Top Stories
ప్రధాన వార్తలు
నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 10 గంటలకు రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలోని రాజానగరం నియోజకవర్గంలో ఉన్న కోరుకొండ జంక్షన్లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం లోక్సభ స్థానం పరిధిలోని ఇచ్ఛాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం లోక్సభ పరిధిలో గాజువాక నియోజకవర్గంలో ఉన్న పాత గాజువాక సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
updatesమహారాష్ట్ర:షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిని, ప్రణితి షిండే, మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే ఓటు వేశారు.#WATCH | Solapur: Congress Solapur Lok Sabha candidate Praniti Shinde and Former Maharashtra CM Sushil Kumar Shinde cast their votes at a polling booth in Solapur. BJP has fielded Ram Vitthal Satpute from Solapur. BJP's Dr.Jaisiddeshwar Shivacharya Mahaswamiji is the sitting MP… pic.twitter.com/6468jda0Af— ANI (@ANI) May 7, 2024కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, ఆయన కుమారుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఓటు వేశారు.#WATCH | Former Karnataka CM BS Yediyurappa and his sons - state BJP chief BY Vijayendra and sitting MP & party candidate from Shimoga, BY Raghavendra - cast their votes at a polling booth in Shivamogga.Congress has fielded Geetha Shivarajkumar and BJP's K.S. Eshwarappa is… pic.twitter.com/U6HQw0J2zU— ANI (@ANI) May 7, 2024ఓటు వేసిన ప్రధాని మోదీప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Prime Minister Narendra Modi shows his inked finger after casting his vote at a polling booth in Ahmedabad, Gujarat#LokSabhaElections2024 pic.twitter.com/OI0LzIJ0dQ— ANI (@ANI) May 7, 2024 అహ్మదాబాద్లోని నిశాన్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో మోదీ ఓటు చేశారు.Prime Minister Narendra Modi casts his vote for #LokSabhaElections2024 at Nishan Higher Secondary School in Ahmedabad, Gujarat pic.twitter.com/5r6Hsm1AZ3— ANI (@ANI) May 7, 2024 బీజేపీ నేత హరనాథ్ సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్లోని ఎటా పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారుBJP leader Harnath Singh Yadav casts his vote at a polling booth in Etah, Uttar PradeshBJP has fielded Rajveer Singh, the son of former Uttar Pradesh CM and BJP leader Kalyan Singh from the Etah Lok Sabha constituency. He is pitted against SP's Devesh Shakya and BSP's Mohammad… pic.twitter.com/8e3f1zIdAu— ANI (@ANI) May 7, 2024 మధ్య ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు ఖజురహో అభ్యర్థి వీడీ శర్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు.భోపాల్లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Madhya Pradesh BJP President and candidate from Khajuraho constituency VD Sharma casts his vote at a polling booth in Bhopal. BJP has fielded Alok Sharma from here, Congress has fielded Arun Shrivastava. BJP's Sadhvi Pragya Singh Thakur is the sitting MP from the… pic.twitter.com/34ZA8VRERu— ANI (@ANI) May 7, 2024 కర్ణాటకలోని కలబురిగి పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి డా. ఉమేష్ యాదవ్ ఓటు వేశారు.#WATCH | Karnataka: BJP candidate Dr Umesh Jadhav shows the indelible ink mark on his finger after casting his vote at a polling booth in Kalaburagi.Congress has fielded party chief Mallikarjun Kharge's son-in-law Radhakrishna Doddamani against him from here.… pic.twitter.com/6TQNcePEvq— ANI (@ANI) May 7, 2024ఓటు వేయాలని ప్రధాని మోదీ ట్వీట్..‘నేటి మూడో దశలో రికార్డు స్థాయిలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీ చురుకైన భాగస్వామ్యం ఖచ్చితంగా ఎన్నికలను ఉత్సాహంగా మారుస్తుంది’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.Urging all those who are voting in today’s phase to vote in record numbers. Their active participation will certainly make the elections more vibrant.— Narendra Modi (@narendramodi) May 7, 2024 లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రారంభమైందిఓటు వేయడానికి ప్రజలు క్యూ లైన్లలో నిల్చుంటున్నారుVoting for the third phase of #LokSabhaElections2024 begins. Polling being held in 93 constituencies across 11 states and Union Territories (UTs) today.17.24 crore voters are casting their votes today. pic.twitter.com/CpQ7gGurNG— ANI (@ANI) May 7, 2024 నేడు లోక్ సభ మూడో విడత ఎన్నికల పోలింగ్ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6వరకు పోలింగ్11 రాష్ట్రాల్లోని 93 ఎంపీ సీట్లకు ఎన్నికలుఎన్నికల బరిలో 1352 మంది అభ్యర్థులుగుజరాత్ , మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ సహ పలు రాష్ట్రాలలో ఎన్నికలుఅహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాఓటు హక్కు వినియోగించుకోనున్న 17.24 కోట్ల మంది ఓటర్లు1.85 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘంఓటు హక్కు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఎస్ఎంఎస్ / వాట్సాప్ మెసేజ్ లు పంపుతున్న ఎన్నికల సంఘంమూడో విడత పోలింగ్ రోజున సాధారణ వాతావరణమే ఉంటుందని అంచనాలువడగల్పుల ప్రభావం తట్టుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, నీళ్లు, ఓఆర్ఎస్ ఏర్పాటుచేసిన ఈసీఎన్నికల ను ప్రత్యక్షంగా చూసేందుకు 23 దేశాల ప్రతినిధులను ఆహ్వానించిన ఈసీపరస్పర వివాదాస్పద ఆరోపణలు, ఈసీకి ఫిర్యాదు లతో రాజకీయ పార్టీలు పెంచిన ప్రచారవేడి చల్లారాక నేడు కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశ పోలింగ్కు సిద్ధమైంది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ దశతో గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్లోని అన్ని స్థానా లకూ పోలింగ్ పూర్తి కానుంది. ఈ రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగిన విష యం తెల్సిందే. ఈసారి మూడో దశలో 120 మంది మహిళలుసహా 1,300కు పైగా అభ్యర్థులు పోటీపడు తున్నారు.బరిలో అగ్రనేతలు, ప్రముఖులు కేంద్రమంత్రులు అమిత్ షా(గాంధీనగర్), జ్యోతిరాదిత్య సింధియా(గుణ), మన్సుఖ్ మాండవీయ(పోర్బందర్), పురుషోత్తం రూపాలా(రాజ్కోట్), ప్రహ్లాద్ జోషి (ధార్వాడ్), ఎస్పీ సింగ్ బఘేల్(ఆగ్రా)మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు శివరాజ్సింగ్ చౌహాన్(విదిశ), దిగ్విజయ్సింగ్(రాజ్గఢ్), ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై (హవేరీ), బారామతిలో వదినా, మరదళ్లు సునేత్రా పవార్, సుప్రియా సూలే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.283 చోట్ల పోలింగ్ పూర్తిఇప్పటికే గుజరాత్లోని సూరత్ నియోజక వర్గంలో బీజేపీ ఏకగ్రీవంగా గెల్చింది. గతంలో వాయిదాపడిన బైతుల్ నియోజ కవర్గంలో ఈరోజే పోలింగ్ నిర్వహిస్తు న్నారు. మూడోదశలో 11 కోట్లకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పశ్చిమబెంగాల్లో ఈరోజు పోలింగ్ ఉన్న నాలుగు స్థానాల్లోనూ ముస్లిం ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. కర్ణాటకలో ఈరోజు పోలింగ్ ఉన్న 14 స్థానాలనూ 2019 ఎన్నికల్లో బీజేపీ క్వీన్స్వీప్ చేసింది. మూడో దశ ముగిస్తే మొత్తం 543 స్థానాలకుగాను ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283కి చేరుకుంటుంది. నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్ ఒకటో తేదీన నిర్వహిస్తారు. అన్ని స్థానాలకు ఓట్ల లెక్కింపును జూన్ 4న చేపడతారు.రాష్ట్రం సీట్లుగుజరాత్ 25కర్ణాటక 14మహారాష్ట్ర 11ఉత్తరప్రదేశ్ 10మధ్యప్రదేశ్ 9ఛత్తీస్గఢ్ 7బిహార్ 5అస్సాం 4బెంగాల్ 4గోవా 2దాద్రానగర్, హవేలీ, డయ్యూడామన్ 2
May 7th: ఏపీ ఎన్నికల సమాచారం
AP Political And Elections News Updates In Telugu9:39 AM, May 7th, 2024అన్నమయ్య రాజంపేటలో టీడీపీకి ఎదురుదెబ్బఅన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని ఊటుకూరు గ్రామంలో టిడిపికి గట్టి ఎదురు దెబ్బ...టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన వంద కుటుంబాలుతెలుగు తమ్ముళ్లకు YSRCP కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే అభ్యర్థి అకేపాటి అమరనాథ్ రెడ్డిజగనన్న అందిస్తున్న జనరంజక పాలన మెచ్చి వైఎస్సార్సీపీలో చేరామన్న స్థానికులు 9:23 AM, May 7th, 2024డబ్బుతో పట్టుబడ్డ టీడీపీ నేతపెందుర్తి నియోజకవర్గ పరిధిలోని వేపగుంట మీనాక్షి కన్వెన్షన్ వద్ద నగదుతో దొరికిన టీడీపీ నేతటీడీపీ నేత దంతులూరి వెంకట దుర్గ ప్రశాంత్ వర్మ నేతృత్వంలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రధాని మోదీ సభకు జనాలను తరలించిన జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు!జనాలకు నగదు పంపిణీ చేయడానికే తరలిస్తున్నారనే సమాచారంతో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులుతనిఖీల్లో వర్మ వద్ద లభించిన రూ.10 లక్షలకు ఎటువంటి ఆధారం లేకపోవడంతో సీజ్ చేసి పెందుర్తి పోలీసులకు అప్పగింత 8:50 AM, May 7th, 2024జనంలోకి జగన్ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినేడు మూడు జిల్లాల్లో ప్రచార భేరీరాజమండ్రి రాజానగరం నియోజకవర్గం పరిధిలోని కోరుకొండ జంక్షన్లో ప్రచారంమధ్యాహ్నం శ్రీకాకుళం ఇచ్ఛాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో ప్రచారంవిశాఖపట్నం లోక్సభ పరిధిలోని గాజువాక నియోజకవర్గం గాజువాక సెంటర్లో ప్రచారం8:23 AM, May 7th, 2024నేడు పవన్ ప్రచారం ఇలా..ప్రకాశం దర్శిలో పవన్ కల్యాణ్ ప్రచారంసాయంత్రం తిరుపతిలో చంద్రబాబుతో కలిసి బహిరంగ సభలో పాల్గొననున్న పవన్8:01 AM, May 7th, 2024హవ్వా.. ఇదేంది బాబూ!తీవ్రరూపం దాల్చిన చంద్రబాబు బూతు పురాణంపూర్తిగా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న చంద్రబాబుతనను ప్రజలు నమ్మట్లేదని ప్రచారంలో బూతుల పర్వం అందుకున్న టీడీపీ అధినేతసీఎం జగన్ ను కొట్టండి అనే దగ్గర నుంచి.. ఇప్పుడు చంపండి, నరకండి అనే స్థాయికి చేరిన చంద్రబాబుఓటమి భయంతో చంద్రబాబుకు మతి చెడిందన్న అనుమానంలో ప్రజలుబాబు బూతు పురాణంపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైస్సార్సీపీచంద్రబాబుపై చర్యలకు వెనుకడుగు వేస్తున్న ఎన్నికల కమిషన్7:25 AM, May 7th, 2024తప్పుడు పోస్టులపై ఈసీ సీరియస్.. కీలక ఆదేశాలుసోషల్ మీడియా లో తప్పుడు పోస్టులపై ఎన్నికల సంఘం సీరియస్ కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీమహిళల్ని కించపరచడం,మైనర్లతో ప్రచారం,జంతువులకు హాని తలపెడుతున్న వీడియోలు,ఫోటోలు నిషేధం.అలాంటి పోస్టులు ఈసీ నోటీసుకు వచ్చిన మూడు గంటల్లో గా తొలగించాలినిబంధనలు పాటించకుంటే ఆయా పార్టీల నాయకులపై కేసులు పెడతామని హెచ్చరిక. 6:59 AM, May 7th, 2024చిలకటూరిపేట పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. ఈసీ సీరియస్ చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఈసీ ఆదేశాలు.ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎం బ్యాలెట్(టెండర్ బ్యాలెట్) పేపర్లను ఇచ్చిన అధికారులు.అధికారుల నిర్లక్ష్యంతో 1219 మంది ఉద్యోగుల ఓట్లు చెల్లని వైనం.వీరందరికీ తిరిగి రెండు రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు.సంబంధిత అధికారులపై ఈనెల 9లోగా క్రమశిక్షణ చర్యలకు ఈసీ ఆదేశాలు6:45 AM, May 7th, 2024చంద్రబాబుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్సీఎం జగన్ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై సీఈసీ ఆగ్రహంఎన్నికల్ కోడ్ ను అతిక్రమించటంపై సీరియస్బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని వార్నింగ్ఏప్రిల్ 6న పెదకూరపాడు, 10న నిడదవోలు, తణుకు, 11న అమలాపురం, 15న పలాస, 17న పెడనలో జరిగిన సభల్లో సీఎంని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మాట్లాడిన చంద్రబాబు6:37 AM, May 7th, 2024భీమవరంలో టీడీపీ, జనసేన మధ్య రగడ..భీమవరంలో తెలుగు తమ్ముళ్లని ఉతికారేసిన జన సైనికులు!జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి ఆంజనేయులుకి ఏమాత్రం సహకరించని టీడీపీ.ప్రచారంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కవ్వింపులతో మొదలైన రగడసర్దిచెప్పేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల ముందే బాహాబాహీ.చేతికి దొరికిన వాటితో చితక్కొట్టిన జనసైనికులుఈ దెబ్బతో భీమవరంలో జనసేన గెలుపుపై ఆశలు గల్లంతు!6:30 AM, May 7th, 2024అబద్దం.. వాస్తవంఎన్నికల వేళ కూటమి కుట్రలుఏపీపై ఢిల్లీ పెద్దల తప్పుడు ప్రకటనలువాస్తవాలతో వివరించే యత్నం వీడియో పోస్ట్ చేసిన వైస్సార్సీపీమన రాష్ట్రంపై డిల్లీ పెద్దల తప్పుడు ప్రచారాలు Vs అసలు వాస్తవాలు! 💥#FactCheck#ProgressiveAP#YSJaganDevelopsAP #DevelopmentInAP pic.twitter.com/G2KbNXK9Pl— YSR Congress Party (@YSRCParty) May 6, 2024
Modi-CBN: దొందూ దొందే!
సాక్షి, అమరావతి: అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు.. ఇదీ చంద్రబాబు నైజం.. అయిదేళ్ల కిందట ప్రధాని మోదీని ఇష్టానుసారం తిట్టారు... ఆయన కుటుంబం గురించీ వ్యక్తిగత విమర్శలు చేశారు.. ప్రధాని మోదీ సైతం చంద్రబాబు వైఖరికి భిన్నం కాదని ఇప్పుడు నిరూపించుకున్నారు.. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని రాజమండ్రిలో తన హావభావ విన్యాసాలతో కాస్త వ్యంగాన్ని జోడించి నాడు ఎగతాళి చేశారు.. ఎద్దేవా చేశారు.. చంద్రబాబు అక్రమాలకు అంతులేదన్నారు. చంద్రబాబు అవినీతిని మోదీ దుమ్మెత్తి పోస్తే.. మోదీపై టెర్రరిస్టు ముద్ర వేసి, అలాంటి వ్యక్తిని ఇంకా అరెస్టు చేయకుండా ఎందుకు వదిలేశారని... చంద్రబాబు గతంలో తెగ రంకెలేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు 2024 ఎన్నికల సమయం.. వీరిద్దరూ కలిసిపోయారు.. గతాన్ని మరిచిపోయారు.. లేక మరిచిపోయినట్లు నటిస్తున్నారు కాబోలు. చంద్రబాబు స్క్రిప్టులో ఓ ముక్కను మోదీ నోట పలికిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు జాప్యానికి చంద్రబాబే కారణమని తెలిసినా.. అదే రాజమండ్రి వేదికగా జనం నవ్వుకునేలా ఆ నెపాన్ని ప్రధాని మోదీ జగన్ ప్రభుత్వంపై వేయడం హాస్యాస్పదం. ఐదేళ్ల వెనక్కి వెళ్తే.. రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబును ఉద్దేశించి ప్రధాని మోదీ తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. 2014–19 మధ్య ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న కాలంలో అమరావతి నుంచి పోలవరం వరకు ఆయా కార్యక్రమాలను కేవలం తన ఆస్తులు పెంచుకోవడానికి కోసం ప్రయతి్నంచారని బాబును మోదీ దుమ్మెత్తిపోశారు.... ప్రతిగా చంద్రబాబు సైతం మోదీపై ఇప్పటి దాకా దేశంలో మరే రాజకీయ పార్టీ సైతం చేయనంతగా వ్యక్తిగత స్థాయిలో విమర్శలకు దిగారు.2018లో చంద్రబాబు ఏన్డీఏ నుంచి ని్రష్కమించాక ప్రధాని మోదీ అప్పట్లో రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి వస్తే, చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండీ తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో నల్ల చొక్కాలు వేయించి, గో బ్యాక్ నినాదాలు చేయించారు. ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ అప్పట్లో టీడీపీ నేతలు నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసనలు తెలిపారు.ఆ సందర్భంగానే మోదీ చంద్రబాబును ఉద్దేశించి చేసిన ప్రసంగాల వీడియోలు సోషల్మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతూ వారిద్దరి ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేస్తున్నాయి. చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. వ్యక్తిగత అభివృద్ధిలో బిజీ అయిపోయారనీ అప్పట్లో ప్రధాని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియను తమకు కావాల్సినప్పుడు డబ్బులు డ్రా చేసిపెట్టే ఏటీఎం లాగానే చంద్రబాబు ఉపయోగించుకున్నారని ప్రధాని ఆరోపించారు.ప్రధాని నరేంద్ర మోదీ వివిధ సందర్భాల్లో చంద్రబాబుపై చేసిన విమర్శలు, ఆరోపణలు.. ‘లోకేష్ తండ్రి చంద్రబాబు నాకు సంపదను సృష్టించడం తెలియదని అన్నారు. అవును నిజమే. నాకు సొంత ఆస్తులు పెంచుకోవడం రాదు. అమరావతి నుంచి పోలవరం వరకు తన ఆస్తులు పెంచుకోవడానికి చంద్రబాబు ప్రయతి్నస్తున్నారు. సొంత ఆస్తులు పెంచుకునే ఆశ నాకు లేదు. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి (చంద్రబాబును ఉద్దేశించి) వాస్తవాలను వదిలిపెట్టి అసత్యాలు మాట్లాడుతున్నారంటే ఆయన ప్రజల మద్దతు కోల్పోయారని అర్ధం. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ వ్యక్తి ఏదో పెద్ద తప్పు చేశారనే అర్ధం...’‘ప్రజలారా మీరే చెప్పండి.. ఎన్టీఆర్ వారసత్వాన్ని తీసుకున్నాయన (చంద్రబాబును ఉద్దేశించి) ఎన్టీఆర్ కలలను సాకారం చేస్తానని మాటిచ్చారా లేదా...? ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తామని హామీ ఇచ్చారా లేదా?.. ఈ రోజు ఆయన ఎన్టీఆర్కు గౌరవమిస్తున్నారా?... సోదర సోదరీమణులారా మీకు ఈ విషయం అర్ధమవుతుంది. ఆయనలాంటి(బాబు) సీనియర్ నాయకుడికి ఎందుకు అర్ధం కావడం లేదు. పార్టీ చరిత్రనే ఆయన మరిచిపోయేంతటి ఒత్తిడి ఏం వచి్చంది. ఇదంతా యువత తెలుసుకోవాల్సిన అవసరముంది.. ఎన్టీఆర్ ఏపీకి కాంగ్రెస్ నుంచి విముక్తి కావాలనుకున్నారు. అందువల్లే తెలుగుదేశం అవిర్భవించింది. ఈ రోజు ఆ వారసత్వపు అహంకారాన్ని ఎదుర్కోవాల్సిన తెలుగుదేశం అధినేత అదే వంశపారంపర్య కుటుంబం ముందు మోకరిల్లారు. అప్పట్లో ఏపీని అవమానించిన కాంగ్రెస్ను దుష్టకాంగ్రెస్ అని ఎన్టీఆర్ అన్నారు. ఇప్పుడు చంద్రబాబు అదే కాంగ్రెస్తో దోస్తీ కట్టారు...’2019 ఫిబ్రవరి 10... గుంటూరు సభలో ప్రధాని మోదీ..‘చంద్రబాబుకు ఏమైంది. ఆయన నా కంటే చాలా సీనియర్నని మళ్లీ మళ్లీ నాకు గుర్తు చేస్తుంటారు. ఇందులో వివాదం ఏముంది. మీరు (చంద్రబాబు) సీనియర్. అందువల్లే గౌరవమిచ్చే విషయంలో ఎప్పుడూ తక్కువ చేయలేదు.. అవును మీరు సీనియర్ కూటములు మార్చడంలో.. కొత్త కూటములు కట్టడంలో.. మీ సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో.. ఈ రోజు ఎవరినీ తిడతారో.. రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో.. నేనైతే ఈ విషయాల్లో సీనియర్ను కానే కాదు...’‘కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను చేపట్టిన పథకాలపై.. చంద్రబాబు తన స్టిక్కర్ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. అద్భుతమైన అమరావతి నిర్మాణమంటూ వ్యక్తిగత అభివృద్ధిలో బిజీ అయిపోయారు. చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. కూలిపోతున్న తన పార్టీ నిర్మాణం...’2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు మోదీని ఉద్దేశించి వివిధ సందర్భాల్లో చేసిన తీవ్ర విమర్శలు... –మార్చి 29, 2018న అసెంబ్లీలో చంద్రబాబుబీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే ఇంకా 15 సీట్లు వచ్చేవి.. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం ఎన్డీఏ నుండి బయటకు వస్తే.. అది రాజకీయ ప్రయోజనాల కోసం అని మాట్లాడుతున్నారు. నిజంగా నేను రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనుకుని ఆనాడు బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే.. ఇంకో 15 సీట్లు ఎక్కువ వచ్చేవి...’ఫిబ్రవరి 8, 2019 తన ట్విట్టర్లో చంద్రబాబు‘దేశ రక్షణ రంగంలో అతి పెద్ద కుంభకోణంగా పేర్కొంటున్న రూ. 59,000 కోట్ల రఫెల్ ఒప్పందం, అందుకు సంబంధించిన నివేదికలు, ఇందులో నేరుగా ప్రధాని కార్యాలయ ప్రమేయం ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటుంటే, దానిపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వ విధ్వంసక నిర్ణయాలను తెలియజేస్తుంది. మోదీజీ... మీరు దేశాన్ని మోసం చేస్తే ఆ సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేరు...’ –2019 ఫిబ్రవరి 2న అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు..‘మీకూ, బ్రిటిష్ వాళ్లకూ తేడా ఏమిటి? వాళ్లే నయం. కాటన్ దొర ఇచి్చన నీళ్లయినా తాగుతున్నాం. మేము మీ బానిసలమా? రాజధానిని 50 ఏళ్లకు నిరి్మస్తారా ? నాలాంటి సీనియర్ నాయకుడు నల్ల చొక్కా వేసుకున్నానంటే వీళ్లు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ప్రజలు అర్ధం చేసుకోవాలి. 2002లో మోదీ, నిన్న అమిత్షా రాకీయాల్లో వచ్చారు. నేను 1978లోనే నేను ఎమ్మెల్యేనయ్యా. ప్రధాని మోదీని సార్ అంటూ గౌరవిస్తే అమరావతికి మట్టి, నీరు ముఖాన కొట్టిపోతారా?..’‘రాష్ట్రం కోసం 29 సార్లు తలవంచుకుని ఢిల్లీ వెళ్లా. కేంద్రం ముందు చేయి చాచా. ఎలాంటి కనికరం లేదు. ప్రజలుగా మీరు చెప్పండి...’ –2018 జూన్ 9న నెల్లూరులో సభలో చంద్రబాబు‘బీజేపీకి ఒకటే చెబుతున్నా, తెలుగుదేశంతో పెట్టుకుంటే ఖబడ్డార్.. మీ కుట్రలు ఏ రాష్ట్రంలోనైనా చెల్లుతాయోమో... ఆంధ్రప్రదేశ్లో మాత్రం సాగవు...’ –2018లో శృంగవరపుకోటలో జరిగిన నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు‘నేను ఎవరికీ భయపడేది లేదు, నరేంద్ర మోదీ, ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బందులు పెడితే భయపడే పిరికి పందను కాను. ఒక్కో రాష్ట్రంలో ఉండే నాయకత్వాన్ని బలహీన పరచడానికి, ఇష్టమొచి్చనట్లు ఆడుకోవడం వీళ్లకు అలవాటైంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలను చూశాను. ఎప్పుడూ భయపడలేదు. భయమనేది నా జీవితంలేదు. –2018లో మార్చి 6 న విజయవాడలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు...’2019 మార్చి 2వ తేదీన విశాఖపట్నం సభలో ప్రధాని మోదీ..‘దేశం కోసం మేం గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామంటే మాకెటువంటి బెరుకూ లేదు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే వెనుక ఎవరైనా వచ్చి మా ఫైళ్లు తెరుస్తారనో, అవినీతి ఆరోపణలు చేస్తారనో భయం నాకే మాత్రం లేదు. ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు (చంద్రబాబును ఉద్దేశించి) భయపడాలి. ఎందుకంటే వారు చేసిన అవినీతి వారిని ఎప్పుడూ వెంటాడుతుంది. ఈ విషయం వారికి తెలుసు. అవినీతి చేయడంలో, ముఖ్యమంత్రిగా ఉంటూ తన కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేసి తప్పు చేశారని వారికి తెలుసు...’ఏప్రిల్ 1, 2019న రాజమండ్రిలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో మోదీ..‘కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందించినప్పటికీ, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే చిత్తశుద్ధి మాత్రం ఈ టీడీపీ ప్రభుత్వానికి లేదు. ఎప్పుటికప్పుడు పోలవరం ప్రాజెక్టు ఖర్చు అంచనాలను పెంచుతూ, ఎక్కువ డబ్బు పొందుతూ చంద్రబాబుకు ఈ ప్రాజెక్టు ఒక ఏటీఎంలా మారింది. అందులో నుంచి డబ్బులు తీసేసుకోవడమే. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు అంచనాలను పెంచడం ద్వారా ఎవరికి మేలు చేయాలని యూ టర్న్ బాబు అనుకుంటున్నారో మీ అందరికీ తెలుసు. రాష్ట్ర రైతుల క్షేమం కాదు, ఎవరి క్షేమం కోసం ఆయన ఆలోచిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ అర్ధం చేసుకోగలరు.’ ‘యూ టర్న్ బాబు (చంద్రబాబును ఉద్దేశించి) పరిస్థితి ఎలా ఉందంటే బాహుబలి సినిమాలో రాజు భల్లాలదేవుడి పాత్ర మాదిరే. తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని తిరిగి దాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలకైనా వెనుకాడడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించేవారైతే.. ఇక్కడి యూ టర్న్ బాబు మాత్రం తన కుటుంబం మొదట, ఆ తర్వాత తన అనుయాయులు అన్నట్టు పాలన సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హెరిటేజ్ (సంస్కృతి) మంచి పాలనతో రాస్ట్ర ప్రజలందరూ అభివృద్ధి చెందాలన్నదైతే... యూ టర్న్ బాబు నైజం మాత్రం తన సొంత హెరిటేజ్ (చంద్రబాబు కుటుంబీకుల వ్యాపార సంస్థ పేరు) కంపెనీ బాగుంటే చాలన్న తీరు...’పోలవరం ఆలస్యానికి బాబే కారణం..పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి కారణం ముమ్మాటికీ నాటి సీఎం, నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబే. కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు మ్యాన్యువల్ను తుంగలో తొక్కి.. వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేయకుండానే– ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ను నిరి్మంచారు. గోదావరికి 2019, 2020లలో వచి్చన భారీ వరదలు.. ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడం వల్ల డయాఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది.ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతం కోతకు గురై విధ్వంసం చోటుచేసుకుంది. పోలవరాన్ని కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారంటూ గత ఎన్నికల ప్రచారంలో 2019, ఏప్రిల్ 1న రాజమహేంద్రవరం సభలో ప్రధాని నరేంద్ర మోదీ కన్నెర్ర చేయడం అప్పట్లో సంచలనం రేపింది. పోలవరం జాప్యానికి చంద్రబాబు తప్పిదమే కారణమని ఫిబ్రవరి 6న రాజ్యసభలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటించారు.వాస్తవాలు ఇలా ఉంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్లే పోలవరం పనులు ఆగిపోయాయంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీసత్యసాయిజిల్లా ధర్మవరంలో నిర్వహించిన సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. సోమవారం రాజమహేంద్రవరం సభలో ప్రధాని నరేంద్ర మోదీ అదే మాటను వల్లె వేయడం గమనార్హం. అయితే డయాఫ్రమ్వాల్పై కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను రీయింబర్స్ చేయకుండా ఇలా ఆరోపణలు తగవని నీటిపారుదల రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.‘విభజన హామీలను నాలుగు బడ్జెట్లలోనూ పట్టించుకోలేదు. చివరి బడ్జెట్లోనూ ఏపీ పేరు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రయత్నం చేయలేదు. ఈ రాష్ట్రం ఒకటి ఉందన్న ఆలోచన లేదా? ఏం ప్రధాని ఓ గంట సమయం ఇవ్వలేరా? మిత్రపక్షంగా రండి. కూర్చుందాం అని అన్నారా...? మీరొక్కరే దేశాన్ని కాపాడతారా. ఏం మీకొక్కరికే దేశభక్తి ఉందా?..’ –2018 మార్చి 7న ఓ సమావేశంలో చంద్రబాబు..‘భార్యనే చూసుకోని వాడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు?....’ – అసెంబ్లీలో చంద్రబాబు తన ప్రసంగంలో..‘నరేంద్ర మోదీ కరుడుకట్టిన ఉగ్రవాది. మంచివాడు కాదు...’ – 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం నాయకుల సమావేశంలో చంద్రబాబు
ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
తల్లాహస్సీ: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధం అయ్యారు. అయితే ఈ యాత్ర ఆగిపోయింది. సాంకేతిక కారణాల దృష్ట్యా రోదసీ యాత్ర ఆగినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఎక్స్ ద్వారా తెలిపింది. అయితే తిరిగి యాత్ర ఎప్పుడు ఉంటుందనేదానిపై నాసా స్పష్టత ఇవ్వలేదు.బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ Starliner వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయాల్సి ఉంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ నుంచి ఈ వ్యోమనౌక అట్లాస్-V రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. Today's #Starliner launch is scrubbed as teams evaluate an oxygen relief valve on the Centaur Stage on the Atlas V. Our astronauts have exited Starliner and will return to crew quarters. For updates, watch our live coverage: https://t.co/plfuHQtv4l— NASA (@NASA) May 7, 2024అయితే 90 నిమిషాల ముందర రాకెట్లో సమస్యతో నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో సునీత.. మిషన్ పైలట్గా వ్యవహరించబోతున్నారు. ఆమెతో పాటు బుచ్ విల్మోర్ కూడా వెళ్లాల్సి ఉంది.మిషన్ ప్రకారం.. వీరు భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వారం పాటు బసచేస్తారు. వాస్తవానికి స్టార్లైనర్ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలు జాప్యం జరిగింది. ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్ఎస్కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.ప్రస్తుతం ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ వ్యోమనౌక ఈ తరహా సేవలు అందిస్తోంది. స్టార్లైనర్తో మానవసహిత యాత్ర నిర్వహించడం మాత్రం ఇదే మొదటిసారి.అందుకే ఒకింత ఆత్రుత.: సునీతతాజా అంతరిక్ష యాత్ర గురించి సునీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఐఎస్ఎస్కు వెళ్తుంటే.. సొంతింటికి తిరిగి వెళ్తున్నట్టుగా ఉంటుంది. స్టార్లైనర్కు ఇది మొదటి మానవసహిత యాత్ర కావడం వల్ల ఒకింత ఆత్రుతగా ఉంది. అయినప్పటికీ గాబరా పడిపోయే పరిస్థితి ఏమీ లేదు. రోదసిలో సమోసాను ఆస్వాదించడమంటే ఇష్టం. నేను ఆధ్యాత్మికవాదిని. గణేశుడు నా అదృష్ట దైవం. అందువల్ల గణనాథుడి విగ్రహాన్ని వెంట తీసుకువెళతాను’’ అని ఆమె పేర్కొన్నారు. సునీత ఒక మారథాన్ రన్నర్. ఐఎస్ఎస్లో ఓసారి మారథాన్ కూడా చేశారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. గతంలో ఆమె 2006, 2012లో రోదసిలోకి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్వాక్ నిర్వహించారు. 322 రోజలపాటు అంతరిక్షంలో గడిపారు.
MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
2024 ఐపీఎల్ సీజన్ గత సీజన్లకు భిన్నంగా జోరుగా సాగుతుంది. ఈ సీజన్లో దాదాపుగా ప్రతి మ్యాచ్లో పరుగుల వరద పారడంతో పాటు భారీ సంఖ్యలో మెరుపు ఇన్నింగ్స్లు నమోదవుతున్నాయి. నిన్న (మే 6) ముంబై-ఎస్ఆర్హెచ్ మ్యాచ్లోనూ ఇలాంటి ఓ మెరుపు ప్రదర్శన నమోదైంది. ముంబై ఆటగాడు సూర్యకుమార్ (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) సునామీ శతకంతో విరుచుకుపడి తన జట్టుకు అపురూప విజయాన్నందించాడు. ఈ క్రమంలో ఓ ఆల్టైమ్ రికార్డు సమం అయ్యింది.ఓ సీజన్లో అత్యధిక సెంచరీల రికార్డును ప్రస్తుత సీజన్ సమం చేసింది. 2023 సీజన్లో రికార్డు స్థాయిలో 12 సెంచరీలు (అన్ని జట్లు కలిపి) నమోదు కాగా.. ఈ సీజన్లో ఇప్పటికే 12 సెంచరీలు పూర్తయ్యాయి. ఇంకా 19 మ్యాచ్లు ఆడాల్సి ఉండగానే భారీ సంఖ్యలో నమోదు కావడంతో ఈ సీజన్ గత సీజన్ల కంటే భిన్నమని మరోసారి రుజువైపోయింది.ఐపీఎల్లో ఏ యేడుకాయేడు సెంచరీల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2022 సీజన్ మొత్తంలో 8 సెంచరీలు నమోదైనప్పుడు అభిమానులు ఆహా ఓహో అన్నారు. ఇప్పుడు మరికొన్ని మ్యాచ్లు మిగిలుండగానే 12 సెంచరీలు నమోదవడం చూసి ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ముక్కీ మూలిగి 173 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (48). కెప్టెన్ కమిన్స్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి సన్రైజర్స్ పరువు కాపాడారు. ముంబై బౌలర్లలో పియూశ్ చావ్లా, హార్దిక్ పాండ్యా తలో 3 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అన్షుల్ కంబోజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే సూర్యకుమార్.. తిలక్ వర్మ (37 నాటౌట్) సాయంతో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో ఓటమితో సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోవడంతో పాటు నెట్ రన్రేట్ను కూడా దిగజార్చుకుంది. ఈ మ్యాచ్లో గెలుపుతో ముంబై ఆఖరి స్థానం నుంచి లేచొచ్చి తొమ్మిదో స్థానానికి చేరుకుంది.
‘ఒకడు మైలవరం మాయలోడు.. ఇంకోడు ఉప్మాగాడు!’
దేవినేని: వసంత రాజకీయ వ్యభిచారి. వసంత: ఉమ ఒక లుచ్చా. లఫంగి. జీవన్మృతుడు. దేవినేని: వాడొక పందికొక్కు. తోడేలు. ఇసుకాసురుడు. వసంత: ఆ వెధవొక బురదపంది. శవాల వెంట చిల్లర పెంకులు ఏరుకునే సన్నాసి. ప్లాట్ ఫారంగాడు. నీ అయ్య ఒక సోడాబుడ్డి. 0.01 సెంటు పట్టా ప్రభుత్వం ఇస్తే బతికినోడివి. ఎలా పైకి వచ్చావో, రూ.వేల కోట్లు ఎలా సంపాదించావో అందరికీ తెలుసు. దేవినేని: కిట్టప్రసాద్ హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాలు కొట్టేసి విల్లాలు, అపార్టుమెంట్లు కట్టినోడు. డబ్బు ఉందనే అహంకారి. వసంత: నేను కిట్టప్రసాద్ అయితే వాడు ఉమాగాడు. ఉమక్కాయ్గాడు. ఉప్మాగాడు. లంగాహరి, భగవాన్దాస్. పోరంబోకు. దేవినేని: ఇప్పుడు కులం (కమ్మ) గుర్తుకొచ్చి కులానికి మద్దతుగా అబ్బా (నాగేశ్వరరావు) కొడుకులిద్దరూ సన్నాసుల్లా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కడప నుంచి రౌడీలను తీసుకొచ్చి నన్ను హత్య చేయిస్తానన్నాడు. వసంత: మతి తప్పి మాట్లాడుతున్నాడు. నేను కడప రౌడీలను తీసుకొచ్చి హత్య చేయిస్తానంటే నువ్వు మంత్రివి. నీ నాయకుడు సీఎం. మరి ఏం పీకారు అప్పుడు. దేవినేని: కిట్టప్రసాద్ తండ్రి నాగేశ్వరరావు మంత్రి పదవి కోసం, ఆర్టీసీ డైరెక్టర్ పదవి కోసం జై ఆంధ్ర ఉద్యమాన్ని తాకట్టు పెట్టాడు. నేడు ఇతను అమరావతి రాజధానిని తాకట్టు పెట్టాడు. బయటి వ్యక్తులతో మైలవరంలో ఒక దళితుడి మీద, ఒక మైనారిటీ వ్యక్తి మీద దాడి చేయించాడు. వసంత: అరే నీ అయ్య, నీ బాబు సినిమా హాల్లో ఆడోళ్లకి టికెట్లు ఇచ్చే దగ్గర వెకిలి వేశాలు వేసినోడు. నా బాబు మాజీ హోం మంత్రి రా. గుర్తుపెట్టుకో. దేవినేని: కొండపల్లి బొమ్మలకు ముడి సరుకు కోసం వాడే పునికి చెట్లను వందల ఎకరాల్లో తొలగించి అక్రమంగా గ్రావెల్ను తరలించి సొమ్ము చేసుకున్న దొంగోడు. వసంత: చంద్రబాబుకు పోలవరం ఏటీఎంలా ఎలా మారిందో అలా ఉమాకి మైలవరం నియోజకవర్గంలో క్రషర్లు, క్వారీలు ఏటీఎంలా మారాయి. క్రషర్లు, క్వారీల యజమానులపై కేసులు పెట్టించి బెదిరించి డబ్బులు వసూళ్లు చేసిన దొంగ. దేవినేని: మట్టి, ఇసుక, వీటీపీఎస్ డస్టుని దోచుకున్న మైలవరం వీరప్పన్. కిట్టప్రసాద్. రూ.వందకోట్లు ఇచ్చి మరీ టీడీపీలో చేరుతున్నాడు. వసంత: మైలవరం మాయలోడు. హత్యారాజకీయాలు అతని నైజం.సాక్షి ప్రతినిధి, విజయవాడ/ జి.కొండూరు : ఇలా మాట్లాడుకుంది మతి తప్పిన వాళ్లో, మద్యం తాగేసి విచక్షణ కోల్పోయిన ఇద్దరో, వీధి రౌడీలో, గూండాలో కాదు. ఒకరేమో ఇంజినీరింగ్ చేశారు. మరొకరు పదో తరగతి వరకు చదివారు. ఇద్దరూ ఇద్దరే... ..దేవినేని ఉమామహేశ్వరరావు ప్రత్యక్ష రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. నందిగామ, మైలవరం నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఏళ్ల తరబడి కొనసాగారు. సొంత సోదరుడు దేవినేని వెంకట రమణ సైతం మాజీ మంత్రే. వసంత వెంకట కృష్ణప్రసాద్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు. ప్రస్తుతం కృష్ణ ప్రసాద్ పోటీలో ఉన్నారు.నందిగామ నుంచి మైలవరం వరకు... ..దేవినేని, వసంత కుటుంబాల రాజకీయాలు నందిగామలో మొదలయ్యాయి. ఎన్నికల్లో తలపడ్డాయి. ఆ స్థానం రిజర్వుడు కావడంతో మైలవరం చేరాయి. ఉమా సోదరుడు దేవినేని వెంకటరమణ, కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు ఇద్దరూ టీడీపీ నుంచి గెలుపొంది మంత్రి పదవులు నిర్వర్తించిన వారే. వారసత్వంగా మైలవరం చేరుకున్న ఉమ టీడీపీ నుంచి, కృష్ణప్రసాద్ వైఎస్సార్ సీపీ అభ్యరి్థగా 2019 ఎన్నికల్లో పోటీపడ్డారు. వసంత విజయం సాధించారు. అంతకుముందు రాజకీయంగా ఎవరేమి అనుకున్నప్పటికీ.. గత 55 నెలల వ్యవధిలో రాజకీయాలను ఎంతగా భ్రష్ఠుపట్టించారో, పరస్పరం ఎంత హీనంగా మాట్లాడుకున్నారో వివిధ సందర్భాలే గుర్తు చేస్తాయి. వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చెప్పలేనన్ని. చెప్పుకోలేనన్ని. ఇద్దరూ ఎంతెంత అవినీతిపరులో, ఎంతటి అక్రమార్కులో వారంతట వారు మీడియా ఎదుట వెల్లడించినవే నిదర్శనాలు. ఇప్పటికీ అవన్నీ ఆడియోలు, వీడియోల రూపంలో ససాక్ష్యంగా నిలుస్తున్నాయి. కేసులు పెట్టుకోవడం పరాకాష్ఠ. నాయకులు, కార్యకర్తలే బకరాలా? ..మైలవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు వసంత, దేవినేనిలకు అప్పుడు, ఇప్పుడు బకరాల్లా కనిపిస్తున్నట్లుంది. వైఎస్సార్ సీపీ నుంచి గత ఎన్నికల్లో గెలుపొంది ఆ పారీ్టకి వెన్నుపోటు పొడిచి ప్రస్తుతం టీడీపీ మైలవరం అభ్యరి్థగా ఎన్నికల బరిలో ఉన్న వసంత ఇరుపారీ్టల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. డబ్బు ఉందనే అహంకారంతో పేదలు, బడుగువర్గాల ఓటర్లను కొనుగోలు చేసేయవచ్చనే అంచ నాలతో ఇష్టారీతిన ప్రలోభాలకు ప్రయతి్నస్తున్నారు. నోట్ల కట్టలను పరిచేయవచ్చనే భావజా లంతో తమను చిన్నచూపు చూస్తున్నారని స్థానిక నేతలు గుర్తుచేస్తున్నారు. రాజకీయం కోసం దేనికైనా.. ఎంతవరకైనా.. ..గడిచిన ఐదేళ్లలో వసంత, దేవినేని ఆయా పారీ్టల నాయకులను, కార్యకర్తలను తమ ఇష్టానుసారం వాడేసుకున్నారు. ఇప్పుడు తామిరువురం ఒక్కటేనని చేయిచేయి కలుపుకొని, పచ్చ చొక్కాలు తొడుక్కుని అదే నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఉమ్మడిగానూ మాట్లాడుతున్నారు. పైగా వసంతను గెలిపించాలని దేవినేని ఉమా అభ్యరి్థస్తుండటమే అత్యంత హాస్యాస్పదమని, ఇంతకన్నా దివాళాకోరుతనం ఉంటుందా? అని ఇరువర్గాల నాయకులు నోరెళ్లబెడుతున్నారు. మనిషన్నాక కాస్త అయినా సిగ్గూ శరం ఉంటుందని వీరికి అలాంటి వేమీ లేవని స్వపక్షీయులే అసహ్యించుకుంటు న్నారు. ‘ఉమా మా నాయకుడని, మాకు అత్యంత సన్నిహితుడని చెప్పుకోవడానికి మాకిప్పుడు సిగ్గేస్తోంది. వాళ్ల అన్నయ్య వెంకటరమణ స్నేహితులుగా గడచిన అన్ని ఎన్నికల్లో ఉమకు తోడుగా నిలిచాం. అన్నిటికీ తెగించి తలపడ్డాం. ఉమ్మడిగా కష్టపడ్డాం. గెలిపించాం కూడా. ఇలా నేను ఒక్కడినే కాదు. పది మందికి పైగా మేమంతా జట్టుగా ఉన్నాం. ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరం ఉమ వెంట నడవడం లేదు. పార్టీ కూడా అతనికి సీటు ఇవ్వలేదులెండి’ అని విజయవాడ గాయత్రీనగర్లో ఉంటున్న వారు ‘సాక్షి’కి చెప్పారు. ఇప్పటి వరకు ఉమ ఒక్కడినే తప్పుడోడు అనుకున్నాం. అతనికన్నా పనికిమాలిన వాడు, పచ్చిమోసగాడుగా వసంత కనిపిస్తున్నాడు’ అని ముక్తాయించారు. గత ఐదేళ్లలో పారీ్టని, కులాన్ని అడ్డుపెట్టుకుని చాలా అరాచకాలే చేశాడు. ఇప్పటికి వైఎస్సార్ సీపీకి కృష్ణప్రసాద్ అనే చీడ పోయిందని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. వారిద్దరి గురించి మా వద్ద చాలా విషయాలు, వివరాలే ఉన్నాయని, అటు వెళ్లడానికి ఇష్టంలేకే ఇప్పుడు విజయవాడ నగరంలో, ముఖ్యంగా వెస్ట్లో పార్టీ తరఫున తిరుగుతున్నాం. మైలవరాన్ని విడిచి ఇలా రావాల్సి వస్తుందని మేమెప్పుడూ అనుకోలేదని పంటకాలవ ప్రాంతంలోని ఓ నాయకుడు ఆవేదన వ్యక్తంచేశారు. మేం అంతా టీడీపీ వీరవిధేయులమైనప్పటికీ మైలవరం ఓటర్లు వసంతకు తగిన బుద్ధి చెప్పాలని, ఉమకు ఇంకా గుణ పాఠం నేర్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అభిప్రాయపడటాన్ని చూస్తుంటే వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమల స్థితిగతులు ఎలాంటివో తేటతెల్లమవుతున్నాయి.
నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయెల్కు ముంబయి హైకోర్టు రెండు నెలలపాటు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. ఆయన భౌతిక, మానసిక ఆరోగ్యం బాగోలేదని గోయెల్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 2023 సెప్టెంబరులో తనను అరెస్టు చేసింది. తాజాగా బెయిల్ మంజూరు చేస్తున్న సమయంలో అనుమతి లేకుండా ముంబయిని విడిచి వెళ్లకూడదని, హామీ కింద రూ.లక్ష జమ చేయాలని ఆదేశించింది. దాంతోపాటు ఆయన పాస్పోర్టును కోర్టుకు సరెండర్ చేయాలని తెలిపింది.నరేశ్ గోయెల్ కొన్నిరోజుల నుంచి క్యాన్సర్తో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాంతో ఆ చికిత్స నిమిత్తం పలుమార్లు బెయిల్కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ అందుకు కోర్టు నిరాకరించింది. జైలులోనుంచి బయటకు వెళ్లి సాక్ష్యాలను మారుస్తారని బెయిల్ ఇవ్వలేదని సమాచారం. మానవతా దృక్ఫథంతో తనకు బెయిలు మంజూరు చేయాలని గోయెల్ విజ్ఞప్తి చేస్తూనే వచ్చారు. ఆసుపత్రిలో గోయెల్ చికిత్స గడువును పొడిగిస్తే ఈడీకి ఎటువంటి అభ్యంతరం లేదని తెలపడంతో బెయిల్ మంజూరు చేసినట్లు తెలసింది.ఇదీ చదవండి: ప్రభుత్వ యాప్లకు ప్రత్యేక లేబుల్..! కారణం..జెట్ ఎయిర్వేస్ అభివృద్ధి కోసం కెనరా బ్యాంకు ద్వారా గతంలో దాదాపు రూ.530 కోట్లు అప్పు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని సంస్థ వృద్ధికికాకుండా వ్యక్తిగత అవసరాలకు, ఇతరవాటికి వినియోగించారని తేలడంతో గోయెల్తోపాటు ఆయన భార్యను అరెస్టు చేశారు. అయితే తన భార్య ఆరోగ్యంరీత్యా బెయిల్ ఇచ్చారు.
విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తెలుగువారికి సుపరిచితమే. 2016లో శ్రీజ.. నటుడు కళ్యాణ్ దేవ్ను వివాహాం చేసుకుంది. ఈ జంటకు 2018లో ఓ కూతురు కూడా జన్మించింది. అయితే, పలు విభేదాల కారణంగా ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగానే ఉంటున్నారు. వీరి ముద్దుల కూతురు నవిష్క వారంలో కొద్ది రోజులు మాత్రమే కల్యాణ్ దేవ్ వద్ద ఉంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే శ్రీజ నెటిజన్లకు టచ్లోనే ఉంటుంది.విడాకుల అంశం గురించి శ్రీజ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ స్టోరీ పోస్ట్ చేసింది. కానీ ఆమె తన భర్తతో విడాకుల గురించి రియాక్ట్ కాలేదు. సోషల్ మీడియా ద్వారా ఓ అమ్మాయి ది ఆంగ్రీ థెరపిస్ట్ అనే అకౌంట్కు ఇలా ప్రశ్న పంపింది. 'నా భర్తకు విడాకులు ఇవ్వాలని ఉంది. కానీ, నా భర్తే ఈ విషయంలో అడ్డు పడుతున్నాడు. తన మీద ప్రేమ ఉంటే విడాకులు ఇవ్వద్దని కోరుతున్నాడు. ఇప్పుడేం చేయాలి..?' అని అడిగింది. ఇందుకు సమాధానంగా వాళ్లు.. ఆయనతో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారా లేదా అనే ప్రశ్న మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి అంటూ చెప్పుకొచ్చారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ అంశంలో ఇతరుల ప్రమేయం లేకుండా మీరే నిర్ణయం తీసుకోవాలని వారు సూచించారు.ఈ క్రమంలో విడాకుల విషయంపై ఆ అమ్మాయికి వారు ఇలా సూచించారు. 'బబుల్ బాత్ చేయడం, స్పాకి వెళ్లడం, నచ్చిన డ్రెస్సులు కొనుక్కోవడం, చక్కగా రెడీ కావడం, మీకు నచ్చిన గిఫ్టులు మీరే కొనుక్కోవడం అనేది సెల్ఫ్ లవ్. ఈ విషయంలో మళ్లీ ఒక్కసారి ఆలోచించండి. సెల్ప్ కేర్ వర్సెస్ సెల్ఫ్ లవ్ అనే పోరాటంలో మనల్ని మనం ప్రేమించుకునే దమ్ము, ధైర్యం మీకుందా..?' అని ఆ యువతితో వారు చెప్పుకొచ్చారు. ఈ మెసేజ్లను శ్రీజ కూడా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. గతంలో కూడా శ్రీజ సెల్ఫ్ లవ్ అంటూ పలు పోస్టులు పెడుతుండేది. దీనినిబట్టి చూస్తే భవిష్యత్లో ఎవరితోనూ ప్రేమలో పడేది ఉండదని ఆపై పెళ్లి చేసుకునే ఛాన్స్ కూడా లేదన్నట్లుగా ఆమె మెసేజ్లు ఉన్నాయని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.వ్యాపారంలో శ్రీజ తొలి అడుగుకొద్దిరోజుల క్రితం శ్రీజ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. స్టూడియో అనంత పేరుతో హైదరాబాద్లో ఓ ఫిట్నెస్ సెంటర్ను ఆమె ప్రారంభించింది. తాను ఇలా వ్యాపార రంగంలోకి రావడం, ఫిట్నెస్ సెంటర్లో భాగం కావడం థ్రిల్లింగ్గా ఉందంటూ గతంలో శ్రీజ తెలిపింది. ఈ ఫిట్నెస్ సెంటర్లో జిమ్, యోగా కూడా ఉంటాయని ఆమె చెప్పింది. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela)
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్రోబ్కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్తో, గ్లామ్డేస్ విభిన్నమైన నెక్లెస్లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- అక్రమాలు కో‘కొల్లు’లు
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
సినిమా
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
హీరామండి వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరోయిన్ అదితిరావ్ హైదరీ. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో వచ్చిన భారీబడ్జెట్ వెబ్ సిరీస్ హీరామండిలో నటించింది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అదితి తన ప్రేమ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో సిద్ధార్థ్తో ఎంగేజ్మెంట్ చేసుకోవడంపై స్పందించింది. సిద్ధార్థ్తో కలిసి ఉండటం ప్రేమపై నమ్మకాన్ని పెంచిందని తెలిపింది.అదితి మాట్లాడుతూ.. 'నేను కొన్ని విషయాల్లో పవిత్రతను నమ్ముతాను. మా ఇద్దరి రిలేషన్పై రూమర్స్ రావడం సహజమే. కానీ మేం మా తల్లిదండ్రుల అనుమతితోనే మా బంధాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నాం. వారు మా కంటే ఎంతో ప్రైవేట్గా ఉంటారు. మాకు చాలా కాల్స్ వస్తున్నందుకే మా రిలేషన్ను బయటకు చెప్పేశాం. ఈ విషయాన్ని బయటకు చెప్పడం బాధ్యతాయుతమైన పనిగా మేము భావించాం'అని తెలిపింది.ఆమె ఇంకా మాట్లాడుతూ..'నేను ఎల్లప్పుడూ అన్ని విషయాలను సానుకూలంగా చూడాలనుకుంటున్నా. నా గోప్యత, పవిత్రతను నేను నమ్ముతా. నా గోప్యతను కోరుకునే ప్రదేశంలో ఉన్నానని భావిస్తున్నా. కానీ ప్రజలు మా పట్ల ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. మీ అందరి ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీ అభిమానం చాలా విలువైనది. సెలబ్రిటీలు కూడా మనుషులేనని మీరు గ్రహించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో వారి ఇష్టమని' తెలిపింది.కాగా.. హీరో సిద్దార్థ్తో డేటింగ్లో ఉన్న భామ ఇటీవలే నిశ్చితార్థం చేసుకుంది. దాదాపు రెండేళ్ల పాటు ఈ జంట డేటింగ్లో ఉన్నారు. వనపర్తిలోని అతి పురాతన ఆలయంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. మా ఇద్దరి తల్లిదండ్రుల కారణంగానే నిశ్చితార్థం జరిగిందని అదితి తెలిపింది. సంజయ్ లీలా భన్సాలీ 'హీరామండి: ది డైమండ్ బజార్'లో బిబో జాన్ పాత్రలో అదితి రావ్ హైదరీ నటించింది.
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
టాలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. నాయక్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ స్టార్ హీరోల సరసన మెప్పించింది. ఇటీవలే రిలీజైన పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ ఆడుజీవితం(గోట్ లైఫ్) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే గతేడాది ప్రియుడు జగత్ దేశాయ్ను అమలాపాల్ పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్న ముద్దుగుమ్మ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ఈ సందర్భంగా తన భర్త జగత్ దేశాయ్పై ప్రశంసలు కురిపించింది. ప్రెగ్నెన్సీ ధరించిన సమయం నుంచి తనకు అన్ని విధాలుగా అండగా నిలిచారని కొనియాడారు.అమలాపాల్ తన ఇన్స్టాలో రాస్తూ..' నాతో పాటు అర్థరాత్రి వరకు ఉంటూ.. నా ఇబ్బందులను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ.. నాపై మీకున్న అచంచలమైన నమ్మకం.. మీ ఉత్తేజపరిచే మాటలు నాలో శక్తిని నింపాయి. ఈ విలువైన గర్భధారణ ప్రయాణంలో నా వెన్నంటే ఉన్నందుకు ధన్యవాదాలు. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన క్షణాల్లో కూడా నాకు మద్దతుగా నిలిచారు. మీలాంటి అపురూపమైన వ్యక్తి నా జీవితంలోకి రావడం.. నిజంగా నేను ఏదో అద్భుతమైనా చేసి ఉండాలి. నా శక్తి, ప్రేమ తిరుగులేని మద్దతు ఉన్నందుకు ధన్యవాదాలు. నేను చెప్పే మాటలకంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు బ్యూటీఫుల్ కపుల్ అంటూ పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul)
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
మంచువిష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ప్రముఖులు నటిస్తోన్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ఓ అతిథి పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అతడు నందీశ్వరుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.కన్నప్పలో ప్రభాస్అయితే కన్నప్ప షూటింగ్లో ప్రభాస్ ఎప్పుడు జాయిన్ అవుతారనే విషయంపై నెట్టింట టాక్ నడుస్తోంది. ది రాజాసాబ్, కల్కి సినిమాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్.. కన్నప్ప కోసం కేవలం మూడు రోజుల సమయం మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. మే సెకండ్ వీక్లో ప్రభాస్ పాల్గొననున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అక్షయ్ కుమార్ తన సీన్లకు సంబంధించిన షూటింగ్ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని విష్ణు మంచు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.అయితే మొదట శివుడి పాత్రలో ప్రభాస్ను తీసుకోవాలనుకున్నారు. కానీ అక్షయ్ ఎంట్రీతో ప్రభాస్ నందీశ్వరుడి పాత్ర పోషించనున్నాడు. దీంతో ప్రభాస్తో షూటింగ్ పూర్తి చేయడానికి ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాను మంచు విష్ణు భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్ కూడా కీలకపాత్రలు పోషించనున్నారు. ఇక సినిమాలో పార్వతిగా అనుష్క శెట్టి నటిస్తోంది.
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
హమరేశ్, ప్రార్ధన సందీప్ జంటగా నటించిన చిత్రం సత్య. ఈ చిత్రాన్ని వాలీ మోహన్దాస్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ సినిమాను శివమ్ మీడియా బ్యానర్పై శివమల్లాల నిర్మించారు. ఈ బ్యానర్లో వచ్చిన తొలి సినిమాగా సత్య నిలిచింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎనిమిది మంది దర్శకుల చేతుల మీదగా విడుదల చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ సినిమా మే 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపారు.ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణచైతన్య మాట్లాడుతూ..'హమరేష్ చూడడానికి జీవీ ప్రకాష్ లాగా ఉన్నాడు. నిర్మాత శివ మల్లాల నాకు నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి తెలుసు, నన్ను జనాలకి చూపించడానికి ఫొటోస్ తీసేవారు. ఆయనకి ఈ సినిమా పెద్ద సక్సెస్ ని తీసుకుని రావాలని కోరుకుంటున్నా' అని అన్నారు. డైరెక్టర్ శశి కిరణ్ టిక్క మాట్లాడుతూ..' సత్య ట్రైలర్ చాల బాగుంది. టీం అందరికీ అల్ ది బెస్ట్, శివ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఆయనా అలానే నవ్వుతూ ఉండాలి. అలానే మంచి సక్సెస్ అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. చిత్ర దర్శకుడు వాలి మోహన్ దాస్ మాట్లాడుతూ.' తమిళంలో ఈ సినిమాని నేను రంగోలిగా తీశాను. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో శివ మల్లాల ద్వారా వస్తోంది. అందరూ చూసి మంచి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా' అని అన్నారు.నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ..'ఈరోజు నాకోసం ఇంత మంది వచ్చి సపోర్ట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. జస్ట్ ఈ సినిమా చూసి రివ్యూ చెప్దామని అనుకున్నా. కానీ సినిమా చూడగానే నాకు బాగా నచ్చింది. ఈరోజు జస్ట్ ట్రైలర్ లాంఛ్కే ఎనిమిది మంది డైరెక్టర్స్ వచ్చారు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు నేను ఫోటోగ్రాఫర్గా కెరీర్ ప్రారంభించి ప్రొడ్యూసర్ వరకు వచ్చా. నా కెరీర్ ముందు నుంచి సపోర్ట్ చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. మే 10న సత్య సినిమా వస్తుంది. అందరూ తప్పకుండా చూడండి' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సుందరమూర్తి కేఎస్ సంగీతమందించారు.
క్రీడలు
MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
2024 ఐపీఎల్ సీజన్ గత సీజన్లకు భిన్నంగా జోరుగా సాగుతుంది. ఈ సీజన్లో దాదాపుగా ప్రతి మ్యాచ్లో పరుగుల వరద పారడంతో పాటు భారీ సంఖ్యలో మెరుపు ఇన్నింగ్స్లు నమోదవుతున్నాయి. నిన్న (మే 6) ముంబై-ఎస్ఆర్హెచ్ మ్యాచ్లోనూ ఇలాంటి ఓ మెరుపు ప్రదర్శన నమోదైంది. ముంబై ఆటగాడు సూర్యకుమార్ (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) సునామీ శతకంతో విరుచుకుపడి తన జట్టుకు అపురూప విజయాన్నందించాడు. ఈ క్రమంలో ఓ ఆల్టైమ్ రికార్డు సమం అయ్యింది.ఓ సీజన్లో అత్యధిక సెంచరీల రికార్డును ప్రస్తుత సీజన్ సమం చేసింది. 2023 సీజన్లో రికార్డు స్థాయిలో 12 సెంచరీలు (అన్ని జట్లు కలిపి) నమోదు కాగా.. ఈ సీజన్లో ఇప్పటికే 12 సెంచరీలు పూర్తయ్యాయి. ఇంకా 19 మ్యాచ్లు ఆడాల్సి ఉండగానే భారీ సంఖ్యలో నమోదు కావడంతో ఈ సీజన్ గత సీజన్ల కంటే భిన్నమని మరోసారి రుజువైపోయింది.ఐపీఎల్లో ఏ యేడుకాయేడు సెంచరీల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2022 సీజన్ మొత్తంలో 8 సెంచరీలు నమోదైనప్పుడు అభిమానులు ఆహా ఓహో అన్నారు. ఇప్పుడు మరికొన్ని మ్యాచ్లు మిగిలుండగానే 12 సెంచరీలు నమోదవడం చూసి ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ముక్కీ మూలిగి 173 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (48). కెప్టెన్ కమిన్స్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి సన్రైజర్స్ పరువు కాపాడారు. ముంబై బౌలర్లలో పియూశ్ చావ్లా, హార్దిక్ పాండ్యా తలో 3 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అన్షుల్ కంబోజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే సూర్యకుమార్.. తిలక్ వర్మ (37 నాటౌట్) సాయంతో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో ఓటమితో సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోవడంతో పాటు నెట్ రన్రేట్ను కూడా దిగజార్చుకుంది. ఈ మ్యాచ్లో గెలుపుతో ముంబై ఆఖరి స్థానం నుంచి లేచొచ్చి తొమ్మిదో స్థానానికి చేరుకుంది.
మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి శ్రీలంక, స్కాట్లాండ్ అర్హత
బంగ్లాదేశ్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్లో జరిగే మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు అర్హత సాధించాయి. అబుదాబిలో జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ రెండు జట్లు ఫైనల్లోకి ప్రవేశించి మిగిలిన రెండు బెర్త్లను సొంతం చేసుకున్నాయి. సెమీఫైనల్స్లో చమరి అటపట్టు నాయకత్వంలోని శ్రీలంక జట్టు 15 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టును ఓడించగా... కేథరీన్ బ్రైస్ సారథ్యంలోని స్కాట్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఐర్లాండ్పై గెలిచింది. తొలిసారి టి20 ప్రపంచకప్ టోటోర్నీకి అర్హత పొందిన స్కాట్లాండ్ ఈరోజు జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్లో శ్రీలంకతో ఆడుతుంది. టి20 ప్రపంచకప్ అక్టోబర్ 3 నుంచి 20 వరకు ఢాకా, సిల్హెట్లో జరుగుతుంది. గత టి20 ప్రపంచకప్లో టాప్–6లో నిలిచిన ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్ నేరుగా ఈ టోటోర్నీకి అర్హత పొందాయి. ఆతిథ్య దేశం హోదాలో బంగ్లాదేశ్, ఐసీసీ ర్యాంక్ ప్రకారం పాకిస్తాన్ ఈ టోటోర్నీలో ఆడనున్నాయి.
IPL 2024: ముంబై ఆశలకు సూర్య ఊపిరి
ముంబై: ఐపీఎల్ నుంచి ‘ఫైవ్ స్టార్’ చాంపియన్ ముంబై ఇండియన్స్ అందరికంటే ముందుగా ని్రష్కమించే ముప్పును సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్స్లు) తప్పించాడు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడి ముంబైని రేసులో నిలిపాడు. సోమవారం జరిగిన మ్యాచ్లో ముంబై 7 వికెట్ల తేడాతో హైదరాబాద్పై ఘనవిజయం సాధించింది. మొదట సన్రైజర్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. హెడ్ (30 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్), ప్యాట్ కమిన్స్ (17 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. హార్దిక్ పాండ్యా, పియూశ్ చావ్లా చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబై 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్కు అండగా తిలక్ వర్మ (32 బంతుల్లో 37 నాటౌట్; 6 ఫోర్లు) నిలిచాడు. ఆదుకున్న హెడ్ ఆరంభంలో హెడ్, ఆఖర్లో కమిన్స్ మెరుపులు మినహా సన్రైజర్స్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్లో బోర్ కొట్టించింది. పవర్ప్లేలో 56/1 స్కోరు చేసిన హైదరాబాద్ 10 ఓవర్ల దాకా 88/2 స్కోరుతో పటిష్టంగానే కనిపించింది. అభిషేక్ (11), మయాంక్ అగర్వాల్ (5), నితీశ్ కుమార్ రెడ్డి (15 బంతుల్లో 20; 2 ఫోర్లు), క్లాసెన్ (2)... ఇలా కీలక బ్యాటర్లందరినీ వరుస విరామంలో కోల్పోవడంతో హైదరాబాద్ కోలుకోలేదు. 16వ ఓవర్ వేసిన పాండ్యా... షహబాజ్ అహ్మద్ (10), మార్కో జాన్సెన్ (17)లను అవుట్ చేయగా, సమద్ (3)ను చావ్లా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 136 పరుగులకే 8 వికెట్లు పడిపోవడంతో డెత్ ఓవర్లలో దూకుడుగా ఆడే స్పెషలిస్టు బ్యాటరే కరువయ్యాడు. అయితే కెపె్టన్ కమిన్స్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో సత్తాచాటడంతో హైదరాబాద్ 170 పైచిలుకు స్కోరు చేయగలిగింది. ‘సూర్య’ మేటి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రోహిత్ (4) అవుటవగానే సూర్యకుమార్ క్రీజులోకి వచ్చాడు. అంతకుముందే ఇషాన్ కిషన్ (9) పెవిలియన్లో కూర్చుకున్నాడు. ఆ తర్వాత నమన్ ధీర్ (0) డకౌటయ్యాడు. ముంబై స్కోరు 31/3. సంబరాల్లో హైదరాబాద్! ఒత్తిడిలో ముంబై... ఈ దశలో తిలక్ వర్మ అండతో ముంబైని పీకల్లోతు కష్టాల్లోంచి ఘనవిజయం దాకా సూర్యకుమార్ గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. మొదట్లో బౌండరీలతో జట్టును నడిపించిన ‘భారత 360’ డిగ్రీ బ్యాటర్ తర్వాత భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో జట్టు స్కోరు ఆరో ఓవర్లో 50 దాటగా... 12వ ఓవర్లో వంద పరుగుల్ని అధిగమించింది. ఈ భాగస్వామ్యం మెరుపులతో లక్ష్యాన్ని చేరింది. 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న సూర్య... శతక్కొట్టేందుకు మరో 21 బంతుల్లే అవసరమయ్యాయి. 18వ ఓవర్లో భారీ సిక్సర్తో 51 బంతుల్లో సెంచరీని పూర్తిచేసుకోవడంతోనే మ్యాచ్ కూడా ముగిసింది. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) తిలక్ వర్మ (బి) చావ్లా 48; అభిõÙక్ (సి) ఇషాన్ (బి) బుమ్రా 11; మయాంక్ (బి) అన్షుల్ 5; నితీశ్ కుమార్ రెడ్డి (సి) అన్షుల్ (బి) హార్దిక్ 20; క్లాసెన్ (బి) చావ్లా 2; జాన్సెన్ (బి) హార్దిక్ 17; షహబాజ్ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ 10; సమద్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చావ్లా 3; కమిన్స్ (నాటౌట్) 35; సనీ్వర్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–56, 2–68, 3–90, 4–92, 5–96, 6–120, 7–124, 8–136. బౌలింగ్: తుషార 4–0–42–0, అన్షుల్ 4–0–42–1, బుమ్రా 4–0–23–1, హార్దిక్ పాండ్యా 4–0–31–3, పియూశ్ చావ్లా 4–0–33–3. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) మయాంక్ (బి) జాన్సెన్ 9; రోహిత్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 4; నమన్ (సి) జాన్సెన్ (బి) భువనేశ్వర్ 0; సూర్యకుమార్ (నాటౌట్) 102; తిలక్ వర్మ (నాటౌట్) 37; ఎక్స్ట్రాలు 22; మొత్తం (17.2 ఓవర్లలో 3 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–26, 2–31, 3–31. బౌలింగ్: భువనేశ్వర్ 4–1–22–1, జాన్సెన్ 3–0–45–1, కమిన్స్ 4–1–35–1, నటరాజన్ 3.2–0–31–0, నితీశ్ కుమార్ రెడ్డి 2–0–16–0, షహబాజ్ 1–0–11–0.
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
ఐపీఎల్-2024లో వరుస ఓటములను చవిచూసిన ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 3 వికెట్లు కోల్పోయి 17.2 ఓవర్లలో చేధించింది. కాగా లక్ష్య చేధనలో ముంబై 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎస్ఆర్హెచ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సూర్య తన హోం గ్రౌండ్లో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఓవైపు గాయంతో బాధపడుతూనే ముంబై ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. సూర్య కేవలం 51 బంతుల్లోనే 12 ఫోర్లు, 6 సిక్స్లతో 102 పరుగులతో ఆజేయంగా నిలిచి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. అతడితో పాటు తిలక్ వర్మ(37నాటౌట్) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మార్కో జానెసన్, కమ్మిన్స్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(48) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్న కమ్మిన్స్ 2 సిక్స్లు, 2 ఫోర్లతో 35 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. వీరిద్దరితో పాటు నితీష్ రెడ్డి(20), జానెసన్(17) రాణించారు. ఇక ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, చావ్లా తలా మూడు వికెట్లు సాధించగా.. అన్షుల్ కాంబోజ్, బుమ్రా చెరో వికెట్ సాధించారు.
బిజినెస్
ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్లు వీరే..
సంపన్నులైన వ్యాపార దిగ్గజాలు వారి బిజినెస్ కార్యకలాపాలను తమ వారసులకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే ఆసియాలోనే కుబేరుడైన ముఖేశ్ అంబానీ తన వారసులకు వ్యాపారాలను అప్పగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపారస్థులు తమ తర్వాత తరాన్ని పరిచయం చేస్తున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఫోర్బ్స్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్స్ ర్యాంకింగ్ 2024లో ఉన్న 2,781 మందిలో దాదాపు మూడింట ఒకవంతు మంది అంటే మొత్తం 934 మంది తమ వారసులకు వ్యాపారాన్ని అప్పగించారు. వీరు నడిపిస్తున్న కంపెనీలు, వాటి మార్కెటింగ్ విలువ ఏకంగా 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది.ముఖేశ్ అంబానీరిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సంపద దాదాపు 113.5 బిలియన్ అమెరికన్ డాలర్లు. రిలయన్స్ టెలికాం విభాగం జియో ఇన్ఫోకామ్కు తన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ సారథ్యం వహిస్తున్నారు. కూతురు ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు అనంత్ అంబానీ పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.బెర్నార్డ్ ఆర్నాల్ట్ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్కు డెల్ఫిన్ ఆర్నాల్ట్, ఆంటోయిన్ ఆర్నాల్ట్, జీన్ ఆర్నాల్ట్, ఫ్రెడెరిక్ ఆర్నాల్ట్, అలెగ్జాండర్ ఆర్నాల్ట్ అనే వారసులున్నారు. తన కుటుంబ సంపద మొత్తం 214.1 బిలియన్ అమెరికన్ డాలర్లు. తన వారసులు బెర్నార్డ్ ఆర్నాల్ట్ కంపెనీ ఎల్వీఎంహెచ్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. డెల్ఫిన్ ఆర్నాల్ట్(49) 2023లో మాంటిల్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆంటోయిన్ ఆర్నాల్ట్(46) ఎల్వీఎంహెచ్ కమ్యూనికేషన్స్, ఇమేజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్ విభాగాన్ని పర్యవేక్షిస్తారు. అలెగ్జాండర్ ఆర్నాల్ట్(31) కమ్యూనికేషన్ విభాగంలో పనిచేస్తున్నారు. ఫ్రెడెరిక్ ఆర్నార్ట్(29)ట్యాగ్హ్యూర్ పదవీకాలం తర్వాత 2024లో ఎల్వీఎంహెచ్ వాచెస్కు సీఈఓగా చేరారు. జీన్ ఆర్నాల్ట్(25) 2021లో ఎల్వీఎంహెచ్లో చేరారు. లూయిస్ విట్టన్ వాచీల విభాగానికి మార్కెటింగ్ హెడ్గా చేస్తున్నారు.అదానీ గ్రూప్గౌతమ్ అదానీ ఛైర్మన్గా ఉన్న ఈ గ్రూప్ సంపద సుమారు 102.4 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఆయనకు కరణ్, జీత్ అదానీలు ఇద్దరు కుమారులు. పర్డ్యూ యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన కరణ్ తన తండ్రి తర్వాత అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. జీత్ అదానీ 2019లో అదానీ గ్రూప్లో చేరారు.షాపూర్జీ పల్లోంజీ గ్రూప్షాపూర్ మిస్త్రీ స్థాపించిన ఈ గ్రూప్ సంపద 37.7 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉంది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వారసుడిగా పల్లోన్ మిస్త్రీ సంస్థను ముందుండి నడిపిస్తున్నారు. ఈ గ్రూప్నకు నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పేరుంది. ఇందులో టాటా సన్స్ వాటా కలిగి ఉంది.ఇదీ చదవండి: 15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టుఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్లాఓరీల్ సంస్థ వ్యవస్థాపకుడు ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్ 94.5 బిలియన్ డాలర్ల సందప కలిగి ఉన్నారు. ప్రపంచంలోని ప్రముఖ సౌందర్య సాధనాల దిగ్గజ సంస్థగా లాఓరీల్కు మంచి పేరుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళ ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్ వారసులు జీన్-విక్టర్, నికోలస్ మేయర్స్. జీన్-విక్టర్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో పనిచేస్తున్నారు. నికోలస్ మేయర్స్ కుంటుంబం పెట్టుబడి సంస్థకు సంబంధించిన వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు.
వ్యాపారులు, వృత్తి నిపుణులకు.. ఫారం 3
ఒక్క మాటలో చెప్పాలంటే ఫారం 1,2 .. జీతం మీద ఆదాయం వచ్చిన వారే వేయాలి. మిగిలిన ఫారాలు ఏవి కూడా వేతన జీవులకు వర్తించవు. ఈ ఫారం–3, అలాగే ఇక నుంచి వచ్చే ఫారాలు వ్యాపారం లేదా వృత్తి మీద ఆదాయం ఉన్న వారికే వర్తిస్తాయి. ఫారం–3ని వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు వాడాలి.ఇది చాలా పెద్ద ఫారం అని చెప్పవచ్చు. నిడివిపరంగా అనడం లేదు.. ఇవ్వాల్సిన వివరాలు ఎక్కువ..సంఖ్య ఎక్కువ.వ్యక్తులు, హిందు ఉమ్మడి కుటుంబాలు వేయొచ్చు.ముఖ్యమైన రూలు ఏమిటంటే వ్యాపారం / లేదా వృత్తి మీద ఆదాయం ఉన్నవారు మాత్రమే ఫారం–3ని వేయాలి.ఆదాయపు పన్ను చట్టప్రకారం వ్యాపారానికొక రకమైన ఫారం, వృత్తి నిపుణులకొక రకమైన ఫారం లేదు. అందరికీ ఒకే ఫారం.‘వ్యాపారం’ అనే పదానికి నిర్వచనంలోనే ఎన్నో వాటితో పాటు ‘వృత్తి’ని కలిపారు.వ్యక్తులు/కుటుంబాలకు ట్యాక్స్ ఆడిట్ వర్తించినా, వర్తించకపోయినా ఈ ఫారం వేయాలి.ఈ రిటర్నులో ఇంటి మీద ఆదాయం, జీతం, పెన్షన్, వ్యాపారం/వృత్తి మీద ఆదాయం, ఇతర ఆదాయాలు, మూలధన లాభాలు.. అంటే చట్టంలో పొందుపర్చిన అన్నీ.. అంటే ఐదు శీర్షికల్లో ఏర్పడ్డ ఆదాయం ఉన్నవారు వేయొచ్చు.భాగస్వామ్యం నుంచి పారితోíÙకం వచ్చే వారు వేయొచ్చు.దీన్ని ‘మాస్టర్ ఫారం’ అని అనొచ్చు. ఎందుకంటే, వ్యక్తి లేదా ఉమ్మడి కుటుంబం ప్రతి ఆదాయం.. ఇండియాలో వచ్చినది కావొచ్చు విదేశాల నుంచి వచ్చినది కావొచ్చు.. ‘సర్వం’ ఇందులో కవర్ అవుతుంది.అంతే కాకుండా, ఆదాయం కానివి.. ఉదాహరణకు, అడ్వాన్సులకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వాలి.ఆ ఆర్థిక సంవత్సరంలో జరిగిన పెద్ద లావాదేవీలు, ఇండియాలో గానీ విదేశాల్లో గానీ జరిగినవి ఇవ్వాలి.అలాగే, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ల వివరాలు ఇవ్వాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ల వల్ల ఆదాయం ఏర్పడకపోయినా వివరాలు ఇవ్వాలి. ఉదాహరణగా ఒక ఇంటి కోసం భారీ మొత్తాన్ని అడ్వాన్సుగా ఇచ్చారు. ఇలాంటి వ్యవహారాలన్నింటిని కూడా పొందుపర్చాలి.కొంత నిర్దేశించిన టర్నోవరు దాటిన వారే అకౌంట్స్ బుక్స్ రాయాలి. కానీ మా సలహా ఏమిటంటే.. వ్యాపారం/వృత్తి ఉన్నవారు అకౌంట్స్ రాయండి. వ్యవహారం జరిగినప్పుడు స్పష్టంగా సమగ్రంగా అన్నీ ఒక చోట పర్మనెంట్ బుక్లో రాసుకోండి. వివరణ రాయండి.ఇలా రాసి ఉంచడం మీకు కాస్తంత శ్రమ కావచ్చు కానీ, తర్వాత రోజుల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఫారం నింపడానికి / దాఖలు చేయడానికి అవసరమైతే వృత్తి నిపుణుల సర్వీసులు తీసుకోండి.- కె.సీహెచ్, ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, - కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులుఇవి చదవండి: రూ. 27 లక్షల కోట్లకు గృహ రుణాలు..
15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు
ఈశాన్య దిల్లీలోని కరవాల్ నగర్ ప్రాంతంలో కల్తీ మసాలా దినుసుల తయారీకి సంబంధించిన భారీ రాకెట్ను పోలీసులు కనుగొన్నారు. రెండు కర్మాగారాలపై దాడులు నిర్వహించి 15 టన్నుల నకిలీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీకి కారణమైన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసుకు సంబంధించి డీసీపీ పవేరియా మాట్లాడుతూ..‘మసాలా దినుసుల్లో కల్తీ జరుగుతోందనే సమాచారం మేరకు ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. దిల్లీ పరిసర ప్రాంతాల్లో సెర్చ్ నిర్వహించాం. ఆపరేషన్ సమయంలో దిలీప్ సింగ్ (46) అనే వ్యక్తికి చెందిన ఒక ప్రాసెసింగ్ యూనిట్లో పాడైపోయిన ఆకులు, నిషేధిత పదార్థాలను ఉపయోగించి కల్తీ పసుపును ఉత్పత్తి చేయడం గుర్తించాం. బియ్యం, మినుములు, కలప పొట్టు, మిరపకాయలు, ఆమ్లాలు, నూనెలను కలిపి వీటిని తయారుచేస్తున్నట్లు కనుగొన్నాం. సెర్చ్ సమయంలో సింగ్తోపాటు అక్కడే ఉన్న సర్ఫరాజ్(32) పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాం. ఈ కల్తీ మసాలా దినుసులు మార్కెటింగ్ చేసేది ఖుర్సీద్ మాలిక్ (42) అనే మరోవ్యక్తి అని తేలింది. దాంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నాం. సర్ఫరాజ్కు కరవాల్ నగర్లోని కాలీ ఖాతా రోడ్లో మరో ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. ఈ ముఠా 2019 నుంచి కల్తీ మసాలా దినుసుల వ్యాపారం చేస్తున్నారు. ఈ రెండు యూనిట్లలో నిలువ ఉన్న సుమారు 15 టన్నుల కల్తీ మసాలా దినుసులను సీజ్ చేశాం. చట్ట ప్రకారం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం’ అని వివరించారు.సీజ్చేసిన వాటిలో పసుపు, గరం మసాలా, దనియా పొడి కలిపి 7,105 కిలోలు ఉంది. కలపపొడి, బియ్యం, మినుములు, మిరపకాయలు, సిట్రిక్ యాసిడ్.. వంటి పదార్థాలు 7,215 కిలోలు ఉన్నాయి.ఇదీ చదవండి: మసాలాలో పురుగుమందులు.. నివేదికలను తోసిపుచ్చిన ప్రభుత్వ సంస్థభారత బ్రాండ్లైన ఎవరెస్ట్, ఎండీహెచ్ ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనే క్యాన్సర్ కారకం ఉందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఈఎఫ్ఎస్ఏ) గుర్తించిన సంగతి తెలిసిందే. దాంతో హాంకాంగ్, సింగపూర్ల్లో వాటి ఉత్పత్తులపై నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే 2020 సెప్టెంబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్యకాలంలో ఇండియాలో తయారైన దాదాపు 527 ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్కు దారితేసే కారకాలు ఉన్నట్లు రాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ (ఆర్ఏఎస్ఎఫ్ఎఫ్) డేటా ప్రకారం నిర్ధారణ అయినట్లు ఈఎఫ్ఎస్ఏ అధికారులు ఇటీవల తెలిపారు.
రూ. 27 లక్షల కోట్లకు గృహ రుణాలు..
న్యూఢిల్లీ: గృహాల రంగానికి ఇచ్చిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు రూ. 10 లక్షల కోట్లు ఎగిశాయి. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి రికార్డు స్థాయిలో రూ. 27.23 లక్షల కోట్లకు చేరాయి. రంగాలవారీగా బ్యాంకు రుణాల అంశంపై ఆర్బీఐ వెలువరించిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.వీటి ప్రకారం 2022 మార్చిలో గృహ నిర్మాణ రంగంలో (హౌసింగ్కు ప్రాధాన్యతా రంగం కింద ఇచ్చినవి సహా) రుణబాకీలు రూ. 17,26,697 కోట్లుగా ఉండగా 2024 మర్చి ఆఖరు నాటికి రూ. 27,22,720 కోట్లకు చేరింది. కమర్షియల్ రియల్ ఎస్టేట్కి ఇచ్చినవి రూ. 2.97 లక్షల కోట్ల నుంచి రూ. 4.48 లక్షల కోట్లకు చేరాయి.కోవిడ్ అనంతరం గత రెండేళ్లలో ఇళ్ల విక్రయాలు, ధరలు గణనీయంగా పెరిగినట్లు పలు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థలు తెలిపాయి. ప్రభుత్వ తోడ్పాటు చర్యలతో అందుబాటు ధరల్లోని ఇళ్లకు డిమాండ్ నెలకొన్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నవీస్ తెలిపారు. రాబోయే రోజుల్లోనూ గృహ రుణాల వృద్ధి పటిష్టంగానే ఉంటుందని, అయితే, అధిక బేస్ కారణంగా 15–20 శాతానికి దిగి రావొచ్చని పేర్కొన్నారు.ఇవి చదవండి: పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
వీడియోలు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
ఫ్యామిలీ
Women of My Billion: కలిసి నడిచే గొంతులు
కన్యాకుమారి నుంచి శ్రీ నగర్ వరకూ 260 రోజుల పాటు 3,800 కిలోమీటర్లు దేశమంతా నడిచింది సృష్టి బక్షి. ఎందుకు? స్త్రీలపై జరిగే దురాగతాలపై చైతన్యం కలిగించడానికే కాదు స్త్రీల శక్తియుక్తులను వారికి గుర్తు చేయడానికి. ఆ సుదీర్ఘ ప్రయాణం ఇప్పుడు ‘విమెన్ ఆఫ్ మై బిలియన్’ పేరుతో అమెజాన్లో స్ట్రీమ్ అవుతోంది. నటి ప్రియాంకా చోప్రా నిర్మాత.తాను నడిచి చేరుకున్న ఊరిలో ఏదైనా స్కూల్లోగాని, పబ్లిక్ హాల్లో కాని మహిళలను పోగు చేస్తుంది సృష్టి బక్షి. ‘అందరూ కళ్లు మూసుకుని దీర్ఘంగా శ్వాస పీల్చి వదలండి’ అంటుంది. ‘ఇప్పుడు మీ కళ్ల ఎదురుగా మీ 11 ఏళ్ల వయసున్న మీ రూపాన్ని గుర్తు చేసుకోండి. ఆ 11 ఏళ్ల అమ్మాయిలో ఉండే విశ్వాసం, ఆనందం ఎన్ని విధాలుగా ధ్వంసమైందో గుర్తుకు తెచ్చుకోండి. ఆ అమ్మాయికి సారీ చెప్పండి. ఎందుకంటే ఆ విధ్వంసమంతా మీ అనుమతితోనే జరిగింది’ అంటుంది. చాలామంది ఆ మాటలకు ఏడుస్తారు. గడిచివచ్చిన జీవితాన్ని తలుచుకుని బాధలో మునిగిపోతారు. అప్పుడు సృష్టి బక్షి ఒక బోర్డు మీద స్త్రీ శరీర నిర్మాణం గీచి ‘ఇదిగో ఈ అవయవాల రీత్యా మీరు మగవారి కంటే భిన్నంగా పుట్టారు. ప్రకృతి ఈ అవయవాలను మీకు ఇస్తే సమాజం అదుపు, ఆంక్షలు, వివక్ష, కుటుంబ హింస, ఆర్థిక బానిసత్వం, ఇంటి పని... ఇన్ని ఇచ్చింది. మనం ఎందుకు మగవారితో సమానం కాము?’ అని ప్రశ్నిస్తుంది.మార్పు కోసంసృష్టి బక్షిది ముంబై. ఆమె హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో చదువుకుంది. హాంగ్కాంగ్లో మార్కెటింగ్లో పెద్ద సంస్థల్లో పని చేసింది. తండ్రి ఆర్మీలో పని చేయడం వల్ల ఆమెకు దేశం పట్ల ఒక ఉద్వేగం ఉండేది. అయితే తాను ప్రేమించే దేశంలో స్త్రీలపై జరిగే అన్యాయాలను చూసి చలించి పోయేది. ‘2017లో హాంకాంగ్లో సిటీ బస్ ఎక్కి ఇంటికి వెళుతున్నప్పుడు నా ఫోన్లో ఇండియాలో తల్లీ కూతుళ్లపై తండ్రి ఎదుటే అత్యాచారం చేసి చంపేశారన్న వార్త చదివాను. చాలా నిస్పృహ కలిగింది. నాలాంటి వాళ్లు సౌకర్యంగా పడక్కుర్చీలో కూచుని చింతించడం సరికాదని రంగంలో దిగాలని అనుకున్నాను. అలా నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, ఇండియా వచ్చి దేశంలోని స్త్రీలందరితో మాట్లాడాలని 2018 మే నెలలో పాదయాత్ర ప్రారంభించాను’ అని చెప్పింది సృష్టి.రోజూ వేలాది మంది‘ఉమెన్ ఆఫ్ మై బిలియన్’ పేరుతో సృష్టి బక్షి మే 2018లో కన్యాకుమారి నుంచి పాదయాత్ర ప్రారంభించింది. ఈ యాత్ర రికార్డు అయ్యేలా టీమ్ను ఏర్పాటు చేసుకుంది. 260 రోజుల పాటు దాదాపు 4 వేల కిలోమీటర్ల పాటు సాగే ఈ యాత్రకు కోటి రూపాయలు ఖర్చవుతాయి. 50 లక్షలను క్రౌడ్ ఫండింగ్ ద్వారా పోగు చేసింది. ‘ఈ యాత్రలో స్త్రీల కలలు, ఆకాంక్షలు, వారి హక్కులు, సంఘర్షణలు. విజయాలు వినదలుచుకున్నాను. వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవాలనుకున్నాను. నా సుదీర్ఘ యాత్రలో మన దేశంలో వరకట్నం ఇంకా పెద్ద సమస్యగా ఉందని అర్థమైంది. వరకట్నం స్త్రీలను మానసికంగా పురుషులతో సమానం అనుకోనివ్వడం లేదు. స్త్రీలను అసభ్యంగా తాకడం, హింసించడం, అణిచి పెట్టడం కొనసాగుతూనే ఉంది. ఒక దశలో నేను యాత్ర చేయలేననుకున్నాను. కాని ఆ మరుసటి రోజు నా మీటింగ్కు హాజరైన ఒక ఆశా వర్కర్– ‘‘రాత్రి నన్ను నా భర్త కొట్టాడు. నీ మాటలు విన్నాక ఇక ఇలాంటిది జరగనివ్వకూడదని నిశ్చయించుకున్నాను. నేను నా భర్తను నిలువరించడానికి నలుగురి సాయం తీసుకుంటాను’’ అని చెప్పింది. నా యాత్ర వల్ల జరుగుతున్న మేలు అర్థమయ్యాక కొనసాగాను’ అని తెలిపింది సృష్టి.డాక్యుమెంటరీ విడుదలసృష్టి చేసిన యాత్ర అంతా ‘విమెన్ ఆఫ్ మై బిలియన్’ పేరుతో డాక్యుమెంటరీగా రూపొందింది. మే 3 నుంచి అమెజాన్లో స్ట్రీమ్ అవుతోంది. ఈ డాక్యుమెంటరీ మీద మంచి రివ్యూలు వస్తున్నాయి. ‘ఎందరో స్త్రీలు. వారి జీవితానుభవాలను ఈ డాక్యుమెంటరీలో పంచుకున్నారు. వారు సమస్యలు వారి తెచ్చుకున్నవి కాదు. వారికి తెచ్చిపెట్టినవి. అందుకే నటి ప్రియాంకా చోప్రా నా డాక్యుమెంటరీని చూసి తాను నిర్మాతగా మారి విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. ఒక స్త్రీగా, ఆడపిల్ల తల్లిగా ఆమెకు స్త్రీల సాధికారత, ఆత్మగౌరవం గురించి అక్కర ఉంది. జెండర్ ఈక్వాలిటీ గురించి స్త్రీ, పురుషుల్లో చైతన్యం రావడానికి ఈ డాక్యుమెంటరీ ఉపయోగపడుతుందని ఆమె విశ్వసిస్తున్నారు’ అని తెలిపింది సృష్టి బక్షి.
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ దరిచేరవు. పైగా వ్యాధులు తగ్గుముఖం పట్టడమే కాకుండా మళ్లీ తలెత్తవట. ముఖ్యంగా విషదోషాలు, దుర్బలత్వం, చర్మరోగాలు, క్షయ, కొవ్వు, అమిత వేడి తగ్గిపోయి శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందని యోగ రత్నాకరం అనే వైద్య గ్రంథంలో ఉంది. అంతేగాదు స్వర్గంలో దేవతల కోసం అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవ౦తుడు సృష్టించాడని ఆ గ్రంథం చెబుతోంది. అలాంటి మజ్జిగని ఈ వేసవిలో తాగుతుంటే వడదెబ్బ కొట్టదట. పైగా మహాభారత కాలం నుంచే వడదెబ్బ నుంచి రక్షించుకునేందుకు ఈ మజ్జిగతో రకరలా పానీయాలు తయారు చేసుకుని తాగేవారట. అవేంటో చూద్దామా..!'కూర్చిక' పానీయం: ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అందులో రెండుగ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి. ఈ పానీయాన్ని ‘కూర్చిక’ అంటారు. ఇందులో పంచదార గానీ, ఉప్పు గానీ కలపకుండానే తాగవచ్చు. ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ 100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి, మూడింటినీ కలిపి తగినంత ఉప్పు కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి. ఈ కూర్చికను తాగినప్పుడల్లా అందులో దీన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగితే వడదెబ్బ కొట్టదు, పైగా పేగులకు బలాన్నిస్తు౦ది. అంతేగాదు జీర్ణకోశ వ్యాధులన్నింటికీ మేలు చేస్తు౦ది. అలాగే వేసవిలో వచ్చే జలుబుని నివారిస్తు౦ది.'రసాల' పానీయం:పెరుగు మీద తేరుకున్న నీళ్ళు, పాలు కలగలిపి ఆరోగ్యకరమైన 'రసాల' అనే పానీయాన్ని భీముడు తయారు చేశాడని భావప్రకాశ వైద్య గ్ర౦థంలో ఉంది. అరణ్యవాసంలో ఉన్నప్పుడు, పాండవుల దగ్గరకు శ్రీకృష్ణుడు వస్తే, భీముడు స్వయంగా దీన్ని తయారు చేసి వడ్డించాడట!. ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకుండా చేస్తుంది కాబట్టి, ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయం ఇది. తన ఆశ్రమాన్ని సందర్శి౦చటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి రాముని గౌరవార్థ౦ ఇచ్చిన విందులో 'రసాల' కూడా ఉంది. ఎలా చేస్తారంటే..?బాగా కడిగిన ఒక చిన్న కుండ లేదా ముంత తీసుకోండి. దాని మూతిని మూస్తూ ఒక పలుచని వస్త్రాన్ని రెండుమూడు పొరల మీద వాసెన (ఆవిరిపోక యెసటికుండ మూతిమూసి కట్టిన గుడ్డ) కట్ట౦డి. ఒక కప్పు పలుచని పెరుగులో అరకప్పు “పంచదార” కలిపి, ఈ మిశ్రమాన్ని చల్లకవ్వంతో బాగా చిలికి ఆ వాసెన మీద పోసి వడకట్టండి.పెరుగులో ప౦చదార కరిగి నీరై ఆ వస్త్రంలోంచి క్రి౦ది ముంతలోకి దిగిపోతాయి. వాసెనమీద పొడిగా పెరుగు ముద్ద మిగిలి ఉ౦టు౦ది. దాన్ని అన్న౦లో పెరుగు లాగా వాడుకోండి. ఈ రసాల పానీయం తయారీకి దీంతో పనిలేదు. ముంతలో మిగిలిన తియ్యని పెరుగు నీటిని ద్రప్యం అంటారు. ఈ ద్రప్యం నిండా లాక్టోబాసిల్లస్ అనే ఉపకారక సూక్ష్మజీవులు ఉ౦టాయి. అవి పేగుల్ని స౦రక్షించి జీర్ణాశయాన్ని బలసంపన్నం చేస్తాయి. ఆ నీటితోనే రసాలను తయారు చేస్తారు ఇప్పుడు, కాచి చల్లార్చిన పాలు ఈ ద్రప్యానికి రెట్టింపు కొలతలో తీసుకొని ముంతలోని పెరుగు నీళ్ళతో కలప౦డి. చల్లకవ్వంతో ఈ మిశ్రమాన్ని చక్కగా చిలికి, అందులో ఏలకుల పొడి, లవంగాల పొడి, కొద్దిగా పచ్చకర్పూరం, మిరియాల పొడి కలపండి. ఈ కమ్మని పానీయమే రసాల!.దీన్ని అప్పటికప్పుడు తాగేలాగా తయారు చేసుకొవాలి.తేటతో కూడా..ఈ వడగట్టే ప్రక్రియకు బదులుగా, పెరుగు లేదా మజ్జిగ మీద తేరుకొన్న తేటని తీసుకొని, సమానంగా పాలు కలిపి చిలికి తయారు చేసుకొవచ్చు కూడా! శొంఠి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చాలా స్వల్పంగా పచ్చకర్పూరం” వీటన్నింటిని మెత్తగా ద౦చిన పొడిని కొద్దిగా ఈ రసాలలో కలుపుకొని త్రాగితే ఎక్కువ ప్రయోజనాత్మకంగా ఉంటుంది. మజ్జిగ మీద తేటలో కేవలం ఉపయోగకారక సూక్ష్మజివులు లాక్టోబాసిల్లై మాత్రమే ఉంటాయి. ఈ సూక్ష్మజీవుల కారణ౦గానే పాలకన్నా పెరుగు, పెరుగు కన్నా చిలికిన మజ్జిగ ఎక్కువ ఆరోగ్య దాయకమైనవిగా ఉంటాయి. మజ్జిగలొని లాక్టోబాసిల్లై ని తెచ్చి పాలలో కలిపి, చిలికి ఈ రసాల ప్రయోగాన్ని మన పూర్వీకులు చేశారన్నమాట. ఇది ”అమీబియాసిస్” వ్యాధి, “పేగుపూత”, “రక్త విరేచనాలు”, “కలరా” వ్యాధులు ఉన్నవారికి కూడా ఇవ్వదగిన పానీయం. వేసవి కాలానికి అనుకూలంగా ఉంటుంది. వడ దెబ్బ తగలనీయదు. శరీరంలో వేడిని తగ్గిస్తు౦ది. తక్షణం శక్తినిస్తుంది. ముఖ్యంగా కామెర్ల వ్యాధిలో ఎక్కువ మేలు చేస్తుంది. పెరుగు మీద తేట, వైద్యపరంగా, చెవులను బలసంపన్నం చేస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. చెవిలో హోరు(టినిటస్), చెవులలో తేడాల వలన కలిగే తలతిరుగుడు (వెర్టిగో)లా౦టి వ్యాధులకు ఇది గొప్ప ఔషధంగా పని చేస్తు౦దన్నమాట.తేమనం..తేమనం అనేది శ్రీనాథుడి కాలంలో ప్రసిద్ధి చె౦దిన వంటకమే!. దీన్ని తిపిగానూ, కార౦గానూ రెండు రకాలుగా తయారు చేసుకొంటారు. ఈ మజ్జిగలో పాలు, బెల్లం, తగినంత చేర్చి, ఒక పొంగు వచ్చే వరకూ కాచితే అది “తేమనం” అనే తెలుగు పానీయంగా తయారవుతుంది. ఇది వేసవి పానీయాలలో మేలైన పానీయం. వడదెబ్బ వలన కలిగే శోషని నివారిస్తుంది. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. చల్లారిన తరువాత త్రాగటం మంచిది. దీన్ని తీపి మజ్జిగ పులుసు అని కూడా పిలుస్తారు.మజ్జిగమీద తేట:మజ్జిగ మీద తేటకు మజ్జిగతో సమానమైన గుణాలున్నాయి. చిలికిన మజ్జిగని ఒక గిన్నెలో సగానికి పోసి మూడొంతుల వరకూ నీళ్ళు కలిపి రెండు గంటలు కదల్చకుండా ఉంచండి. మజ్జిగమీద ఆ నీరు తేరుకొంటుంది. మజ్జిగ తేటను వంచుకొని మళ్ళీ నీళ్ళు పోయండి. ఇలా ప్రతి రెండు మూడు గంటల కొకసారి మజ్జిగ నీళ్ళు వంచుకొని వేసవి కాలం అంతా మంచి నీళ్ళకు బదులుగా ఈ మజ్జిగ నీళ్ళు తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టదుగాక కొట్టదు. ఎండల్లో బయటకు వెళ్ల వలిసి వస్తే చిలికిన మజ్జిగలో నిమ్మకాయి, ఉప్పు వేసుకుని తాగండి. అవసరమయ్యితే ఓ బాటిల్ నిండా వేసుకుని తీసుకువెళ్లండి. లేదా తిరిగి ఇంటికి వచ్చాక మరొక్కసారి తాగండి వడదెబ్బ కొట్టదు.(చదవండి: సమ్మర్లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి!)
సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
చిన్న పిల్లల చేష్టలు భలే ముద్దుగా ఉంటాయ్. అందులోనూ అమ్మాయిలు చేస్తే ఇంకా ముచ్చటగా ఉంటుంది. అమ్మచీర దొంగచాటుగా చుట్టేసు కోవడం, పెద్ద జడకోసం ఆరాట పడటం . అబ్బో..ఈ లిస్ట్ చాలా పెద్దదే. ఇది మాత్రమే కాదు.. అమ్మ చేసే పనులను కాపీ చేస్తూ ఉంటారు. పెద్ద ఆరిందాలాగా చీపురు పట్టకొని ఊడ్వడం, బుజ్జి బుజ్జి చేతులతో వంట చేసేయడం, వడ్డించడం లాంటి పనులు చేసి మురిపిస్తుంటారు. ఇక ఒక టీవీ చూస్తూ డాన్స్లు వేయడం,అద్దం ముందు నించొని చేసే చేష్టల గురించైతే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. తాజాగా ఓ చిన్నారి డ్యాన్స్ వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.Who says group dance is not possible with a single performer? 😀😛😂 #Dance #cutenessoverload pic.twitter.com/mOJIVgB6yR— Ananth Rupanagudi (@Ananth_IRAS) May 5, 2024 ఒక షాపింగ్ మాల్లో ఒక చిన్నారి ఒక రేంజ్లో డ్యాన్స్ చేసింది. ఎక్కడ ఎవరు తీసారు అనే వివరాలు అందుబాటులో లేనప్పటికీ, షాపింగ్ మాల్ ట్రయిల్ రూంలో అద్దం ముందు నిల్చొని అద్భుతంగా స్టెప్పులేసింది. దీంతో అద్దాల్లో నలుగురు చిన్నారులు గ్రూపు డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ అమ్మాయి అభియం కూడా నిజంగా అక్కడ నలుగురు అమ్మాయిలున్నారా అనిపించేలా చేసింది. దీంతో నెటిజన్లు వావ్..సూపర్ అంటున్నారు. మరి మీరు కూడా ఒకసారి చూసేయ్యండి ఆ వీడియోను.
ఓ సుకుమారీ.. నీ స్టయిలే అదిరే.. కుమారీ! (ఫోటోలు)
న్యూస్ పాడ్కాస్ట్
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం పట్ల ఎన్నికల సంఘం సీరియస్.. తక్షణం దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
అవ్వాతాతల పెన్షన్లపై చంద్రబాబు పాపిష్టి కళ్లు.. నరసాపురం, క్రోసూరు, కనిగిరి ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ ఆరాటం.. గుజరాత్ ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. జగన్ది ప్రోగ్రెస్ రిపోర్ట్... టంగుటూరు, మైదుకూరు, కలికిరి ఎన్నికల సభల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నేత చంద్రబాబును నమ్మితే అధోగతే.. చోడవరం, అంబాజీపేట, పొన్నూరు ప్రచార సభల్లో ప్రజలను అప్రమత్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
మోసగాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలి.. ఎన్నికల ప్రచార సభల్లో రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ..ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో మరింత సంక్షేమం.. మరింత అభివృద్ధి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... నవరత్నాల పథకాలన్నీ కొనసాగింపు..ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
Karachi Bakery:హోటల్స్, బేకరీల్లో తనిఖీ
హైదరాబాద్: హైదరాబాద్లోని పలు హోటల్స్, బేకరీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఎంజేమార్కెట్ చౌరస్తాలోని అంతర్జాతీయ గుర్తింపు పొందిన కరాచీ బేకరీలో గడువు తేదీ ముగిసిన పదార్థాలను గుర్తించారు. ఇందులో రూ.5200 వేల విలువైన బిస్కెట్లు, మిఠాయిలు, చాక్లెట్ కేకులు, రస్క్, బన్నులు ఉన్నాయి. అంతేగాకుండా పలు ఆహార పదార్థాలపై లేబుల్ లేని ఉత్పత్తులను గుర్తించారు. ఫుడ్సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో కరాచీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
సుల్తానాబాద్రూరల్: డ్రైవర్ సీటు కింది స్ప్రింగ్ ఊడిపోవడంతో ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడడంతో ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై శ్రావణ్కుమార్, మృతుల కుటుంబసభ్యుల కథనం ప్రకారం..సుల్తానాబాద్ మండలం చిన్న కూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ మల్యాల వెంకటేశ్ మియాపూర్ గ్రామ పరిధిలో చేను కౌలుకు తీసుకొని మొక్కజొ న్న సాగు చేశాడు. పంట చేతికి రావడంతో తన భార్య మల్యాల వైష్ణవి(35)తోపాటు పోచంపల్లి రాజమ్మ(61), బేతి లక్ష్మి(50), పోచంపల్లి పద్మ, విజ్జగిరి రమ, విజ్జగిరి రాజమ్మ, పోచంపల్లి లక్ష్మి ని ట్రాక్టర్లో తీసుకొని ఆదివారం ఉదయం 7గంటల సమయంలో చేను వద్దకు వెళ్లాడు. మొక్కజొన్న కంకులు కోసి ట్రాక్టర్లో లోడ్ చేసుకున్నాడు. తిరుగుప్రయాణంలో వారిని ట్రాక్టర్ ట్రాలీ పై ఎక్కించుకొని కాలువ వెంట ఉన్న దారి నుంచి వస్తున్నాడు. మధ్యాహ్నం 12గంటల సమయంలో డ్రైవర్ సీటు కింద ఉన్న స్ప్రింగ్ ఊడిపోయింది. దీంతో ఒక్కసారిగా డ్రైవర్ కుప్పకూలిపోయాడు. స్టీరింగ్ చేజారి ట్రాక్టర్ అదుపు తప్పింది. వేగంగా కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. దీంతో ట్రాలీ కింద మహిళా కూలీలు నలిగిపోయారు. ఇందులో మల్యాల వైష్ణవి, పోచంపల్లి రాజమ్మ, బేతి లక్ష్మి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. పోచంపల్లి పద్మ, విజ్జగిరి రమ, విజ్జగిరి రాజమ్మ, పోచంపల్లి లక్ష్మికి తీవ్ర గాయాలు సమీపంలోని రైతులు వెంటనే కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ వెంకటేశ్కు స్వల్ప గాయాలు కావడంతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాలను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సీఐ సుబ్బారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు ఎస్సై కేసు నమోదు చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, నాయకులు నల్ల మనోహర్రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు.
పది రోజుల్లో బిడ్డ పెళ్లి.. అంతలోనే తండ్రి మృతి
కోరుట్ల: పది రోజుల్లో బిడ్డ పెళ్లి.. అంతలోనే వాంతులు చేసుకొని, మృతిచెందాడు కోరుట్లకు చెందిన ఓ ఆటోడ్రైవర్. వైద్యులు సమయానికి చికిత్స అందించక పోవడం వల్లే చనిపోయాడని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి ఫర్నిచర్ ధ్వంసం చేసి, దవాఖానా ఎదుట ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని హాజీపురకు చెందిన నజీబుర్ రెహ్మాన్(48) ఆటోడ్రైవర్. ఆదివారం మధ్యాహ్నం బస్టాండ్ ఆటో అడ్డా వద్ద వాంతులు చేసుకున్నాడు. అక్కడున్నవారు అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించకుండా గంటసేపు కాలయాపన చేసి, చివరికి నజీబుర్ రెహ్మాన్ మృతిచెందినట్లు చె ప్పారు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెబితే మరో ఆస్పత్రికి తీసుకువెళ్లేవారమని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువులతో కలి సి ఆస్పత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసి, ఆందో ళన చేపట్టారు. వైద్యుడు శ్రవణ్, సిబ్బందిపై గొడవకు దిగడంతో ఓ గదిలోకి వెళ్లి, దాక్కున్నారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ గొడవ సద్దుమణగలేదు. బాధితులు వైద్య సిబ్బంది దాక్కున్న గదిలోకి పెట్రోల్ విసరడంతో అప్రమత్తమయ్యారు. వారిని అక్కడినుంచి సురక్షితంగా తరలించారు. సుమారు 4 గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. చివరకు మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్రావు, కోరుట్ల సీఐ సురేశ్బాబు, ఎస్సైలు చిరంజీవి, శ్యాంరాజ్, నవీన్ మృతుడి బంధువులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఈ నెల 17న పెద్ద కూతురి వివాహం జరగాల్సి ఉంది. ఈ సమయంలో నజీబుర్ రెహ్మాన్ ఆకస్మిక మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వాంతులు చేసుకున్న కోరుట్లవాసి వైద్యులు చికిత్స అందించలేదని కుటుంబసభ్యుల ఆరోపణ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు, సిబ్బందితో గొడవ ఫర్నిచర్ ధ్వంసం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
మంచిర్యాలక్రైం/నస్పూర్: తమ ఇద్దరు కుమారులకు ఈతనేర్పించేందుకు స్విమ్మింగ్ పూల్కు తీసుకెళ్లిన ఆ తండ్రి అదే స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ ఊపిరాడక కొడుకుల కళ్లెదుటే మృతి చెందిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. నస్పూర్ ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల మేరకు గద్దెరాగడికి చెందిన పంజాల సతీష్గౌడ్ (41) మంచిర్యాల పోలీస్ స్టేషన్లో బ్లూకోర్ట్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొద్దిరోజులుగా తన ఇద్దరు కుమారులతో కలిసి సీసీసీలోని సింగరేణి స్విమ్మింగ్పూల్కు వెళ్తున్నాడు. ఆదివారం స్విమ్మింగ్ చేస్తుండగా అధిక రక్తపోటుకు గురికావడంతో నీటిలో మునిగిపోయి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. తోటి స్విమ్మర్లు, సిబ్బంది మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య స్వప్న, ఇద్దరు కుమారులు యశ్వంత్(12) వేయాన్(10) ఉన్నారు. స్పప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. నివాళులర్పించిన డీసీపీ అశోక్ కుమార్ కానిస్టేబుల్ సతీష్ మృతిని జిల్లా పోలీస్ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. శనివారం రాత్రి తమతో కలిసి బ్లూకోర్ట్ పెట్రోలింగ్ విధుల్లో ఉత్సాహంగా పాల్గొన్న సతీష్ మృతి చెందిన వార్త తెలియగానే డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ ప్రకాశ్, ఎస్సైలు, సీఐలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలివచ్చి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆర్నెళ్ల క్రితమే గృహప్రవేశం కొత్తగా ఇంటిని నిర్మించుకున్న సతీష్ ఆర్నెళ్ల క్రితమే గృహప్రవేశం కూడా చేశాడు. కొత్త ఇంట్లోకి ప్రవేశించి ఏడాది కూడా పూర్తికాకముందే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో మృతుని కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. స్విమ్మింగ్ పూల్లో ఈతకొడుతూ కానిస్టేబుల్ మృతి నివాళులర్పించిన డీసీపీ అశోక్కుమార్