్ పాండ్యా (4-1-27-3), అర్ష్దీప్ సింగ్ (4-0-35-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్ పటేల్ (1-0-3-1) ధాటికి ఐర్లాండ్ 16 ఓవర్లలోనే చాపచుట్టేసింది.ఐర్లాండ్ ఇన్నింగ్స్లో లోర్గాన్ టక్కర్ (10), కర్టిస్ క్యాంపర్ (12), గెరాత్ డెలానీ (26), జాషువ లిటిల్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో డెలానీ మెరుపులు మెరిపించడంతో ఐర్లాండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), హ్యారీ టెక్టార్ (4), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అదైర్ (3), బ్యారీ మెక్ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు.లక్ష్యం దిశగా సాగుతున్న భారత్..97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా ఆడుతూపాడుతూ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఆదిలోనే కోహ్లి ఔటైనా.. రోహిత్ శర్మ (28), పంత్ (10) నిలకడగా ఆడుతుండటంతో భారత్ లక్ష్యం దిశగా సాగుతుంది. 7 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 43/1గా ఉంది. 13 ఓవర్లలో మరో 54 పరుగులు చేస్తే భారత్ విజయం సాధిస్తుంది.
T20 World Cup 2024: నిప్పులు చెరిగిన భారత పేసర్లు.. 96 పరుగులకే కుప్పకూలిన ఐర్లాండ్
టీ20 వరల్డ్కప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో ఇవాళ (జూన్ 5) జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా ఐర్లాండ్ ఇన్నింగ్స్ పేక మేడలా కూలింది. హార్దిక్ పాండ్యా (4-1-27-3), అర్ష్దీప్ సింగ్ (4-0-35-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్ పటేల్ (1-0-3-1) ధాటికి ఐర్లాండ్ 96 పరుగులకే (16 ఓవర్లలో) కుప్పకూలింది.ఐర్లాండ్ ఇన్నింగ్స్లో లోర్గాన్ టక్కర్ (10), కర్టిస్ క్యాంపర్ (12), గెరాత్ డెలానీ (26), జాషువ లిటిల్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో డెలానీ మెరుపులు మెరిపించడంతో ఐర్లాండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), హ్యారీ టెక్టార్ (4), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అదైర్ (3), బ్యారీ మెక్ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు.
T20 World Cup 2024: హార్దిక్ సూపర్ డెలివరీ.. వైరల్ వీడియో
టీ20 వరల్డ్కప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా ఐర్లాండ్తో ఇవాళ (జూన్ 5) జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా పేసర్లు చెలరేగిపోతున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఐర్లాండ్కు చుక్కలు చూపిస్తుంది. టీమిండియా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా చాలాకాలం తర్వాత బంతితో ఇరగదీస్తున్నాడు. హార్దిక్ ధాటికి ఐర్లాండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలుతుంది. హార్దిక్ 4 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడిన్ ఉంది. హార్దిక్తో పాటు అర్ష్దీప్ సింగ్ (3-0-18-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (2-1-4-1), అక్షర్ పటేల్ (0.2-0-1-1) కూడా విజృంభించడంతో ఐర్లాండ్ 13 ఓవర్లలో 66 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), లోర్కాన్ టక్కర్ (10), హ్యారీ టెక్టార్ (4), కర్టిస్ క్యాంపర్ (12), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అదైర్ (3), బ్యారీ మెక్ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు. జాషువ లిటిల్ (8), గారెత్ డెలానీ (9) క్రీజ్లో ఉన్నారు.What a ball from Vice Captain Hardik Pandya. 💪 pic.twitter.com/rk76b8Dbdj— Johns. (@CricCrazyJohns) June 5, 2024హార్దిక్ సూపర్ డెలివరీ..చాలాకాలం తర్వాత బంతితో మెరిసిన హార్దిక్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ పడగొట్టిన ఓ వికెట్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. హార్దిక్ సూపర్ డెలివరీతో హ్యారీ టెక్టార్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా, న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
బిజినెస్
టీవీ ఛానళ్ల సబ్స్క్రిప్షన్ రేట్లు పెంపు.. ఎంతంటే..
టీవీ ఛానళ్ల సబ్స్క్రిప్షన్ రేట్లు 5-8 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిస్నీ స్టార్, వయాకామ్ 18, జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా వంటి బ్రాడ్కాస్టర్లు తమ బొకే(ఛానళ్ల సమూహం) రేట్లు పెంచనున్నట్లు తెలిపాయి.కొత్త టారిఫ్ ఒప్పందాలపై సంతకం చేయని డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ ఆపరేటర్లకు (డీపీఓ) సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు సిగ్నళ్లను తొలగించకూడదని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) బ్రాడ్కాస్టర్లను ఆదేశించింది. దాంతో ఎన్నికలు ముగిసే వరకు కంపెనీలు ఈమేరకు చర్యలు తీసుకోలేదు. తాజాగా ఎన్నికల ఫలితాలు సైతం వెలువడడంతో తిరిగి సబ్స్క్రిప్షన్ రేట్ల పెంపు అంశం వెలుగులోకి వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: జూన్ 14 తర్వాత ఆధార్ పనిచేయదా..? స్పష్టతనిచ్చిన యూఐడీఏఐజనవరిలో ప్రముఖ బ్రాడ్కాస్టర్లు తమ బేస్ బొకే రేట్లను సుమారు 10 శాతం పెంచారు. భారతీయ క్రికెట్ హక్కులను చేజిక్కించుకోవడంతో సాధారణ ఎంటర్టైన్మెంట్ ఛానెళ్ల కంటే వయోకామ్18 అత్యధికంగా 25 శాతం పైగా రేట్లును పెంచింది. అయితే పెరిగిన ధరలు ఫిబ్రవరి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ట్రాయ్ నిబంధనల వల్ల వాటికి బ్రేక్ పడింది.
స్పెక్ట్రమ్ వేలం వాయిదా..కొత్త తేదీ ఖరారు
స్పెక్ట్రమ్ వేలాన్ని జూన్ 25కు వాయిదా వేస్తున్నట్లు టెలికా విభాగం(డాట్) ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యుల్ ప్రకారం ఈ వేలం జూన్ 6(గురువారం)న నిర్వహించాల్సి ఉంది. వాయిదాకుగల కారణాలను మాత్రం డాట్ వెల్లడించలేదు.మొబైల్ ఫోన్ సేవల కోసం ఎనిమిది స్పెక్ట్రమ్ బ్యాండ్లను రూ.96,317 కోట్ల కనీస ధరతో వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 800 - 900 - 1800 - 2100 - 2300 - 2500 - 3300 మెగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్ల స్పెక్ట్రమ్ను వేలంలో విక్రయించనుంది. అందులో ఎలాగైనా గరిష్ఠవాటాను సొంతం చేసుకోవాలని టాప్ కంపెనీలు ఈఎండీ చెల్లించి, అధిక పాయింట్లు పొందేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రక్రియ కోసం రిలయన్స్ జియో రూ.3,000 కోట్ల మొత్తాన్ని (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్-ఈఎండీ) డిపాజిట్ చేయడం ద్వారా అత్యధిక రేడియో తరంగాలకు బిడ్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధ చేసింది. భారతీ ఎయిర్టెల్ రూ.1,050 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.300 కోట్ల ఈఎండీని డిపాజిట్ చేశాయి.ఇదీ చదవండి: జూన్ 14 తర్వాత ఆధార్ పనిచేయదా..? స్పష్టతనిచ్చిన యూఐడీఏఐస్పెక్ట్రమ్ అంటే?సెల్ఫోన్లు, రేడియోలు వంటి వైర్లెస్ సాధనాలకు సిగ్నళ్లు కావాలి. వీటి మధ్య సమాచార మార్పిడికి విద్యుదయస్కాంత తరంగాలు అవసరం. వీటినే రేడియో తరంగాలు అని కూడా అంటారు. ఇలాంటి విద్యుదయస్కాంత తరంగాల శ్రేణినే స్పెక్టమ్ అంటారు. ఒక సాధనం నుంచి ఇంకో సాధనానికి సమాచారం చేరవేతకు నిర్దిష్ట పౌనఃపున్యాలు (ఫ్రీక్వెన్సీలు) ఉంటాయి. రేడియోకు వేరేగా.. సెల్ఫోన్లకు వేర్వేరు ఫ్రీక్వెన్సీలను కేటాయించారు. ఫ్రీక్వెన్సీని బట్టి స్పెక్ట్రమ్ను వివిధ బ్యాండ్లుగా వర్గీకరించారు.
జూన్ 14 తర్వాత ఆధార్ పనిచేయదా..? స్పష్టతనిచ్చిన యూఐడీఏఐ
ఆధార్కార్డులోని వ్యక్తిగత వివరాలను జూన్ 14 లోపు అప్డేట్ చేయకపోతే కార్డు పని చేయదంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (యూఐడీఏఐ) స్పష్టతనిచ్చింది. అలా వస్తున్న వార్తలను నమ్మకూడదని చెప్పింది.ఆధార్లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి జూన్ 14 గడువు విధించినట్లు చెప్పింది. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు మార్చుకోకపోయినా ఆధార్ పనిచేస్తుందని స్పష్టం చేసింది. తర్వాత కూడా వివరాలు మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఆధార్ సెంటర్లలో నిర్దేశిత రుసుము చెల్లించి వివరాలు అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది.ఆన్లైన్లో ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఉడాయ్ గతంలో 2023 డిసెంబర్ 14 వరకు అవకాశం ఇచ్చింది. తర్వాత దాన్ని రెండుసార్లు పొడిగించి చివరగా జూన్ 14 గడువు విధించింది. ఆలోపు ఆన్లైన్లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు.ఉడాయ్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి కూడా ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా తాజా గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ పాస్బుక్, పాస్పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్షీట్, పాన్/ఇ-పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది.
లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ 152 పాయింట్లు లాభపడి 22,043కు చేరింది. సెన్సెక్స్ 585 పాయింట్లు ఎగబాకి 72,619 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.19 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 77.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.33 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.15 శాతం లాభపడింది, నాస్డాక్ 0.15 శాతం పెరిగింది.అంచనాలు తారుమారయ్యేలా లోక్సభ తాజా ఫలితాల్లో ఎన్డీఏ 300 సీట్లకంటే తక్కువకు పరిమితం కానున్నట్లు స్పష్టమవడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మంగళవారం మార్కెట్ ఆరంభం నుంచే అమ్మకాలకు దిగారు. మోడీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ప్రభుత్వ రంగ కౌంటర్లు తీవ్రంగా నష్టపోయాయి. ప్రధానంగా ఆర్ఈసీ 24 శాతం, పీఎఫ్సీ 22%, బీఈఎంఎల్, కంకార్, బీఈఎల్, బీహెచ్ఈఎల్ 19%, హెచ్ఏఎల్ 17%, ఓఎన్జీసీ, మజ్గావ్ డాక్ 16%, రైల్టెల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా 14%, ఆర్వీఎన్ఎల్ 13%, ఐఆర్సీటీసీ, పవర్గ్రిడ్, బీపీసీఎల్ 12% చొప్పున దిగజారాయి. ఇక పీఎస్యూ బ్యాంక్స్లో యూనియన్ బ్యాంక్, బీవోబీ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, ఎస్బీఐ 18–13% మధ్య కుప్పకూలాయి. దీంతో పీఎస్ఈ ఇండెక్స్ 16%పైగా క్షీణించింది. ఎన్ఎస్ఈలో బ్యాంకెక్స్ 2022 ఫిబ్రవరి తదుపరి అత్యధికంగా 8% పతనమైంది. ఇప్పుడేం చేయాలి..మార్కెట్లు ఇంతలాపడుతుంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నవారు కంగారుపడిపోకుండా దీన్నో అవకాశంగా చూడాలని నిపుణులు చెబుతున్నారు. ఫండమెంటల్స్ బలంగా ఉన్న స్టాక్స్లో పెట్టుబడిపెట్టిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఇలా మార్కెట్ పడిపోతున్న సమయంలో మరిన్ని స్టాక్లు కొనుగోలు చేయాలంటున్నారు. గతంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఆరు నెలల వ్యవధిలో మార్కెట్లు పడిపోయిన దానికంటే చాలా పాయింట్లు పెరిగినట్లు రుజువైంది. కాబట్టి ఎలాంటి ఆందోళన చెందకుండా మంచి కంపెనీల్లో పెట్టుబడి పెట్టినవారు కొంతసమయం వేచిచూస్తే లాభాలు పొందవచ్చని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
వీడియోలు
వర్షం బీభత్సం.. నిలిచిపోయిన ట్రాఫిక్
మోడీ నివాసంలో ఎన్డీయే సమావేశం
ఎన్నికల ఫలితాలపై తమ్మినేని రియాక్షన్
గెలుపు, ఓటములు సహజం కార్యకర్తలు అధైర్యపడొద్దు .. మీకు అండగా నేనుంటా
ఓటమి పై కె కె రాజు సంచలన వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం.. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
మోడీ రాజీనామా పత్రాన్ని ఆమోదించిన రాష్ట్రపతి
ఈవీఎంలు మార్చేశారు
ప్రజలకు మంచి జరగాలని తపన పడ్డ మనిషి జగన్
ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార తేదీ లోక్సభ ఎన్నికల తేదీ ఖరారైంది
ఫ్యామిలీ
ఆ చిన్న సిరామిక్ మేక బొమ్మ అన్ని లక్షలా..!
ప్రముఖులు, సెలబ్రెటీలు, ముఖ్యంగా రాజుల కాలం నాటి వస్తువులు వేలంలో అత్యంత ధర పలుకుతాయి. వాటికి చారిత్రక నేపథ్యం ఉండటంతో అంతలా కళ్లు చెదిరే రేంజ్లో ధర పలుకుతాయి. కొన్ని అరుదైన వజ్రాలు, నగలు, లేదా హస్త కళా నైపుణ్యానికి సంబంధించిన వస్తువులు అత్యంత ఖరీదు అమ్ముడుపోతాయి. కానీ మట్టితో తయారు చేసిన సాధారణ సిరామిక్ మట్టి బొమ్మ వేలంలో ఎంత పలికిందో వింటే కంగుతింటారు. 55 ఏళ్ల రేమండ్ పాటెన్ అనే వ్యక్తి వద్ద ఏళ్లుగా ఉన్న రాజవంశీకులకు సంబంధించిన సిరామిక్ మట్టి మేక బొమ్మ వేలంలో కనివినీ ఎరుగని రీతీలో రూ. 9 లక్షలకు పలిగింది. జస్ట్ మట్టి బొమ్మే కదా..!అన్ని లక్షలా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఈ బొమ్మను కింగ్ చార్లెస్ స్వహస్తాలతో తయారు చేసిన మట్టి మేక బొమ్మ అది. ఆ బొమ్మను 21వ పుట్టిన రోజున తన ఆంటీ ఇచ్చిందని చెప్పాడు రేమండ్.ఆమె ఈ బొమ్మను ప్రిన్స్ చార్లెస్ తయారు చేశారని చెప్పడంతో ఇప్పటి వరకు దాన్ని అత్యంత భద్రంగా కాపాడుకుంటూ వచ్చానని అన్నారు. 1960లలో ఆమె క్వీన్స్ కాలేజ్లో కుక్గా పనిచేస్తుండేదని, ఆ టైంలో ప్రిన్స్ తన కాలేజ్కి రావడం తన ఆంటీ ఎంతో గర్వంగా భావించేదని చెప్పకొచ్చాడు రేమాండ్. ఆమె ఆ కేంబ్రిడ్జ్లోని 37 నార్ఫోక్ టెర్రేస్లో నివశించేది. ఆమె తన తాతయ్య చెల్లెలని, జీవితాంతం పెళ్లే చేసుకోలేదని చెప్పుకొచ్చారు. ఆమె తన జీవితమంతా రాజకుటుంబ సభ్యలుకు సేవ చేస్తూ గడిపిందని, ముఖ్యంగా రాణిగారి తల్లికి వంటచేసేదని రేమాండ్ చెప్పారు. ఈ చారిత్రక ప్రాముఖ్యత కలిగన మేక విలువైన ప్రదేశంలో ఉండటం మంచిదని ఇలా వేలంలో ఉంచినట్లు అతను చెప్పుకొచ్చారు. ఇలానే గతేడాది హాన్సన్స్ వేలం పాటలో చార్లెస్ ఐదేళ్ల వయసులో గీసిన తన తల్లిదండ్రులు క్వీన్ ఎలిజబెత్II, ది డ్యూక్ ఆఫ్ ఎడిన్ బర్గ్ల చిత్రాలు కూడా ఇలానే ఏకంగా రూ. 63 లక్షలు పలికడం విశేషం.(చదవండి: పోలాండ్లోని రహదారులకు, స్కూళ్లకు భారతీయ రాజు పేరు ఎందుకు పెట్టారో తెలుసా..!)
మీ ఇంటి దగ్గర పుస్తకాలకు అద్దెకు ఇచ్చే షాపులు ఉన్నాయా?
మన పక్కింటికో, ఎదురింట్లోకో పండగసెలవులకని ఎవరైనా కొత్తపిల్లలు వచ్చినపుడు మాటా మాటా కలిసినపుడు మీ ఊరు పెద్దదా మా ఊరు పెద్దదా అని ఒక అంచనా వేసుకొవడానికి అడిగే మొదటి ప్రశ్న మీ ఊర్లో సినిమా టాకీసులు ఎన్ని ఉన్నాయి? అని అయిఉండేది. నా కటువంటి సమస్యే ఎదురయ్యేది కాదు. నాకు కావలసిన భోగట్టా అల్లా మీ ఊర్లో, మీ ఇంటి దగ్గర పుస్తకాలకు అద్దెకు ఇచ్చే షాపులు ఎన్ని ఉన్నాయని మాత్రమే.నాకు ఊహ తెలిసాకా తరుచుగా ఎమ్మిగనూరుకు వెల్తుండేవాడిని. ఊర్లో దిగి మా మేనత్త ఇంటికి వెళ్ళే రిక్షా ఎక్కాకా దారికి అటూ ఇటూ చూస్తూ ఆ ఊరిలో పుస్తకాల బంకులు ఎన్ని ఉన్నాయా ? ఎక్కడెక్కడ ఉన్నాయా అని బుర్రలో గురుతులు పెట్టుకునేవాడిని . మా నూనెపల్లె లో భద్రయ్య బంకు అద్దె పుస్తకాలకు పేరెన్నికది. నూనెపల్లె సెంటరు లో గుర్రాల షెడ్డుకు ఎదురుగా ఉండేదది. ఆ బజారు అంతా కోమట్ల ఇల్లు ఎక్కువగా ఉండేవి. భద్రయ్య గారు కూడా కొమట్లే. ఆయన కొడుకు భాస్కర్ ఆ బంకులో ఎక్కువగా కూచునేవాడు. బంకు సీలింగు కు ఒక చిన్న ప్యాన్ బిగించి ఉండేది. బంకులో ఒక మూల రేడియో కూడా. అక్కడ నాకు పుస్తకాల తరువాత అత్యంత ప్రీతిప్రాత్రమైన వస్తువు బెల్లంపాకపు వేరుసేనగ గట్టా. ఎంతో రుచిగా ఉండేదది . ఇప్పుడు అటువంటి గట్టాలే ఆల్మండ్ హౌస్ లో కనపడతాయి. రూపం ఒకటే కాని ధర మాత్రం హస్తిమశకాంతరం. పుస్తకాలు, గట్టాల తరువాత నాకు ఫేవరెట్ అనదగ్గది గుడ్ డే బిస్కత్తు. గాజు సీసాలలో చక్కగా అమర్చి పెట్టి ఉండేవి. సుతారంగా అల్యూమినియం మూత తిప్పి అడిగిన వారికి బిస్కట్లు ఇచ్చేవాడు భద్రయ్య . అపుడు ఆ సీసాలోనుంచి బిస్కెట్ల వాసన ఎంత కమ్మగా వచ్చేదో. ఇప్పుడు అప్పుడప్పుడూ రత్నదీప్ సూపర్ మార్కెట్ కు ఏదయినా సరుకులు కొనడానికి వెడతానా, బిస్కెట్ కౌంటర్ దగ్గర గుడ్ డే ప్యాకెట్ పుచ్చుకుని ఆ చిన్ననాడు తగిలిన చక్కని వాసన వస్తుందా లేదా అని చూస్తా, రానే రాదు. ఆ వాసన లేని బిస్కెట్ కూడా రుచిగా అనిపించదు నాకు . నేను భద్రయ్య అంగట్లో పుస్తకం తీసుకుంటే కూడా ఉన్న ఫ్రెండ్ ఎవరో ఒకరు బిస్కెటో , బుడ్డల గట్టానో కొనేవాడు అది ఇద్దరం పంచుకుని తినుకుంటూ నడిచే దారిలోనే పుస్తకాన్ని నమిలేస్తూ కదిలేవాడ్ని.పుస్తకాలు అద్దెకిచ్చే షాపులో ఆ గోడల నిండా వందలుగా పుస్తకాలను నిలువ వరుసల్లో నింపేవారు. స్కెచ్చు పెన్నులతో పుస్తకాల మీద పేర్లు రాసి ఉండేవి. ఏ పుస్తకం కోసం కష్టపడి వెదుక్కోనక్కరలేదు. చక్కని చేతి రాతలో ఆ పేర్లు కళ్ళని ఆకర్షించేవి. చాలా షాపుల్లో అయితే పత్రికలో సీరియల్ గా వచ్చిన నవల పేజీలని చించి పుస్తకంగా బైండ్ చేసి అద్దెకు ఇచ్చెవారు. కొత్తగా రిలీజ్ అయిన పుస్తకాలయితే డిమాండ్ ఎక్కువ కాబట్టి వాటిని జనం కంట పడకుండా సెపరేట్ గా ఉంచేవాళ్ళు. నియమిత ఖాతాదారుల కోసం ఆ పుస్తకాలు పక్కకు తీసిపెట్టేవారు. షాపు వాళ్ళు ఏ పుస్తకాన్ని కూడా ఒకటి ఒకటిగా కొనేవాళ్ళు కాదు. ప్రతి పుస్తకం రెండు మూడు ఉండేవి సూపర్ స్టార్లయిన మధుబాబు, మల్లాది, యండమూరి పుస్తకాలయితే అయిదు లెక్కన కొనేవారు. ఆ పుస్తకాలు వచ్చిన కొత్తలో అయిదేం ఖర్మ పది కొన్నా అంత సులువుగా పాఠకుల చేతికి వచ్చేవి కావు. త్రిమూర్తులకు డిమాండ్ ఎక్కువ. ఎవరు ఎంత గీ పెట్టి చచ్చినా ఒకానొక కాలంలో హైస్కూలు పిల్లవాళ్ళ దగ్గరి నుండి సకుటుంబ సపరివారం వరకు తెలిసిన రచయితలంటే వీరే . పెరిగిపెద్దయి అతి పెద్ద చదవరులయిన ఆ రోజుల చదువరులు చాలామందికి అక్షర ప్రాశన చేసింది వీరే. వీరిలో యండమూరి కాస్త హట్ కే. రాసింది కమర్షియల్, పాపులర్ సాహిత్యమే కావచ్చు. అయినా ఆయన తన పుస్తకాల్లో ఎక్కడో ఒకక్కడ బుచ్చిబాబు, తిలక్ , విశ్వనాథ సత్యనారాయణ, చలం... ఇత్యాదుల ప్రస్తావన తెచ్చేవారు. నాకయితే ఈ మహారచయితల తొలి పరిచయం వీరేంద్రనాథ్ గారి పుస్తకాల్లోనే. ఒక పుస్తకంలో ఆయన ఇట్లావాక్యం వ్రాశారు "తెలుగు సాహిత్యంలో ఒకే ఒక హీరో తంగిరాల శంకరప్ప" ఆ వాక్యాన్ని పట్టుకుని నేను పెద్దయ్యాకా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి సాహిత్యాన్ని మొత్తం చదువుకునే భాగ్యం కలిగింది. లేకుంటే ఎక్కడి చిన్న పల్లె నూనెపల్లె? దానికి అద్భుతమైన సాహిత్యం ఎంతెంత దూరం?షాపు పెట్టాము కదాని వచ్చిన ప్రతి ఒక్కరికి పుస్తకాలు ఇవ్వబడవు. బ్యాంకులో అకవుంట్ తెరవడానికి సాక్షి సంతకం కావాలన్నట్లు, షాపువారికి తెలిసిన వారినెవరినయినా తోడుగా తీసుకెడితేనే పుస్తకాలు ఇస్తారు. లేదా పుస్తకం ధరమొత్తం అడ్వాన్సుగా కట్టాలి. నాకు గుర్తు ఉండి కొందరు 20 రూపాయలు బయానా గా పుచ్చుకునేవారు. అంత డబ్బు ఎలా వస్తుంది? ఎవరు ఇస్తారు? అందుకని నేను ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి అడ్వాన్స్ కట్టే వాణ్ని, అద్దె చెల్లించే వాడిని. పుస్తకాలు నాకు దొంగతనం నేర్పాయి. అలవాటు ఐయింది కదాని ప్రతిఎప్పుడూ దొంగతనం చేయకూడదు. పట్టుబడి పోతాం. అందుకే పుస్తకాలకు అద్దె అప్పు పెట్టడం నేర్చుకున్నాను. ఈ రోజుల్లో చోరీ చేస్తూ పట్టుబడిన పిల్లలు ఎవరైనా పుస్తకాలు కొనడానికి దొంగతనం చేసాను అని ఏడుపుముఖంతో అంటే వాళ్ళని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోబుద్ది వేస్తోంది. నేను పెరిగి పెద్దయ్యాక ఒకసారి నాకెంతో ఇష్టమైన ఆర్టిస్ట్ పుస్తకాలు కొనడానికి డబ్బులు లేక దిగాలుగా ఉంటే ఏమిటి విషయమని అడిగి తెలుసుకుని చిత్రకారులు శ్రీ బాపు గారు దగ్గరకు పిలిచి ముద్దు పెట్టుకోలేదు కానీ ఇరవైవేల రూపాయలు ఇచ్చి నా ముఖంలో నవ్వు చూశారు . అద్దెకు తీసుకున్న పుస్తకాన్ని తమ వద్దనున్న రిజిస్టరు పుస్తకంలో తేది, సమయం వేసి , మళ్ళీ ఆ పుస్తకాన్ని రేపటి రోజున అదే సమయం లేదా అంతకంటే ముందుగా తెచ్చి ఇస్తే ఒక రోజు అద్దె, రోజు మారిన కొద్దీ అద్దె రెట్టింపు అయ్యేది ,ఒక్కొక్క సారి అద్దె కట్టడానికి కి డబ్బులు లేక పుస్తకాన్ని అట్లానే అట్టిపెట్టేసుకుని పుస్తకం ధరకన్నా ఎక్కువ అద్దె డబ్బులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అప్పుడప్పుడు షాపు యజమానికి ఏదయినా పనిపడో , భోజనానికి వెళ్ళవలసి వచ్చినపుడో పుస్తకాల షాపు మూసి ఉండేది. షాపు మూసి ఉన్నదేమి అని ఖంగారు పడకూడదు. అంగడి చెక్కలకు సన్న సందులు ఉంటాయి . అందు గుండా పుస్తకాన్ని పడెయ్యాలి. షాపు ఆయన తిరిగి వచ్చాక మన పుస్తకం నెంబరు , పేరూ చూసి పుస్తకం ముట్టినట్టుగా పద్దు వేసుకుంటాడు. అద్దె బకాయి రాసుకుంటాడు.మా ఇంటి దగ్గరలోనే, శివశంకర విలాస్ దగ్గర ఒక క్రైస్తవ కుటుంబం పుస్తకాల బంకు పెట్టుకున్నారు. అమ్మా, నాన్న, ఒక అబ్బాయి. ఒకరు లేనప్పుడు ఒకరు ఆ షాపు చూసుకునేవారు. నేను వాళ్లదగ్గర పుస్తకాలు అద్దెకు తీసుకునేవాడిని. యండమూరి వీరేంద్రనాథ్ "’రక్తసింథూరం" పుస్తకం అక్కడే తీసుకున్న గుర్తు నాకు. ఆ పుస్తకానికి చిత్రకారులు చంద్ర గారు వేసిన బొమ్మని చూసి మంత్రముగ్దుణ్ణి అయ్యాను ఆ కాలల్లోనే. ఒకసారి పుస్తకాలకు అద్దె చెల్లించడానికి డబ్బులు లేనప్పుడు ఒక ఉపాయం చేశా. కొడుకు ఆ షాపులో ఉన్నపుడు పుస్తకం తీసుకున్నాను అనుకో, పుస్తకం తిరిగి ఇచ్చేటప్పుడు అతను కాకుండా వాళ్ళ అమ్మగారో , నాయనో ఉన్నప్పుడు పుస్తకం వాపసు ఇచ్చి అద్దె ముందే కట్టా అని చెప్పేవాడిని. కొన్ని సార్లు పుస్తకం అద్దె ముందే కట్టించుకునేవారు. పుస్తకాలు నాకు మోసాన్ని కూడా నేర్పాయి. ఆ కుటుంబం వారు కడు బీదవారు. వారి రూపు, వేసుకున్న బట్టలు ఆ విషయాన్ని యథాతంగా చూపేవి. ఇప్పుడు ఎప్పుడయినా నాకు ఏదయినా అన్యాయం జరిగింది అనిపించినపుడు నేను ఆ కుటుంబాన్ని గుర్తు చేసుకుని వారిని మోసం చేసినందుకు ఇదంతా నాకు తగినదే జరిగింది అనుకుంటాను. ఇపుడు ఆ బంకు వాళ్ళు ఎవరూ కనపడరు కానీ కనపడితే బావుండు, వాళ్ళ చేతులు పట్టుకుని మన్నించమని ప్రాధేయపోయేవాడినే. పుస్తకాల చదువు వలన నేను దొంగతనం, మోసం నేర్చుకుంటే నా ప్రెండు బాషా అనేవాడికి పుస్తకాలు వ్యాపారం నేర్పాయి. ఆ రోజుల్లో ఎంత పెద్ద పుస్తకాన్నయినా ఒక దెబ్బకు గంటా రెండు గంటల్లో చదివేసేవాళ్లం. మరి చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లొక లెక్క. మా బాషాగాడు ఏం చేసేవాడంటే వాడు ఒక పిల్లల పుస్తకాన్ని అద్దెకు తెచ్చుకుని చదివేసి , ఒకోసారి చదవకుండా కూడా మాకు అద్దెకు ఇచ్చేవాడు. గంటకు పావలా పుచ్చుకునేవాడు . షాపులో అయితే పుస్తకాన్ని ఒక గంటకు వెనక్కి ఇచ్చినా, ఒక రోజుకు వెనక్కి ఇచ్చినా రూపాయో, రూపాయిన్నరనో కట్టక తప్పదు . బాషగాడి పావలా పథకం హాయిగా ఉండేది. వాడు ఇచ్చినంత మందికి అద్దెకు ఇచ్చి , అద్దె చెల్లించి ఆ పై దర్జాగా మిగిలిన డబ్బులు జేబులో వేసుకునే వాడు.చిన్న చిన్న బంకుల్లో కుదరదు కానీ, కాస్త పెద్ద షాపుల్లో అయితే పుస్తకాలు చూస్తూన్నట్టుగా నటిస్తూ, షాపు యజమాని తల తిప్పగానే చేతిలో ఉన్న పుస్తకాన్ని చొక్కా ఎత్తి లటుక్కున నిక్కరుకు పొట్టకు మధ్యలో దాచేవాళ్లం. పుస్తకం చదివెయ్యగానే మళ్ళీ వెనక్కి వచ్చి పుస్తకాన్ని ఆ అరల మధ్యనే ఇరికించి వెళ్ళేవాళ్లం. చెప్పుకుంటూ పొతే చాలా సంగతులు ఊరుతూనే ఉంటయి. నిజానికి ఎలా కనుమరుగయ్యాయో, ఎప్పుడు కనుమరుగయ్యాకో కూడా ఊహకు అందడం లేదు ఆ పుస్తకాలని అద్దెకు ఇచ్చే షాపులు. టెంత్ క్లాస్ లోనా? కాదేమో ! ఇంటర్ మీడియట్ లోనా , లేక డిగ్రీ రోజుల్లోనా? ఏమో గుర్తు లేదు. సినిమా థియేటర్ టికెట్ కౌంటర్ బయట నిలబడ్డంత పెద్ద బారు వరుస కాకపోయినా , అద్దె పుస్తకాల షాపు, బంకుల బయట వరుసలో నాలుగురయిదుగురే ఉన్నా, కొత్త నవల కోసం విపరీతమయిన ఒత్తిడి తోనో , నాలుగురోజులుగా తెగ తిరుగుతున్నా ఇంకా దొరకని అభిమాన రచయితా పుస్తకం ఈరోజైనా దొరుకుతుందా లేదా అనే మనోదౌర్బల్యం తోడుగానో నిలబడి ఉండేవారు పాఠకులు. వట్టి అద్దె పుస్తకాలే కాదు. ఊరి మెయిన్ సెంటర్లలోనూ, సందు చివర, వీధి మలుపులో ప్రతిచోటా దినపత్రికలు, వార పత్రికలూ, పక్షపత్రికలు, పిల్లల పత్రికలూ , పాకెట్ నవల్స్ కనపడుతూనే ఉండేవి, ఈరోజు ఒక దినపత్రిక కోసమో, వార పత్రిక కోసమో కిలోమీటర్లకు కిలో మీటర్లు నడిచినా ఒక్క పుస్తకమూ రోడ్డు మీద కనపడుత లేదంటే అత్యంత సాంస్కృతిక లేమి నడుస్తున్న రోజులవి . ఆరోజుల్లో కథలు, నవలలు, పాటలు , పద్యాలు అనేకాలు పుస్తకాలుగా దొరికేవి. రచయితల ముక్కు మొహంతో అవసరం లేని రోజులవి. రాసిందే భాగ్యం. కంటపడిన అచ్చు కాగితమే వరం. ఈ రోజున వద్దన్నా వీధికొక, సందుకోక, నగరం నాలుగు వైపులా రచయితలూ, కవులు ఊరికూరికే కనపడుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. సరస్వతి మీద ఒట్టు రచయితల పేర్లు తెలుసు , వారు వ్రాసిన ఒక్క వాక్యం కూడా తెలీదు. రాసేవారు మాత్రమే తెలుస్తున్నారు రచన అందడం లేదు . ఏం రాశారో ఆనవాలు లేదు, చూసిన తనని పోల్చుకుంటే చాలన్నంత అల్పసంతోషి అయిపోయినాడు సృజనకారుడు.-అన్వర్
రాహుల్ గాంధీ ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్స్ ఇవే..!
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల విజయం సాధించారు. ఆయన గతేడాది చేపట్టిన జోడో యాత్ర మంచి ఫలితాన్నిచి ఈ లోక్సభ ఎన్నికల్లో పార్టీకి మెజార్టీ సీట్లను గెలుచుకునేలా చేసింది. ఈ నేపథ్యంలో మంచి ఫిట్నెస్ మెయింటెయిన్ చేసే రాహుల్ ఇష్టపడే ఆహార పదార్థాలేంటో చూద్దామా..!రాహుల్ గాంధీ ఒక జర్నలిస్ట్తో కలిసి రాజధాని ఢిల్లీలోని ఒక ఐకానిక్ రెస్టారెంట్లో ఫుడ్ని ఆస్వాదిస్తూ కనిపించారు. ఆ జర్నలిస్ట్తో జరిపిన సంభాషణలో తనకు ఇష్టమైన ఆహార పదార్థాల గురించి పంచుకున్నాడు. తనకు బటర్ చికెన్, సీక్ కబాబ్ రోట్ అంటే మహా ఇష్టమని చెప్పారు. ఆలూ టిక్కకి తన ఇష్టమైన స్నాక్ ఐటెం అని చెప్పారు. తాను బోర్డింగ్స్కూల్లో ఉన్నప్పడు తన స్నేహితులతో కలిసి సమీపంలో ఉన్న ట్రక్ షాప్ నుంచి ఈ ఆలూ టిక్కిని ఇష్టంగా కొనుక్కుని తినేవాడనని అన్నారు. అంతేగాదు ఆ సంభాషణలో తాను తన చిన్నతనంలో తన తండ్రితో కలిసి చైనీస్ రెస్టారెంట్ ఫుజియాకు వెళ్లి ఇష్టంగా తిన్న నాటి మధురానుభూతలను కూడా షేర్ చేసుకున్నారు. ఇక తాను ఇలా ఢిల్లీలో స్నాక్ ఐటెమ్స్ తిని రెండేళ్లు అవుతుందని అన్నారు. తనకు కుల్ఫీ అంటే కూడా మహా ఇష్టమని అన్నారు. అలాగే ప్రాంతీయ వంటకాల వద్దకు వచ్చేటప్పటికీ దక్షిణ భారతీయ వంటకాలను ఇష్టంగా తింటనని, ముఖ్యంగా పంజాబీ వంటకాల్లో చోలే భటుర్, పరాఠాలు అంటే నాకు మహా ఇష్టమని అన్నారు. ఇష్టమైన కర్రీ దగ్గరకు వచ్చేటప్పటికీ బటర్ చికెన్, తందూరి చికెన్ అంటే ఇష్టమని తెలిపారు. రోజుని మంచి ఘుమఘమలాడే కాఫీతో ప్రారంభిస్తానని, సాయంత్రం మంచి టీ తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Khaane Mein Kya Hai? (@khaanemein_kyahai) (చదవండి: పోలాండ్లోని రహదారులకు, స్కూళ్లకు భారతీయ రాజు పేరు ఎందుకు పెట్టారో తెలుసా..!)
‘సిండ్రిల్లా’లా మెరిసిన రాధికా మర్చంట్, మురిసిన అంబానీ
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్అంబానీ, వ్యాపారవేత్త కుమార్తెతో రాధిక మర్చంట్ రెండో ప్రీ వెడ్డింగ్వేడుక ఇటలీలో క్రూయిజ్ షిప్లో కనీవినీ ఎరుగని రీతిలో ఘనంగా జరిగింది. గుజరాత్లో జాం నగర్లో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకలతో పోలిస్తే, రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకను మరింత ఘనంగా నిర్వహించింది అంబానీ కుటుంబం. అలాగే ఈ వేడుకలో రాధికా మర్చంట్ తన ప్రిన్స్, అనంత్ అంబానీతో రియల్ లైఫ్ సిండ్రెల్లాలా మెరిసిపోయింది. రాధిక, నీలిరంగులో ఉన్న కార్సెట్ గౌనులో అందంగా కనిపించింది. దీనికి బ్లూ డైమండ్, బ్లూ సఫైర్ నెక్లెస్, చెవిపోగులు ధరించింది. అటు అనంత్ అద్భుతమైన లుక్స్తో ఆకట్టుకున్నాడు. అనంత్ బూజీ బ్లాక్ సెల్ఫ్ డిజైన్ చేసిన బ్లాక్ టక్సేడోలో అందంగా కనిపించాడు. అందంతో మెరిసిపోతున్న ప్రేయసిని చూసి అనంత్ అంబానీ, అటు పెళ్లి కళ ఉట్టిపడుతున్నకాబోయే కోడల్ని చూసి ముఖేష అంబానీ కూడా మురిసిపోయారు. ఇదే ఈవెంట్లో పింక్ డియోర్ దుస్తులు ధరించింది రాధిక. ఈ గౌను ధర సుమారు మూడులక్షలట. అలాగే ఈ సందర్భంగా ఆమె ధరించిన బ్యాగ్ ధర రూ. 26లక్షలట. ఇటలీలోని పోర్టోఫినోలో జరిగిన ఈవేడుకకు దాదాపు 800 మందికి పైగా అతిథులుతో 7500 కోట్లతో ఘనంగా జరిగిందీ వేడుక. జూలై 12న లవ్బర్డ్స్ అనంత్- రాధిక పెళ్లి పీటలెక్కనున్నారు.
న్యూస్ పాడ్కాస్ట్
లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించిన ఎన్డీయే.. బీజేపీకి కూటమికి 292 స్థానాలు, ఇండియా కూటమికి 234 స్థానాలు.. 240 సీట్లకే పరిమితమైన బీజేపీ, మెజారిటీ కంటే 32 స్థానాలు తక్కువ.. 99కి పెరిగిన కాంగ్రెస్ బలం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా ఈరోజే వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి, రీప్లేస్మెంట్ మనమే.. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
మళ్లీ విజయం మనదే, ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం... ‘ఎక్స్’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు కేరళకు నైరుతి రుతుపవనాల రాక.. రెండు రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నాయకులు చల్లే బురదలోనే కమలాలు విరగబూస్తాయి.. ప్రధాని మోదీ ధీమా.. ఇంకా ఇతర అప్డేట్స్
మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్నికల్లో విపక్ష ‘ఇండియా’ కూటమి గెలిస్తే హిందువులు రెండో తరగతి పౌరులే.. ప్రధాని మోదీ ఆందోళన.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
సీనియర్ ఐఏఎస్ ఇంట్లో విషాదం : చందమామలాంటి కుమార్తె తిరిగి రాని లోకాలకు
భార్యభర్తలిద్దరూ ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. వీరికి అందమైన కుమార్తె. చదువులో కూడా బాగా రాణిస్తోంది. ఇంతలోనే అనూహ్య పరిణామం వారి జీవితాల్లో తీరని అగాథాన్ని నింపింది. ఉన్నత చదువులు చదువుకుని తమకు మంచి పేరు తెస్తుందనుకున్న కుమార్తె అర్థాంతరంగా తనువు చాలించిన ఘటన కలకలం రేపింది.పోలీసులు అందించిన సమాచారం మహారాష్ట్రలో ఉన్నత పదవుల్లో ఉన్నారు వికాస్రస్తోగి, ఆయన భార్య రాధికా రస్తోగి. వికాస్ రస్తోగి మహారాష్ట్ర విద్యా శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, రాధికా రస్తోగి రాష్ట్ర హోం శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. వీరికి లిపి రస్తోగి (27)అనే కుమార్తె ఉంది. ఈమె హర్యానాలోని సోనేపట్లో న్యాయశాస్త్రం చదువుతోంది అయితే పరీక్షలకు సంబంధించిన ఒత్తిడి నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ముంబైలోని అపార్ట్మెంట్లోని 10వ అంతస్తు నుంచి దూకింది. లిపిని వెంటనే జిటి ఆసుపత్రికి తరలించి నప్పటికీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదని మృతికి ఎవరినీ నిందించవద్దంటూ పేర్కొన్న సూసైడ్ నోట్ని అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు కాగా 2017లో ఇదే తరహాలో మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారులు మిలింద్, మనీషా మహీస్కర్ జంట 18 ఏళ్ల కుమారుడిని కోల్పోయారు.
‘పాపం..దొంగ గారు.. ఏసీ చూడగానే ఫ్లాట్!’ కట్ చేస్తే..!
దేశంలోఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోద వుతున్నాయి. ఏసీ, ఫ్యాన్లు లేనిదే క్షణం కూడా ఉండలేని పరిస్థితి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. చోరీకి వచ్చిన ప్రబుద్ధుడు, ఎంచక్కా ఏసి వేసుకొని ఆదమరిచి నిద్ర పోయిన ఘటన, ఫోటో వైరల్గా మారింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న ఇంట్లోకి చోరీకి చొరడ్డాడో వ్యక్తి. అసలే పగలూ రాత్రి తేడా లేకుండా మండే ఎండలు పైగా పూర్తిగా మద్యం మత్తులో ఉన్న అతగాడు, ఏసీ చూడగానే మైమరిచిపోయాడు. ఏసీ ఆన్ చేసుకొని, నేలమీదే ఒక దిండు వేసుకుని హాయిగా గుర్రు కొట్టి నిద్ర పోయాడు. తెల్లవారేక ఇంటి ముందు గేటు తెరిచి ఉండడంతో వారణాసిలో విధులు నిర్వహిస్తున్న సదరు ఇంటి యజమాని డాక్టర్ సునీల్ పాండేకు సమాచారం అందించారు పొరుగువారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి చ్చింది. సంఘటనా చేరుకున్న పోలీసులు కూడా విస్తుపోయారు. చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని అలాగే గాఢనిద్రలోకి జారుకున్నాడు. చిత్రం వైరల్గా మారింది. దొంగ తనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి నిద్రపోయాడని డీసీపీ నార్త్ జోన్ ఆర్ విజయ్ శంకర్ తెలిపారు. అతణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు.
అత్తింటి వేధింపులతో గర్భిణి బలవన్మరణం
పెనమలూరు: కృష్ణాజిల్లా పెనమలూరు మండలం యనమలకుదురులో ఓ గర్భిణి బలవన్మరణానికి పాల్పడింది. వారసుడు కావాలని అత్తింటివారు వేధించడంతో కడుపులో ఉన్న ఆడబిడ్డను చంపలేక తానే ప్రాణాలు తీసుకుంది. సీఐ టి.వి.వి.రామారావు కథనం మేరకు.. యనమలకుదురు పుట్టరోడ్డుకు చెందిన కావ్యశ్రీ (19)కి రెండేళ్ల కిందట విజయవాడ కండ్రికకు చెందిన సందు శ్రీకాంత్తో(31) వివాహమైంది. శ్రీకాంత్ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. పదినెలల కిందట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కావ్యశ్రీ, ఇటీవల మళ్లీ గర్భం దాల్చింది. ఆమెకు ప్రస్తుతం ఐదో నెల. భర్త శ్రీకాంత్ నాలుగు రోజుల క్రితం కావ్యశ్రీకి విజయవాడలో స్కానింగ్ చేయించగా, ఆడపిల్ల పుడుతుందని అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో దంపతుల మధ్య గొడవ మొదలైంది. ఆడపిల్ల వద్దు, వారసుడే కావాలని కావ్యశ్రీపై భర్త శ్రీకాంత్తోపాటు అత్త వెంకటేశ్వరమ్మ, మామ లక్ష్మణరావు ఒత్తిడి తెచ్చారు. దీంతో భార్యాభర్తలు గత బుధవారం ఆస్పత్రికి వెళ్లగా, అబార్షన్ చేస్తే ప్రమాదమని డాక్టర్ హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. అయితే శ్రీకాంత్ స్నేహితుడు కానిస్టేబుల్ శ్యామ్ తన పరపతితో అబార్షన్ చేయిస్తానని చెప్పడంతో భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ మొదలైంది. అబార్షన్ చేయించుకోనని కడుపులో బిడ్డను చంపలేనని శుక్రవారం రాత్రి కావ్యశ్రీ తన భర్తకు తేల్చి చెప్పింది. శనివారం ఉదయం భార్యాభర్తలు మళ్లీ అబార్షన్ విషయమై చర్చించుకున్నారు. అనంతరం కావ్యశ్రీ స్నానానికి వెళ్తూ భర్తకు ఫోన్ ద్వారా ఓ మెసేజ్ చేసింది. ‘తాను వారసుడిని ఇవ్వలేనని,..కడుపులోని బిడ్డను చంపలేనని.. తనను ఛీదరించుకోవద్దని.. పదినెలల కుమార్తెను తన తల్లిదండ్రులే పెంచాలని..తనను క్షమించాలని’ ఆ మెసేజ్లో పేర్కొంది. కావ్యశ్రీ బాత్రూమ్ నుంచి ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కటుంబసభ్యులు, భర్త బాత్రూమ్ తలుపులు తెరిచి చూడగా వెంటిలేటర్కు కావ్యశ్రీ ఉరేసుకుని కొనఊపిరితో ఉంది. ఆమెను వెంటనే కానూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ పరిస్థితి విషమించడంతో కావ్యశ్రీ ఆదివారం ఉదయం మృతి చెందింది. మృతిరాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కావ్యశ్రీ భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యార్థినులపై కామాంధుని వల
యశవంతపుర: రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఒకచోట కామాంధుల అఘాయిత్యాలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల పెన్డ్రైవ్ సంఘటన ఒకవైపు సంచలనం సృష్టిస్తుండగా, మరోవైపు ఉడుపిలోనూ అదే మాదిరి సంఘటన బయటపడింది. వ్యాపారవేత్త శ్రేయస్ నాయక్ (25) పలువురు బాలికలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. జిల్లాలోని కుందాపుర తాలూకాలో అమావాస్యె బైలు పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. శ్రేయస్పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేయటంతో పరారయ్యారు. విద్యార్థులపై లైంగిక దాడులు జరిపి అశ్లీల వీడియోలను తీసి తన ల్యాప్లాప్లో ఉంచుకున్నట్లు బయట పడింది.ఎక్కువగా కాలేజీ విద్యార్థులను మాయమాటలు చెప్పి గత సంవత్సరం నుంచి లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఉడుపిలో హాలాడి రోడ్డులోని హెగ్గూడ్లులోని ప్రాంతానికి తీసుకెళ్లి కారులో లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన్నట్లు అరోపణలు వస్తున్నాయి. వీడియోలు తీసుకున్న నిందితుడు వాటిని చూపి తను పిలిచినప్పుడు రావాలని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఒక బాలిక అతని వల్ల గర్భవతి కూడా అయ్యింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో మే 18న పోక్సో కేసు నమోదైంది. ఆ తరువాత విచారణలో అతని అకృత్యాలు ఒక్కొక్కటే వెలుగుచూశాయి. అంతలోనే దుండగుడు పరారయ్యాడు. శ్రేయస్ అరెస్ట్కు పోలీసు బృందాలు గాలింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డా.కె.అరుణ్ ఆదివారం తెలిపారు. నర్సుపై వైద్యుని అకృత్యం ఉడుపి జిల్లాలో మరో ఘటనలో.. కుందాపుర తాలూకా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ రాబర్ట్ రెబల్పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సుపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు కుందాపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు రాబర్ట్ రెబల్ను సస్పెండ్ చేశారు. గర్భం దాల్చిన చిన్నారిదొడ్డబళ్లాపురం: అత్యాచారానికి గురైన బాలిక గర్భం దాల్చిన కేసులో ముగ్గురిని దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి పోలీసులు అరెస్టు చేసారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి మహమ్మద్ ఇక్బాల్ (26), ఫారూక్ (19), మరో మైనర్ బాలున్ని అరెస్టు చేశారు. నిందితులు కొన్ని నెలల క్రితం బాలికపై అత్యాచారం జరిపారు. బాలిక ఇప్పుడు ఆరునెలల గర్భంతో ఉండడంతో దారుణం వెలుగు చూసింది.