Top Stories
ప్రధాన వార్తలు
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ షెడ్యూల్ను సోమవారం ఆయన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 10 గంటలకు ఒంగోలు లోక్సభ స్థానం పరిధిలో ఉన్న కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరులో జరిగే ప్రచార సభలో.. మధ్యాహ్నం 12.30 గంటలకు కడప లోక్సభ స్థానం పరిధిలో ఉన్న మైదుకూరు నియోజకవర్గంలోని మైదుకూరు నాలుగు రోడ్ల జంక్షన్లో జరిగే సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట లోక్సభ స్థానం పరిధిలో ఉన్న పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
నేడే టెన్త్ ఫలితాలు..
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలవుతాయి. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం 11 గంటలకు ఫలితాలను అధికారి కంగా విడుదల చేస్తారు. టెన్త్ పరీక్షల విభా గం డైరెక్టర్ కృష్ణారావు ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఫలితాలను http:// results. bse.telangana.gov.in, http://results.bsetela అనే వెబ్సైట్లలో చూడవచ్చని తెలిపారు.‘సాక్షి’లో వేగంగా ఫలితాలు ఇంటర్మీడియెట్ ఫలితాలను అందించిన విధంగానే టెన్త్ ఫలితాలను శరవేగంగా అందించేందుకు ‘సాక్షి’ దినపత్రిక ఏర్పాట్లు చేసింది. అత్యాధునిక సాఫ్ట్వేర్ను అందిపుచ్చుకుంది.www.sakshieducation.com వెబ్సైట్కు లాగిన్ అయి ఫలితాలను చూడవచ్చు.
Horoscope Today: ఈ రాశులవారు శుభవార్తలు వింటారు..
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.సప్తమి రా.2.52 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: ఉత్తరాషాఢ రా.1.39 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ఉ.10.13 నుండి 11.45 వరకు, తదుపరి తె.5.28 నుండి 6.56 వరకు (తెల్లవారితే బుధవారం), దుర్ముహూర్తం: ఉ.8.08 నుండి 8.56 వరకు, తదుపరి రా.10.50 నుండి 11.38 వరకు, అమృతఘడియలు: రా.7.25 నుండి 8.46 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.39, సూర్యాస్తమయం: 6.14. మేషం: నూతన ఉద్యోగాలు. ఆకస్మిక ధనలాభం. వ్యవహారాలలో విజయం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.వృషభం: ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. పనుల్లో అవరోధాలు. మానసిక అశాంతి. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు.మిథునం: వ్యయప్రయాసలు.. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు ముందుకు సాగవు. వృత్తి,వ్యాపారాలలో మార్పులు.కర్కాటకం: వ్యవహారాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూలత.కన్య: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. సోదరులు, సోదరీలతో కలహాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.తుల: కుటుంబసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం. అనారోగ్య సూచనలు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.వృశ్చికం: శుభవార్తలు వింటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహమే.మకరం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.కుంభం: రాబడి నిరాశ పరుస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.మీనం: ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకర సమాచారం.
అమల్లోలేని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీడీపీ దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: ‘అమల్లో లేని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం చేస్తోంది. ఓటర్లను తప్పుదారి పట్టిస్తోంది. ఇది ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కు విరుద్ధం. టీడీపీపై తగిన చర్యలు తీసుకోండి’ అని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ సోమవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, న్యాయవాది కె.శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదుతోపాటు తగిన ఆధారాలను అందజేశారు. అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ నెల 28వ తేదీన కోడుమూరు, మంత్రాలయంలలో జరిగిన ప్రచార సభల్లో ప్రసంగిస్తూ సీఎం వైఎస్ జగన్పై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ ఈ నెల 28న ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజు ఎన్నికల కోడ్కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
ఊరూరా కళ్లెదుటే మార్పు ‘ప్రభుత్వ ఆస్పత్రులు బాగుండవని చాలా మంది అనుకుంటారు. మా బాపట్ల ప్రభుత్వాస్పత్రిని చూస్తే ఆ ఆలోచన కచ్చితంగా మారిపోతుంది. ఆపరేషన్ థియేటర్స్లో కూడా అత్యాధునిక ఎక్విప్మెంట్, అప్పుడే పుట్టిన చిన్నారుల కోసం ఇన్ఫాంట్ స్పెషల్ ఐసీయూ, సొంత ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. నాకు తెలిసి ఆ సౌకర్యం చాలా ప్రైవేటు ఆస్పత్రులకు ఇప్పటికీ లేదు’ అంటున్నారు సినీ దర్శకుడు, రచయిత కోన వెంకట్. చిన్న చిన్న గ్రామాల్లో కూడా హెల్త్ క్లినిక్స్, రూపురేఖలు మారిపోయిన పాఠశాలలు, డిజిటల్ బోధన కళ్లెదుటే కనిపిస్తోందని స్పష్టం చేస్తున్నారు. కళ్లెదుటే ఇంత మార్పునకు కారణం ముమ్మాటికీ సీఎం జగనే అని నొక్కి చెబుతున్నారు. ‘చెడు త్వరగా ప్రచారంలోకి వస్తుంది. అది వినడానికి కూడా ఎక్కువ మంది ఇష్టపడతారు. మంచి చెబితే ఏదో ఆశించి భజన చేస్తున్నాం అంటారు. అంటే అనుకోనీయండి. కానీ నిజం చెప్పకపోవడం అంటే అబద్ధాన్ని ప్రోత్సహించడమే అని నా అభిప్రాయం. అందుకే నేను నిజాలు చెబుతున్నాను’ అంటున్నారు సినీ దర్శక, రచయిత కోన వెంకట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా పరిశీలించి, వాటి గురించి ససాక్ష్యంగా వరుసగా ట్వీట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షితో ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. –సత్యార్థ్ బాపట్ల జిల్లా కర్రపాలెం మండలంలోని మారుమూల గణపవరం అనే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించా. అక్కడి పిల్లలతో కలిసి నిమ్మకాయ పులిహోర తిన్నా. రాగిజావ తాగా. ఉచితం అంటే ఎలా ఉంటాయో అని మనం అనుకుంటాం. కానీ మన అంచనాలన్నీ తప్పని అక్కడ ఆహారం తిన్నాక స్పష్టమైంది. అక్కడి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వడ్డించే పదార్థాలు ఎంతో రుచికరంగా ఉన్నాయి. అంతేకాదు ట్యాబ్స్, స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్స్, షూ, సాక్స్... అన్నీ నాణ్యమైనవే ఇచ్చారు. పాఠశాల వాతావరణం బాగుంటే సానుకూల ఫలితాలు వస్తాయి కదా... అదే ఇప్పుడు కనిపిస్తోంది. మేం చదువుకున్నప్పుడు ఇలాంటి వసతులు, సౌకర్యాలు ఉంటే మరింత బాగా రాణించేవాళ్లం కదా అనిపించింది. టీచర్లు, సిబ్బంది కూడా కొత్త ఉత్సాహంతో కనిపించారు. నాకు ఎంత ఆనందం కలిగిందంటే అప్పటికప్పుడు ఆ టీచర్లు అందరికీ శాలువాలు తెప్పించి సన్మానించాను. పల్లెలకు చికిత్స ప్రభుత్వ ఆస్పత్రులు.. అదీ మారుమూల గ్రామంలో ఎలా ఉంటాయో అనే దానిపై మనం ఒక మైండ్ సెట్తో ఉంటాం. అయితే మా బాపట్ల ప్రభుత్వాస్పత్రిని చూస్తే ఆ ఆలోచన కచ్చితంగా మారిపోతుంది. ఆపరేషన్ థియేటర్స్లో కూడా అత్యాధునిక ఎక్విప్మెంట్, అప్పుడే పుట్టిన చిన్నారుల కోసం ఇన్ఫాంట్ స్పెషల్ ఐసీయూ. అంతేకాదు.. సొంత ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. నాకు తెలిసి ఆ సౌకర్యం చాలా ప్రైవేటు ఆస్పత్రులకు ఇప్పటికీ లేదు. నేను వచ్చింది ప్రభుత్వ ఆస్పత్రికా, లేక కార్పొరేట్ ఆస్పత్రికా అన్న ఆశ్చర్యం కలిగింది. కొన్నేళ్ల క్రితం వరకూ గర్భిణులు సైతం డెలివరీల కోసం చీరాల, తెనాలి అంటూ పొరుగూళ్లకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడిక ఆ సమస్య లేదు. ఇక మరో మారుమూల ఉన్న కొత్త నందాయపాలెం అనే చిన్న గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ చూశా. అదీ అద్భుతం అనే చెప్పాలి. ఆ హెల్త్ క్లినిక్లో ల్యాబ్ కూడా పెట్టారు. అక్కడికక్కడ రక్త పరీక్షలు, బీపీ, షుగర్ టెస్ట్లు చేస్తూ మందులు ఇస్తున్నారు. అక్కడ సేవలందించే డాక్టర్స్ విశ్రాంతి తీసుకోవడానికి క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేశారంటే ఎంత పక్కా ప్రణాళికతో ఈ విలేజ్ క్లినిక్స్ని డిజైన్ చేశారో ఆలోచించండి. నా కళ్లు నేనే నమ్మలేనంత గొప్పగా ఇళ్లు పేదలకిచ్చిన ఇళ్లను గమనించడానికి మాకు సమీపంలో ఉన్న జగనన్న కాలనీలను సందర్శించా. చెబుతుంటే అతిశయోక్తిలా ఉంటుందేమో. హైదరాబాద్లోని గచ్చి»ౌలిలో ఉన్న విల్లా కమ్యూనిటీలాగా అనిపించింది. అది కూడా ఎక్కడో ఊరికి దూరంగా విసిరేసినట్టు కట్టిన కాలనీ కాదు. బాపట్ల ఎంట్రన్స్లో హైవే పక్కనే కట్టించి ఇచ్చారు. కేవలం ఇళ్లు ఇవ్వడమే కాదు చక్కగా, పరిశుభ్రంగా అన్ని వసతులతో నిర్వహిస్తున్నారు. అక్కడ తాపీ పనిచేసే ఒక ముస్లిం కుటుంబంతో పాటు అనేక మందితో ముచ్చటించినప్పుడు వాళ్ల కళ్లల్లోని ఆనందాన్ని చూస్తే పేదలకు ఇంతకన్నా మేలు చేసే ప్రభుత్వం ఉంటుందా? అనిపించింది. ఎందుకంటే వాళ్ల జీవితంలో ఇలాంటి ఇళ్లు కట్టుకోవడం అసాధ్యం. నాకు కూడా అలాంటి చోట ఒక ఇల్లు ఉంటే బాగుండు అన్నంత బాగుంది. రోడ్లపై జరుగుతోంది దు్రష్పచారమే...రహదారుల విషయంలో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం జరుగుతోంది. దీనిని నిర్ధారించుకోవడానికి నేను మా ఊరి చుట్టుపక్కల రహదారుల్ని సర్వే చేశాను. అదంతా అబద్ధమేనని తేలింది. మీరు నమ్ముతారా? మా బాపట్లకి అవుటర్ రింగ్ రోడ్ కూడా ఉంది. ఇక గ్రామ సెక్రటేరియట్స్, రైతు భరోసా కేంద్రాలు కూడా త్వరలో సందర్శిస్తాను. ఆం«ధ్రప్రదేశ్లో జరుగుతున్న మంచిని కనపడనీయకుండా, వినపడనీయకుండా చేయాలనే ఆలోచనతో విపక్షాలు, జగన్ శత్రువులు కుట్ర చేస్తున్నారు. నేను రాష్ట్రం మంచి కోరుకునే ఆంధ్రప్రదేశ్ పౌరుడ్ని. వృత్తి, వ్యాపకాల రీత్యా నేనెక్కడ స్థిరపడినా నా ఊరు బాగుపడుతుంటే ఆ ఊరంటే ప్రేమ ఉన్న నేనెందుకు గర్వంగా చెప్పుకోకూడదు? ఎవరేమనుకున్నా సరే.. నాకు కనపడిన మంచిని ప్రజలతో పంచుకుంటా. చిత్తశుద్ధి ఉన్న సీఎం గెలవాలి... వైఎస్సార్సీపీయా... బీజేపీయా... కాదు. పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉన్న జగన్ లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఆయనకు ఆ అవసరం లేకపోవచ్చు. నాన్న వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని తప్ప మరో కోరిక ఉండకపోవచ్చు. కానీ ఆయన సీఎంగా ఉండడం, మళ్లీ గెలవడం ఈ రాష్ట్రానికి... ముఖ్యంగా పేదలకు అవసరం. ఇలాంటి పాలన నిజంగా పేదలకు ఓ వరం.
సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లు
సాక్షి, అమరావతి: స్టార్ క్యాంపెయినర్లు.. ప్రతి పార్టీలోనూ ప్రముఖ నాయకులు వీళ్లు.. సభలకు వస్తారు.. చేతులూపుతారు.. ఏదేదో చెప్పేస్తారు.. వారి పార్టీ వారికి ఓటేయమని కోరుతూ ఓ దండం పెట్టేసి హెలికాప్టరో, విమానమో ఎక్కేసి వెళ్లిపోతారు. కానీ, జగన్ నేతృత్వంలోని ప్రజల పార్టీ అయిన వైఎస్సార్సీపీకి స్టార్లు, స్టార్ క్యాంపెయినర్లు కూడా సామాన్య ప్రజలే. జగన్ ప్రభుత్వం అందించిన చేయూతతో అభివృద్ధి సాధించి, కుటుంబ జీవన ప్రమాణాలను పెంచుకున్న సాధారణ ప్రజలే. చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా ఈ సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లుగా వైఎస్సార్సీపీ ఎన్నికల సమారానికి సిద్ధమైంది.ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారే తన స్టార్ క్యాంపెయినర్లంటూ సీఎం జగన్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. దీనినే కార్యరూపంలోకి తెస్తూ దేశంలో ఏ పార్టీ కనీసం ఆలోచన కూడా చేయలేని సాహసోపేత నిర్ణయం తీసుకుని, వైఎస్సార్సీపీ 12 మంది సామాన్యులతో తన రాష్ట్రస్థాయి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఎన్నికల కమిషన్కు అందజేసింది. వీరంతా జిల్లా, నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవుతారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయాన్ని వీరు సందర్శించారు. సీఎం వైఎస్ జగన్కు స్టార్ క్యాంపెనర్లుగా ఏ విధంగా మారారో వారిలో కొందరు వివరించారు. 50 ఇళ్లకు నేనే ఎమ్మెల్యేగా పనిచేశా ఈ ప్రభుత్వంలో వలంటీర్గా పనిచేశా. నా 50 ఇళ్లకు నేనే ఎమ్మెల్యే అన్నట్లు పనిచేశా. ప్రతి ఇంటికి వారికి ఏ పథకాలు అందాలో వాటన్నింటినీ పక్కాగా అందించాం. అదే ఊరికి చెందిన నాకు ఆ కటుంబాలు గతంలో ఎలా ఉండేవి, నవరత్నాలతో ఆర్థిక భరోసా అందిన తరువాత ఎలా మారాయో నాకు స్పష్టంగా కనిపించింది. ఈ ఐదేళ్లలో నిజమైన అభివృద్ధిని చూశా. ఆర్థిక కారణాలతో పిల్లలను చదువించుకోలేని ప్రతి కుటుంబానికీ సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. భర్త సంపాదన మీద మాత్రమే బతికే ప్రతి అక్కకు, చెల్లెమ్మకు సీఎం జగనన్న అండగా నిలిచి ఆర్థిక భరోసా కల్పించారు. ఏదో ఒక చిరు వ్యాపారం చేసుకునేలా తీర్చిదిద్దారు. ఈ ప్రభుత్వం మహిళలను నిజమైన ఇంటి యజమానిని చేసింది. నా క్లస్టర్లోని సగం కుటుంబాలు స్థానికంగా, పక్కనే ఉన్న పట్టణాల్లో సొంత వ్యాపారాలు ప్రారంభించాయి. తద్వారా ప్రతిరోజూ రూ. 1,000 వరకు సంపాదించుకుంటున్నాయి. వారి జీవితాల్లో చాలా మార్పు వచి్చంది. ఒక తల్లిగా ఆలోచిస్తే మా పిల్లలకు అవసరమైన చదువులు, అవసరాలు అన్నీ పాఠశాలల్లో లభిస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర భవిష్యత్తును మారుస్తున్న నాయకుడని నేను నమ్ముతున్నాను. – ఈశ్వరి, కొండపల్లి, ఎన్టీఆర్ జిల్లాసీఎం జగన్ చలవతో నా కుమారుడు అమెరికాలో చదువుతున్నాడు నాకు ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి కిషోర్ డిగ్రీ పూర్తి చేసి డిల్లీలోని మారుతి సుజుకీలో ఉద్యోగం చేసేవాడు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ పొలిటికల్ అఫైర్స్లో సీటు సంపాదించాడు. కోర్సు ఫీజు రూ.1.36 కోట్లు అవుతుందన్నారు. ఈ మాట నాకు చెప్పగానే కనీసం రూ. లక్ష అయినా మనం కట్టలేం.. మంచి ఉద్యోగం చూసుకో అని చెప్పా. ఆ తరువాత వైఎస్ జగన్ ప్రభుత్వంలో విదేశీ విద్య పథకం గురించి తెలుసుకుని దరఖాస్తు చేశాం.నా కొడుకు చదువుకు కావాల్సిన డబ్బు విదేశీ విద్య కింద మంజూరైంది. ఇప్పటికే రెండు సెమిస్టర్లు పూర్తి చేసిన నా కుమారుడికి రెండు దఫాలుగా రూ. 50 లక్షలు అందింది. ఇది చూసిన నాకు లక్ష రూపాయలు కట్టలేని నా కుమారుడు ఇంత పెద్ద మొత్తం ఫీజుతో విదేశీ విశ్వవిద్యాలయంలో చదవగలుగుతున్నాడని గర్వంగా అనిపించింది. ఒక్క నా కుమారుడే కాదు.. ఇలా చాలా మంది పేదల పిల్లలు విదేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఉన్నత విద్య చదువుతున్నారు. ఇదంతా సీఎం వైఎస్ జగన్ చలవే. అందుకే సీఎం జగన్ కోసం స్టార్ క్యాంపెయినర్ అయ్యాను. – పండలనేని శివప్రసాద్, మోపిదేవి మండలం, కృష్ణా జిల్లాసీఎం జగన్ ఆలోచనలకు సంపూర్ణ మద్దతు జగనన్న చేదోడు అందుకున్న మా ఇంటి పక్కనే నివాసం ఉండే శారద బట్టల షాపు ఏర్పాటు చేసుకుని కుటుంబానికి అండగా నిలుస్తోంది. దాసరి మహాలక్ష్మి అనే మహిళకు భర్త మరణిస్తే రూ. 2 లక్షల బీమా అందింది. దీంతోపాటు పెన్షన్, ఆసరా, అమ్మఒడి పథకాలూ అందుతున్నాయి. మాది కూడా నిరుపేద కుటుంబం. జగననన్న ప్రభుత్వంలో అందిన నవరత్నాలతో రోజు గడవడమే కష్టంగా ఉండే దుస్థితి నుంచి నిలకడ ఆదాయం అందుకునే స్థితికి వచి్చంది. మా కుటుంబాలను ఆర్థికంగా నిలబడేలా ఆదుకున్న ప్రభుత్వానికి మేమెందుకు అండగా నిలవకూడదు? పేదలను పేదరికం నుంచి తప్పించి మెరుగైన జీవితం కల్పించాలనే సీఎం జగన్ ఆలోచనకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. అందుకే సీఎం జగన్ కోసం స్టార్ క్యాంపెయినర్గా పనిచేసేందుకు ముందుకు వచ్చా. – ఎ. అనంతలక్ష్మి, రాజమండ్రి సిటీ నియోజకవర్గం, తూర్పు గోదావరి జిల్లాప్రభుత్వ పాఠశాలల్ని చూస్తే తేడా తెలుస్తుంది సీఎం జగన్ పరిపాలన ఏమిటో చెప్పేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలే ఉదాహరణ. నేను డిగ్రీ పూర్తి చేసి ఐదేళ్లే అయ్యింది. మేం చదువుకునే సమయంలో ప్రభుత్వ పాఠశాలలి్న, ఇప్పడు నాడు – నేడు కింద పూర్తిగా మారిన ప్రభుత్వ పాఠశాలలను చూస్తే తేడా అర్ధమవుతుంది. అప్పటి ప్రభుత్వ పాఠశాలలు తలుపులు లేక గేట్లు లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేవి. కనీసం బాలికలకు టాయిలెట్లు కూడా లేని దుస్థితి. ఇలాంటి స్కూళ్లలో బాలికల విద్య ఎలా ఉంటుందో మనం ఒక్కసారి ఆలోచిస్తే అర్ధమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే అంతర్జాతీయ స్థాయి. సకల సౌకర్యాలు, డిజిటల్ క్లాస్ రూంలు, ట్యాబ్లతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను బోధిస్తున్నారు. మరో పదేళ్లలో ఈ ప్రభుత్వ పాఠశాలల నుంచి బయటికి వచ్చే వారితో రాష్ట్రం మరో ఎత్తుకు ఎదుగుతుంది. ఇంగ్లిష్ చదువులతో కొన్ని లక్షల కుటుంబాల తలరాత మారిపోతుంది. సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రతి గ్రామానికి తీసుకొచ్చారు. వీటన్నింటినీ ప్రజలకు వివరిస్తాను. – అన్వర్, నెల్లూరు జిల్లాఒక అడుగు ముందుకు వేశాం ద్విచక్ర వాహనాలకు సీట్ కవర్లు కుట్టే ఒక చిన్న షాపు నాది. రోడ్డు పక్కన పెట్టుకున్నాను. నాకు ముగ్గురు పిల్లలు. నా రోజువారీ సంపాదన కుటుంబ పోషణకే సరిపోతుంది. పిల్లలను బాగా చదివించాలని ఆశ ఉన్నా చదివించే ఆర్థిక స్థోమత లేదు. 2019లో సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఇంజనీరింగ్లో చేరిన నా కొడుకుకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన పథకాలతో ఆదుకున్నారు. నా కుమారుడు బాగా చదువుకున్నాడు. రెండో కొడుకు కూడా ఫీజు రియింబర్స్మెంట్ డబ్బుతో డిగ్రీ చదువుతున్నాడు. మూడో కొడుకుకి అమ్మఒడి అందుతోంది. నా సంపాదన అరకొరే అయినా, నా పిల్లల చదువు ఏ ఆటంకం లేకుండా సాగుతోంది. పెద్ద కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం సాధించాడు. సీఎం జగన్ ఇచ్చిన ఒక్క పథకం కింద చదువుకున్న నా కొడుకు నా కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చాడు. మేము సమాజంలో ఒక అడుగు ముందుకు వేసినట్లైంది. ఇలాంటి వేలాది పేదింటి పిల్లలకు సీఎం జగన్ చదువులు చెప్పిస్తున్నారు. – కటారి జగదీష్ , మల్లవీధి, అనకాపల్లి
సెగలు.. భగభగలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా ఆత్మకూరులో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే సింహాద్రిపురం (వైఎస్సార్)లో 45.9, రామభద్రపురం (విజయనగరం) 45.1, కోడుమూరు (కర్నూలు) 44.8, సాలూరు (పార్వతీపురం మన్యం) 44.5, రాపూరు (నెల్లూరు) 44.4, లక్ష్మీనర్సుపేట (శ్రీకాకుళం) 44.3, మార్కాపురం (ప్రకాశం)లో 44.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా 59 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 78 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. మంగళవారం 61 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 173 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. వీటిలో శ్రీకాకుళంలో 13, విజయనగరం 24, పార్వతీపురం మన్యం 14, అనకాపల్లి 9, విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలంలోనూ తీవ్ర వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే కోస్తా జిల్లాలోని పలు మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని వివరించింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారిని చితకబాదిన నటి రాధ
సుందరా ట్రావెల్స్ చిత్ర కథానాయకి మరో వివాదంలో చిక్కుకున్నారు. దీంతో పోలీసులు కేసు గురించి విచారణ జరుపుతున్నారు. వివరాలు చూస్తే.. చెన్నై, నెర్కుం డ్రం, పల్లవన్నగర్ సమీపంలోని ఏరిక్కరై వీధికి చెందిన వ్యక్తి మురళీకృష్ణన్ (48) రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు, ఎల్ఐసీ ఏజెంట్గానూ వ్యవహరిస్తున్నారు. మురళీకృష్ణన్ మాట్లాడుతూ ద్వారకేశ్ అనే తన మిత్రుడికి నటి రాధ పరిచయం చేశానన్నారు. దీంతో ఆమె రెండేళ్ల క్రితం 90 వేలు బిట్ కాయిన్స్ పె ట్టుబడి పెట్టారన్నారు. అయితే అప్పటినుంచి అత ను ఆ బిట్ కాయిన్స్ను నటి రాధకు తిరిగి చెల్లించలేదన్నారు. దీంతో నటి రాధ ద్వారకేశ్ను పరిచయం చేసిన తనను ఆ బిట్ కాయిన్స్ తిరిగి చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేశారన్నారు. అలా రాధ, ఆమె తల్లి పల్లవి, కొడుకు మరో ముగ్గురు స్థానిక చూలైమేడులోని తన కార్యాలయానికి వచ్చి గొడవ చేశారన్నారు. వాగ్వాదం తరువాత నటి రాధ తనను కిందకు పడేసి కొట్టారన్నారు. దీంతో తన అనుచరు లు స్థానిక రాయపేటలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్చారని, తన తలకు మూడు కుట్లు పడ్డాయని చె ప్పారు. అనంతరం తాను స్థానిక వడపళనిలో పోలీస్స్టేషన్లో నటి రాధ, ఆమె కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కాగా పోలీసులు ఈ వ్యహారంపై విచారణ జరుపుతున్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ‘తిరుగు’పాట్లు!
సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని తిరుగుబాటు అభ్యర్థులు హడలెత్తిస్తున్నారు. 16 నియోజకవర్గాల్లో రెబల్స్ పోటీలో ఉండడంతో కూటమి అభ్యర్థులకు కునుకు కరువైంది. వాస్తవానికి 30కిపైగా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొనగా నయానో భయానో కొందరిని రేసు నుంచి తప్పించారు. 16 నియోజక వర్గాల్లో మాత్రం రెబల్స్ కూటమి పార్టీలను ధిక్కరించి తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇందులో తొమ్మిది చోట్ల టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులు ఉండగా.. ఏడు చోట్ల బీజేపీ, జనసేన తిరుగుబాటు అభ్యర్థులు రంగంలో నిలిచారు. తిరుగుబాటు అభ్యర్థులు కొందరికి గాజు గ్లాసు గుర్తు కేటాయించడం గమనార్హం. రాప్తాడులో రెబల్ పోటు శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడులో సాకే రాజేష్ కుమార్ రెబల్గా పోటీలో నిలిచారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఆయనపై తీవ్ర ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గలేదు. దీంతో అక్కడ టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ఓట్లకు గండి పడటం ఖాయమనే భయం టీడీపీని కలవరపెడుతోంది. నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ రెబల్ పసుపులేటి సుధాకర్ బరిలో దిగారు. సుధాకర్కు గాజు గ్లాసు గుర్తు కేటాయించడం టీడీపీకి సంకటంగా మారింది. చిత్తూరు జిల్లా సత్యవేడు స్థానాన్ని మొదటి నుంచి కష్టపడిన తనకు కాకుండా ఫిరాయింపు నేత ఆదిమూలానికి ఇవ్వడంతో జేడీ రాజశేఖర్ తిరుగుబాటు చేసి బరిలో నిలిచారు. అక్కడ అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఆ నియోజకవర్గంలోనే టీడీపీని మరో రెబల్ అభ్యర్థి యాతాటి రమేష్బాబు బెంబేలెత్తిస్తున్నారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి ఓటమే ధ్యేయంగా దామోదర్నాయుడు పోటీలో ఉన్నారు.రఘురామ గుండెల్లో రైళ్లు అనేక మలుపులు తిరిగిన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి స్థానంలోనూ టీడీపీకి రెబల్ బెడద తప్పలేదు. ఇక్కడ రఘురామకృష్ణంరాజుకు పోటీగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పోటీలో ఉన్నారు. ఆయన్ను బరిలో నుంచి తప్పించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. టీడీపీ ఓటమే లక్ష్యంగా శివరామరాజు మొదటి నుంచి ప్రచారం చేస్తూ ఆ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఏలూరు జిల్లా పోలవరం సీటును జనసేనకు ఇవ్వడంతో మొడియం శ్రీనివాస్ రెబల్గా బరిలోకి దిగారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సీటు దక్కలేదనే అసంతృప్తితో పరమట శ్యామ్కుమార్ పోటీలో నిలిచారు.టీడీపీ రెబల్ మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తువిజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత టీడీపీ రెబల్ అభ్యర్థిగా రేసులో నిలవడంతోపాటు ఆమెకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో కూటమి నేతలు కంగు తిన్నారు. తనకు సీటు ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశారంటూ మీసాల గీత రెబల్గా నామినేషన్ వేశారు. అశోక్గజపతిరాజు కుమార్తె అతిథికి సీటు ఇచ్చి తనను అవమానించారని, ఆమెను ఎలాగైనా ఓడిస్తానని మీసాల గీత శపథం చేశారు. గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ సోమవారం సాయంత్రం నుంచే గుర్తుతో కూడిన కరపత్రాలతో ఇంటింటి ప్రచారం చేయడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. అరకులో టీడీపీ రెబెల్గా సివేరి అబ్రహం పోటీలో ఉండడంతో కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు.బాలయ్యకు పరిపూర్ణానంద ఝలక్ కూటమి సీటు దక్కకపోవడంతో హిందూపురం నుంచి స్వామి పరిపూర్ణానంద బీజేపీ రెబల్గా బరిలో నిలిచారు. చంద్రబాబు పిలిచి మాట్లాడినా ఆయన వెనక్కి తగ్గగకుండా కూటమికి చెమటలు పట్టిస్తున్నారు. ఇక్కడ నుంచి బాలకృష్ణ పోటీ చేస్తున్న నేపథ్యంలో పరిపూర్ణానంద దెబ్బ ఏ స్థాయిలో ఉంటుందోనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎచ్చెర్ల, టెక్కలి, గన్నవరం, మాచర్ల, పోలవరంలోనూ బీజేపీ రెబల్స్ పోటీలో ఉన్నారు. పెడన, జగ్గంపేటలో జనసేన సీటు దక్కని నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు.ఫలించని సీఎం రమేష్ పైరవీలుఅనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, పాయకరావుపేట అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగలపూడి అనిత తమ స్థానాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తు కేటాయించకుండా చేసిన పైరవీలు ఫలించలేదు. సీఎం రమేష్ తన పలుకుబడి ఉపయోగించి కేంద్ర పెద్దల ద్వారా చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఎన్నికల అధికారులు గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్లు కోరిన చోట వారికి కేటాయించారు. జనసేన పోటీ చేసిన చోట్ల గాజు గ్లాస్ గుర్తును ఆ పార్టీకి కేటాయించాలని, పోటీ చేయని చోట ఫ్రీ సింబల్గా ప్రకటించి ఇండిపెండెంట్లకు కేటాయించవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. పాయకరావుపేట అసెంబ్లీ, అనకాపల్లి ఎంపీ స్థానానికి వడ్లమాని కృష్ణ స్వరూప్ దళిత బహుజన పార్టీ తరఫున నామినేషన్ వేశారు. తనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలని కోరారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిత ఆర్వో కార్యాలయానికి చేరుకుని అభ్యంతరం తెలిపినా ఫలితం దక్కలేదు. తాను కోర్టును ఆశ్రయిస్తానని కృష్ణ స్వరూప్ స్పష్టం చేయడంతో అధికారులు నిబంధనల ప్రకారం ఆయనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు.
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఐపీఎల్-2024లో కోల్కతా నైట్రైడర్స్ మరో అద్భుత విజయం సాధించింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయభేరి మోగించింది.154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కేవలం 3 వికెట్లు కోల్పోయి 16.3 ఓవర్లలోనే చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్లతో 68 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(33), వెంకటేశ్ అయ్యర్(26) నాటౌట్గా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టగా.. విలియమ్స్ఒక్క వికెట్ సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో టెయిలాండర్ కుల్దీప్ యాదవ్(35) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో చెలరేగగా.. వైభవ్ ఆరోరా, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు స్టార్క్, నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా కేకేఆర్ బౌలర్లు ఎక్స్ట్రాస్ రూపంలో ఏకంగా 13 పరుగులు సమర్పించుకున్నారు.
తప్పక చదవండి
- ‘గంట’కు రూ.100.!
- రియల్ ఎస్టేట్ వ్యాపారిని చితకబాదిన నటి రాధ
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- T20 WC: సచినే ఓపెనర్గా రాలేదు.. నువ్వెందుకు కోహ్లి?
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
సినిమా
పొలిమేర-2 చిత్రానికి అరుదైన ఘనత.. అదేంటంటే?
సత్యం రాజేశ్, బాలాదిత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పొలిమేర-2. గతేడాది రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్లో తెరకెక్కించారు. పొలిమేర బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.అయితే తాజాగా పొలిమేర-2 చిత్రం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు ఈ సినిమా ఎంపికైంది. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ వెల్లడించారు. చేతబడుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. త్వరలోనే ఈ మూవీ పార్ట్-3 ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.
బ్రహ్మాజీ కుమారుడు ‘గుట్టు చప్పుడు’ టీజర్
డాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘గుట్టు చప్పుడు’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్రావ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్గా ఆయేషాఖాన్ నటిస్తుంది. రొమాంటిక్ మాస్ యాక్షన్ లవ్, ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రాన్ని మణీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా సంగీత దర్శకుడిగా మారిన గౌర హరి సంగీత సారథ్యంలో వస్తున్న ఈ సినిమాను డాక్టర్ లివింగ్స్టన్ నిర్మిస్తున్నారు.బ్రహ్మాజీ మాట్లాడుతూ... 'టైటిల్కు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకూ పూర్తయినట్టు ఉంది. టీజర్ను సాయి దుర్గాతేజ్ ఆన్లైన్లోను, నేను ఆఫ్లైన్లోను విడుదల చేయడం సంతోషంగా ఉంది. మా అబ్బాయి నటిస్తున్న 3వ సినిమా ఇది. మంచి నిర్మాత, టెక్నీషియన్స్ కుదిరారు. భారీ బడ్జెట్తో తీశారు.ఈ టీజర్ చూసిన తర్వాత సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఇందులో ఎందుకో గానీ నాకు మాత్రం క్యారెక్టర్ ఇవ్వలేదు' అని నవ్వుతూ అన్నారు.నిర్మాత లివింగ్స్టన్ మాట్లాడుతూ... 'డైరెక్టర్ మణీంద్రన్ కథ చెప్పినప్పుడు ఎగ్జైట్గా ఫీలయ్యా. ఆయనతో నాకు 12 సంవత్సరాల అనుబంధం ఉంది. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు మంచి ఆర్టిస్ట్లు, టెక్నీషియన్స్తోనే చేయాలని ముందే డిసైడ్ అయ్యాము. అందుకే పాన్ ఇండియా రేంజ్కు ఎదిగిన సంగీత దర్శకులు హరి గారితో పాటు ఇతర టెక్నీషియన్స్ను కూడా మంచి వారిని ఎంచుకున్నాం. ఇదొక ప్రేమ, యాక్షన్, రొమాంటిక్తో పాటు మంచి మెసేజ్తో కూడిన సినిమా. హీరో సంజయ్ రెండు రకాల షేడ్స్ను అద్భుతంగా చేశారు. సినిమాలో ఇంకా మంచి స్టఫ్ ఉంది. క్లైమాక్స్ ఫైట్ను ముందుగా 15 లక్షలతో అనుకున్నప్పటికీ, క్వాలిటీ కోసం దాదాపు 75 లక్షల రూపాయలతో జహీరాబాద్ షుగర్ ఫ్యాక్టరీలో తీశాం.' అని ఆయన అన్నారు.
స్టార్ హీరోయిన్పై నెటిజన్స్ ఆగ్రహం.. ఎందుకంటే?
బాలీవుడ్ భామ కాజోల్ బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. అజయ్ దేవగణ్ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు ఓ కూతురు కూడా ఉన్నారు. ప్రస్తుతం దో పట్టి అనే చిత్రంలో కనిపించనుంది. అయితే తాజాగా ఓ రెస్టారెంట్కు వెళ్లిన కాజోల్ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. దీంతో ఆమె వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలసుకుందాం.ఇటీవల ముంబయి జుహూలోని ఓ రెస్టారెంట్కు కాజోల్ తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్లింది. అదే సమయంలో ఆమెకు వీరాభిమాని అయిన హోటల్ వెయిటర్ కాజోల్ను చూశాడు. ఆమె వద్ద నుంచి బిల్ తీసుకునే సమయంలో భావోద్వాగానికి గురయ్యాడు. తన అభిమాన నటిని చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.అయితే అతని తీరుపై కాజోల్ మండిపడింది. నాటకాలు ఆపి.. ముందు బిల్ తీస్కో అంటూ ర్యాష్గా మాట్లాడింది. అంతే కాకుండా ఇలాంటి వారిని వెయిటర్గా నియమించడంపై ఏకంగా మేనేజర్కు ఫిర్యాదు చేసింది. దీంతో కాజోల్ వ్యవహరించిన తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ అభిమాని అయినందుకు కనీసం అతనికి కృతజ్ఞతలు కూడా చెప్పలేకపోయారంటూ మండిపడుతున్నారు. కాజోల్ తీరుపై వెయిటర్ సోదరుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
స్టార్ హీరోకు కూతుర్ని.. నన్నే రూమ్కు వస్తావా అన్నాడు: వరలక్ష్మీ శరత్ కుమార్
కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ వరుస సినిమాలతో ట్రెండింగ్లో కొననసాగుతుంది. ఇండస్ట్రీలో ఒక ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందడమే కాకుండా అందుకు తగ్గట్లుగా.. తన మాట కూడా చాలా స్ట్రైట్గా ఉంటుంది. తప్పు చేస్తే ఎదుట ఉన్నది ఎంతటివారైనా సరే ముక్కు సూటిగా హెచ్చరిస్తుంది. తాజాగా ఆమె నటించిన లేడీ ఓరియెంటేడ్ సినిమా 'శబరి' మే 3న విడుదల కానుంది.సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా తన గతంలో జరిగిన ఒక సంఘటన గురించి పంచుకుంది. 'ఒక అమ్మాయి ఇండస్ట్రీలో రాణించడం అంత సులభం కాదు. నాన్నకు ఇష్టం లేకున్నా నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. నేను హీరోయిన్గా పేరుపొందుతున్న రోజుల్లో తమళనాడుకు చెందిన ఒక టీవీ ఛానల్ అధినేత నా ఇంటికి వచ్చాడు. ఒక ప్రాజెక్ట్లో నటించాలని కోరాడు.. అందుకు నేను కూడా ఒప్పుకున్నాను. కానీ, కొంత సమయం తర్వాత మనం మళ్లీ బయట కలుద్దామా..? అన్నాడు. ఎందుకు సార్ అని నేను అడిగిన వెంటనే.. ఏదైనా మాట్లాడుకుందాం రూమ్ బుక్ చేస్తాను కలుద్దాం అన్నాడు. ఒక స్టార్ హీరో కుటుంబానికి చెందిన నన్నే ఇలా అడిగితే మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంటి అని అతని మీద కేసు పెట్టాను. ఈ సంఘటన సుమారు ఆరేళ్ల క్రితం జరిగింది. ఇలాంటి వ్యక్తుల ఆటకట్టించాలని నేను 'సేవ్ శక్తి ఫౌండేషన్' స్థాపించాను.' అని ఆమె చెప్పింది.స్టార్ హీరో కూతురిని అయనంత మాత్రాన నాకు అవకాశాలు రాలేదు.. నన్ను కూడా చాలా సినిమాల్లో నుంచి తొలగించారు. కొంతమంది కమిట్మెంట్ అడగడం వల్ల చాలా సినిమాలను వదులుకోవాల్సి కూడా వచ్చిందని వరలక్ష్మీ తెలిపింది. సేవ్ శక్తి ఫౌండేషన్ ద్వారా చాలామంది ఆడబిడ్డలను రక్షించామని ఆమె చెప్పింది. ఎలాంటి ఆపద అయినా సరే తమ ఫౌండేషన్లోకి వచ్చి సాయం అడిగితే తప్పకుండా జరుగుతుందని ఆమె పేర్కొంది.
ఫొటోలు
బిజినెస్
భారీగా పుంజుకున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 215 పాయింట్లు లాభపడి 22,635 వద్దకు చేరింది. సెన్సెక్స్ 941 పాయింట్లు ఎగబాకి 74,671 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే, సన్ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, మారుతీసుజుకీ కంపెనీ షేర్లు నష్టాల్లో జారుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం రూ.3,408.88 కోట్ల విలువ చేసే వాటాలను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.4,356.83 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఈక్విటీల్లో మహిళల భాగస్వామ్యం ఎలా ఉందంటే..
ఈక్విటీ మార్కెట్లో మహిళా పెట్టుబడిదారుల భాగస్వామ్యం పెరుగుతోంది. వారి సగటు పోర్ట్ఫోలియో పరిమాణం రూ.55,454గా ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇది ఈక్విటీ పెట్టుబడిదారుల జాతీయ సగటు కంటే ఎక్కువ. ఈక్విటీలో పెట్టుబడిపెట్టే మొత్తం మహిళల్లో మెజారిటీ (68%) రూ.1 లక్షలోపు పోర్ట్ఫోలియో కలిగి ఉన్నారని ఆన్లైన్ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ ఫైయర్స్ డేటా ద్వారా తెలిసింది.ఈ నివేదిక ప్రకారం 21% మహిళలు రూ.1 లక్ష-రూ.5 లక్షల వరకు పోర్ట్ఫోలియో కలిగి ఉన్నారు. 11% మంది రూ.5 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. మహారాష్ట్రలోని మొత్తం ఇన్వెస్టర్లలో దాదాపు మహిళలు సగం మంది ఉన్నారు. మొత్తం మహిళా పెట్టుబడిదారుల్లో 22.38% మంది మహారాష్ట్ర వారే. ఆంధ్రప్రదేశ్లో 10.68%, కర్ణాటక 7.65%, కేరళ 5.78% మంది మహిళలు ఈక్వీటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.ఇదీ చదవండి: బ్యాంకుల్లో రుణవృద్ధి తగ్గుతుందన్న ప్రముఖ సంస్థమహిళా వ్యాపారులు ఉన్న మొదటి ఐదు నగరాల్లో ముంబై (4.16%), బెంగళూరు (4.19%), పుణె (3.93%), థానే (2.66%), హైదరాబాద్ (2.62%) ఉన్నాయి. 26-55 ఏళ్ల వయసు ఉన్న మహిళలు 58% మంది ఉన్నారు. ఫైయర్స్ ప్లాట్ఫారమ్లో మహిళా పెట్టుబడిదారులు నెలకు 5% స్థిరమైన వృద్ధితో పెరుగుతున్నారని డేటా ద్వారా తెలిసింది.
అభివృద్ధి చెందే రంగాలు ఇవే.. నిర్మలా సీతారామన్
ఢిల్లీ: 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. వికసిత భారత్ సాధ్యమవుతుందని, ఇండియా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని 'నరేంద్ర మోదీ' గతంలో చాలా సార్లు చెబుతూనే వచ్చారు. ఈ విషయం మీద కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు.ఎవరు ప్రధానమంత్రి అయినా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని చిదంబరం అన్నారు. ఈ మాటలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా విమర్శించారు. 2004 - 2014 మధ్య జీడీపీ కేవలం రెండు ర్యాంకులు మాత్రమే పెరిగిందని సోమవారం ఉదయం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన విక్షిత్ భారత్ అంబాసిడర్ క్యాంపస్ డైలాగ్ సభలో వెల్లడించారు.2004 నుంచి 2014 వరకు అప్పటి ప్రభుత్వం పదేళ్లలో కేవలం రెండు ర్యాంకులు జీడీపీ పెంచింది. ఆ తరువాత పదేళ్ల మోదీ పాలనలో జీడీపీ ఐదు ర్యాంకులకు ఎగబాకింది. రాబోయే రోజుల్లో మళ్ళీ మోదీ ప్రభుత్వం వస్తే.. తప్పకుండా జేడీపీ మరింత పెరుగుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు.ఆర్ధిక వ్యవస్థ 2014కు ముందు బాగా తగ్గింది. చెడు విధానాలు, భారీ అవినీతి కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినింది. ప్రస్తుతం భారతదేశ జీడీపీ అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తరువాత ఐదో స్థానంలో ఉంది. రానున్న రోజుల్లో ఇది మూడో స్థానానికి చేరుతుంది. అది మోదీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని సీతారామన్ అన్నారు.భారతదేశంలో ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ ఎలా ఉందనే విషయాలను నిర్మల సీతారామన్ వివరించారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో పునరుత్పాదక వస్తువులు, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ, గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆగ్రో-ప్రాసెసింగ్ రంగాలు మరింత అభివృద్ధి మార్గంలో నడుస్తాయని స్పష్టం చేశారు.
బ్యాంకుల్లో రుణవృద్ధి తగ్గుతుందన్న ప్రముఖ సంస్థ
భారతీయ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్, లాభాల విషయంలో ఆశించిన వృద్ధి నమోదవుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ తెలిపింది. అయితే అనుకున్న మేరకు డిపాజిట్లు రావని, దాంతో రుణ వృద్ధి తగ్గుతుందని సంస్థ అంచనా వేసింది.ఆసియా-పసిఫిక్ 2క్యూ 2024 బ్యాంకింగ్ అప్డేట్ కార్యక్రమంలో ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ నికితా ఆనంద్ మాట్లాడారు. ‘గతేడాదిలో 16 శాతం వృద్ధి నమోదుచేసిన రిటైల్ డిపాజిట్లు ఈ ఏడాది 14 శాతానికి పరిమితం కానున్నాయి. ప్రతి బ్యాంకులో రుణం-డిపాజిట్ల నిష్పత్తిలో తేడా ఉండనుంది. లోన్వృద్ధి డిప్లాజిట్ల కంటే 2-3 శాతం ఎక్కువగా ఉండనుంది. ఈ ఏడాదిలో బ్యాంకులు తమ రుణ వృద్ధిని తగ్గించి, డిపాజిట్ల పెంపునకు కృషి చేయాలి. అలా చేయకపోతే బ్యాంకులు నిధులు పొందడానికి కొంత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది’ అని చెప్పారు. సాధారణంగా రుణ వృద్ధిలో ప్రైవేట్ రంగ బ్యాంకులు 17-18 శాతం వృద్ధి నమోదుచేస్తాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సరాసరి 12-14 శాతం మేరకు రుణ వృద్ధి ఉంటుంది.
వీడియోలు
బాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది: సజ్జల
పోయేకాలం వచ్చినప్పుడు విలన్లకి హీరో ఎప్పుడూ బచ్చానే..!
ఇదొక్కటి చాలు.. చంద్రబాబు మోసాలు చెప్పడానికి
జనసేన రెబల్స్ కు గాజుగ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ కు భారీ షాక్..!
అయ్యా చంద్రబాబు నువ్వు పుడింగి అయితే..బాబు ను ఏకిపారేసిన సీఎం జగన్
మరో రెండు వారాల్లో కురుక్షేత్రం..!
యాదవుల కోసం ప్రత్యేక జీవో..!
పొన్నూరు చేరుకున్న సీఎం జగన్
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ పొన్నూరు (గుంటూరు జిల్లా)