Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

IPL 2024: Kolkata Knight Riders beat Delhi Capitals by 7 wickets
ఫిల్‌ సాల్ట్‌ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్‌

ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మరో అద్భుత విజయం సాధించింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయభేరి మోగించింది.154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ కేవలం 3 వికెట్లు కోల్పోయి 16.3 ఓవర్లలోనే చేధించింది. కేకేఆర్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(33), వెంకటేశ్‌ అయ్యర్‌(26) నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. విలియమ్స్‌ఒక్క వికెట్‌ సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో టెయిలాండర్‌ కుల్దీప్‌ యాదవ్‌(35) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఇక కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి మూడు వికెట్లతో చెలరేగగా.. వైభవ్‌ ఆరోరా, హర్షిత్‌ రానా తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు స్టార్క్‌, నరైన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. కాగా కేకేఆర్‌ బౌలర్లు ఎక్స్‌ట్రాస్‌ రూపంలో ఏకంగా 13 పరుగులు సమర్పించుకున్నారు.

Simran and Meena to play prominent roles in Ajith Good Bad Ugly
అజిత్‌కి జోడీగా...

కోలీవుడ్‌లో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా నిలిచిన వార్తల్లో అజిత్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సిమ్రాన్, మీనా పేర్లు వినిపిస్తున్నాయి.ఈ ఇద్దరూ అతిథి పాత్రల్లో కాదు.. అజిత్‌ సరసన హీరోయిన్లుగా నటిస్తారని టాక్‌. ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’లో అజిత్‌ మూడు పాత్రల్లో కనిపిస్తారట. మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, శ్రీలీల, సిమ్రాన్, మీనాతో అజిత్‌  జతకడతారని చెన్నై కోడంబాక్కమ్‌ అంటోంది. ఈ వార్త నిజమైతే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సిమ్రాన్, మీనా అజిత్‌తో మళ్లీ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నట్లు అవుతుంది. ‘అవళ్‌ వరువాళా (1998), వాలి’ (1999) వంటి విజయవంతమైన చిత్రాల్లో అజిత్‌ సరసన నటించారు సిమ్రాన్‌.అలాగే అజిత్‌కి జోడీగా ‘సిటిజెన్‌ (2001), విలన్‌’ (2002) వంటి చిత్రాల్లో నటించారు మీనా. ఇప్పుడు మళ్లీ ఈ హీరో సరసన సిమ్రాన్, మీనా నటిస్తే దాదాపు రెండు దశాబ్దాలకు ఈ కాంబినేషన్‌ కుదిరినట్లు అవుతుంది. మేలో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. సో... అజిత్‌ సరసన శ్రీలీల, సిమ్రాన్, మీనా  నటించనున్నారా? అనేది త్వరలో తెలిసి΄ోతుంది. మహేశ్‌బాబు సినిమాలో...మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు సిమ్రాన్‌ని ఎంపిక చేశారని సమాచారం. గతంలో ‘యువరాజు’ (2000) చిత్రంలో మహేశ్‌బాబు–సిమ్రాన్‌ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరూ స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. అయితే హీరో–హీరోయిన్‌గా కాదని, సిమ్రాన్‌ది అతిథి పాత్ర అని భోగట్టా. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను రాజమౌళి ప్రకటించనున్నారట. మరి.. సిమ్రాన్‌ ఈప్రాజెక్ట్‌లో ఉన్నారా? లేదా అనే ప్రశ్నకు అప్పుడు సమాధానం దొరుకుతుంది.

Sakshi Editorial On Summer Water scarcity
ఎండుతున్న జలకళ

అనుకున్నంతా అయింది. విశ్లేషకులు భయపడుతున్నట్టే జరిగింది. మొన్న మార్చిలోనే దేశంలోని ప్రధాన జలాశయాలన్నీ అయిదేళ్ళలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి అడుగంటినట్టు వార్తలు వచ్చి నప్పుడు వేసవిలో ఇంకెంత గడ్డుగా ఉంటుందో అని భయపడ్డారు. సరిగ్గా అప్పుడనుకున్నట్టే ఇప్పుడు దేశం నీటికొరత సంక్షోభంలోకి జారిపోతోంది. ఏప్రిల్‌ 25 నాటికి దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటిమట్టం ఆందోళనకర స్థాయికి పడిపోయినట్టు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా లెక్కలు వెల్లడించాయి. ముఖ్యంగా, దక్షిణాదిలో పదేళ్ళలో ఎప్పుడూ లేనంత కనిష్ఠస్థాయికి జలాశ యాల్లో నీటి నిల్వలు పడిపోయాయి. సాగునీటికీ, తాగునీటికీ, జలవిద్యుత్‌ ఉత్పత్తికీ తిప్పలు తప్పేలా లేవు. ఆ సవాళ్ళకు సంసిద్ధం కావాల్సిన అవసరాన్ని గణాంకాలు గుర్తు చేస్తున్నాయి.దేశం మొత్తం మీద రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యంలో కేవలం 30 శాతం వరకే ప్రస్తుతం నీళ్ళున్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇది గత ఏడాది కన్నా తక్కువ. అందుకే ఇప్పుడింతగా ఆందోళన. వర్షాకాలంలో 2018 తర్వాత అతి తక్కువ వర్షాలు పడింది గత ఏడాదే. దానికి తోడు ఎల్‌నినో వాతావరణ పరిస్థితి వల్ల గత వందేళ్ళ పైచిలుకులో ఎన్నడూ లేనంతగా నిరుడు ఆగస్టు గడిచి పోయింది. వర్షాలు కురిసినా, కొన్నిచోట్ల అతివృష్టి, మరికొన్నిచోట్ల అనావృష్టి. ఇవన్నీ కలిసి దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. దీర్ఘకాలంగా వర్షాలు కొరవడడంతో నీటి నిల్వలు తగ్గి, అనేక ప్రాంతాలు గొంతు తడుపుకొనేందుకు నోళ్ళు తెరుస్తున్నాయి. హెచ్చిన ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాడ్పులు సైతం నీటిమట్టాలు వేగంగా పడిపోవడానికి కారణమయ్యాయి. దేశంలో తూర్పు ప్రాంతంలోని అస్సామ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ లాంటి రాష్ట్రాల్లో నీటి నిల్వలు కొంత మెరుగ్గా ఉన్నాయి కానీ, మిగతా ప్రాంతాల్లో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ప్రధానంగా తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో ఈ ప్రభావం అమితంగా కనిపిస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు తెలుగు రాష్ట్రాలకూ తిప్పలు తప్పడం లేదు. దక్షిణాదిలో దాదాపు 42 జలాశయాలను సీడబ్ల్యూసీ పర్యవేక్షిస్తుంటుంది. గత ఏడాది ఇదే సమయానికి వాటిలో 29 శాతం దాకా నీళ్ళున్నాయి. దశాబ్ద కాలపు సగటు గమనిస్తే, ఈ సమయానికి కనీసం 23 శాతమన్నా నీళ్ళుండేవి. కానీ, ఈ ఏడాది కేవలం 17 శాతానికి తగ్గిపోయాయి. దాన్నిబట్టి ప్రస్తుత గడ్డు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గుజరాత్, మహారాష్ట్రలున్న పశ్చిమ భారతావనిలోనూ అదే పరిస్థితి. అక్కడ సీడబ్ల్యూసీ పర్యవేక్షించే 49 రిజర్వాయర్లలో పదేళ్ళ సగటు 32.1 శాతం కాగా, నిరుడు నీటినిల్వలు 38 శాతం ఉండేవి. కానీ, ఈసారి అది 31.7 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది మధ్య, ఉత్తర భారతావనుల్లోనూ జలాశయాల్లో నీళ్ళు అంతంత మాత్రమే. అక్కడ చారిత్రక సగటు నిల్వలతో పోలిస్తే, ఈసారి బాగా తక్కువగా ఉన్నాయట. మొత్తం మీద దేశంలోని ప్రధాన నదీపరివాహక ప్రాంతాల రీత్యా చూస్తే... నర్మద, బ్రహ్మపుత్ర, తాపీ నదీపరివాహక ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం సాధారణ నిల్వస్థాయుల కన్నా మెరుగ్గా ఉంది. అయితే, కావేరీ నదీ పరివాహక ప్రాంతం, అలాగే మహానది, పెన్నా నదులకు మధ్యన తూర్పు దిశగా ప్రవహించే పలు నదీ క్షేత్రాలు తీవ్రమైన లోటును ఎదుర్కొంటున్నాయి. ఎండలు ముదిరి, వేసవి తీవ్రత హెచ్చనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత గడ్డుగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ఇవన్నీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. బెంగళూరు కొద్ది వారాలుగా తీవ్ర నీటి ఎద్దడి సమస్యలో కూరుకుపోయింది. విషయం జాతీయ వార్తగా పరిణమించింది. ఇక, తమిళనాట పలు ప్రాంతాల్లో నెర్రెలు విచ్చిన భూములు, ఎండిన జలాశయాలు, తాగునీటి కొరతతో బిందెడు నీళ్ళ కోసం ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతున్న దృశ్యాలు ప్రత్యక్షమవుతున్నాయి. సహజంగానే నిత్యజీవితంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలనూ ఈ నీటి నిల్వల కొరత బాధిస్తోంది. తగిన నీటి వసతి లేక వివిధ రకాల పంటలు, తోటలు దెబ్బతింటున్నాయి. ఇవాళ్టికీ భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం కీలకం. జలాశయాల్లో తగ్గిన నీటితో అది పెను సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఇప్పటికీ మన దేశంలోని సేద్యపు భూముల్లో దాదాపు సగం వర్షపు నీటిపైనే ఆధారపడ్డాయి. రానున్న వర్షాకాలంలో సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదవుతుందని అంచనా వెలువడింది. ఫలితంగా, ఋతుపవనాలు ఇప్పుడున్న చిక్కులను తొలగిస్తాయన్నది ఆశ. నిజానికి, దేశంలో జలవిద్యుదుత్పత్తి సైతం తగ్గుతూ వస్తోంది. విద్యుచ్ఛక్తి గిరాకీ విపరీతంగా ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో హైడ్రోపవర్‌ జనరేషన్‌ 17 శాతం పడిపోయింది. ఆ మాటకొస్తే, తగ్గుతున్న జలాశయాల నిల్వలు, పెరుగుతున్న ప్రజల నీటి అవసరాల రీత్యా గత కొన్ని దశాబ్దాలుగా ఆసియాలో, ప్రధానంగా చైనా, భారత్‌లలో జలవిద్యుదుత్పత్తి తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో జలసంరక్షణ కీలకం. ప్రభుత్వాలు, పాలకులు తక్షణం స్పందించి, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కష్టం. గృహవినియోగం మొదలు వ్యవసాయ పద్ధతులు, పారిశ్రామిక కార్యకలాపాల దాకా అన్ని స్థాయుల్లోనూ నీటి వృథాను తగ్గించి, ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టుకోవడం ముఖ్యం. నీటి నిల్వ, పంపిణీలు సమర్థంగా సాగేలా చూడాలి. సుస్థిర వ్యవసాయ విధానాలు, పంటల వైవి ధ్యంతో నీటి వినియోగాన్ని తగ్గించాలి. ఎప్పుడైనా వర్షాలు లేక, దుర్భిక్షం నెలకొన్నా తట్టుకొనే సామర్థ్యం పెంపొందించుకోవాలి. నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత నుంచి వర్షపునీటి నిల్వల దాకా అన్నిటిపై ప్రజా చైతన్యం కలిగించాలి. గడ్డుకాలం కొనసాగితే, భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సత్వరమే మేలుకోవాలి. 

Sakshi Guest Column On Western Asia
పశ్చిమాసియా ఘర్షణ ఆర్థికానికి చేటే!

భారీ ఆర్థిక వ్యవస్థల కంటే భారత్‌ మెరుగైన వృద్ధి రేటు నమోదు చేయగల సమయంలో ఇరాన్ , ఇజ్రాయెల్‌ల మధ్య ఘర్షణ మొదలైంది. గల్ఫ్‌ ముడిచమురుపై భారత్‌ ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో రవాణాలో వచ్చే ఇబ్బంది ఏదైనా మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. పైగా యుద్ధం ముదిరితే ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు కొండెక్కుతాయి. అత్యధిక లాభాలనిచ్చే యూరోపియన్  మార్కెట్లకు భారత్‌ తన సరుకులు రవాణా చేయడం కూడా కష్టమవుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటి అంటే... పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం నుంచి మన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోగలదా అన్నది!పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలు భారత్‌ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. తీవ్రత, నష్టం ఏమిటన్నవి ఇంకా అంచనా వేయాల్సే ఉన్నా ఈ ఆర్థిక సంవత్సరంలో బాహ్య పరిణామాలు మన ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ముప్పు కాగలవని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఉక్రెయిన్ , రష్యా మధ్య 2022లో యుద్ధం మొదలైన తరువాత పలు దేశాల్లో పరిస్థితులు మారినట్లే పశ్చిమాసియా పరిణామాలు కూడా అంతర్జాతీయంగానే కాకుండా, స్థానికంగానూ కలకలం సృష్టించనున్నాయి. పరిస్థితి సద్దు మణగకుంటే... లేదా మరింత దిగజారితే ఇప్పటికే ఎదురవుతున్న పలు సవాళ్లను తట్టుకోవడం కష్టమని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం ఇక్కడ ప్రస్తావనార్హం. అంతేకాదు... కొన్ని అసందిగ్ధ పరిస్థితులు ఎదు ర్కోవాల్సి రావచ్చు అని కూడా ఆమె సూచనప్రాయంగా తెలిపారు. సప్లై చెయిన్ లో వచ్చే ఇబ్బందుల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశముందని అంటున్నారు కేంద్ర మంత్రి. ఆర్థిక పరిపుష్టి మార్గంలో కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయన్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వ్యాఖ్యలు అర్థం చేసుకోదగ్గవే. ప్రపంచంలోని భారీ ఆర్థిక వ్యవస్థల కంటే భారత్‌ మెరుగైన వృద్ధి రేటు నమోదు చేయగల సమయంలో ఇరాన్ , ఇజ్రాయెల్‌ల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ(స్థూల జాతీయోత్పత్తి) 7 శాతం కంటే ఎక్కువ ఉండవచ్చునని ప్రభుత్వం ఉత్సాహంగా ఉన్న వేళ అంతర్జా తీయ సంస్థలు కూడా తమ అంచనాలను సవరించుకుంటున్న విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్‌ మానెటరీ ఫండ్‌ (అంత ర్జాతీయ ద్రవ్యనిధి – ఐఎంఎఫ్‌) ఇటీవలే భారత్‌ జీడీపీ వృద్ధిరేటును 6.5 నుంచి 6.8 శాతానికి సవరించింది. ప్రపంచ బ్యాంకు కూడా 6.4 నుంచి 6.6 శాతానికీ, ‘స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ గ్లోబల్‌’ 6.4 నుంచి 6.8 శాతానికీ ఈ ఆర్థిక సంవత్సరపు భారత జీడీపీ రేటును సవరించాయి. అయితే ఈ అద్భుతమైన పురోగతిని అంతర్జాతీయ అంశాలు నిరాశా పూరితం చేసే అవకాశం ఉంది. రానున్న వారాల్లో పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితులు ఒక దశ దాటాయంటే మాత్రం ఇప్పటివరకూ హెచ్చరికలు అనుకుంటున్న పలు ఘటనలు వాస్తవం కావచ్చు. ఒకవేళ ఇరాన్  తన హోర్‌ముజ్‌ జలసంధి ద్వారా ముడిచమురు, సహజవాయువు రవాణాలను నిలిపివేసిందని అనుకుందాం. పెర్షియన్ , ఒమాన్  గల్ఫ్‌లను కలిపే ఈ సన్నటి రవాణా మార్గాన్ని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గంగా యూఎస్‌ ఎనర్జీ ఇన్ఫర్మేషన్  ఏజెన్సీ గుర్తించింది. పర్షియన్  గల్ఫ్‌ నుంచి రవాణా అయ్యే ముడిచమురులో 80 శాతం ఈ జలసంధి ద్వారానే ఖండాలు మారుతుంది. భారత దేశం కూడా ఈ ప్రాంతపు ముడిచమురుపై ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో రవాణాలో వచ్చే ఇబ్బంది ఏదైనా మనపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. భారత్‌ ఉపయోగించే ముడిచమురులో 30 శాతం వరకూ రష్యా నుంచే వస్తున్నా మిగిలిన మొత్తం సౌదీ అరేబియా, పశ్చిమాసియా, యూఏఈ వంటి దేశాల నుంచే వస్తూండటం గమనార్హం. హోర్‌ముజ్‌ జలసంధి ఎంత కీలకమో దీనిద్వారా అర్థం చేసుకోవచ్చు. రెండో అంశం... పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగితే సూయిజ్‌ కాలువను కూడా మూసివేసే అవకాశం ఉంది. ఆసియా నుంచి ఎర్ర సముద్రం మీదుగా ఈ కాలువకు వెళ్లే మార్గం బాబ్‌ ఎల్‌–మందేబ్‌ అనే చిన్న కాలువ దగ్గరి నుంచి మొదలవుతుంది. యెమెన్  కేంద్రంగా పనిచేసే హౌతీ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్న ప్రాంతమిదే. వీరంతా హమాస్‌కు మద్దతుగా ఉన్నవారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రవాణా కొంత ‘కేప్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌’ (దక్షిణాఫ్రికా) మీదుగా మళ్లింది. ఫలితంగా రవాణ ఖర్చులు పెరిగిపోవడమే కాదు... సమయం కూడా ఎక్కువవుతోంది. పరిస్థితి ముదిరితే అత్య ధిక లాభాలనిచ్చే యూరోపియన్  మార్కెట్లకు భారత్‌ తన సరుకులు రవాణా చేయడం కష్టమవుతుంది. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఎగుమతులు స్తంభించిపోతే వాణిజ్య ప్రవాహాలు తీవ్రస్థాయిలో ప్రభావితమవుతాయి.మూడో ప్రమాదం ఇంకోటి ఉంది. యుద్ధం ముదిరితే ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు కొండెక్కుతాయి. బారెల్‌కు 75–80 డాలర్ల అత్యంత తక్కువ శ్రేణి ధరలు ఇప్పటికే లేకుండాపోయాయి. ప్రస్తుతం బ్రెంట్‌ ముడిచమురు ధరలు 87 నుంచి 89 డాలర్ల మధ్య ఉన్నాయి. ఇప్పటికైతే ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య ఘర్షణ ఈ ధరల మీద పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఇంకొంచెం తీవ్రమైతే అవి పెరగడం ఖాయం.ముడిచమురు ధరలు పెరిగితే ఏమవుతుందో మనందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వ ఖర్చులు పెరిగిపోతాయి. కరెంట్‌ అకౌంట్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు పెట్రోలు, డీజిళ్ల ధరలు పెంచాలని చమురు కంపెనీలు ఇప్పటికే కోరుతూండటం గమనార్హం. ఇది బహుశా ఎన్నికల తరువాతే జరగవచ్చు. అయినా, ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం పడటం ఖాయం. ముడి చమురుకు మనం పెట్టే ఖర్చు మాటెలా ఉన్నా... పశ్చిమాసియా మీద అలుముకున్న యుద్ధమేఘాలు తొలగకపోతే మన వ్యూహా త్మక అవసరాల కోసం స్థిరంగా చమురు అందుబాటులో ఉండటమూ అత్యంత కీలకమే. మన దేశ చమురు అవసరాల్లో 80 శాతం దిగు మతులతోనే తీరుతున్నాయన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి.ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటి అంటే?... పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం నుంచి మన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోగలదా? అన్నది. ప్రస్తుతం మన చేతుల్లో ఏమీ లేదు కానీ... మనకు మిత్రదేశాలే అయిన ఇజ్రాయెల్, ఇరాన్ లకు నిగ్రహం పాటించమని కోరడం మాత్రం చేయదగ్గ పనే. ముడిచమురు విషయానికి వస్తే ఇటీవలి కాలంలో వేర్వేరు మార్గాల ద్వారా కొను గోలు చేయడం కొంచెం ఎక్కువైంది. అలాగని గల్ఫ్‌ నుంచి వచ్చే లోటు మొత్తం భర్తీ అవుతుందని కాదు. కానీ ఈ మార్గాల గుండా వచ్చే ఇతర సరుకుల విషయంలో మాత్రం ప్రత్యామ్నాయాలు వెత కడం అసాధ్యం. కానీ ఈ ప్రవాహానికి ఆటంకాలు ఎదురుకావొచ్చు. ఇలాంటి పరిణామాలే ఎదురైతే రానూ పోనూ సరుకుల ఖర్చులు తడిసి మోపెడవుతాయి.ఘర్షణ తాలూకు ఇతర ప్రభావాలను ఇప్పుడే అంచనా వేయ లేము. కానీ ఉదాహరణకు రష్యా–ఉక్రెయిన్  యుద్ధం మొదలైనప్పుడు వేర్వేరు లోహాల ధరలు అమాంతం పెరిగాయి. సన్ ఫ్లవర్‌ నూనెలు దొరక్కుండా పోయాయి. ఇలాగే పశ్చిమాసియాలో యుద్ధం లాంటి వాతావరణం ఏదైనా ఏర్పడితే భారత ఆర్థిక వ్యవస్థపై అనూహ్య పరిణామాలు తప్పకుండా ఉంటాయి. నిజానికి ప్రపంచీకరణ నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం ఏ దేశానికీ సాధ్యం కాదు. అందుకే... పశ్చిమాసియా ప్రాంతంలో అత్యంత త్వరగా శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని మాత్రమే ఎవరైనా కోరుకోగలిగేది!సుష్మా రామచంద్రన్  వ్యాసకర్త సీనియర్‌ ఫైనాన్షియల్‌ జర్నలిస్ట్‌(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Sakshi Guest Column On CM Jagan Memantha Siddham
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు

మేమంతా ‘సిద్ధం’ బస్సు యాత్ర ముగింపు సభలో జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పిన ఒకమాట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మధ్య తరగతిని ఆలో చనలో పడేసింది. ‘ఈ సభ నుంచి మీరు మీ ఇళ్ళకు వెళ్ళాక, మీ కుటుంబ సభ్యులు అందరూ: పిల్లలూ, అవ్వా తాతలతో సహా కలిసి కూర్చుని ఎవరికి ఓటు వేయాలో చర్చించుకోండి...’ అన్నారు. ఈ మాట విన్నాక, ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడ్డారు. ఇన్నాళ్ళూ ‘నా వల్ల మేలు జరిగితే నాకు ఓటు వేయండి’ అని చెప్పిన సీఎం, ఇప్పుడు అదే మాటను మీ కుటుంబంలో అందరూ ఒక మాట అనుకొని ఒక నిర్ణయానికి రండి, అని దీన్ని ఒక ‘హోమ్లీ ఎఫైర్‌’గా మార్చారు. ఓటర్లు పోలింగ్‌ బూత్‌ లోకి వెళ్ళడానికి ఇంకా మూడు వారాలు సమయం ఉండగా ఆయన ఇటువంటి కొత్త పనిని వాళ్లకు అప్పగించారు.  వినడానికి ఇది సాదాసీదాగా ఉన్నప్పటికీ, ‘పిల్లలూ, అవ్వాతాతలతో సహా కలిసి కూర్చుని...’ అని అనడం ద్వారా జగన్‌ దీన్ని ఒక ఇంట్లో మూడు తరాలు కలిసి కూర్చుని చేసే నిర్ణయంగా మార్చారు. జగన్‌ చెప్పాడు– ‘కొన్ని కొంచెం మాత్రం పెంచి ఇంతకు ముందు ఇచ్చినవన్నీ మళ్ళీ ఇస్తాడంట...’ అనేది వారి చర్చలో కీలకం అవుతుంది. అయితే వారి ‘నిర్ణయం’ ఏమిటి? అనే విషయం వద్దకు వచ్చేసరికి మూడు తరాల్లో కూడా యువతరం (ఎమర్జింగ్‌ జెనరేషన్‌) ఏమనుకుంటున్నది అనేది ప్రధానం అవుతున్నది. ఏప్రిల్‌ చివరి వారంలో వైఎస్సార్‌సీపీకి ఉన్న అదృశ్యశక్తి ఏమిటో విశాఖ జిల్లా భీమిలి ‘సోషల్‌ మీడియా వారియర్స్‌’ సదస్సులో దృశ్యమానం అయింది. ఇన్నాళ్ళూ జగన్‌ కోసం స్వచ్ఛందంగా పనిచేసిన అదృశ్య ‘కేడర్‌’ ఇది. స్వచ్ఛందంగా ‘సోషల్‌ మీడియా వారియర్స్‌’ ఈ పార్టీని ఇలా ‘ఓన్‌’ చేసుకోవడానికి మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి– తమ సామాజిక వర్గాల వారు చిన్నదో పెద్దదో ఏదో ఒక రాజకీయ పద వితో ఈ ప్రభుత్వంలో గుర్తింపును పొందడం. రెండు – సంస్కరణల వల్ల పరిపాలన వ్యవస్థ వారి సమీపానికి రావడం. మూడు – మొదటి ఐదేళ్లలోనే ‘రియాల్టీ’గా కనిపిస్తున్న 2019 ఎన్ని కల వాగ్దానాలు. వీటిని మించి విభజిత ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాష్ట్రంగా రూపాంతర (ట్రాన్స్‌ ఫార్మింగ్‌) దశలో ఉన్నప్పుడు, తమ కొత్త రాష్ట్రం ఎలా ఉండాలి? అనే భావన, దాన్ని వాస్తవం చేసే నాయకుడు ఎవరు? ప్రభుత్వం ఏది? అనే విషయంలో యువత ఇప్పుడు పూర్తి స్పష్టతతో ఉంది. ఎన్నికలు అనేసరికి తమ పార్టీల ప్రాధా న్యతల ఎంపికలో ‘కన్ఫ్యూజన్‌’కు గురి అవు తున్నది ఎవరు? వాటిని నిజాయతీగా అర్థం చేసుకుంటున్నది ఎవరు? అనేది వాళ్లకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఎన్నికల ముందు ‘సీట్ల’ కోసం జరిగిన కొందరి పార్టీల మార్పు, నిరు పేదలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇచ్చే ప్రయత్నాలను పబ్లిగ్గా అవహేళన చేస్తున్న తీరు, వారి దృష్టిని దాటిపోయేవి కాదు. అందుకే, కేవలం పార్టీ పట్ల రాజకీయ అభిమానం ఉంచు కోవవడమే కాకుండా, నాయకుడి పట్ల యువత దాన్ని బహిరంగంగా వ్యక్తం చేసే తీరులో మునుపు ఎన్నడూ మనం చూడని వ్యక్తీకరణ ఒక ‘హై వోల్టేజ్‌’ దేహభాషగా స్పష్టంగా కనిపిస్తున్నది.ఈ కసి వెనుక ఉన్న కారణాల కోసం చూసి నప్పుడు రెండు ప్రధాన అంశాలు కనిపిస్తాయి. మొదటిది – ప్రభుత్వం నుంచి అందే మేలు ఏదైనా నిర్ణయాధికారం స్థానిక ఆధిపత్య వర్గాల చేతిలో నుంచి ఇప్పుడు అది సాంకేతికం అయింది. ఊళ్ళోని గ్రామ సచివాలయాల సిబ్బంది, ‘వలంటీర్ల’ వద్దకు ‘ఆన్‌లైన్‌’లో అది చేరువయింది. దాన్ని ఆక్షేపిస్తూ ఏదో వంకతో ఆ సేవలను ఆపాలనే వర్గాల నైజం కూడా అర్థమైంది. జరుగుతున్న ‘యుద్ధం’లో నిర్లక్ష్యిత, లేదా వర్ధమాన సమాజాల్లోని యువత ఇది తమ నిశ్శబ్ద విజయం అనుకొంటున్నారు.రెండవది – ‘గడచిన ఇరవై ఏళ్లుగా చిన్న‘బ్యాగ్‌’ భుజాన వేసుకుని కాళ్ళకు చక్రాలు కట్టుకుని, దేశంలో ఎక్కడ పని దొరికితే అక్కడికి జీవిక వెతుక్కుంటూ వెళ్ళాము. ఇక ముందు మాకు ఈ తిరుగుడు తగ్గాలి. దిగువ మధ్య తరగతి, మధ్యతరగతి వర్గాల్లో కుటుంబం అంతా కనీసం సమీపంగా కలిసి జీవించే పరిస్థితి రావాలి’ అనేది వారి ఆకాంక్ష. ఇప్పుడు ఉన్న ఈ– ‘ఫీల్‌ గుడ్‌’ వాతావరణంతో పాటుగా, వేగవంతమైన అభివృద్ధి కోసం ఇప్పటికే సిద్ధమైన ‘లాజిస్టిక్స్‌’, వాటికి తోడుగా విస్తరిస్తున్న మౌలిక వసతుల వల్ల ఇక ముందు ఉపాధి అవకాశాలు ఇక్కడే మెరుగవుతాయని కొత్త పార్టీ ప్రణాళిక చూశాక వాళ్ళు బలంగా నమ్ముతున్నారు.జాన్సన్‌ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత

Lok sabha elections 2024: AAP and Congress dichotomy in Punjab
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్‌...మిత్రభేదం

పోరాటాల పురిటి గడ్డగా పేరొందిన పంజాబ్‌లో ఎన్నికల పోరు ఎప్పుడూ హై ఓల్టేజ్‌లో ఉంటుంది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ)లను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊడ్చిపారేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ దుమ్ము రేపే ప్రయత్నంలో ఉంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భాగస్వాములైన ఆప్, కాంగ్రెస్‌  పంజాబ్‌లో మాత్రం విడిగా  పోటీ చేస్తూ పరస్పరం  తలపడుతుండటం విశేషం. గత  లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కొల్లగొట్టిన కాంగ్రెస్‌ ఈసారీ సత్తా చాటాలని చూస్తోంది. అకాలీ–బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమికి  ఆ ఎన్నికల్లో అంతంత ఫలితాలే వచ్చాయి. రైతు ఉద్యమం నేపథ్యంలో బీజేపీకి అకాలీ కటీఫ్‌తో పంజాబ్‌లో ఈసారి పారీ్టలన్నీ ఒంటరి పోరాటమే చేస్తున్నాయి...  స్టేట్‌స్కాన్‌పంజాబ్‌ ఎన్నికల్లో కొన్నేళ్లుగా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మొత్తం 13 చోట్లా ఒంటరి పోరాటం చేసి ఏకంగా 8 స్థానాలు చేజిక్కించుకుంది. అకాలీదళ్‌ 10, బీజేపీ మూడు చోట్ల పోటీపడ్డా చెరో రెండు సీట్లతో సరిపెట్టుకున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా 4 సీట్లు కొల్లగొట్టిన కేజ్రీవాల్‌ పార్టీ అన్నిచోట్లా పోటీ చేసి ఒక్క స్థానానికే పరిమితమైంది. ఆ తర్వాత పంజాబ్‌లో రాజకీయాలు సమూలంగా మారిపోయాయి. 2020లో మోదీ సర్కారు వ్యవసాయ సంస్కరణ చట్టాలపై వ్యతిరేకంగా పంజాబ్‌లో వ్యతిరేకత తారస్థాయిలో వ్యక్తమైంది. ఆ దెబ్బకు 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్‌ కుదేలయ్యాయి. సరికొత్త రాజకీయాల వాగ్దానంతో  ఆప్‌ అధికారాన్ని తన్నుకుపోయింది. బీజేపీకి మళ్లీ ‘రైతు’ గండం... హస్తినతో పాటు దేశాన్నీ కుదిపేసిన సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమ సారథులు పంజాబ్‌ రైతులే. వారి ఆగ్రహ ప్రభావం ఎక్కడ తమపై పడుతుందోననే ఆందోళనతో అకాలీదళ్‌ 2020లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నా లాభం లేకపోయింది. సుర్జీత్‌ సింగ్‌ బర్నాలా, ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ వంటి దిగ్గజాల సారథ్యంలో వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు పంజాబ్‌లో ఎదురీదుతోంది. తాజాగా మరోసారి రైతులు ‘చలో ఢిల్లీ’ అంటూ ఆందోళనల బాట పట్టడం పంజాబ్‌లో బీజేపీకి విషమ పరీక్షగా మారింది. ప్రచారంలోనూ కమలనాథులకు రైతుల నుంచి నిరసనల సెగ బాగానే తగులుతోంది. అభివృద్ధి నినాదం, మోదీ ఫ్యాక్టర్‌తోనే తదితరాలనే నమ్ముకుని బీజేపీ ఒంటరి పోరాటం చేస్తోంది. కెపె్టన్‌ అమరీందర్‌ తన పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ను 2022లో బీజేపీలో విలీనం చేశారు. కాంగ్రెస్‌ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆయన భార్య ప్రణీత్‌ కౌర్‌ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం విశేషం. లూధియానా కాంగ్రెస్‌ ఎంపీ రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ కూడా బీజేపీలో చేరి పార్టీ టికెట్‌పై అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.కలి‘విడి‘గా కాంగ్రెస్, ఆప్‌... పంజాబ్‌లో నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూ, కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ వర్గ పోరు కాంగ్రెస్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. సిద్ధూకు పీసీసీ చీఫ్‌ పదవి కట్టబెట్టిన అధిష్ఠానం పార్టీ వీర విధేయుడైన కెపె్టన్‌కు పొమ్మనకుండా పొగబెట్టింది. దాంతో ఆయన వేరుకుంపటి పెట్టుకున్నారు. పర్యవసానంగా రెండేళ్లకే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తల బొప్పికట్టింది. 117 సీట్లకు ఏకంగా 92 చోట్ల గెలిచి ఆప్‌ ప్రభంజనం సృష్టించింది. ఢిల్లీ ఆవలా దుమ్ము రేపగలమని నిరూపించింది. ఆప్‌ నేత భగవంత్‌ మాన్‌ సీఎం అయ్యారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ సారథ్యంలోని ఇండియా కూటమితో జట్టుకట్టిన ఆప్‌ పంజాబ్‌లో మాత్రం పొత్తుకు ససేమిరా అంది. దాంతో కాంగ్రెస్, ఆప్‌ విడిగానే పోటీ చేస్తున్నాయి. గతంలో రైతుల పోరాటానికి దన్నుగా నిలిచిన ఆ పార్టీలకు ఎన్నికల ముందు మళ్లీ రైతులు ఆందోళనలకు దిగడం కలిసి రానుంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి రైతుల డిమాండ్లను కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో చేర్చడం విశేషం. 6 న్యాయాలు, 25 గ్యాంరటీలనూ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. కార్పొరేట్లతో బీజేపీ కుమ్మక్కు, అధిక ధరలు, నిరుద్యోగం వంటి అంశాలనూ గట్టిగా ప్రచారం చేస్తోంది.కేజ్రీవాల్‌ అరెస్టు ఆప్‌కు ప్లస్సా, మైనస్సా! ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో లోక్‌సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడం సంచలనంగా మారింది. బీజేపీ కక్షగట్టి విపక్ష నేతలను జైల్లో పెడుతోందంటూ ఇండియా కూటమి దేశవ్యాప్తంగా మూకుమ్మడి ఆందోళనలకు దిగింది. తొలుత కాస్త తడబడ్డ ఆప్‌ నేతలు ప్రచారంలో జోరు పెంచారు. ‘జైల్‌ కా జవాబ్‌ ఓట్‌ సే’ (జైల్లో పెట్టినందుకు ఓటుతో జవాబిద్దాం) నినాదంతో దూసుకెళ్తున్నారు. కేజ్రీవాల్‌ భార్య సునీత  ప్రచార బరిలో దిగడంతో ఆప్‌ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. ఏమైనా ఎన్నికల ముంగిట అధినేత అందుబాటులో లేకపోవడం ఆప్‌కు ఇబ్బందికరమేనని కొందరంటుండగా, ఆప్‌కు సానుభూతి కలిసొస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.సర్వేల సంగతేంటి.. పంజాబ్‌ రైతుల తాజా ఆందోళనలు బీజేపీపై ప్రభావం చూపవచ్చని సర్వేలు అంచనా వేస్తున్నాయి. 13 సీట్లలో ఆప్, కాంగ్రెస్‌లకే చెరో సగం దక్కవచ్చని లెక్కలేస్తున్నాయి. బీజేపీకి 2,  అకాలీదళ్‌కు ఒక సీటు రావచ్చని  కొన్ని సర్వేలు అంటున్నాయి.చిన్న రాష్ట్రమే అయినా ఐకే గుజ్రాల్,  మన్మోహన్‌ సింగ్‌ రూపంలో పంజాబ్‌  ఏకంగా ఇద్దరు ప్రధానులను అందించింది. వారి జన్మస్థలాలు దేశ విభజనతో  ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోకి  వెళ్లిపోయాయి. పాక్‌ మాజీ ప్రధాని  నవాజ్‌ షరీష్‌ జన్మస్థలమేమో మన  పంజాబ్‌లో ఉండటం విశేషం.కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టినా ఆయన  సిద్ధాంతాలను అరెస్టు చేయగలరా!?  దేశవ్యాప్తంగా ఆయనకు మద్దతు పలుకుతున్న లక్షలాది కేజ్రీవాల్‌లను ఏ జైల్లో  పెడతారు? కేజ్రీవాల్‌ వ్యక్తి కాదు, భావజాలం. మోదీ సర్కారు వేధింపులను ఇండియా కూటమి కలిసికట్టుగా ఎదుర్కొంటుంది. బీజేపీ భారతీయ  జుమ్లా పార్టీగా మారింది. – ఎన్నికల ర్యాలీలో పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

agriculture development in andhra pradesh
బిందువే సిరుల సింధువు

సాక్షి, అమరావతి : అన్నమయ్య జిల్లా చిట్వేల్‌ మండలం పోళ్లోపల్లి రైతులను వర్షాభావం ఏళ్ల తరబడి పట్టి పీడించింది. అక్కడి రైతులు రాగి, సజ్జలు, ఉలవలు, అలసందలు, పెసర, మినుములు, పొద్దు తిరుగుడు మినహా ఇతర పంటలను సాగు చేయరు. కరవు కాటకాల వల్ల ఆరు తడి పంటలు సైతం ఏనాడూ పూర్తిగా చేతికందని దుస్థితి. గత్యంతరం లేక బతుకుదెరువు కోసం కొందరు కువైట్‌కు మరికొందరు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లారు.దశాబ్దాల పాటు ఊళ్లో యువకులెవరూ కానరాని విచిత్రం ఆ ఊరి సొంతం. ఈ గ్రామంలో 1,800 కుటుంబాల్లో 134 మంది రైతులుండేవారు. సేద్యం కలిసిరాక 100 మందికి పైగానే గ్రామం నుంచి వలస వెళ్లారు. అప్పో సప్పో చేసి సేద్యం చేసే వారి సంఖ్య 30కి మించి ఉండేదికాదు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడా గ్రామంలో మోటారు సైకిల్‌ లేని ఇల్లు లేదు. ప్రతి పదిళ్లకూ ఒక కారు ఉంది. పిల్లలు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్నారు.ఒకప్పుడు ఈ ఊరి యువకులకు పిల్లనివ్వడానికే సంకోచించేవారు. ఇప్పుడు సంబంధాలు కుదుర్చుకోవడానికి పోటీ పడుతున్నారు. ఎందుకింత మార్పు అంటే..? సంక్షేమం ఆ గ్రామంలో ప్రతి తలుపూ తట్టింది. సేద్యంలో ఆ ఊరు గెలిచింది. సేద్యం లాభదాయకంగా మారి వలసలకు పగ్గాలు వేసింది. వేసిన పంటలు చేతికందుతున్నాయి. పెట్టుబడి పదింతలు మిగులుతోంది. పోళ్లోపల్లి రూపురేఖలను బిందుసేద్యం మార్చేసింది. కువైట్‌ నుంచి 90 శాతం స్వగ్రామానికి..ఒకప్పుడు అక్కడ పంటలకు నీటితడులు పెట్టేందుకు రాత్రనకా, పగలనకా చెలగ పార చేత పట్టుకుని పొలాల్లోనే కాపురాలు పెట్టేవారు. మోటారు కరెంటు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. పంటలు పండించడానికి ఇంటిల్లిపాదీ కష్టపడే వారు. ఇప్పుడు పగటి పూటే 9 గంటల పాటు నిరాటంకంగా ఉచిత విద్యుత్తు అందుతుండడంతో నీటి తడుల కోసం బెంగలేకుండా పోయింది. కావాల్సినంత నీరందుతోంది. సూక్ష్మ సేద్యానికి సంక్షేమం తోడవడంతో వలస వెళ్లిన వారిలో నూటికి 90 మంది తిరిగి స్వగ్రామం బాటపట్టారు. ప్రస్తుతం ఆ గ్రామంలో రైతుల సంఖ్య 230కి పెరిగింది. ఒకప్పుడు సొంత పొలాలనే ఖాళీగా వదిలేసిన రైతులు ఇప్పుడు పక్క ఊళ్లోని పొలాలనూ కౌలుకు తీసుకుని సిరుల పంటలు పండిస్తున్నారు. 90 శాతం సబ్సిడీ (రూ.1.50 కోట్లు)తో నూరు శాతం విస్తీర్ణం (280 ఎకరాలు)లో బిందు పరికరాలను అమర్చుకున్నారు. బొప్పాయి, అరటి, జామ, సీతాఫలం.. ఇలా వివిధ రకాలను సాగు చేస్తూ లక్షలు గడిస్తున్నారు. సంక్షేమంతో గ్రామానికి రూ.7 కోట్లు వైఎస్సార్‌ రైతు భరోసా, పంటల బీమా, పంట నష్టపరిహారం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ వంటి రైతు సంక్షేమ పథకాలతో పాటు అమ్మఒడి, చేయూత, ఆసరా లాంటి డజనుకు పైగా సంక్షేమ పథకాల రూపంలో గ్రామస్తులు రూ.7 కోట్లకు పైగా లబ్ధి పొందారు. ఫలితంగా వారిలో కొనుగోలు శక్తి పెరిగి పల్లె రూపురేఖలు మారాయి. సూక్ష్మసేద్యంతో ప్రభుత్వం తోడుగా నిలబడడంతో నాలుగేళ్లలో సుమారు రూ.1,500 కోట్లతో 6 లక్షల ఎకరాల్లో బిందు, తుంపర పరికరాలను అమర్చుకుని 2.25 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు.  ఐదేళ్లలో రాష్ట్రంలో 7.33 లక్షల ఎకరాలకు విస్తరణ రాష్ట్రంలో 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు, 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. రాష్ట్రంలో మరో 28 లక్షల ఎకరాలు బిందు, తుంపర సేద్యానికి అనువైనదిగా ప్రభుత్వం గుర్తించింది. ఈ ఐదేళ్లలో 7.33 లక్షల ఎకరాలను కొత్తగా సాగులోకి తీసుకొచ్చి 2.60 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. సబ్సిడీ రూపంలో రూ.2,669.85 కోట్లు జమ చేసింది. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.800.16 కోట్లూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో సిఫార్సులున్న వారికే పరికరాలు ఇచ్చేవారు. గత ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వంలో అర్హతే కొలమానంగా అడిగిన ప్రతి రైతుకు సిఫార్సులకు తావులేకుండా, కుల, రాజకీయ పక్షపాతం లేకుండా అర్హులందరికీ పరికరాలిచ్చారు. రైతులు తమ వాటా చెల్లించిన 15 రోజుల్లోగానే నేరుగా వారి క్షేత్రాలకు పరికరాలను తీసుకెళ్లి మరీ అమర్చారు. ఈ పథకం కింద లబ్ధి పొందే ఎస్సీ, ఎస్టీ రైతులకు మేలు చేసేందుకు తుంపర, బిందు పరికరాలపై కేంద్రం విధించే 12 శాతం జీఎస్టీలో 50 శాతం పన్నుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇలా రూ.60 కోట్లకు పైగా జీఎస్టీ భారాన్ని రైతుల తరపున ప్రభుత్వం భరించింది.  రైతులకు రూ.1,034 కోట్ల పెట్టుబడి ఆదా సూక్ష్మసేద్యంలో గతేడాది జాతీయ స్థాయిలో ఐదవ స్థానంలో ఉన్న ఏపీ ఈ ఏడాది 4వ స్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యుత్తమ 20 జిల్లాల్లో ఐదు జిల్లాలు (ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి) ఏపీకి చెందినవే. బిందు, తుంపర సేద్యంపై ఆర్బీకేల ద్వారా, ఆర్బీకే చానల్‌ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎరువుల యాజమాన్యం, విద్యుత్‌ ఆదా, కూలీల ఖర్చు, నీటి ఆదాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ పథకం విస్తరణ ద్వారా 36,650 టన్నుల ఎరువులు, 11,383 లక్షల యూనిట్ల విద్యుత్, 110 టీఎంసీల నీరు ఆదా కాగా, రైతులకు రూ.1,034 కోట్ల కూలీల ఖర్చు మిగిలిందని గుర్తించారు. కువైట్‌ను వీడి కన్నతల్లి ఒడికి.. పోళ్లోపల్లికే చెందిన సంగరాజు చంద్రశేఖర్‌రాజు సేద్యం కలిసి రాకపోవడంతో 17 ఏళ్ల క్రితం కువైట్‌ వెళ్లి అక్కడే ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మూడేళ్ల క్రితం గ్రామానికి తిరిగి వచి్చన ఆయన 90 శాతం ప్రభుత్వ సబ్సిడీతో డ్రిప్‌ ఏర్పాటు చేసుకున్నారు. 2.5 ఎకరాల్లో పచ్చ అరటి సాగు చేశారు. రూ.1.50 లక్షలు వ్యయం కాగా , రూ.6 లక్షల ఆదాయం వచి్చంది. మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని అమృతపాణి, సుగంధ అరటి, డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేస్తున్నారు. రైతు భరోసా సహా వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.2.56 లక్షలు అందాయి. ‘ఇద్దరు పిల్లలను కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదివిస్తున్నా. ఇక సేద్యం వదిలి పెట్టను. ఊళ్లోనే దర్జాగా జీవిస్తా’..నంటూ ధీమాగా చెబుతున్నారాయన. పిల్లలకు కార్పొరేట్‌  చదువులు.. వ్యవసాయం కలిసిరాక కువైట్‌ వెళ్లిన నా భర్త సుబ్బరాజు మూడేళ్ల కిందట  సొంతూరొచ్చారు. 5 ఎకరాల్లో తైవాన్‌ జామ, మరో 5 ఎకరాల్లో అరటి, బొప్పాయి  సాగు చేపట్టాం. ప్రభుత్వ సబ్సిడీతో ఫారం పాండ్‌తో పాటు 90 శాతం సబ్సిడీపై రూ.1.30 లక్షల విలువైన డ్రిప్‌ పరికరాలు తీసుకున్నా. జామకు రూ.3 లక్షలు ఖర్చు చేస్తే రూ.15 లక్షల ఆదాయం వచి్చంది. మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకుని అమృతపాణి జి–9 రకాన్ని వేశాం. రైతు భరోసా, సున్నా వడ్డీ, అమ్మఒడి, ఆసరా వంటి పథకాల ద్వారా రూ.1.13 లక్షల ఆరి్థక సాయం అందింది. బిందు సేద్యంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు తోడవడంతో అమ్మాయిని వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలోనూ, ఇద్దరు కుమారులను కార్పొరేట్‌ విద్యాసంస్థలో చదివిస్తున్నా.  -ఉమ్మలరాజు సుజాత సమాజంలో గౌరవం పెరిగింది.. దినసరి కూలీగా పనిచేస్తూ ఐటీఐ చదువుకున్నా. ఉద్యోగం పేరిట మోసపోవడంతో కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నాకున్న 4 ఎకరాలకు 90 శాతం సబ్సిడీపై రూ.2 లక్షల విలువైన డ్రిప్‌ పరికరాలు సమకూర్చుకున్నా. బొప్పాయిలో మేలైన రెడ్‌ లేడీ రకం సాగు చేశా. ఏడాదిలో రూ.15 లక్షల ఆదాయం వచి్చంది. రైతుభరోసా, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ, ఆసరా పథకాల ద్వారా రూ.65 వేల వరకు లబ్ధి పొందాం. ఆర్థిక పరిస్థితి‡ మెరుగుపడడంతో సమాజంలో గౌరవం పెరిగింది.  –పందేటి కృష్ణమరాజు పిల్లలను మోడల్‌ స్కూల్‌లో చదివిస్తున్నా.. 4.5 ఎకరాల్లో డ్రిప్‌ పరికరాల కోసం దరఖాస్తు చేస్తే 90 శాతం సబ్సిడీపై 2.61 లక్షల విలువైన డ్రిప్‌ పరికరాలు అమర్చారు. కోలియోసిస్‌ అనే మెడిసిన్‌ ప్లాంటేషన్‌ చేశా. ఎకరాకు సగటున రూ.15 వేలు ఖర్చు చేశా. రూ.2.80 లక్షల ఆదాయం వచి్చంది. డ్రిప్‌తో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని నిమ్మ వేశా. రూ.లక్ష పెట్టుబడి పెడితే రూ.6 లక్షలు ఆదాయం తీశాను. సంక్షేమ పథకాల ద్వారా రూ.1.91 లక్షల మేర లబ్ధి పొందా. ఫలితంగా పిల్లలను మోడల్‌ స్కూల్‌లో చదివిస్తున్నా. బిందు సేద్యంతో వ్యవసాయం లాభసాటిగా మారింది. సంక్షేమ ఫలాలు అందడంతో నిశి్చంతగా జీవిస్తున్నా.  –మందా సుధాకర్‌ ఫలిస్తున్న సీఎం జగన్‌ కృషి ఉద్యాన హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.800 కోట్ల బకాయిలను చెల్లించడమే కాకుండా ఐదేళ్లలో రూ.2,670 కోట్ల సబ్సిడీ చెల్లించాం. 7.33 లక్షల ఎకరాలకు విస్తరించగలిగాం.    –కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి 30 ఏళ్ల తర్వాత మళ్లీ వ్యవసాయం..పోళ్లోపల్లికి చెందిన రైతు ఆనాల నరసింహులు 1989లో వ్యవసాయం భారమై బతుకుదెరువు కోసం కువైట్‌ వెళ్లాడు. అక్కడ పడరాని పాట్లు పడి, సరైన సంపాదన లేక కుంగిపోయాడు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక సూక్ష్మసేద్యంతో రైతులు లాభాలార్జిస్తున్నారని తెలిసి, నాలుగేళ్ల క్రితం గ్రామానికి తిరిగొచ్చి రెండెకరాల్లో నిమ్మ, 1.5 ఎకరాల్లో చీనీ వేశారు. నిమ్మ కాపు ప్రారంభమైన రెండేళ్లలోనే రూ.2.50 లక్షల ఆదాయం వచి్చంది.డ్రిప్‌ కోసం 2022లో ఆర్బీకేలో దరఖాస్తు చేసుకుంటే, సిఫార్సులతో పని లేకుండా 90 శాతం సబ్సిడీపై 3.5 ఎకరాల్లో రూ.62,934 విలువైన పరికరాలను అమర్చారు. పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్, డ్రిప్‌ ఇరిగేషన్‌తో సాగు సాఫీగా సాగుతోంది. కువైట్‌కు తిరిగి వెళ్లాలన్న ఆలోచన విరమించుకుని 30 ఏళ్ల తర్వాత మళ్లీ వ్యవసాయం చేపట్టిన నరసింహులు లాభాలు గడిస్తున్నారు. రైతు భరోసా, సున్నావడ్డీ, ఆసరా, జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన లాంటి పథకాల ద్వారా ఆయన కుటుంబం లబ్ధి పొందింది. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేయగా, కొడుకును కార్పొరేట్‌ కళాశాలలో చదివిస్తున్నట్లు ఎంతో ఆనందంగా చెప్పారాయన 

Jagan Mohan Reddy is implementing the Navaratnalu Scheme in AP
సర్కారు ఊతంతో పూల బాట

నవరత్నాల పేరుతో రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగు రేఖలు నింపుతు న్నాయి. లక్షలాది మంది జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి.  తిరుపతి జీవకోనలోని రాఘవేంద్ర నగర్‌కు చెందిన వెంకటేష్, మునీశ్వరి కుటుంబమే ఇందుకు నిదర్శనం  వెంకటేష్‌ 2019కి ముందు భవన నిర్మాణ సెంట్రింగ్‌ కార్మికుడిగా పనిచేస్తూ చాలీ చాలని ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తుండేవారు. పని దొరికిన రోజు వచ్చే  కూలి రూ.400తో ఆ కుటుంబంలోని ఆరుగురు జీవించాల్సి వచ్చేది. ఆయన భార్య మునీశ్వరి గృహిణి. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ముగ్గురు పిల్లలను చదివించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు. గత ప్రభుత్వంలో రేషన్‌ కార్డు తప్ప ఎలాంటి పథకాలు అందలేదు. మునీశ్వరి అత్తమ్మకు పింఛన్‌ కూడా వచ్చేది కాదు. జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్లరిగే లా తిరిగినా ఫలితం లేకపోయింది. పిల్లలను చది వించగలమా అనే బెంగతో ఉండేవారు. 2019లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త ప్రవేశపెట్టిన నవరత్నాలతో ఆ కుటుంబానికి భరోసా లభించింది.  వైఎస్‌ఆర్‌ ఆసరా, జగనన్న తోడు, ముగ్గురు పిల్లలకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌­మెంట్, అమ్మ ఒడి, కుటుంబంలోని మునీశ్వరి అత్తమ్మకు వృద్ధాప్య పింఛన్‌ లభిస్తోంది. ప్రస్తుతం ఒక కుమార్తె ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది, మరో కుమార్తె డిగ్రీ పూర్తి చేసింది. వీరిద్ధరూ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కూలిపని మానేసి చెన్నై నుంచి ముడిసరుకు తెప్పించుకుని  గృహాలకు ప్లాస్టిక్‌ పూల తోరణాలు, దేవుని చిత్రపటాలకు అవసరమైన పలు రకాల రంగులతో మాలలు, ప్లాస్టిక్‌ పూలతో షోకేజ్‌ డెకరేషన్‌ బొకేలు తయారు చేస్తూ మరో ఆరు మంది మహిళలకు ఉపాధి కబ్ధి స్తున్నారు.     –తిరుపతి సిటీ\తలసరి ఆదాయం పెరిగింది గతంలో నిరుపేద మహిళలు కూలి పనులు చేసుకుంటూ లేదా ఇళ్లల్లో   పనిచేసుకుంటూ   కుటుంబా­న్ని పోషించేవారు.   పిల్లలను చదివించలేక పోవడంతో వారు షాపుల్లో పనులు చేసుకుంటూ మంచి భవిష్యత్తు కోల్పోయి జీవితాలను సర్వనాశనం చేసుకునేవారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నవరత్నాలు పేదల పాలిట వరాలుగా మారాయి.  వారి జీవన ప్రమాణాలు పెరిగాయి. తలసరి ఆదాయం పెరిగింది. ఇది కాదనలేని నిజం.   అమ్మ ఒడి, ఫీజురియింబర్స్‌మెంట్, విద్యాదీవెన, వసతి దీవెనతో పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు.    –జి సవరయ్య, రిటైర్డ్‌ ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌ ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతివైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మునీశ్వరి కుటుంబానికి కలిగిన లబ్ధి వైఎస్సార్‌ ఆసరా    రూ.68,000 వైఎస్సార్‌ చేయూత    రూ.75,000 జగనన్న విద్యాదీవెన    రూ.28,000 వసతి దీవెన    రూ.20,000 అమ్మ ఒడి    రూ.30,000 సున్న వడ్డీ    రూ.2,250 పింఛన్‌ కానుక    రూ.96,000 మొత్తం    రూ.3,19,250 

Kona Venkat Exclusive Interview With Sakshi
జగన్‌ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం

ఊరూరా కళ్లెదుటే మార్పు ‘ప్రభుత్వ ఆస్పత్రులు బాగుండవని చాలా మంది అనుకుంటారు. మా బాపట్ల ప్రభుత్వాస్పత్రిని చూస్తే ఆ ఆలోచన కచ్చితంగా మారిపోతుంది. ఆపరేషన్‌ థియేటర్స్‌లో కూడా అత్యాధునిక ఎక్విప్‌మెంట్, అప్పుడే పుట్టిన చిన్నారుల కోసం ఇన్ఫాంట్‌ స్పెషల్‌ ఐసీయూ, సొంత ఆక్సిజన్‌ ప్లాంట్‌ కూడా ఏర్పాటు చేశారు. నాకు తెలిసి ఆ సౌకర్యం చాలా ప్రైవేటు ఆస్పత్రులకు ఇప్పటికీ లేదు’ అంటున్నారు సినీ దర్శకుడు, రచయిత కోన వెంకట్‌. చిన్న చిన్న గ్రామాల్లో కూడా హెల్త్‌ క్లినిక్స్, రూపురేఖలు మారిపోయిన పాఠశాలలు, డిజిటల్‌ బోధన కళ్లెదుటే కనిపిస్తోందని స్పష్టం చేస్తున్నారు. కళ్లెదుటే ఇంత మార్పునకు కారణం ముమ్మాటికీ సీఎం జగనే అని నొక్కి చెబుతున్నారు.  ‘చెడు త్వరగా ప్రచారంలోకి వస్తుంది. అది వినడానికి కూడా ఎక్కువ మంది ఇష్టపడతారు. మంచి చెబితే ఏదో ఆశించి భజన చేస్తున్నాం అంటారు. అంటే అనుకోనీయండి. కానీ నిజం చెప్పకపోవడం అంటే అబద్ధాన్ని ప్రోత్సహించడమే అని నా అభిప్రాయం. అందుకే నేను నిజాలు చెబుతున్నాను’ అంటున్నారు సినీ దర్శక, రచయిత కోన వెంకట్‌. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా పరిశీలించి, వాటి గురించి ససాక్ష్యంగా వరుసగా ట్వీట్స్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షితో ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..    –సత్యార్థ్‌  బాపట్ల జిల్లా కర్రపాలెం మండలంలోని మారుమూల గణపవరం అనే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించా. అక్కడి పిల్లలతో కలిసి నిమ్మకాయ పులిహోర తిన్నా. రాగిజావ తాగా. ఉచితం అంటే ఎలా ఉంటాయో అని మనం అనుకుంటాం. కానీ మన అంచనాలన్నీ తప్పని అక్కడ ఆహారం తిన్నాక స్పష్టమైంది. అక్కడి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వడ్డించే పదార్థాలు ఎంతో రుచికరంగా ఉన్నాయి. అంతేకాదు ట్యాబ్స్, స్కూల్‌ బ్యాగ్స్, యూనిఫామ్స్, షూ, సాక్స్‌... అన్నీ నాణ్యమైనవే ఇచ్చారు. పాఠశాల వాతావరణం బాగుంటే సానుకూల ఫలితాలు వస్తాయి కదా... అదే ఇప్పుడు కనిపిస్తోంది. మేం చదువుకున్నప్పుడు ఇలాంటి వసతులు, సౌకర్యాలు ఉంటే మరింత బాగా రాణించేవాళ్లం కదా అనిపించింది. టీచర్లు, సిబ్బంది కూడా కొత్త ఉత్సాహంతో కనిపించారు. నాకు ఎంత ఆనందం కలిగిందంటే అప్పటికప్పుడు ఆ టీచర్లు అందరికీ శాలువాలు తెప్పించి సన్మానించాను. పల్లెలకు చికిత్స ప్రభుత్వ ఆస్పత్రులు.. అదీ మారుమూల గ్రామంలో ఎలా ఉంటాయో అనే దానిపై మనం ఒక మైండ్‌ సెట్‌తో ఉంటాం. అయితే మా బాపట్ల ప్రభుత్వాస్పత్రిని చూస్తే ఆ ఆలోచన కచ్చితంగా మారిపోతుంది. ఆపరేషన్‌ థియేటర్స్‌లో కూడా అత్యాధునిక ఎక్విప్‌మెంట్, అప్పుడే పుట్టిన చిన్నారుల కోసం ఇన్ఫాంట్‌ స్పెషల్‌ ఐసీయూ. అంతేకాదు.. సొంత ఆక్సిజన్‌ ప్లాంట్‌ కూడా ఏర్పాటు చేశారు. నాకు తెలిసి ఆ సౌకర్యం చాలా ప్రైవేటు ఆస్పత్రులకు ఇప్పటికీ లేదు. నేను వచ్చింది ప్రభుత్వ ఆస్పత్రికా, లేక కార్పొరేట్‌ ఆస్పత్రికా అన్న ఆశ్చర్యం కలిగింది. కొన్నేళ్ల క్రితం వరకూ గర్భిణులు సైతం డెలివరీల కోసం చీరాల, తెనాలి అంటూ పొరుగూళ్లకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడిక ఆ సమస్య లేదు. ఇక మరో మారుమూల ఉన్న కొత్త నందాయపాలెం అనే చిన్న గ్రామంలో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ చూశా. అదీ అద్భుతం అనే చెప్పాలి. ఆ హెల్త్‌ క్లినిక్‌లో ల్యాబ్‌ కూడా పెట్టారు. అక్కడికక్కడ రక్త పరీక్షలు, బీపీ, షుగర్‌ టెస్ట్‌లు చేస్తూ మందులు ఇస్తున్నారు. అక్కడ సేవలందించే డాక్టర్స్‌ విశ్రాంతి తీసుకోవడానికి క్వార్టర్స్‌ కూడా ఏర్పాటు చేశారంటే ఎంత పక్కా ప్రణాళికతో ఈ విలేజ్‌ క్లినిక్స్‌ని డిజైన్‌ చేశారో ఆలోచించండి. నా కళ్లు నేనే నమ్మలేనంత గొప్పగా ఇళ్లు పేదలకిచ్చిన ఇళ్లను గమనించడానికి మాకు సమీపంలో ఉన్న జగనన్న కాలనీలను సందర్శించా. చెబుతుంటే అతిశయోక్తిలా ఉంటుందేమో. హైదరాబాద్‌లోని గచ్చి»ౌలిలో ఉన్న విల్లా కమ్యూనిటీలాగా అనిపించింది. అది కూడా ఎక్కడో ఊరికి దూరంగా విసిరేసినట్టు కట్టిన కాలనీ కాదు. బాపట్ల ఎంట్రన్స్‌లో హైవే పక్కనే కట్టించి ఇచ్చారు. కేవలం ఇళ్లు ఇవ్వడమే కాదు చక్కగా, పరిశుభ్రంగా అన్ని వసతులతో నిర్వహిస్తున్నారు. అక్కడ తాపీ పనిచేసే ఒక ముస్లిం కుటుంబంతో పాటు అనేక మందితో ముచ్చటించినప్పుడు వాళ్ల కళ్లల్లోని ఆనందాన్ని చూస్తే పేదలకు ఇంతకన్నా మేలు చేసే ప్రభుత్వం ఉంటుందా? అనిపించింది. ఎందుకంటే వాళ్ల జీవితంలో ఇలాంటి ఇళ్లు కట్టుకోవడం అసాధ్యం. నాకు కూడా అలాంటి చోట ఒక ఇల్లు ఉంటే బాగుండు అన్నంత బాగుంది. రోడ్లపై జరుగుతోంది దు్రష్పచారమే...రహదారుల విషయంలో కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం జరుగుతోంది. దీనిని నిర్ధారించుకోవడానికి నేను మా ఊరి చుట్టుపక్కల రహదారుల్ని సర్వే చేశాను. అదంతా అబద్ధమేనని తేలింది. మీరు నమ్ముతారా? మా బాపట్లకి అవుటర్‌ రింగ్‌ రోడ్‌ కూడా ఉంది. ఇక గ్రామ సెక్రటేరియట్స్, రైతు భరోసా కేంద్రాలు కూడా త్వరలో సందర్శిస్తాను. ఆం«ధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మంచిని కనపడనీయకుండా, వినపడనీయకుండా చేయాలనే ఆలోచనతో విపక్షాలు, జగన్‌ శత్రువులు కుట్ర చేస్తున్నారు. నేను రాష్ట్రం మంచి కోరుకునే ఆంధ్రప్రదేశ్‌ పౌరుడ్ని. వృత్తి, వ్యాపకాల రీత్యా నేనెక్కడ స్థిరపడినా నా ఊరు బాగుపడుతుంటే ఆ ఊరంటే ప్రేమ ఉన్న నేనెందుకు గర్వంగా చెప్పుకోకూడదు? ఎవరేమనుకున్నా సరే.. నాకు కనపడిన మంచిని ప్రజలతో పంచుకుంటా. చిత్తశుద్ధి ఉన్న సీఎం గెలవాలి... వైఎస్సార్‌సీపీయా... బీజేపీయా... కాదు. పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉన్న జగన్‌ లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఆయనకు ఆ అవసరం లేకపోవచ్చు. నాన్న వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని తప్ప మరో కోరిక ఉండకపోవచ్చు. కానీ ఆయన సీఎంగా ఉండడం, మళ్లీ గెలవడం ఈ రాష్ట్రానికి... ముఖ్యంగా పేదలకు అవసరం. ఇలాంటి పాలన నిజంగా పేదలకు ఓ వరం.  

List of star campaigners for Election Commission with 12 commoners
సామాన్యులే స్టార్‌ క్యాంపెయినర్లు

సాక్షి, అమరావతి: స్టార్‌ క్యాంపెయినర్లు.. ప్రతి పార్టీలోనూ ప్రముఖ నాయ­కులు వీళ్లు.. సభలకు వ­స్తారు.. చేతులూపుతారు.. ఏదేదో చెప్పే­స్తారు.. వారి పార్టీ వారికి ఓటేయమని కోరుతూ ఓ దండం పెట్టేసి హెలికాప్టరో, విమానమో ఎక్కేసి వెళ్లిపోతారు. కానీ,  జగన్‌ నేతృత్వంలోని ప్రజల పార్టీ అయిన వైఎస్సార్‌సీపీకి స్టార్లు, స్టార్‌ క్యాంపెయినర్లు కూడా సామాన్య ప్రజలే.  జగన్‌ ప్రభుత్వం అందించిన చేయూతతో అభివృద్ధి సాధించి, కుటుంబ జీవన ప్రమాణాలను పెంచుకున్న సాధారణ ప్రజలే. చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా ఈ సామాన్యులే స్టార్‌ క్యాంపెయినర్లుగా  వైఎస్సార్‌సీపీ ఎన్నికల సమారానికి సిద్ధమైంది.ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారే తన స్టార్‌ క్యాంపెయినర్‌లంటూ సీఎం జగన్‌ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. దీనినే కార్యరూపంలోకి తెస్తూ దేశంలో ఏ పార్టీ కనీసం ఆలోచన కూడా చేయలేని సాహసోపేత నిర్ణయం తీసుకుని, వైఎస్సార్‌సీపీ 12 మంది సామాన్యులతో తన రాష్ట్రస్థాయి స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ఎన్నికల కమిషన్‌కు అందజేసింది. వీరంతా జిల్లా, నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవుతారు.  సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయాన్ని వీరు సందర్శించారు. సీఎం వైఎస్‌ జగన్‌కు స్టార్‌ క్యాంపెనర్‌లుగా ఏ విధంగా మారారో వారిలో కొందరు వివరించారు.  50 ఇళ్లకు నేనే ఎమ్మెల్యేగా పనిచేశా ఈ ప్రభుత్వంలో వలంటీర్‌గా పనిచేశా. నా 50 ఇళ్లకు నేనే ఎమ్మెల్యే అన్నట్లు పనిచేశా. ప్రతి ఇంటికి వారికి ఏ పథకాలు అందాలో వాటన్నింటినీ పక్కాగా అందించాం. అదే ఊరికి చెందిన నాకు ఆ కటుంబాలు గతంలో ఎలా ఉండేవి, నవరత్నాలతో ఆర్థిక భరోసా అందిన తరువాత ఎలా మారాయో నాకు స్పష్టంగా కనిపించింది. ఈ ఐదేళ్లలో నిజమైన అభివృద్ధిని చూశా. ఆర్థిక కారణాలతో పిల్లలను చదువించుకోలేని ప్రతి కుటుంబానికీ సీఎం వైఎస్‌ జగన్‌ అండగా నిలిచారు. భర్త సంపాదన మీద మాత్రమే బతికే ప్రతి అక్కకు, చెల్లెమ్మకు సీఎం జగనన్న అండగా నిలిచి ఆర్థిక భరోసా కల్పించారు. ఏదో ఒక చిరు వ్యాపారం చేసుకునేలా తీర్చిదిద్దారు. ఈ ప్రభుత్వం మహిళలను నిజమైన ఇంటి యజమానిని చేసింది. నా క్లస్టర్‌లోని సగం కుటుంబాలు స్థానికంగా, పక్కనే ఉన్న పట్టణాల్లో సొంత వ్యాపారాలు ప్రారంభించాయి. తద్వారా ప్రతిరోజూ రూ. 1,000 వరకు సంపాదించుకుంటున్నాయి. వారి జీవితాల్లో చాలా మార్పు వచి్చంది.  ఒక తల్లిగా ఆలోచిస్తే మా పిల్లలకు అవసరమైన చదువులు, అవసరాలు అన్నీ పాఠశాలల్లో లభిస్తున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర భవిష్యత్తును మారుస్తున్న నాయకుడని నేను నమ్ముతున్నాను. – ఈశ్వరి, కొండపల్లి, ఎన్టీఆర్‌ జిల్లాసీఎం జగన్‌ చలవతో నా కుమారుడు అమెరికాలో చదువుతున్నాడు నాకు ఇద్దరు కుమా­రులు. పెద్దబ్బాయి కిషోర్‌ డిగ్రీ పూర్తి చేసి డిల్లీలోని మారుతి సుజుకీలో ఉద్యోగం చేసే­వాడు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్‌ ఇన్‌ పొలిటికల్‌ అఫైర్స్‌లో సీటు సంపాదించాడు. కోర్సు ఫీజు రూ.1.36 కోట్లు అవుతుందన్నారు. ఈ మాట నాకు చెప్పగానే కనీసం రూ. లక్ష అయినా మనం కట్టలేం.. మంచి ఉద్యోగం చూసుకో అని చెప్పా. ఆ తరువాత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో విదేశీ విద్య పథకం గురించి తెలుసుకుని దరఖాస్తు చేశాం.నా కొడుకు చదువుకు కావాల్సిన డబ్బు విదేశీ విద్య కింద మంజూరైంది. ఇప్పటికే రెండు సెమిస్టర్లు పూర్తి చేసిన నా కుమారుడికి రెండు దఫాలుగా రూ. 50 లక్షలు అందింది. ఇది చూసిన నాకు లక్ష రూపాయలు కట్టలేని నా కుమారుడు ఇంత పెద్ద మొత్తం ఫీజుతో విదేశీ విశ్వవిద్యాలయంలో చదవగలుగుతున్నాడని గర్వంగా అనిపించింది. ఒక్క నా కుమారుడే కాదు.. ఇలా చాలా మంది పేదల పిల్లలు విదేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఉన్నత విద్య చదువుతున్నారు. ఇదంతా సీఎం వైఎస్‌ జగన్‌ చలవే. అందుకే సీఎం జగన్‌ కోసం స్టార్‌ క్యాంపెయినర్‌ అయ్యాను.       – పండలనేని శివప్రసాద్, మోపిదేవి మండలం, కృష్ణా జిల్లాసీఎం జగన్‌ ఆలోచనలకు సంపూర్ణ మద్దతు జగనన్న చేదోడు అందుకున్న మా ఇంటి పక్కనే నివాసం ఉండే శారద బట్టల షాపు ఏర్పాటు చేసుకుని కుటుంబానికి అండగా నిలుస్తోంది. దాసరి మహాలక్ష్మి అనే మహిళకు భర్త మరణిస్తే రూ. 2 లక్షల బీమా అందింది. దీంతోపాటు పెన్షన్, ఆసరా, అమ్మఒడి పథకాలూ అందుతున్నాయి. మాది కూడా నిరుపేద కుటుంబం. జగననన్న ప్రభుత్వంలో అందిన నవరత్నాలతో రోజు గడవడమే కష్టంగా ఉండే దుస్థితి నుంచి నిలకడ ఆదాయం అందుకునే స్థితికి వచి్చంది. మా కుటుంబాలను ఆర్థికంగా నిలబడేలా ఆదుకున్న ప్రభుత్వానికి మేమెందుకు అండగా నిలవకూడదు? పేదలను పేదరికం నుంచి తప్పించి మెరుగైన జీవితం కల్పించాలనే సీఎం జగన్‌ ఆలోచనకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. అందుకే సీఎం జగన్‌ కోసం స్టార్‌ క్యాంపెయినర్‌గా పనిచేసేందుకు ముందుకు వచ్చా.      – ఎ. అనంతలక్ష్మి, రాజమండ్రి సిటీ నియోజకవర్గం, తూర్పు గోదావరి జిల్లాప్రభుత్వ పాఠశాలల్ని చూస్తే తేడా తెలుస్తుంది సీఎం జగన్‌ పరిపాలన ఏమిటో చెప్పేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలే ఉదాహరణ. నేను డిగ్రీ పూర్తి చేసి ఐదేళ్లే అయ్యింది. మేం చదువుకునే సమయంలో ప్రభుత్వ పాఠశాలలి్న, ఇప్పడు నాడు – నేడు కింద పూర్తిగా మారిన ప్రభుత్వ పాఠశాలలను చూస్తే తేడా అర్ధమవుతుంది. అప్పటి ప్రభుత్వ పాఠశాలలు తలుపులు లేక గేట్లు లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేవి. కనీసం బాలికలకు టాయిలెట్లు కూడా లేని దుస్థితి. ఇలాంటి స్కూళ్లలో బాలికల విద్య ఎలా ఉంటుందో మనం ఒక్కసారి ఆలోచిస్తే అర్ధమ­వుతుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే అంతర్జాతీయ స్థాయి. సకల సౌకర్యాలు, డిజిటల్‌ క్లాస్‌ రూంలు, ట్యాబ్‌లతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్యను బోధిస్తున్నారు. మరో పదేళ్లలో ఈ ప్రభుత్వ పాఠశాలల నుంచి బయటికి వచ్చే వారితో రాష్ట్రం మరో ఎత్తుకు ఎదుగుతుంది. ఇంగ్లిష్‌ చదువులతో  కొన్ని లక్షల కుటుంబాల తలరాత మారిపోతుంది. సీఎం జగన్‌ ప్రభుత్వాన్ని ప్రతి గ్రామానికి తీసుకొచ్చారు.  వీటన్నింటినీ ప్రజలకు వివరిస్తాను.      – అన్వర్, నెల్లూరు జిల్లాఒక అడుగు ముందుకు వేశాం ద్విచక్ర వాహనాలకు సీట్‌ కవర్లు కుట్టే ఒక చిన్న షాపు నాది. రోడ్డు పక్కన పెట్టుకున్నాను. నాకు ముగ్గురు పిల్లలు. నా రోజువారీ సంపాదన కుటుంబ పోషణకే సరిపోతుంది. పిల్లలను బాగా చదివించాలని ఆశ ఉన్నా చదివించే ఆర్థిక స్థోమత లేదు. 2019లో సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇంజనీరింగ్‌లో చేరిన నా కొడుకుకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాలతో ఆదుకున్నారు. నా కుమారుడు బాగా చదువుకున్నాడు. రెండో కొడుకు కూడా ఫీజు రియింబర్స్‌మెంట్‌ డబ్బుతో డిగ్రీ చదువుతున్నాడు. మూడో కొడుకుకి అమ్మఒడి అందుతోంది. నా సంపాదన అరకొరే అయినా, నా పిల్లల చదువు ఏ ఆటంకం లేకుండా సాగుతోంది. పెద్ద కొడుకు ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగం సాధించాడు. సీఎం జగన్‌ ఇచ్చిన ఒక్క పథకం కింద చదువుకున్న నా కొడుకు నా కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చాడు. మేము సమాజంలో ఒక అడుగు ముందుకు వేసినట్లైంది. ఇలాంటి వేలాది పేదింటి పిల్లలకు సీఎం జగన్‌ చదువులు చెప్పిస్తున్నారు.      – కటారి జగదీష్ , మల్లవీధి, అనకాపల్లి

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement