Top Stories
ప్రధాన వార్తలు
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను మంగళవారం ఆయన విడుదల చేశారు.ఆ వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 10 గంటలకు విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని బొబ్బిలిలో ఉన్న మెయిన్ రోడ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేటలోని సూర్య మహల్ సెంటర్లో జరిగే సభలో.. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
మీ మేనిఫెస్టోలో ప్రధాని మోదీ ఫొటో ఎక్కడ చంద్రబాబూ?: సీఎం వైఎస్ జగన్
ఈ పెద్దమనిషి చంద్రబాబు.. ఇవాళ మేనిఫెస్టో అంటూ ప్రకటించాడు. చంద్రబాబు విశ్వసనీయత, సాధ్యం కాని హామీలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. పైనుంచి బీజేపీ వాళ్లు ఫోన్ చేసి నీ ఫొటో మాత్రమే పెట్టుకో! ప్రధాని మోదీ ఫొటోను నీ మేనిఫెస్టోలో పెట్టొద్దు అని తేల్చి చెప్పారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలిచి్చనట్లే కదా! అదంతా మోసమే అని రుజువు అవుతోంది కదా? కూటమిలో ఉంటూ ముగ్గురి ఫొటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు లేడంటే ఒక్కసారి గమనించండి. ప్రజల్ని మోసం చేయడం కోసం ఆయన ఏ స్థాయిలో బరి తెగించాడో చూడండి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిచేతగానివాడికే కోపం ఎక్కువ..చంద్రబాబు వయసు 75 ఏళ్లు దాటింది. ఇంత జీవితం.. వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలతోనే గడిచిపోయింది. 75 ఏళ్లు వచ్చాయి కదా..! ఆ మనిషిలో ఇప్పుడైనా పశ్చాత్తాపం కనిపిస్తుందా? అని చూస్తే ఏ కోశానా లేదు. వీళ్లంతా.. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో తెలుసా? జగన్ను మనిషి అనాలో రాక్షసుడు అనాలో చంద్రబాబుకు అర్థం కావట్లేదట! జగన్ను ఎందుకు చంపకూడదు? అని అడుగుతాడు ఈ పెద్దమనిషి. పనిలో పనిగా జగన్ను పాతేస్తానని కూడా అంటాడు. మొన్న నందికొట్కూరు, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు, కోవూరులో అన్న మాటలివి. అయ్యా.. మీ సంస్కారానికి ఓ నమస్కారం! చేతగానివాడికే కోపం ఎక్కువ.– మైదుకూరు సభలో సీఎం జగన్సాక్షి ప్రతినిధి, ఒంగోలు, సాక్షి ప్రతినిధి, కడప, సాక్షి రాయచోటి: అసత్యాల హరిశ్చంద్రులంతా 2014 తరహాలో మరోసారి కూటమి కట్టి మళ్లీ మోసగించేందుకు తయారయ్యారని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. తాను వరుసబెట్టి 58 నెలలుగా మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ల లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబూ..! నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటని అడిగితే సమాదానం చెప్పకుండా జగన్ను తిడితే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. నాయకుడంటే ప్రజలకు నమ్మకం కలిగేలా ఉండాలన్నారు. ‘చంద్రబాబుది బోగస్ రిపోర్టు అయితే మీ జగన్ది ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇద్దరి పాలనలే ఇందుకు నిదర్శనం’ అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం టంగుటూరులో, మధ్యాహ్నం వైఎస్సార్ జిల్లా మైదుకూరులో, సాయంత్రం అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించిన బహిరంగ సభల్లో సీఎం జగన్ మాట్లాడారు. నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం..ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. ఇది జగన్కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధం కాదు. పేదలకు–చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. మీరు వేసే ఓటు పేదల తలరాతలను మారుస్తుంది. మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా సజావుగా కొనసాగింపు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే. మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. లకలకా... అంటూ మళ్లీ ఐదేళ్లు మీ అందరి రక్తం తాగేందుకు తలుపు తడుతుంది. చంద్రబాబును నమ్మటం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమే. నాయకుడంటే ప్రజల్లో నమ్మకం ఉండాలి. తాను ఒక మాట చెబితే చేస్తాడనే నమ్మకం ఆ నాయకుడిపై ప్రజలకు కలగాలి. మేనిఫెస్టోలో చెప్పిన 99శాతం వాగ్దానాలను అమలు చేసి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. ఎవరు మనసున్న మనిషి?చంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత? కేవలం రూ.1,000 మాత్రమే. ఈరోజు మీ బిడ్డ ఇస్తున్న పెన్షన్ రూ.3,000. మరి ఎవరికి మనసుంది? చంద్రబాబు ఏనాడైనా ఆ అవ్వాతాతలకు తోడుగా ఉన్నాడా? ఇంటికే పెన్షన్ పంపించాడా? 14 ఏళ్ల పాలనలో ఎన్నడైనా బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మలకు మంచి చేశాడా? మరి మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కి నేరుగా రూ.2.70 లక్షల కోట్లు ఎక్కడా లంచాలు లేకుండా పారదర్శకంగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాడు. అందుకనే మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు, మన చదువులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన హాస్పిటల్స్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. అక్కచెల్లెమ్మలను ఆదుకున్నాం..18 శాతం ఓవర్ డ్యూస్తో ఎన్పీఏలుగా సీ, డీ గ్రేడ్ల్లోకి పడిపోయిన పొదుపు సంఘాలకు మీ జగన్ పునరుజ్జీవం కల్పించాడు. ఈరోజు లోన్ రీపేమెంట్ ఏకంగా 99.7 శాతానికి చేరుకుని దేశానికే ఆదర్శంగా నిలిచాయి. అక్కచెల్లెమ్మల కోసం ఆసరాతోపాటు సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు, పిల్లల చదువులకు తోడుగా విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి అందించి అండగా నిలిచాం. మహిళా సాధికారతకు అర్థం చెబుతూ ఏకంగా చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్టుల్లో అక్కచెల్లెమ్మలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది మీ బిడ్డ ప్రభుత్వమేనని గర్వంగా చెబుతున్నా. అక్కచెల్లెమ్మలకు రక్షణగా దిశ యాప్, గ్రామంలోనే మహిళా పోలీస్ సేవలు అందుబాటులోకి తెచ్చాం. అమ్మ ఒడిని రూ.15వేల నుంచి రూ.17 వేలకు, అవ్వాతాతల పెన్షన్లను రూ.3 వేల నుంచి దశలవారీగా రూ.3,500కి పెంచుకుంటూ వెళతామని మాటిస్తున్నా. రైతన్నలకు జగన్ ఏం చేశాడంటే..⇒ ఎన్నడూ లేని విధంగా అన్నదాతలకు రైతు భరోసా ఇచ్చింది మీ బిడ్డ జగన్. సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తోంది మీ జగన్. ⇒ గ్రామాల్లో ఆర్బీకేలు తేవడంతోపాటు 9 గంటలు పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్, ఈ– క్రాప్, ఉచిత పంటల బీమా, గిట్టుబాటు ధరలు, ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, రైతన్నలకు సలహాలు, దళారీలు లేకుండా పంటల కొనుగోళ్లు.. ఇవన్నీ జరిగింది ఎప్పుడంటే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాకే.⇒ మీ జగన్ చెప్పిన దాని కంటే మిన్నగా రైతన్నలకు సాయం చేశాడు. రైతు భరోసా ద్వారా ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పినా అంతకంటే మిన్నగా ఐదేళ్లలో రూ.67,500 పెట్టుబడి సాయంగా అందించాడు. ⇒ ఈ దఫా అధికారంలోకి వచ్చాక ఏటా రూ.16 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.80 వేలు రైతన్నల చేతిలో పెడతామని చెబుతున్నా. మరి మాట తప్పకుండా కచ్చితంగా ఇచ్చే మీ జగన్ను నమ్మాలా? లేక ఇస్తానని మోసం చేసే చంద్రబాబును నమ్మాలా? డెవలప్ చేసిందెవరు?⇒ చంద్రబాబు డెవలప్మెంట్ కింగ్ అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 బాకా ఊదుతుంటాయి. చంద్రబాబు ఏం డెవలప్మెంట్ చేశాడో మీరే చెప్పండి. గ్రామాల్లో పౌర సేవల్ని పూర్తిగా మారుస్తూ, గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఏకంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు కట్టింది ఎవరు? ఈరోజు 11 వేల విలేజ్, వార్డు క్లినిక్లు కనిపిస్తున్నాయంటే వాటిని కట్టింది ఎవరు? మన గ్రామాల్లో 11 వేల రైతు భరోసా కేంద్రాలు కట్టింది ఎవరు? గ్రామానికే ఫైబర్ గ్రిడ్, వేగంగా డిజిటల్ లైబ్రరీల నిర్మాణం జరుగుతున్నది కూడా మీ బిడ్డ హయాంలోనే. నాడు–నేడుతో గవర్నమెంట్ బడులు, ఆస్పత్రులు బాగు పడ్డాయంటే కారణం ఎవరు?బాగు చేసింది ఎవరయ్యా?జగన్లా 17 మెడికల్ కాలేజీలు తెచ్చావా బాబూ? జగన్లా 4 కొత్త సీ పోర్టులు కట్టావా? 10 ఫిషింగ్ హార్బర్లు కట్టావా? ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కట్టావా? మీ జగన్ సర్ఫేస్ వాటర్ (రిజర్వాయర్ నుంచి ఉపరితల జలాలు) తరలించి ఉద్దానం వాసుల కిడ్నీ కష్టాలను తీర్చాడు. వెలిగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తెచ్చింది మీ జగన్ కాదా? జగన్లా ఎయిర్పోర్టుల విస్తరణ చేశావా చంద్రబాబూ? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును పరుగులు తీయించావా? 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్లు.. ఇవన్నీ నువ్వు పరిగెత్తించావా? జగన్లా ఎంఎస్ఎంఈలకు ఏనాడైనా సపోర్ట్ చేశావా? జగన్లా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ ఓ రైతు భరోసాగానీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా, సున్నా వడ్డీ, వాహన మిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న తోడు, జగనన్న చేదోడు, లా నేస్తం వంటి పథకాలను తెచ్చావా చంద్రబాబూ? అన్నింటికీ మించి పేదరికం సంకెళ్లను తెంచేలా పిల్లల చదువులను బాగు చేసింది ఎవరయ్యా చంద్రబాబూ? డెవలప్మెంట్ విషయంలో కూడా బాబుది బోగస్ రిపోర్టే. మీ సంస్కారానికి ఓ నమస్కారం..నేను వరుసబెట్టి 58 నెలలుగా మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ల లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోంది. మా బాబును ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా? అని ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి, టీవీ 5, దత్తపుత్రుడికి కోపం వస్తోంది. వదినమ్మకూ కోపం వస్తోంది. వీరందరికీ పిచ్చిపిచ్చిగా కోపం వస్తోంది. వీరితోపాటు చంద్రన్న కాంగ్రెస్కు కూడా కోపం వస్తోంది. మనకు కౌంటర్గా వారు లిస్టులు చదువుతున్నారు. కాకపోతే అవి స్కీమ్ల లిస్టులు కాదు. అవన్నీ నాపై తిట్లు, శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు. అవి ప్రతి రోజూ గడగడ చదివేస్తున్నారు. అయ్యా.. మీ అందరి సంస్కారానికి ఓ నమస్కారం.బంగారం వేలం వేయించిన చంద్రబాబుచంద్రబాబూ.. రైతుల రుణ మాఫీపై తొలి సంతకం చేస్తానన్నావు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నావు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశావా? బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపించకపోగా ఏకంగా వేలం వేయించాడు. చంద్రబాబు రైతులకు ఉచితంగా పంటల బీమా ఏరోజైనా ఇచ్చాడా? సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఏ రోజైనా ఉందా? సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చాడా? లేక ఎగరగొట్టారా? పెట్టుబడి సాయంగా చంద్రబాబు ఏ ఒక్క రైతుకైనా రైతు భరోసా అందించారా? ఎన్నికలు రావడంతో జగన్ కంటే ఎక్కువ డబ్బులిస్తానంటూ నమ్మబలుకుతున్నాడు. రైతులపై కాల్పులు జరిపించిన బాబువ్యవసాయం దండగ అని నువ్వు మాట్లాడిన మాట నిజం కాదా చంద్రబాబూ? రైతులపై బషీర్బాగ్లో కాల్పులు జరిపించింది నువ్వు కాదా? రైతులను విచారించేందుకు ఏకంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు తెచ్చింది నువ్వు కాదా? రైతన్నలకు ఉచిత కరెంటు ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందన్న మాటలు నీవి కావా? రైతులను అన్ని రకాలుగా మోసం చేసి నిట్ట నిలువునా ముంచిన నీది బోగస్ రిపోర్టు కాదా?పెన్షన్లపై బాబు కుట్రలుఈ బోగస్ బాబు చేస్తున్న మరో దుర్మార్గం చూడండి. పెన్షన్ల విషయంలో బాబు కుట్రలను గమనించండి. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏ ఒక్కరోజైనా అవ్వాతాతల బాధలను పట్టించుకున్నాడా? పెన్షన్లు ఇంటికే పంపించిన చరిత్ర చంద్రబాబు హయాంలో ఉందా? మీ జగన్కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే ఆందోళనతో తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాయించి ఇంటికి వచ్చే ఆ పెన్షన్లను ఆపించారు. వలంటీర్ల సేవలను రద్దు చేయించిన వ్యక్తి ఈ చంద్రబాబు కాదా? తాను చేసిన వెధవ పనికి ఆ అవ్వా తాతలంతా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుండటంతో ఆ నెపాన్ని జగన్ మీదకు తోస్తున్నాడు. ఇంతకంటే దిగజారుడు రాజకీయం ప్రపంచ చరిత్రలో ఉంటుందా?నీ కళ్లకు పచ్చ కామెర్లా?బడులకు పంపే తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి అనే పథకాన్ని నీ హయాంలో ఏ రోజైనా తెచ్చావా బాబూ? పేదింటి పిల్లలకు ఇంగ్లిష్ మీడియం, బైలింగ్వల్ టెక్ట్స్ బుక్స్, 8వ తరగతికి వచ్చే సరికి ట్యాబ్లు, 6వ తరగతి నుంచే ఐఎఫ్పీలతో డిజిటల్ బోధన, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్, బైజూస్ కంటెంట్ లాంటివి కనిపించడం లేదా చంద్రబాబూ? పచ్చకామెర్లు వచ్చాయా నీ కళ్లకు? పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెన, ఖర్చులకు ఇబ్బంది పడకుండా వసతి దీవెన, తొలిసారిగా ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్.. ఇవన్నీ వచ్చింది ఈ 58 నెలల కాలంలోనే కాదా? మరి చదువుల విషయంలో చంద్రబాబు రిపోర్టు బోగస్ కాదా?బాబుది బోగస్ రిపోర్ట్.. జగన్ది ప్రోగ్రెస్ రిపోర్ట్ బాబు వస్తే జాబొస్తుందని 2014లో చంద్రబాబు, ఎల్లో మీడియా ఊదరగొట్టాయి. చంద్రబాబు ఐదేళ్లలో ముష్టి వేసినట్లు 32 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే మీ జగన్ 2.31 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాడు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాలు నాలుగు లక్షలు మాత్రమే ఉంటే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఏకంగా మరో 2.31 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేశాడు. మన చెల్లెమ్మలు, తమ్ముళ్లే గ్రామ సచివాలయాలు, మెరుగుపడిన ఆస్పత్రులు, బాగుపడిన స్కూళ్లలో కనిపిస్తున్నారు. మరి బాబు రిపోర్ట్ బోగస్ కాదా? ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మీ జగన్ రిపోర్టు కళ్లెదుటే కనిపిస్తున్న వాస్తవం కాదా?మన అభ్యర్థులను ఆశీర్వదించండిఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కొండపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సురేష్, ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్. రఘురామిరెడ్డి, రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలి.రాజోలి మనమే పూర్తి చేస్తాం..మన ప్రభుత్వం మళ్లీ రాగానే రాజోలి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. కరోనా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా అనుకున్న సమయానికి చేయలేకపోయాం. నాలుగేళ్లు పుష్కలంగా వర్షాలు పడటంతో అన్ని ప్రాజెక్టులు నిండాయి. ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రంగా పడటంతో రాజోలి ప్రాముఖ్యత తెలుస్తోంది. వచ్చే టర్మ్లో కచ్చితంగా రాజోలి ప్రాజెక్టును పూర్తి చేస్తాం.2014లో బాబు ముఖ్యమైన మోసాలివీ..⇒ రూ.87,612 కోట్ల రైతు రుణాలు మాఫీ చేశాడా? రూ.14,205 కోట్లు డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాల్లో కనీసం ఒక్క రూపాయి మాఫీ చేశాడా? ⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25వేలు బ్యాంకుల్లో వేస్తామని నమ్మబలికిన చంద్రబాబు ఏ ఒక్కరి ఖాతాలోనైనా రూపాయి జమ చేశాడా?⇒ ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల నిరుద్యోగ భృతి అని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ ప్రకారం ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఎవరికైనా ఇచ్చాడా?⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు ఒక్కరికైనా ఇచ్చాడా? ⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ జరిగిందా? ⇒ ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? ⇒ సింగపూర్కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. కొండపి, మైదుకూరులో ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ⇒ పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా? అది కూడా అమ్మేశాడు. ⇒ అవే మూడు పార్టీలు ఇప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అంటూ మరోసారి మోసాలకు సిద్ధమయ్యాయి.జవాబు చెప్పకుండా జగన్ను తిడతావా?చంద్రబాబూ నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటని అడిగితే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను అమలు చేశావా? అంటే సమాధానం రాదు. మీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి? ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిడితే ఏం ప్రయోజనం? ఇంటింటికీ ఎవరు మంచి చేశారు? ఎవరు అందరినీ మోసగించారు? వారి చరిత్ర ఏమిటనేది ప్రజలందరికీ తెలుసు.
ఇజ్రాయెల్ నెతన్యాహుకు ఊహించని షాక్!
టెల్ అవీవ్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. యుద్ధ నేరాలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇతర అగ్రనేతలకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ త్వరలో అరెస్ట్ వారెంట్లు జారీ చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. దీంతో, ఈ అంశం హాట్ టాపిక్గా మారింది.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. నెతన్యాహు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. హమాస్తో కాల్పుల విరమణ చర్చలు కొనసాగుతున్నాయి. చర్చల్లో భాగంగా ఒప్పందం కుదరినా, కుదరకపోయినా.. హమాస్లను అంతం చేయడానికి ఇజ్రాయెల్ దళాలు రఫాలోకి ప్రవేశిస్తాయన్నారు. మా లక్ష్యాలను సాధించకుండా యుద్ధం నిలిపివేసే సమస్యే లేదు. హమాస్ దళాలను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ తప్పకుండా విజయం సాధిస్తుందని కామెంట్స్ చేశారు.The International Criminal Court may soon issue arrest warrants for Israeli Prime Minister Benjamin Netanyahu and other top leaders for war crimes. That's according to press reports out of Israel. Capitol Hill Correspondent @ErikRosalesNews reports. pic.twitter.com/lFuboZN6oK— EWTN News Nightly (@EWTNNewsNightly) May 1, 2024 మరోవైపు.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా వేలాది మంది పాలస్తీనియన్లు రఫా నగరంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో బందీల విడుదలకు, కొంత ఉపశమనం పొందడానికి రెండు దేశాల మధ్య కాల్పుల ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇక.. రఫా నగరంపైకి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి జరిపిన దాడుల్లో మూడు కుటుంబాల్లోని ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదు రోజుల వయసున్న పసికందు ఉందని పాలస్తీనా అధికారులు తెలిపారు.
పోలీసుల కళ్లెదుటే ‘మణిపూర్ ఘోరం’
మణిపుర్లో మైతీ తెగకు చెందిన మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీ తెగ మహిళను నగ్నంగా ఊరేగించి.. లైంగిక హింసకు పాల్పడిన ఘటన దేశంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఛార్జిషీట్లో షాకింగ్ విషయాలను వెల్లడించింది. బాధిత మహిళలు సాయం చేయమని కోరినా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, వారు ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిగుంపుకే సహకరించేలా వ్యవహరించారని తెలిపింది.కాంగ్పోక్పీ జిల్లాలో మైతీ అల్లరిగుంపు చేతికి చిక్కిన ఇద్దరు కుకీ మహిళలు ఘటనా ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీసు జీపు వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరారు. అయితే పోలీసులే స్వయంగా బాధితులను ఆ అల్లరిగుంపకు అప్పగించినట్లు ఛార్జిషీటులో సీబీఐ పేర్కొంది. దీంతో ఆ అల్లరి మూక ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వరిపొలాల్లో దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వివరించింది.బాధితురాళ్లలో ఒక మహిళ తమను కాపాడి, సురక్షిత ప్రాంతాని తీసుకుళ్లాలని పోలీసులను కోరారు. అయితే జీపు తాళాలు తమ వద్ద లేవని పోలీసులు అబద్దాలు చెప్పినట్లు సీబీఐ ఛార్జిషీట్ పేర్కొంది. మరోవైపు.. అల్లరిగుంపు చేతికి చిక్కిన మూడో మహిళ వారి నుంచి త్రుటిలో తప్పించుకొంది.గతేడాది మే 4న జరిగిన ఈ ఘటన రెండు నెలల తర్వాత జులై నెలలో వైరల్గా మారి దేశమంతా కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆరుగురు నిందితులతోపాటు ఓ బాల నేరస్థుడిపై గౌహతి సీబీఐ ప్రత్యేక జడ్జి కోర్టులో అక్టోబరు 16న ఛార్జిషీటు దాఖలు అయింది.ఈ దాడుల్లో అల్లరిగుంపు చేతిలో మృతిచెందిన కుకీ తెగకు చెందిన తండ్రీకొడుకుల మృతదేహాలను గ్రామ సమీపంలోని నీరులేని నదిలోకి విసిరేసినట్లు తెలిపింది. మైతీ గుంపు జీపు వద్దకు చేరుకోగానే బాధితులను అక్కడే వదిలేసి.. పోలీసులు పారిపోయినట్లు సీబీఐ మూడు పేజీల ఛార్జిషీటులో పేర్కొంది.
మేం టచ్ చెయ్యం బాబూ.. మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా బీజేపీ ససేమిరా
సాక్షి, అమరావతి: దేశంలో విశ్వసనీయత లేని నాయకుడు చంద్రబాబు అని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్ర నాయకత్వం స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఈ ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ, ఉమ్మడిగా మేనిఫెస్టో ఇవ్వడానికి మాత్రం అంగీకరించలేదు. తద్వారా చంద్రబాబు హామీలకు బీజేపీ కానీ, ప్రధాని నరేంద్ర మోదీ కానీ గ్యారంటీ కాదని చెప్పింది. ఆ మేనిఫెస్టోపై బీజేపీ ముద్ర ఒక్కటి కూడా లేకుండా జాగ్రత్తపడింది. దానిపై బీజేపీ నేతల ఫొటోలు, గుర్తు ఉండకూడదని ఆ పార్టీ ముందే స్పష్టం చేసింది. చంద్రబాబు కమలం గుర్తు వేయించినా, చివర్లో తొలగించాల్సి వచ్చింది. చివరికి ఆ మేనిఫెస్టోని తాకడానికి కూడా బీజేపీ నేతలు ముందుకు రావడంలేదు. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకొన్న బీజేపీ అప్పట్లో ఉమ్మడి మేనిఫెస్టోకి అంగీకరించింది. ఆ మేనిఫెస్టోలో చంద్రబాబు రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ, యువతకు జాబులు అంటూ ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చారు. ఆ మేనిఫెస్టోలో ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ ఫొటోలు, మూడు పార్టీల గుర్తులు ఘనంగా ముద్రించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఒక్కటీ నెరవేర్చకుండా అన్ని హామీలకు మంగళం పాడారు. అడుగడుగునా ప్రజలను వంచించారు. రుణ మాఫీ చేస్తానని చెప్పి రైతులు, మహిళలను నిలువునా మోసం చేశారు. జాబులు లేక యువత అల్లాడారు. పైగా, ఐదేళ్లూ విచ్చలవిడి అవినీతి, దోపిడీ జరగడంతో మరోసారి చంద్రబాబు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. ఆ నింద బీజేపీ పైనా పడింది. ఆ పార్టీ జాతీయ నేతలూ ఇదే నిర్ధారణకు వచ్చారు. బాబును నమ్మని బీజేపీ ఈ ఎన్నికల్లో మళ్లీ బీజేపీతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడినప్పటికీ, ఆ పార్టీ జాతీయ నాయకత్వం తొలుత అంగీకరించలేదు. చంద్రబాబు ఢిల్లీలోని తన ఏజెంట్లు, బీజేపీలో ఉన్న తన అనుంగులు, ఇతరత్రా పైరవీలు చేశారు. అయినా బీజేపీ పెద్దలు ఆయన్ని నమ్మలేదు. ఢిల్లీలో రాత్రింబవళ్లు పడిగాపులు గాసి, కాళ్లా వేళ్లా పడి చిట్టచివరకు పొత్తు పెట్టుకోగలిగారు. బీజేపీ పొత్తయితే పెట్టుకొంది కానీ, చంద్రబాబును ఆ పార్టీ పెద్దలు నమ్మడంలేదన్న విషయం ప్రతి సందర్భంలోనూ బయటపడుతోంది. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన గెలుపే అసాధ్యమైతే, మేనిఫెస్టో విషయంలోనూ మరోసారి అభాసుపాలు కాకూడదని బీజేపీ అధిష్ఠానం భావించింది. దీంతో ఈసారి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఓ పరిశీలకుడిని మాత్రమే పంపి మమ అనిపించింది. కనీసం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి, పార్టీ రాష్ట్ర నాయకులు కూడా హాజరుకాలేదు. అంతేకాదు.. మేనిఫెస్టోలో కనీసం ప్రధాని మోదీ ఫొటోగానీ, కమలం గుర్తు గానీ ముద్రించేందుకు బీజేపీ పెద్దలు అంగీకరించలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్షా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫొటోలు ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. అయితే, చంద్రబాబు తెలివిగా మేనిఫెస్టో కాపీలపై మోదీ, ఇతర నాయకుల ఫొటోలు లేకుండా, కమలం గుర్తును మాత్రం వేయించారు. బీజేపీ దీనికీ అంగీకరించలేదు. దాన్ని మార్చాల్సిందేనని పరిశీలకుడు సిద్ధార్థనాథ్సింగ్ పట్టుబట్టారు. దీంతో మేనిఫెస్టో ముఖచిత్రంలో అప్పటికప్పుడు మార్పులు చేశారు. అందుకే 12 గంటలకు జరగాల్సిన మేనిఫెస్టో విడుదల మూడు గంటలు ఆలస్యమైంది. చివరకు టీడీపీ, జనసేన పార్టీల మేనిఫెస్టోగానే చంద్రబాబు, పవన్ దాన్ని విడుదల చేశారు. బాబు, పవన్ ఫొటోలు, రెండు పార్టీల గుర్తులు మాత్రమే మేనిఫెస్టోలో ఉన్నాయి. మేనిఫెస్టో విడుదల సందర్భంగా కనీసం దాన్ని పట్టుకునేందుకు సైతం బీజేపీ పరిశీలకుడు సిద్ధార్థనాథ్సింగ్ ఇష్టపడలేదు. పవన్, చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేసి ఫొటోలకు పోజు ఇస్తూ దాన్ని సిద్ధార్థనాథ్ను పట్టుకోవాలని ఒక వ్యక్తి ఇవ్వగా, ఆయన నిర్ద్వందంగా తిరస్కరించడం టీవీల్లో ప్రత్యక్ష ప్రసారంలోనే కనిపించింది. చివరకు ఈ మేనిఫెస్టోకు టీడీపీ, జనసేనదే బాధ్యతని చంద్రబాబు చెప్పడం గమనార్హం. బీజేపీ జాతీయ స్థాయిలో ఒకే మేనిఫెస్టో విడుదల చేస్తుందని, కాబట్టి ఏపీలో కూటమిలో మేనిఫెస్టోకి మద్దతు తెలిపిందని ఆయన సర్దిచెప్పుకున్నారు. సిద్ధార్థనాథ్సింగ్ కూడా తాము రాష్ట్రానికో మేనిఫెస్టో ఇవ్వడంలేదని చెప్పారు. నిజానికి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలోనూ వేర్వేరుగా మేనిఫెస్టోలు ప్రకటించే ఆనవాయితీ ఉన్నా కేవలం చంద్రబాబుపై నమ్మకం లేకే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ధర పెరిగినా బంగారమే
న్యూఢిల్లీ: భారత్ కుటుంబాల్లో బంగారానికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. దీనిని ప్రతిబింబిస్తూ, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 2023 ఇదే కాలంతో పోలి్చతే భారత్ పసిడి డిమాండ్ 8 శాతం పెరిగి 136.6 టన్నులకు (ఆభరణాలు, పెట్టుబడులు) పెరిగింది. ధర తీవ్రంగా ఉన్నా ఈ స్థాయి డిమాండ్ నెలకొనడం గమనార్హం. సమీక్షా కాలంలో త్రైమాసిక సగటు ధర (దిగుమతి సుంకం, జీఎస్టీ మినహా) 10 గ్రాములకు రూ.49,943.80 నుంచి రూ.55,247.20కి ఎగసింది. ఇక భారత్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇదే కాలంలో ఏకంగా 19 టన్నులు కొనుగోలు చేసింది. 2023 క్యాలెండర్ ఇయర్ మొత్తంలో ఆర్బీఐ కొనుగోళ్లు 16 టన్నులే కావడం గమనార్హం. తాజా ‘క్యూ1 2024, గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదికలో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఈ అంశాలను తెలిపింది.ప్రపంచ వ్యాప్తంగా 3 శాతం అప్ మార్చి త్రైమాసికంలో ప్రపంచ పసిడి డిమాండ్ 3% పెరిగి 1,238 టన్నులకు చేరింది. 2016 తర్వాత ఈ స్థాయి డిమాండ్ పటిష్టత ఇదే తొలిసారి. సగటు త్రైమాసిక ధర ఔన్స్కు (31.1 గ్రాములు) 2,070 డాలర్లు. వార్షికంగా ఈ రేటు 10% అధికమైతే, త్రైమాసికంగా 5 % ఎక్కువ. సెంట్రల్ బ్యాంకులు తమ హోల్డింగ్స్ను ఈ కాలంలో 290 టన్నులు పెంచుకున్నాయి. ∗ మార్చి త్రైమాసికంలో భారత్ పసిడి డిమాండ్ విలువ రూపాయల్లో వార్షిక ప్రాతిపదికన 20 శాతం పెరిగి రూ.75,470 కోట్లకు చేరింది.∗సమీక్షా కాలం మొత్తం పసిడి డిమాండ్లో ఆభరణాల డిమాండ్ 4 శాతం పెరిగి 95.5 టన్నులకు చేరగా, పెట్టుబడుల (కడ్డీలు, నాణేల వంటివి) విలువ 19 శాతం పెరిగి 41.1 టన్నులుగా నమోదైంది.∗ విలువల్లో చూస్తే ఆభరణాలకు డిమాండ్ 15% పెరిగి రూ.52,750 కోట్లకు చేరింది. పెట్టుబడుల్లో విలువ 32% పెరిగి రూ.22,720కి ఎగసింది. ∗ మార్చి త్రైమాసికంలో పసిడి దిగుమతులు 25 % పెరిగి 179.4 టన్నులుగా నమోదయ్యాయి. ∗గోల్డ్ రీసైక్లింగ్ విలువ 10% పెరిగి 38.3 టన్నులుగా నమోదైంది.∗2024లో 700 నుంచి 800 టన్నుల కొనుగోళ్లు జరుగుతాయన్నది అంచనా.
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో మంగళవారం (ఏప్రిల్ 30) జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు అదరగొట్టారు.డూ ఆర్ డై లా జరిగిన మ్యాచ్లో ముంబై కేవలం నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు ముంబైకి చుక్కలు చూపించారు. వరుసగా వికెట్లు పడగొట్టడంతో పాటు పరుగులు కూడా రాకుండా కట్టడి చేశారు. ఫలితంగా ముంబై జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. దాంతో పాయింట్ల జాబితాలో లక్నో మూడో స్ధానానికి చేరింది. ఇక ప్లే ఆఫ్ అవకాశాలు ముంబై జట్టు దాదాపు కోల్పోయింది.స్కోర్లు: ముంబై 144/7, 145/6(19.2 ఓవర్లు)ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్ ప్లేయర్స్: నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, డెవాల్డ్ బ్రెవిస్, నమన్ ధీర్, షమ్స్ ములానీలక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్ఇంపాక్ట్ ప్లేయర్స్: అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్
అల్లూరికి అర్ధ శతాబ్దం
‘మా మన్యం దొర సీతారామరాజు వచ్చాడు’.... ప్రజల్లో సంబరం. దొరకు పాదాభివందనం చేశారు. కానీ... అతను నిజమైన దొర కాదు. మన్యం దొర అల్లూరి సీతారామ రాజు గెటప్ వేసుకున్న నటుడు. అప్పటికి నిజమైన అల్లూరి సీతారామరాజుని చూసిన కొందరు వృద్ధులు లొకేషన్లో ఆ గెటప్లో ఉన్న నటుడికి పాదాభివందనం చేశారు. వెండితెరపై సీతారామరాజుగా కనిపించక ముందే అలా షూటింగ్ లొకేషన్లో ప్రజల చేత ‘భేష్’ అనిపించుకున్నారు కృష్ణ. అల్లూరి సీతారామరాజు గెటప్ అంటే కృష్ణ తప్ప వేరే ఏ నటుడికీ నప్పదు అనేంతగా ఆ పాత్రలో ఒదిగిపోయారు సూపర్ స్టార్. 1974 మే 1న విడుదలైన ‘అల్లూరి సీతారామరాజు’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం... ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అగ్గిరాముడు’ సినిమా 1954 ఆగస్టు 5న విడుదలైంది. బుర్రిపాలెంకు చెందిన కృష్ణ తెనాలిలో ఆ సినిమా చూశారు. అందులో అల్లూరి గురించి బుర్రకథగా చెప్పే సీన్ కృష్ణను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన ‘జై సింహ’ని కూడా చూశారు కృష్ణ. ఆ సినిమా పాటల పుస్తకం చివరి పేజీలో ఎన్టీఆర్ తర్వాతి చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ అనే ప్రకటనతో పాటు అల్లూరి గెటప్లో స్కెచ్తో గీసిన ఎన్టీఆర్ బొమ్మ ఉంది. ఆ సినిమా కోసం కృష్ణ ఎదురు చూశారు. అయితే ఆ సినిమా ప్రారంభమైనా తర్వాత ఆగిపోయింది. పై చదువుల కోసం ఏలూరు వెళ్లిన కృష్ణకి నాటకాలపై ఆసక్తి కలిగింది. అది కాస్తా సినిమాలవైపు మళ్లడంతో చెన్నైకి చేరుకున్నారు. అప్పుడు ప్రజా నాట్యమండలి రాజారావు బృందం ప్రదర్శించిన ‘అల్లూరి సీతారామరాజు’ నాటకానికి మంత్రముగ్దుడయ్యారు కృష్ణ. ఆ తర్వాత హీరో అయిన కృష్ణ ‘అసాధ్యుడు’లో (1968) అంతర్నాటకంలో భాగంగా సీతారామరాజు వేషం వేశారు. ఆ వేషంలో చక్కగా ఉన్నారంటూ జనాలు కితాబిచ్చారు. దీంతో తాను హీరోగా అల్లూరి చరిత్రతో సినిమా తీస్తే బాగుంటుందనుకున్నారు కృష్ణ. అయితే 1972లో శోభన్బాబు హీరోగా సీతారామరాజు మూవీ నిర్మించనున్నట్లు డి. లక్ష్మీ నారాయణ (డీఎల్) ప్రకటించారు. కానీ అనారోగ్యం వల్ల ఆ ప్రయత్నం విరమించుకున్నారాయన. కృష్ణ హీరోగా ‘పెద్దలు మారాలి’ సినిమా తీశారు డీఎల్. ఆ చనువుతో సీతారామరాజు కథని కృష్ణకి ఇచ్చి, ఆసక్తి ఉంటే సినిమా తీసుకోమన్నారు. అలా ‘అల్లూరి సీతారామరాజు’ చేసే అవకాశం కృష్ణకి వచ్చింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ కృష్ణ కృష్ణకు ‘డేరింగ్ అండ్ డ్యాషింగ్’ అని పేరు. ‘అల్లూరి సీతారామరాజు’ కథలో వాణిజ్యపరమైన అంశాలు ఉండవని, పైగా హీరో చనిపోతాడని ఫైనాన్స్ ఇవ్వడానికి ఫైనాన్షియర్లు, పంపిణీ చేయడానికి కూడా ఎవరూ సాహసించలేదు. ‘ఇంత రిస్క్ అవసరమా.. ఈ సినిమా వద్దు’ అని శ్రేయోభిలాషులు కృష్ణకు చె΄్పారు. ఎన్టీఆర్ కూడా వద్దనే అన్నారు. అయినా తాను ఓ హీరోగా రూపొందిన ‘దేవుడు చేసిన మనుషులు’ శత దినోత్సవంలో అల్లూరి సీతారామరాజు సినిమా తీస్తున్నానని, అది తన నూరో చిత్రంగా ఉంటుందని కృష్ణ ప్రకటించారు. 1973 డిసెంబరులో మద్రాస్ వాహినీ స్టూడియోలో షూటింగ్ ఆరంభమైంది. అల్లూరి సీతారామరాజు గెటప్లో ఉన్న కృష్ణపై ఫస్ట్ షాట్ తీశారు. సినిమా మొదలుపెట్టినప్పట్నుంచి అనేక ఇబ్బందులు. చింతపల్లి అడవిలో షూటింగ్ కాబట్టి అక్కడ గెస్ట్ హౌస్లు లేకపోవడంతో యూనిట్లోని దాదాపు ఐదువందల మందికి ఒక కాలనీలా తాత్కాలిక బస ఏర్పాటు చేశారు. సముద్ర మట్టానికి నాలుగువేల అడుగుల ఎత్తులో కొండ ప్రాంతంలో షూటింగ్. భయంకరమైన చలి. దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ చేశారు. దర్శకుడు రామచంద్రరావు అస్వస్థతకి గురి కావడం ఓ ఊహించని షాక్. ఆయన్ను చెన్నైకి తీసుకెళ్లి, మెరుగైన వైద్యం చేయించినా కోలుకోలేదు. ఫిబ్రవరి 14న తుది శ్వాస విడిచారు. మిగతా భాగాన్ని కృష్ణ తెరకెక్కించారు. యుద్ధ సన్నివేశాలను దర్శకుడు కేఎస్ఆర్ దాస్ రూపొందించారు. రామచంద్రరావు మీద గౌరవంతో దర్శకుడిగా ఆయన పేరే ఉంచేశారు కృష్ణ. సినిమా స్కోప్.. ఈజీ కాదు తెలుగులో పూర్తి స్థాయిలో రూపొందిన తొలి సినిమా స్కోప్ ఈస్ట్మన్ కలర్ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’. అయితే అప్పుడు సినిమా స్కోప్ అంత ఈజీ కాదు. ఈ మూవీకి వీఎస్ఆర్ స్వామి ఛాయాగ్రాహకుడు. అప్పట్లో సినిమా స్కోప్ ఫార్మాట్లో తీసేందుకు రెండే లెన్స్లు ఉండేవట. కాగా సినిమా స్కోప్ ఫార్మాట్లో తీసే లెన్స్కి కెమెరా వ్యూఫైండర్స్ ఉండవట. దీంతో ఊహించుకుని ఫ్రేమ్ సెట్ చేసుకునేవారట. ఈ ప్రక్రియను వీఎస్ఆర్ స్వామి ముంబైలో అధ్యయనం చేసి రావడంతో ‘అల్లూరి సీతారామరాజు’ ఈజీగా చేయగలిగారు. అల్లూరి పాటలు అజరామరం ‘అల్లూరి సీతారామరాజు’లోని పాటలన్నీ సూపర్ హిట్. పి. ఆదినారాయణరావు ఈ సినిమాకు సంగీతదర్శకుడు. సినిమా ఆరంభంలో వచ్చే ‘రగిలింది విప్లవాగ్ని..’, సినిమా చివర్లో వచ్చే.. ‘ఓ విప్లవజ్యోతి...’ పాటలకు ఆరుద్ర సాహిత్యం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ‘వస్తాడు నా రాజు..’ పాటను నారాయణరెడ్డి రాయగా, ‘హైలెస్సా.. హైలెస్సా..’, ‘కొండ దేవతా నిన్ను కొలిచేవమ్మా..’ పాటలను కొసరాజు రాశారు.‘తెలుగు వీర లేవరా..’ పాటను శ్రీశ్రీ రాశారు. ఈ పాటను ఘంటసాలతోనే పాడించాలన్నది కృష్ణ సంకల్పం. ఆ సమయానికి ఘంటసాల ఆరోగ్యం సరిగా లేదు. ఆ తర్వాత ఘంటసాల ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఆయన ఈ పాట పాడారు. కానీ ఈ సినిమా విడుదల కాకముందే ఘంటసాల కాలం చేశారు. ఈ పాటకు వి. రామకృష్ణ గొంతు కలిపారు. ఈ పాటకుగాను జాతీయ ఉత్తమ గీత రచయిత అవార్డు శ్రీశ్రీని వరించింది. ఓ తెలుగు సినిమాలోని పాటకు జాతీయ పురస్కారం రావడం అదే తొలిసారి. అలాగే ఇదే సినిమాలోని ‘వందేమాతరం అంటూ నినదించిన..’, ‘హ్యాపీ క్రిస్మస్..’ పాట, ‘అరుణాయ శరణ్యాయ..’ శ్లోకం వంటివి కూడా వీనుల విందుగా ఉంటాయి.రికార్డులు భళా ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా 19 కేంద్రాల్లో (బెంగళూరుతో కలుపుకుని) వందరోజులు, 2 కేంద్రాల్లో 25 వారాలు, హైదరాబాద్లోని సంగం థియేటర్లో రజతోత్సవం, అలాగే షిఫ్టింగులతో ఏడాది పాటు ఆడటం విశేషం. ఈ చిత్రం స్వర్ణోత్సవం చెన్నైలోని ఉడ్ల్యాండ్స్ హోటల్లో ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర సమరయోధులు ఇంటూరి వెంకటేశ్వరరావు, అనిసెట్టి సుబ్బారావు, దాశరథి, సుంకర సత్యనారాయణ, కేఎస్ గోపాలకృష్ణన్ వంటి వారిని సత్కరించారు. అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం రూ. పదివేలతో ఓ ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, అందుకు సంబంధించిన పత్రాలను సీతారామరాజు సోదరుడు సత్యనారాయణరాజుకి అందించారు కృష్ణ. ఇలా ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు చాలా ఉన్నాయి.అల్లూరి చేయనన్న ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు సినిమా మొదలుపెట్టి, ఆపినా ఆ సినిమా తీయాలన్న ఎన్టీఆర్ ఆకాంక్ష అలాగే ఉండిపోయింది. కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ వచ్చిన చాలా ఏళ్లకు ఆ సినిమా తీద్దామని పరుచూరి బ్రదర్స్తో అన్నారు ఎన్టీఆర్. కానీ సోదరులు వద్దని సలహా ఇచ్చి, కృష్ణ చేసిన సినిమా చూడమన్నారు. ఎన్టీఆర్ కోరిక మేరకు ‘అల్లూరి సీతారామరాజు’ని ప్రత్యేకంగా చూపించారు కృష్ణ. ‘‘అద్భుతంగా తీశారు. నేను ‘అల్లూరి సీతారామరాజు’ తీయను’’ అన్నారు ఎన్టీఆర్.మహారథి చేతికి స్క్రిప్ట్ త్రిపురనేని మహారథి చేతిలో డీఎల్ ఇచ్చిన స్క్రిప్ట్ పెట్టి, ‘ఈ సబ్జెక్ట్లో సినిమా తీయడానికి కావాల్సినంత దమ్ము ఉందా’ అడిగారు కృష్ణ సోదరుడు హనుమంతరావు. ‘చాలా ఉంది’ అన్నారు మహారథి. కానీ, తనకు ఇచ్చిన స్క్రిప్ట్లో ఒక్క సన్నివేశం తప్ప మహారథికి వేరే ఏదీ నచ్చలేదు. పరిశోధనలు చేసి, స్క్రిప్ట్ తయారు చేశారు. దర్శకుడిగా వి. రామచంద్రరావును తీసుకున్నారు. సినిమా స్కోప్ ఈస్ట్మన్ కలర్లో తీయాలని నిర్ణయించింది పద్మాలయా స్టూడియోస్ సంస్థ (కృష్ణ సొంత నిర్మాణ సంస్థ). ‘అల్లూరి...’ తర్వాత ‘పాడి పంటలు’తోనే హిట్... ‘అల్లూరి సీతారామరాజు’ చూసిన విజయా వాహిని సంస్థ అధినేతల్లో ఒకరైన దర్శక–నిర్మాత చక్రపాణి అభినందించారు. కానీ ‘ఈ సినిమా తర్వాత నీ సినిమాలు ఆడటం కష్టం’ అని కూడా కృష్ణతో అన్నారు. ఆయన అన్న మాటలు నిజమయ్యాయి. ‘అల్లూరి సీతారామరాజు’ తర్వాత కృష్ణ చేసిన ప్రతి చిత్రాన్నీ ఈ సినిమాతో పోల్చారు ప్రేక్షకులు. దాంతో ఆ తర్వాత కృష్ణ నటించిన çపది సినిమాలకు పైగా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. చివరికి పద్మాలయా స్టూడియోస్ నిర్మించిన ‘పాడి పంటలు’ (1976) విజయంతో హీరోగా కృష్ణ పూర్వ వైభవాన్ని పొందారు.
కూటముల కురుక్షేత్రం
కురుక్షేత్ర యుద్ధాన్ని తలదన్నే రాజకీయాలకు హరియాణా ఆలవాలం. కుల సమీకరణాలు, పొత్తులు, కూటములు, వేరుకుంపట్లు ఇక్కడ పరిపాటి. జాతీయ పార్టీలతో పాటు ఒకప్పుడు చక్రం తిప్పిన ప్రాంతీయ పార్టీలూ రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తున్నాయి.రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే లోక్సభ ఎన్నికల్లోనూ ఆధిపత్యం లభిస్తూ వస్తోంది. 2005 నుండి 2014 దాకా కాంగ్రెస్ చక్రం తిప్పగా పదేళ్లుగా బీజేపీ పట్టు బిగించింది. గత ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసి 10 సీట్లను క్లీన్స్వీప్ చేసిన కమలనాథులను రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు కలవరపెడుతున్నాయి. గత ఎన్నికల్లో సున్నా చుట్టిన కాంగ్రెస్ ఈసారి ఇండియా కూటమి రూపంలో కాషాయ పార్టీని ఢీకొడుతోంది... – సాక్షి, నేషనల్ డెస్క్ఇండియా కూటమి, ప్రాంతీయ పార్టీలు సై... రైతు సమస్యలు తదితరాలతో రాష్ట్రంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీజేపీపై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి రెట్టించిన ఉత్సాహంతో పోరాడుతోంది. పొత్తులో భాగంగా 9 సీట్లలో కాంగ్రెస్, ఒకచోట ఆప్ పోటీ చేస్తున్నాయి. మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా సారథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 31 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా నిలిచిన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.ధరల పెరుగుదల, కార్పొరేట్లతో మోదీ కుమ్మక్కు, విపక్షాలపై వేధింపులు, నిరుద్యోగం తదితరాలను ఇండియా కూటమి ప్రచారా్రస్తాలుగా చేసుకుంది. రైతు ఆందోళనలకు మద్దతుతో పాటు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత హామీలను మేనిఫెస్టోలో చేర్చడం కలిసొస్తుందని ఆశపడుతోంది. ఐఎన్ఎల్డీ, జేజేపీ కూడా ఒంటరిగా పోటీ చేస్తూ జాతీయ పార్టీలకు సవాలు విసురుతున్నాయి.అయితే జేజేపీ హరియాణా రాష్ట్ర చీఫ్ నిషాన్ సింగ్ ఎన్నికల వేళ పార్టీకి గుడ్బై చెప్పి షాకిచ్చారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కార్పొరేట్ దిగ్గజం నవీన్ జిందాల్ కురుక్షేత్రలో ఆప్ నేత సుశీల్ గుప్తాతో తలపడుతున్నారు. అది హాట్ సీట్గా అందరినీ ఆకర్షిస్తోంది. 2004, 2009ల్లో కాంగ్రెస్ తరఫున ఇక్కడ గెలిచిన జిందాల్ 2014లో బీజేపీ చేతిలో ఓడారు. 2019లో పోటీకి దూరంగా ఉన్నారు.బీజేపీకి కొత్త కష్టాలు...2014 లోక్సభ ఎన్నికల్లో 7 సీట్లు గెలిచిన ఊపులో ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించింది. మనోహర్లాల్ ఖట్టర్ సీఎం అయ్యారు. 2019లో 10 లోక్సభ సీట్లూ నెగ్గినా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పుంజుకోవడంతో హంగ్ వచ్చింది. అయినా జేజేపీ, స్వతంత్రుల మద్దతుతో బీజేపీ మళ్లీ గద్దెనెక్కింది. జేజేపీ చీఫ్ దుష్యంత్కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. ప్రభుత్వ వ్యతిరేకతతో బీజేపీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై విభేదాలతో బీజేపీ, జేజేపీ పొత్తుకు తెరపడింది. దాంతో ఖట్టర్, దుష్యంత్ రాజీనామా చేశారు. ఎన్నికల ముందు ఓబీసీ వర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయాబ్ సింగ్ సైనీ సీఎం అయ్యారు. తాజాగా వెల్లువెత్తిన రైతు ఆందోళనలూ బీజేపీకి ప్రతికూలంగా మారొచ్చని భావిస్తున్నారు. మోదీ కరిష్మా, అయోధ్య రామమందిర నిర్మాణం, హిందుత్వ నినాదం తదితరాలనే పార్టీ నమ్ముకుంది.ప్రాంతీయ పార్టీల్లో చీలికలు... ఐఎన్ఎల్డీ వ్యవస్థాపకుడు, హరియాణా సీఎంగా, ఉప ప్రధానిగా చేసిన చౌదరి దేవీలాల్ అనంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన కుమారుడు ఓం ప్రకాశ్ చౌతాలా నాలుగుసార్లు సీఎం అయ్యారు. ఉద్యోగ నియామకాల కుంభకోణంలో ఆయన, అవినీతి కేసుల్లో పెద్ద కుమారుడు అజయ్ సింగ్ చౌతాలా జైలుకెళ్లారు. దాంతో రెండో కుమారుడు అభయ్ సింగ్ చౌతాలా పార్టీ పగ్గాలు చేపట్టారు. అన్నదమ్ముల కుమ్ములాటతో పార్టీ చీలిపోయింది.అజయ్ సింగ్ కుమారులైన దుష్యంత్ చౌతాలా, దిగ్విజయ్ చౌతాలాను పార్టీ నుంచి తొలగించారు. దాంతో తండ్రి, సోదరునితో కలిసి దుష్యంత్ జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)ని స్థాపించారు. జేజేపీ గత లోక్సభ ఎన్నికల్లో ఆప్తో కలిసి పోటీ చేసినా ఒక్క సీటూ దక్కలేదు. అభయ్ సారథ్యంలోని ఐఎన్ఎల్డీ కూడా ప్రభావం చూపలేకపోయింది.2014లో హరియాణా జనహిత్ కాంగ్రెస్ (హెచ్జేసీ–బీఎల్) తో పొత్తు పెట్టుకున్న బీజేపీకి పెద్దగా ప్రయోజనం లభించలేదు. బీజేపీ 8 స్థానాల్లో పోటీ చేసి ఏడింటిని దక్కించుకోగా మూడు చోట్ల పోటీ చేసిన హెచ్జేసీకి ఒక్క సీటూ దక్కలేదు. హరియాణా లో మూడుసార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పని చేసిన భజన్లాల్ 2007లో కుమారుడు కుల్దీప్ బిష్ణోయ్తో కలిసి ఈ పార్టీని స్థాపించారు. 2016లో కాంగ్రెస్లో విలీనం చేశారు.పోలింగ్ తేదీ: మే 25 సర్వేలు ఏమంటున్నాయి?!బీజేపీ 8, ఇండియా కూటమి 2 సీట్లలో గెలుస్తాయని తాజా ఎన్నికల సర్వేలు అంచనా వేశాయి. సీఎం మార్పు, ప్రభుత్వ వ్యతిరేకత, రైతు ఆందోళనలు, తదితర పరిణామాలు కమలనాథుల జోరుకు కళ్లెం వేస్తాయని మరికొందరు రాజకీయ పండితులు అంటున్నారు.హరియాణా రాజకీయాలు జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎత్తుజిత్తుల నడుమ సాగుతున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో ఏడు సీట్లు గెలిచిన బీజేపీ 2019లో ఒంటరిగా పోటీ చేసి మొత్తం 10 సీట్లూ ఒడిసిపట్టింది. కాంగ్రెస్కు ఒక్క సీటూ దక్కలేదు. ప్రాంతీయ పార్టీ ఇండియన్ లోక్దళ్ (ఐఎన్ఎల్డీ) 2014లో గెలిచిన 2 సీట్లనూ పోగొట్టుకుంది.
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
యువ సంగీతాభిమానులకు అచ్చంగా సరిపోయే మాట... మ్యూజిక్ మేక్స్ ఎవ్రీ థింగ్ బెటర్. ఇట్టే మరిచిపోయే లక్షణం నుంచి జ్ఞాపకశక్తి పెరగడం వరకు, క్రియేటివిటీని ఎంజాయ్ చేయడం నుంచి క్రియేటివ్ పవర్ పెంచుకోవడం వరకు, జడత్వం నుంచి నిత్యజీవనోత్సాహం వెల్లివిరియడం వరకు, అనామకత్వం నుంచి ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదగడం వరకు ఎన్నోరకాలుగా సంగీతం యువతకు బలం అయింది. సంగీత రత్నాలను వెదుకుతూ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలోకి అడుగు పెట్టిన యువతరం ఆ ప్లాట్ఫామ్లలోనే మ్యూజిక్ స్టార్లుగా మెరవడం ఈ తరంలో కనిపిస్తున్న ప్రత్యేకత.∗ స్పాటిఫైతో ప్రయాణం ప్రారంభించి స్టార్గా ఎదిగిన ఆర్టిస్ట్లలో జస్లీన్ రాయల్ ఒకరు. సింగర్, సాంగ్ రైటర్, కంపోజర్గా మంచి పేరు తెచ్చుకుంది. హిట్ బాలీవుడ్ ట్రాక్స్ కంపోజ్ చేసింది. ‘ప్రపంచ ప్రేక్షకులతో కనెక్ట్ కావడానికి, శ్రోతల అభిప్రాయాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా మ్యూజిక్ కంపోజింగ్లో మార్పులు చేయడానికి స్పాటిఫై ఉపయోగపడింది’ అంటుంది జస్లీన్ రాయల్.∗ ఆరు సంవత్సరాల వయసులో పాటల కోసం గొంతు సవరించింది బెంగళూరుకు చెందిన దియా వదిరాజ్. రకరకాల మ్యూజిక్ జానర్లలో టాలెంటెడ్ సింగర్గా పేరు తెచ్చుకుంది. కోల్కతాకు చెందిన రనితా బెనర్జీ అయిదు సంవత్సరాల వయసులో ‘సింగింగ్ స్టార్’ షోలో పాల్గొంది. ‘స రే గ మ ప’ లిటిల్ ఛాంప్స్లో ఫస్ట్ రన్నర్–అప్గా నిలిచింది. ‘స్వీట్ వాయిస్’ రనిత గొంతు నుంచి వచ్చిన ‘జరాసీ ఆహట్’ పాట 6.2 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది.∗ మల్టీ టాలెంటెడ్ సింగర్గా పేరు తెచ్చుకుంది అంకిత కుందు. రియాల్టీ షోలలో పాడడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బిహార్కు చెందిన మిథాలీ ఠాకూర్ ‘రైజింగ్ స్టార్’ షోతో ఫేమ్ అయింది. భోజ్పూరి, క్లాసికల్, ఫోక్ సాంగ్స్ను పాడడంలో మంచి పేరు తెచ్చుకుంది. యూట్యూబ్లో ఆమె వీడియోలు మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకున్నాయి. ఇండియన్–అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ లిశా మిశ్రా పాటలను రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేది. బాలీవుడ్ సినిమాలలో కూడా పాడింది. ఇండియన్ ఐడల్ జూనియర్గా 2015లో సంగీత ప్రపంచానికి పరిచయం అయింది భువనేశ్వర్కు చెందిన అనన్య నందా. బాలీవుడ్ పాటల్లోనే కాదుక్లాసికల్లోనూ మంచి పేరు తెచ్చుకుంది. మెలోడియస్ వాయిస్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.∗ బోస్టన్ (యూఎస్)లో పుట్టిన అవంతి నగ్రల్కు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం. ముంబైకి వచ్చిన తరువాత తన పాషన్నే కెరీర్గా చేసుకుంది. మ్యూజిక్లో రకరకాల జానర్స్ను మిక్స్ చేయడంలో గట్టి పట్టు సాధించిన అవంతికి యూట్యూబ్ చానల్ కూడా ఉంది. ఇందులో తన లైవ్ పర్ఫార్మెన్స్ వీడియోలను అప్లోడ్ చేస్తుంది. అవంతికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.∗ ఆర్ అండ్ బీ, హిప్–హాప్, సోల్, పాప్ మ్యూజిక్లలో బహుముఖ ప్రజ్ఞ చాటుకుంటోంది ఇలీన హ్యాట్స్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. ముంబైకి చెందిన సాచి రాజాధ్యక్ష ఆల్ట్–పాప్ మ్యూజిక్లో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఆమె పవర్ఫుల్, సోల్ వాయిస్కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.∗ దియ నుంచి అవంతి వరకు ఎందరో, ఎందరెందరో యంగ్ మ్యూజిషియన్స్ సంగీతం పట్ల అంకితభావంతో సెల్ఫ్–మేడ్ సూపర్స్టార్లుగా ఎదిగారు. ఎంతోమంది ఔత్సాహికులకు రోల్ మోడల్స్గా మారారు.
తప్పక చదవండి
- పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- నిట్టనిలువునా చీలిపోతున్న 127 ఏళ్ల కంపెనీ
- ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
- Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
- ‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
సినిమా
'శబరి' సినిమాలో 'అలిసిన ఊపిరి' పాట రిలీజ్
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శబరి'. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించగా.. అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించారు. మే 3న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. గత కొన్నాళ్ల నుంచి ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 'అలిసిన ఊపిరి...' పాటను దర్శకుడు కరుణ కుమార్ చేతుల మీదగా విడుదలైంది.(ఇదీ చదవండి: హీరోయిన్ మెహ్రీన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్)'శబరి' నుంచి ఇప్పటివరకు విడుదలైన పాటల్లో తల్లి కూతుళ్ల అనుబంధం, ప్రేమను చూపిస్తే... 'అలిసిన ఊపిరి' పాటలో పోరాటానికి సిద్ధమవుతున్న వరలక్ష్మిని చూపించారు. మధ్యలో కుమార్తె కోసం అన్వేషణలో పడిన తల్లి మనసును సైతం స్పృశించారు. గోపీసుందర్ బాణీ, అనురాగ్ కులకర్ణి గాత్రం, రెహమాన్ సాహిత్యం దీనినొక మోటివేషనల్ సాంగ్ తరహాలో మార్చాయి.(ఇదీ చదవండి: అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార)
అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
హీరోయిన్ నయనతార.. తన 'అన్నపూరణి' సినిమా వివాదంలో చిక్కుకోవడంపై మరోసారి నోరు విప్పింది. గతేడాది రిలీజైన ఈ చిత్రం ఓకే ఓకే అనిపించుకుంది. కానీ కంటెంట్ విషయంలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. మరీ ముఖ్యంగా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందని కామెంట్స్ రావడంతో నెట్ఫ్లిక్స్.. ఈ చిత్రాన్ని పూర్తిగా ఓటీటీ నుంచే తీసేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)భర్త, పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న నయన్.. మరోవైపు ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది. గతేడాది రిలీజైన 'అన్నపూరణి' మూవీ ఫ్లాఫ్ కావడం, వివాదాల్లో ఇరుక్కోవడం నయనతార జీర్ణించుకోలేకపోయింది. ఇప్పటివరకు ఈ మూవీ వివాదంపై నోరు మెదపని ఈమె.. ఇటీవల ఒక వేదికపై స్పందించింది. సమాజంలోని అసమానతలను అధిగమించి సక్సెస్ అయ్యే కథా పాత్రల్లో నటించడం, మనఃస్ఫూర్తిగా ఎంపిక చేసుకోవడం తన బాధ్యత అని చెప్పింది. అలానే మహిళల గొంతుగా ప్రతిబింబించాలని తాను అనుకుంటున్నట్లు పేర్కొంది.నిజానికి నయనతార జీవితం చాలామంది మహిళలకు స్ఫూర్తిదాయకం. ఎన్నో ఆటంకాలను, ఇబ్బందుల్ని అధిగమించి ఆమె ఈ స్థాయికి చేరుకుంది. 40కి దగ్గరవుతున్నప్పటికీ హీరోయిన్గా హిట్లు కొడుతోంది. ప్రస్తుతం తమిళంలో మన్నాంగట్టి సిన్స్ 1960, టెస్ట్ సినిమాల్లో నటిస్తోంది. 'జవాన్' లాంటి హిట్ తర్వాత హిందీలో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్)
కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్ ఫోటోలు
పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసిన మెహ్రీన్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. పెళ్లి కాకుండానే పిల్లల్ని కనేందుకు ప్లానే చేసేసింది. అదేనండి మొన్నీ మధ్య 'ఎగ్ ఫ్రీజింగ్' అని హీరోయిన్ మృణాల్ ఠాకుర్ చెప్పిందిగా. ఇప్పుడు దాన్ని మెహ్రీన్ చేసి చూపించేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అలానే దీనికి గల కారణాల్ని కూడా చెప్పుకొచ్చింది.'ఎగ్ ఫ్రీజింగ్' అంటే ఏంటి?ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు పెళ్లి లేటుగా చేసుకుంటున్నారు. అయితే 30 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువ. అందుకే చాలామంది హీరోయిన్లు.. వయసులో ఉన్నప్పుడే తమ ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరుచుకుని, కావాల్సినప్పుడు పిల్లల్ని కనే ప్లాన్ చేసుకుంటున్నారు. దీన్ని 'ఎగ్ ఫ్రీజింగ్' అంటారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు 'ఎగ్ ఫ్రీజింగ్' చేసుకోగా, ఇప్పుడా లిస్టులోకి మెహ్రీన్ చేరింది.(ఇదీ చదవండి: అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక)మెహ్రీన్ ఏమని చెప్పింది?'గత రెండేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నా. చివరకు ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ఇది నా వ్యక్తిగత విషయం కదా దీన్ని అందరికి చెప్పాలా? వద్దా? అని ఆలోచించాను. కానీ నాలాంటి చాలామంది మహిళలు ప్రపంచంలో ఉన్నారు. పెళ్లి, బిడ్డని కనే విషయంలో వాళ్లు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. నేను మాత్రం భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యమని భావించాను. దీని గురించి మనం పెద్దగా మాట్లాడట్లేదు. కానీ టెక్నాలజీ సాయంతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం''తల్లి కావడమనేది నా కల. కాకపోతే అది కొన్నేళ్లు ఆలస్యం కావొచ్చు. అందుకే ఈ ఎగ్ ఫ్రీజింగ్. ఆస్పత్రులంటే భయముండే నాలాంటి వాళ్లకు ఇది సవాలే. ఎందుకంటే ఇంజెక్షన్స్ కారణంగా ఆస్పత్రికి వెళ్లిన ప్రతిసారీ నేను కళ్లు తిరిగి పడిపోయేదాన్ని. ఇక ఎగ్ ఫ్రీజింగ్ మంచిదా కాదా అంటే.. కచ్చితంగా మంచిదే అని చెబుతాను. మీరు ఏం చేసినా సరే మీకోసం చేయండి. అలానే ఈ జర్నీలో నాకు అండగా ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ రిమ్మీ, మా అమ్మకు థ్యాంక్స్' అని మెహ్రీన్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)
ఫొటోలు
కొత్త ఎక్సీడ్ లగ్జరీ స్పోర్ట్స్కారు.. అదిరిపోయే ఫొటోలు
హైదరాబాద్ : సిటీలో సందడి చేసిన సన్ రైజర్స్ టీమ్ (ఫొటోలు)
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (30-04-2024)
జగన్ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)
టాలీవుడ్లో టాప్ యాంకర్గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)
బిజినెస్
ప్రపంచంలో ఎత్తైన రెసిడెన్షియల్.. ఫిదా చేస్తున్న వీడియో
దుబాయ్ అనగానే చాలామందికి ప్రపంచంలో ఎత్తైన భవనంగా కీర్తి గడిస్తున్న 'బుర్జ్ ఖలీఫా' గుర్తొస్తుంది. అయితే త్వరలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ అందుబాటులోకి రానుంది. నగరంలోని మెరీనా జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఈ రెసిడెన్షియల్ మొత్తం 122 అంతస్తులుగా నిర్మించనున్నారు.'సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్' పేరుతో నిర్మిస్తున్న ఈ భవనం 517 మీటర్లు లేదా 1696 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన రెసిడెన్షియల్గా.. న్యూయార్క్ నగరంలోని 'సెంట్రల్ పార్క్ టవర్' (474 మీటర్లు లేదా 1550 అడుగులు) కంటే చాలా పొడవుగా ఉంటుంది.సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్ను వుడ్స్ బాగోట్ అండ్ డబ్ల్యుఎస్పీ మిడిల్ ఈస్ట్ రూపొందించారు. ఇది గుండ్రంగా మెరుస్తున్న టవర్ మాదిరిగా ఉంటుంది. బాల్కనీలను, టెర్రస్ వంటి వాటిని కలుపుతూ చివరి బిందువు మాదిరిగా పూర్తయ్యి ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్ మొత్తం మిచెల్ & ఈడెస్ పూర్తి చేస్తుంది. కాబట్టి ఇందులో అరబ్ యువరాజుకు సరిపోయే హై-ఎండ్ యాక్సెసరీస్, మెటీరియల్లను ఉపయోగించినట్లు సమాచారం.సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్లో అత్యాధునిక ఫిట్నెస్ సౌకర్యాలు ఫంక్షనల్ జిమ్లు, వర్చువల్ సైక్లింగ్, బాక్సింగ్ స్టూడియోలు, ఇన్ఫినిటీ పూల్, ఐస్ బాత్లు, సాల్ట్ రూమ్, బయో, సౌండ్ హీలింగ్ రూమ్, మసాజ్ సూట్లు, ఇండోర్ అండ్ అవుట్డోర్ సినిమాస్ వంటి ఎన్నో ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి.సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్ దుబాయ్ మెరీనాకు కొంత చరిత్ర కూడా ఉంది. ఇది 2007లో పెంటోమినియం టవర్గా ప్రారంభమైంది. తరువాత ఆనతి కాలంలోనే ప్రపంచ ఆర్ధిక సంక్షోభం కారణంగా నిర్మాణం నిలిచిపోయింది. ఇటీవలే సెలెక్ట్ గ్రూప్ అసంపూర్తిగా ఉన్న ఈ భవనాన్ని 100 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం నిర్మాణం 25 శాతం పూర్తయింది. ఇది 2028 చివరి నాటికి పూర్తవుతుందని సమాచారం.
ఓటీటీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ను సగానికి తగ్గించిన ప్రభుత్వ సంస్థ
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. దాదాపు చాలా టెలికాం కంపెనీలు ప్రత్యేకంగా ఓటీటీ సేవలందిస్తున్నాయి. అందులో భాగంగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ఓటీటీని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తమ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రైబర్లకు అందించే సినిమాప్లస్ ఓటీటీ ప్యాకేజీ ప్రారంభ ధరను సంస్థ తగ్గించింది.ఈ ప్రారంభ ప్యాక్ ధర గతంలో నెలకు రూ.99గా ఉండేది. దాన్ని రూ.49కు తగ్గిస్తూ కంపెనీ ఇటీవల ప్రకటించింది. ఇందులో లయన్స్గేట్, షెమరూమీ, హంగామా, ఎపిక్ ఆన్ ఓటీటీల్లోని కంటెంట్ను వీక్షించవచ్చు. దీంతోపాటు బీఎస్ఎన్ఎల్ మరో రెండు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెలకు రూ.199 సబ్స్క్రిప్షన్తో జీ5, సోనీలివ్, యప్టీవీ, డిస్నీ+ హాట్స్టార్తో కూడిన ఫుల్ ప్యాక్ ఓటీటీ ప్యాకేజీ అందిస్తోంది.ఇదీ చదవండి: టెకీలకు శుభవార్త.. ఈ ఏడాది 10వేల మందికి ఉద్యోగాలునెలకు రూ.249 చెల్లిస్తే బీఎస్ఎన్ఎల్ ప్రీమియం ప్లాన్కు అప్గ్రేడ్ కావచ్చని సంస్థ తెలిపింది. ఇందులో జీ5, సోనీ లివ్, డిస్నీ+ హాట్స్టార్, యప్టీవీ, లయన్స్గేట్, షెమరూమీ, హంగామా, వంటి ఓటీటీలను ఫ్రీగా చేసేయొచ్చు.
బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఏప్రిల్ ప్రారంభం నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఉలుకూ.. పలుకూ లేకుండా అన్నట్లు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66550 (22 క్యారెట్స్), రూ.72600 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 300 నుంచి రూ. 330 వరకు తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 66700 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 72750 రూపాయల వద్దే ఉంది. నిన్న రూ.300, రూ.330 వరకు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు ఏ మాత్రం పెరగలేదు. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి.దేశంలోని ఇతర నగరాలలో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 67400 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 73530 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. వెండి ధరలు మాత్రం రూ. 100 తగ్గింది. కాబట్టి ఈ రోజు (ఏప్రిల్ 30) ఒక కేజీ వెండి ధర 83900 రూపాయల వద్ద నిలిచింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేదు.
టెకీలకు శుభవార్త.. ఈ ఏడాది 10వేల మందికి ఉద్యోగాలు
టెక్ కంపెనీలు జనరేటివ్ ఏఐపై దూకుడుగా పనిచేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో వీటిలో అపార అవకాశాలున్నట్లు గుర్తించి ఆదిశగా ముందుకుసాగుతున్నాయి. తాజాగా జనరేటివ్ ఏఐలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. మార్చి త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.కృత్రిమమేధ రంగంలో కంపెనీ చాలా మందికి శిక్షణ ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికే సుమారు 25,000 మందికి శిక్షణ ఇవ్వగా, మరో 50,000 మందికి ఈ ఏడాదిలో ట్రెయినింగ్ పూర్తి చేస్తామన్నారు. గడిచిన త్రైమాసికంలో కొత్తగా 2700 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు తెలిపారు. 2024-25లో పరిస్థితులను బట్టి నియామకాలుంటాయన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇలాగే కొనసాగిగే కనీసం 10,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిస్తామన్నారు. భవిష్యత్తులో ఏదైనా మార్పులు ఏదురైతే నియామకాల సంఖ్యలోనూ తేడాలుండవచ్చని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థకంపనీ మార్చి త్రైమాసికంలో ఆదాయ వృద్ధి రేటు 5.4%గా నమోదైంది. టెక్ కంపెనీలకు అడ్వాన్స్డ్ టెక్నాలజీలపై క్లౌడ్, జనరేటివ్ఏఐ ప్రాజెక్టులు పెరుగుతాయని విజయ్ అంచనా వేశారు. అయితే ఆర్థిక సేవల విభాగంలో మాత్రం కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకావొచ్చన్నారు. రానున్న రోజుల్లో జనరేటివ్ ఏఐ ఆధారిత సైబర్ భద్రత, డేటా, క్లౌడ్ ఇమిగ్రేషన్, ప్రైవేటు ఏఐ స్టాక్ల నిర్మాణం తదితర విభాగాల్లో ఆర్డర్లు పెరిగే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.
వీడియోలు
YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం
పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం
సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..
జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్టు..బాబుది బోగస్ రిపోర్టు
కూటమి బండారం మేనిఫెస్టో తో బట్టబయలు
బాబు, పవన్ తో నో యూజ్ బీజేపీ క్లారిటీ..
పచ్చ బ్యాచ్ బరితెగింపు...YSRCP ప్రచార రథంపై దాడి
నేడు మూడు చోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచార సభలు
జగనే మళ్లీ సీఎం.. అరుకులో ప్రస్తుత పరిస్థితి...అభివృద్ధి
ఏపీలో కూటమి మేనిఫెస్టో తో తమకు సంబంధం లేదన్న బీజేపీ