Top Stories
ప్రధాన వార్తలు
21 రోజుల నిరీక్షణ.. ఉత్కంఠకు నేడే తెర
సాక్షి, అమరావతి: ఓటర్ల తీర్పు వెల్లడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై గత 21 రోజులుగా రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తం అయిన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే విడుదలైన మెజార్టీ సర్వేల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైఎస్సార్సీపీ రెండోసారి అధికారం చేపట్టనుందని తేల్చాయి. గత నెల 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించడం, శనివారంతో చివరి దశ పోలింగ్ ముగియడంతో ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సి వచ్చింది. నేటి మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వస్తుంది. అయితే ఈవీఎం కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ, ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్లలోని స్లిప్లను కూడా చివర్లో లెక్కించాల్సి ఉంటుంది. అందువల్ల అధికారికంగా ఫలితాల ప్రకటనకు కొంత జాప్యం అవుతుంది.తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురంరాష్ట్రంలో మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇందులో ఈవీఎంల ద్వారా 3.33 కోట్ల మంది, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 5.15 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, వృద్ధులు అ్యధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా రికార్డు స్థాయలో 81.8 శాతం ఓటింగ్ నమోదైంది. 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది, 25 లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఓట్ల లెక్కింపు కోసం 33 చోట్ల 401 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ తర్వాత కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు చేటు చేసుకోవడంతో, ఓట్ల లెక్కింపు సందర్భంగా అటువంటి సంఘటలను పునరావృతం కాకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు 111 అసెంబ్లీ స్థానాల్లో 5 – 6 గంటల్లోనే పూర్తి కానుంది. 61 నియోజకవర్గాల్లో 6 – 8 గంటలు, మూడు నియోజకవర్గాల్లో 9 – 10 గంటల సమయం పట్టనుంది. పార్లమెంటు ఫలితాలకు సంబంధించి 13 రౌండ్లు ఉన్న రాజమండ్రి, నరసాపురం ఫలితాలు తొలుత వెల్లడి కానుండగా, 27 రౌండ్ల లెక్కింపు ఉన్న అమలాపురం ఫలితం ఆలస్యంగా రానుంది. అసెంబ్లీ విషయానికి వస్తే కేవలం అయిదు గంటలలోపే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నరసాపురం ఫలితాలు.. ఆలస్యంగా భీమిలి, పాణ్యం ఫలితాలు వెల్లడి కానున్నాయి.ఒంటరిగా సిద్ధంవైఎస్సార్సీపీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీలతో జట్టు కట్టి కూటమిగా పోటీలో నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధం పేరుతో ముందస్తుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోగా, తెలుగుదేశం పార్టీ సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికపై సిగపట్లు పడుతూ ప్రచారంలో వెనుకబడ్డారు. టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో, భారతీయ జనతాపార్టీ ఆరు పార్లమెంటు, 10 అసెంబ్లీ.. జనసేన రెండు పార్లమెంటు, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడుతున్నాయి. వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాల్లో సామాన్యులను అభ్యర్థులుగా నిలబెట్టగా, తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకొని తమ పార్టీకి చెందిన అభ్యర్థులను బీజేపీ, జనసేనల్లోకి పంపి అభ్యర్థులుగా నిలబెట్టింది.ఫలితాలు ఇలా తెలుసుకోవచ్చు..ఎన్నికల సరళిని, ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియచేసేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. లెక్కింపులో ఒక రౌండు పూర్తి కాగానే ఆ ఫలితాలను కౌంటింగ్ సెంటర్ వద్ద మైక్లో వెల్లడించడంతో పాటు, మీడియా ప్రతినిధులకు కనపడే విధంగా డిస్ప్లే బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. ప్రతి రౌండు ఫలితాలను సువిధా యాప్లో అప్లోడ్ చేయనున్నారు. నియోజకవర్గ ఫలితాలతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఫలితాలను తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను, యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. https://results.eci.gov.in వెబ్సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీంతోపాటు ‘ఓటర్స్ హెల్ప్¬లైన్’ అనే యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఎన్నికల ఫలితాల సరళిని తెలుసుకోవచ్చు. 25,209 మంది సిబ్బంది : ముఖేష్ కుమార్ మీనారాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో 2,387 మంది, 25 పార్లమెంటు స్థానాల్లో 454 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కోసం 25,209 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపును పర్యవేక్షించడానికి 119 మంది కేంద్ర అబ్జర్వర్లు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నారన్నారు. పార్లమెంటు స్థానాలకు తొలుత 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభించి, 8.30 తర్వాత ఈవీంఎల లెక్కింపును కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లో డిక్లరేషన్ ఫారంపై రిటర్నింగ్ అధికారి నియమించిన అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే సరిపోతుందని, దీనిపై ఇక ఎటువంటి అభ్యంతరాలను అనుమతించమని స్పష్టం చేశారు. ఈసారి అత్యధిక సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లు నమోదు కావడంతో 25 చోట్ల నాలుగు రౌండ్లు కూడా లెక్కింపు జరగనుందన్నారు. ప్రతి 500 ఓట్లు ఒక రౌండ్గా లెక్కిస్తామని, ఇది సుదీర్ఘ పక్రియ కావడంతో ఒకొక్క రౌండ్ పూర్తి కావడానికి కనీసం రెండున్నర గంటల సమయం పడుతుందని చెప్పారు. అదే ఈవీఎంల లెక్కింపులో ప్రతి రౌండు సగటున 25 నిమిషాల నుంచి 30 నిమిషాల్లో పూర్తవుతుందన్నారు. లెక్కింపు ప్రారంభమైన అయిదు గంటల్లోనే మెజార్టీ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడవుతాయని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 45,000 పోలీసు సిబ్బందితో పాటు 67 కంపెనీల సాయుధ బలగాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా పెట్టామని, లోపల ఈవీఎంల తరలింపు నుంచి ఓట్ల లెక్కింపు మొత్తం వీడియో చిత్రీకరణ చేస్తామన్నారు. ఏజెంట్లు తమ అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని, దురుసుగా వ్యవహరిస్తే ఎన్నికల నిబంధన 54 కింద కౌంటింగ్ హాల్ నుంచి బయటకు పంపిస్తామని స్పష్టం చేశారు. రీ కౌంటింగ్ కోరితే దానికి గల స్పష్టమైన కారణాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలన్నారు. ఆ కారణాలతో ఆర్వో ఏకిభవిస్తేనే రీ కౌంటింగ్కు అనుమతిస్తారని చెప్పారు. కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లను అనుమతించరని స్పష్టం చేశారు. కౌంటింగ్ తర్వాత అభ్యర్థి గెలిచినట్లు ఫారం 20 ఇవ్వడానికి కనీసం గంట– గంటన్నర పడుతుందని, అప్పటి వరకు అభ్యర్థి వేచి ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం మద్యం అమ్మకాలపై నిషేధం విధించామని తెలిపారు.
లోక్సభ ఓట్ల లెక్కింపుపై ‘డబుల్’ ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ఫలితాల వేళ తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ జరిగిన 22 రోజుల తర్వాత జరుగుతున్న ఓట్ల లెక్కింపు కో సం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు ఎదురుచూస్తున్నాయి. పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ను బ ట్టి.. రాష్ట్రంలో పోటీ రెండు జాతీయ పార్టీల మధ్యే జరిగిందన్న అంచనాలు వెలువడ్డాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడా మెజార్టీ సీట్లు త మకంటే తమకేనని.. డబుల్ డిజిట్ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కచ్చితంగా పది స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్.. పది కంటే ఎక్కువే గెలుస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో గెలుస్తామన్న దానిపై క చ్చితమైన లెక్కలు చెప్పకపోయినా.. కనీస స్థానా ల్లో విజయం దక్కుతుందని ఆశిస్తోంది. మరోవైపు జాతీయ స్థాయిలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోందన్న దానిపైనా రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. 12 సీట్లు కూడా రావొచ్చంటున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ.. లోక్సభ ఎన్నికల్లోనూ సానుకూల ఫలితాలు వస్తాయనే అంచనాలో ఉంది. కనీసం తొమ్మిది, పది స్థానాల్లో గెలుస్తామన్న ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. పోలింగ్ సరళిని బట్టి చూస్తే మరో రెండు, మూడు సీట్లు కూడా గెలుస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, భువనగిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్తోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పూర్తి పట్టు సాధించిన వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకేనని అంటున్నారు. సికింద్రాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లోనూ విజయం సాధిస్తామని లెక్కలు వేస్తున్నారు. చేవెళ్ల, మల్కాజ్గిరి, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురైనా.. విజయ తీరం చేరుతామనే అంచనాలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బలహీనపడటం, బీజేపీకి సంస్థాగత బలం లేకపోవడం, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్నికలు రావడంతో పెద్దగా ప్రజా వ్యతిరేకత లేకపోవడం, గ్రామీణ స్థాయిలో పార్టీకి ఉన్న పట్టు వంటివి అనుకూలిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ మేజిక్తో బీజేపీదే హవా అంటున్న కమలనాథులు మోదీ మేజిక్తో తెలంగాణలోనూ బీజేపీ హవా కొనసాగుతుందని ఆ పార్టీ ముఖ్య నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు గెలిచి సత్తా చాటుతామని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్లో వెలువడిన అంచనాలను మించి సీట్లు సాధిస్తామని చెబుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన నాలుగు ఎంపీ సీట్లకు అదనంగా మరో ఆరేడు సీట్లు గెలుస్తామని అంటున్నారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలే ప్రభావం చూపాయని కమలనాథులు చెబుతున్నారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందనే అంచనాలు తమకు ఉపకరించాయని.. ఈ ఎఫెక్ట్తో పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయని అంచనా వేస్తున్నారు. ఎగ్జాక్ట్ పోల్స్ తమకే అనుకూలమంటూ బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్తో సంబంధం లేకుండా ఎగ్జాక్ట్ పోల్స్ ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని బీఆర్ఎస్ అంటోంది. బీఆర్ఎస్ ఒకట్రెండు స్థానాలకు మించి గెలిచే అవకాశం లేదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నా.. బీఆర్ఎస్ మాత్రం అంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎనిమిది లోక్సభ సెగ్మెంట్ల పరిధిలో బీఆర్ఎస్ ఆధిక్యత కనబర్చిందని.. అదే తరహాలో ఇప్పుడు ఫలితాలు ఉంటాయని అంచనా వేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఇప్పుడు కాంగ్రెస్ అనుకూల ఓటింగ్ జరగలేదని.. అదే సమయంలో బీజేపీ భారీగా ఏమీ పుంజుకోలేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్తో పోలిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకుకే ఎక్కువగా గండి పడిందని పేర్కొంటున్నారు. అంతేగాకుండా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ 17 రోజుల పాటు చేసిన బస్సుయాత్ర కూడా ప్రభావం చూపిందని.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటేసినవారిలో కొంత మేర తిరిగి అనుకూలంగా మారారని చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీతో జరిగిన ముక్కోణపు పోటీ బీఆర్ఎస్కు అక్కడక్కడా అనుకూలిస్తుందనే అంచనా వేస్తున్నారు.ఢిల్లీ పీఠం ఎవరిదో..?లోక్సభ ఎన్నికల్లో జాతీయ స్థాయి ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఈసారి కూడా మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడం ఓవైపు.. ఎగ్జిట్ పోల్స్ ఫెయిలవుతాయని, ఇండియా కూటమి గెలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేసిన కామెంట్స్ మరోవైపు ఉత్కంఠ రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా మోదీ ప్రభావం ఎలా ఉంటుంది?ఇండియా కూటమికి ఉన్న సానుకూలతలేంటి? ఏ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశాలపై చర్చ జరుగుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపైనా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఎడతెగని చర్చ నడుస్తోంది.ఆ స్థానాలపై మరింత ఆసక్తితెలంగాణలోని నాలుగైదు నియోజకవర్గాల్లో ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యరి్థగా బరిలోకి దిగిన దానం నాగేందర్ తలపడుతున్న సికింద్రాబాద్ ఫలితంపై అందరి ఫోకస్ ఉంది. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి.. ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి అయ్యే చాన్స్ ఉందంటున్న బండి సంజయ్ బరిలో ఉన్న కరీంనగర్.. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నేతలు పోటీ చేస్తున్న జహీరాబాద్, నాగర్కర్నూల్, వరంగల్ తదితర స్థానాల్లో ఫలితాలపైనా ఆసక్తి ఉంది.
Lok Sabha Results 2024: టిక్.. టిక్.. టిక్ మోదీ 3.0నా, ఇండియా కూటమా?
న్యూఢిల్లీ: దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణాలు రానేవచ్చాయి. 80 రోజులకు పైగా ఏడు విడతల్లో సాగిన సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల క్రతువు తుది దశకు చేరింది. మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా నెహ్రూ రికార్డును సమం చేస్తారా? లేదంటే కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి అనూహ్యమేమైనా చేసి చూపించనుందా? సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న ఈ ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం లభించనుంది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏకగ్రీవమైన సూరత్ మినహా 542 లోక్సభ స్థానాలు, ఏపీలో 175, ఒడిశాలో 147 అసెంబ్లీ స్థానాల్లో విజేతలెవరో తేలనుంది. కౌంటింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. మధ్యాహా్ననికల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఎన్డీఏ హ్యాట్రిక్ ఖాయమని శనివారం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ ముక్త కంఠంతో పేర్కొనడం, విపక్ష కూటమి వాటిని తిరస్కరించడం తెలిసిందే. ఎన్నడూ లేని స్థాయిలో ఈ దఫా పోలింగ్ అనంతరం కూడా కేంద్ర ఎన్నికల సంఘంపై, ఈవీఎంలపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఎగ్జిట్ పోల్స్ను ‘మోదీ మీడియా పోల్’గా అభివరి్ణంచాయి. ఎగ్జిట్ పోల్స్ ముసుగులో అసలు ఫలితాలు ఎలా ఉండాలో అధికార యంత్రాంగానికి మోదీ స్పష్టమైన సంకేతాలిస్తున్నారంటూ దుయ్యబట్టాయి. ఈసీ స్వతంత్ర ప్రతిపత్తిని, దేశ ఎన్నికల ప్రక్రియను న్యూనత పరిచేందుకు విపక్షాలు మతిలేని ప్రయత్నాలు చేస్తున్నాయంటూ అధికార బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగియాన్న ఆరోపణలకు ఆధారాలుంటే ఇవ్వాలంటూ విపక్షాలను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ నిలదీశారు! దాంతో పోలింగ్ ప్రక్రియ జూన్ 1నే ముగిసినా రాజకీయ వేడి మాత్రం అలాగే కొనసాగింది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ కౌంటింగ్పైనే కేంద్రీకృతమయ్యాయి... హోరాహోరీ పోరు... ఈసారి ఎన్నికలు అత్యంత హోరాహోరీగా సాగాయి. ప్రచారం ముందెన్నడూ లేనివిధంగా ప్రధానంగా మతం, కులాల ప్రాతిపదికగా సాగింది. వరుసగా మూడో విజయం కోసం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి సర్వశక్తులూ ఒడ్డగా, పదేళ్ల మోదీ పాలనకు తెర దించడమే లక్ష్యంగా విపక్షాలు కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమిగా బరిలో దిగాయి. బీజేపీ తరఫున మోదీ అన్నీ తానై ప్రచారం చేశారు. కాంగ్రెస్ వస్తే సంపద పన్ను తదితరాల పేరిట జనం ఆస్తులు లాక్కుంటుందని ప్రతి ఎన్నికల సభలోనూ ఆరోపణలు గుప్పించారు. చివరికి హిందూ స్త్రీల మెళ్లో పుస్తెలనూ లాక్కుంటారన్నారు. విపక్షాలు కూడా గట్టిగానే ఎదురు దాడికి దిగాయి. ముస్లింలకు మతాధారిత రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీ ప్రకటనను అందిపుచ్చుకున్నాయి. రిజర్వేషన్లను మొత్తానికే ఎత్తేస్తారని, రాజ్యాంగాన్నే సమూలంగా మార్చేస్తారని ఊరూవాడా హోరెత్తించాయి. దాంతో ప్రచార పర్వం ఆసాంతం అక్షరాలా కురుక్షేత్రాన్ని తలపించింది. ఎన్డీఏకు 400 పై చిలుకు, బీజేపీకి సొంతగానే 370 స్థానాలొస్తాయని మోదీ, ఆ పార్టీ నేతలు పేర్కొనగా; ఇండియా కూటమికి 295 స్థానాలు ఖాయమని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్గాంధీ చెప్పుకొచ్చారు. లోక్సభలో మెజారిటీకి 272 సీట్లు అవసరం.ఆ సీట్లపై ఆసక్తి... ఈసారి పలు లోక్సభ స్థానాల్లో ఫలితాలపై ఎనలేని ఆసక్తి నెలకొంది. వాటిలో టాప్లో ఉన్నది రాహుల్గాంధీ పోటీ చేసిన రాయ్బరేలీ అంటే అతిశయోక్తి కాదు. యూపీలో గాం«దీల కంచుకోట అమేథీలో 2019లో ఆయన తొలిసారి ఓటమి చవిచూడటం తెలిసిందే. ఈసారి మరో కంచుకోట రాయ్బరేలీలో నెగ్గుతారా లేదా అన్నది ఆసక్తికరం. సిట్టింగ్ స్థానమైన కేరళలోని వయనాడ్లో కూడా సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా నుంచి రాహుల్ గట్టి పోటీ ఎదుర్కొన్నారు. అక్కడి ఫలితంపైనా ఉత్కంఠే నెలకొంది. మాజీ సీఎంలు భూపేశ్ భగెల్, చరణ్జీత్సింగ్ చన్నీ, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ కూతుళ్లు మీసా భారతి, రోహిణీ ఆచార్య, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే గెలుస్తారో లేదో చూడాలి.
Mexico Election Results 2024: మెక్సికోలో కొత్త చరిత్ర
మెక్సికో సిటీ: మెక్సికో చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించినట్టుగానే అధికార మోరెనా వామపక్ష కూటమి అభ్యర్థి క్లాడియా షేన్బామ్ (61) ఘనవిజయం సాధించారు. 200 ఏళ్ల స్వతంత్ర మెక్సికో చరిత్రలో దేశ అధ్యక్ష పీఠమెక్కనున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. యూదు మూలాలున్న తొలి ప్రెసిడెంట్ కూడా ఆమే కానున్నారు! షేన్బామ్కు ఇప్పటికే దాదాపు 60 శాతం ఓట్లు లభించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రత్యర్థులిద్దరూ నాకిప్పటికే ఫోన్ చేసి అభినందించారు. ఓటమిని అంగీకరించారు. దేశానికి తొలి అధ్యక్షురాలిని కాబోతున్నా’’ అంటూ చిరునవ్వులు చిందించారు. ‘‘ఇది నేను ఒంటరిగా సాధించిన విజయం కాదు. తల్లులు మొదలుకుని కూతుళ్లు, మనవరాళ్ల దాకా దేశ మహిళలందరి విజయమిది’’ అన్నారు. విపక్ష కూటమి మహిళకే అవకాశమిచి్చంది. రెండు ప్రధాన పారీ్టల నుంచీ మహిళలే తలపడటమూ మెక్సికో చరిత్రలో ఇదే తొలిసారి. విపక్ష కూటమి అభ్యర్థి సోచిల్ గాల్వెజ్కు 28 శాతం, మరో ప్రత్యర్థి జార్జ్ అల్వారిజ్ మైనేజ్కు 10 శాతం ఓట్లు వచి్చనట్టు ఈసీ పేర్కొంది. షేన్బామ్ నూతన చరిత్ర లిఖిస్తున్నారంటూ అధ్యక్షుడు ఆంద్రెజ్ మాన్యుయెల్ లోపెజ్ అబ్రేడర్ అభినందించారు. ఆరేళ్ల పదవీకాలంలో ఆయన పలు చరిత్రాత్మక నిర్ణయాలతో ప్రజల మనసు గెలుచుకున్నారు. షేన్బామ్ విజయంలో లోపెజ్ పాపులారిటీదే ప్రధాన పాత్ర. ఒకసారికి మించి అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు మెక్సికో రాజ్యాంగం అనుమతించదు. దాంతో ఆయన రెండోసారి బరిలో దిగలేకపోయారు. 2018లో లోపెజ్ గెలిచినప్పటి మాదిరిగా ఈసారి ప్రజల్లో పెద్దగా హర్షాతిరేకాలు వ్యక్తం కాకపోవడం విశేషం. అధ్యక్ష పదవితో పాటు పాటు 9 రాష్ట్రాల గవర్నర్లు, 128 మంది సెనేటర్లు, 500 మంది కాంగ్రెస్ ప్రతినిధులు, వేలాది మేయర్లు, స్థానిక సంస్థల ప్రతినిధి పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలపై ఆసక్తి నెలకొంది. మొత్తం 32 గవర్నర్ పదవుల్లో మెరేనా పార్టీకి 23 ఉన్నాయి. షేన్బామ్కు సవాళ్లెన్నో... షేన్బామ్ అక్టోబర్ 1న అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమెకు సవాళ్ల స్వాగతమే లభించనుంది. మహిళలపై హింసకు మెక్సికో ప్రపంచంలోనే పెట్టింది పేరు. ఈ సమస్యను రూపుమాపాల్సి ఉంది. సంక్షేమ పథకాలతో లోపెజ్ బాగా ఆకట్టుకున్నా అడ్డూ అదుపూ లేదని వ్యవస్థీకృత హింస, గ్యాంగ్ వార్లు, డ్రగ్ ట్రాఫికింగ్, పెట్రో ధరల పెరుగుదల తదితరాల కట్టడికి పెద్దగా చేసిందేమీ లేదన్న అసంతృప్తి ప్రజల్లో బాగా ఉంది. వీటిపై కొత్త అధ్యక్షురాలు దృష్టి పెట్టాలని వారు భావిస్తున్నారు. ప్రస్తుత పథకాలన్నింటినీ కొనసాగిస్తూనే దేశాన్ని పీడిస్తున్న అన్ని సమస్యలనూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని షేన్బామ్ ప్రకటించారు. ఏ తారతమ్యాలూ లేకుండా ప్రజలందరినీ ఒకేలా చూస్తానన్నారు.లా డాక్టోరా... షేన్బామ్ విద్యార్హతలు అన్నీ ఇన్నీ కావు. ఎనర్జీ ఇంజనీరింగ్లో పీహెచ్డీ చేవారు. అందుకే ఆమెను అభిమానులు ముద్దుగా ‘లా డాక్టోరా’ అని పిలుచుకుంటారు. పర్యావరణవేత్తగా చాలా పేరుంది. నోబెల్ శాంతి బహుమతి పొందిన ఐరాస పర్యావరణ శాస్త్రవేత్తల బృందంలో షేన్బామ్ సభ్యురాలు. రాజధాని మెక్సికో సిటీ మేయర్గా చేసిన తొలి మహిళ కూడా ఆమే. షేన్బామ్ తాత, అమ్మమ్మ హిట్లర్ హోలోకాస్ట్ హింసాకాండను తప్పించుకోవడానికి యూరప్ నుంచి మెక్సికో వలస వచ్చారు. షేన్బామ్ మెక్సికో సిటీలోనే పుట్టారు. 2000లో రాజకీయ అరంగేట్రం చేశారు.
సంబరాలకు సిద్ధంకండి: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని.. వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎన్నికల సంఘం మంగళవారం ఓట్ల లెక్కింపు చేపడుతుందని.. వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేస్తుందని, ఉ.10.30 గంటల నుంచి సంబరాలకు సిద్ధంకావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సజ్జల మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.ఇండియా టుడే–మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ బోగస్ అంటూ కొట్టిపారేశారు. ఆ సంస్థ జనసేన, బీజేపీకి ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చిన స్థానాలు, ఓట్ల శాతమే అందుకు నిదర్శనమన్నారు. ఆ ఎగ్జిట్ పోల్స్లో 21 స్థానాల్లో పోటీచేసిన జనసేనకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారని.. ఈ లెక్కన ఒక్కో శాసనసభ స్థానంలో జనసేన అభ్యర్థికి 61 శాతం ఓట్లు రావాల్సి ఉంటుందని.. ఇది సాధ్యమయ్యే పనేనా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ వ్యూహంలో భాగంగా దక్షిణాదిలో నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినట్లు చూపించే ప్రయత్నంలో ఇది భాగమని చెప్పారు. బీజేపీ కూటమిలో టీడీపీ భాగస్వామి కాకపోయి ఉంటే.. ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా ఈ రీతిలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేదే కాదన్నారు.స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రంలో అసలు చర్చే జరగలేదని.. దానివల్ల టీడీపీకి ప్రజల్లో సానుభూతి వచ్చిందని ఆ సంస్థ పేర్కొనడం విడ్డూరమన్నారు. టైమ్స్ నౌ, దైనిక్ భాస్కర్ సహా రాష్ట్రంలోని పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తున్నట్లు తేల్చాయని సజ్జల గుర్తుచేశారు. ఆ సంస్థలు ఎగ్జిట్ పోల్స్లో పేర్కొన్న స్థానాల కంటే వైఎస్సార్సీపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టంచేశారు.ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లందరూ అప్రమత్తంగా ఉండాలని సజ్జల పిలుపునిచ్చారు. సంయమనంతో వ్యవహరిస్తూ.. వైఎస్సార్సీపీ అభ్యరి్థకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా అభ్యర్థి ఖాతాలో పడేలా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. కౌంటింగ్ పూర్తయి వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపొందినట్లు డిక్లరేషన్ తీసుకునే వరకు కౌంటింగ్ కేంద్రం నుంచి కదలవద్దని సజ్జల కోరారు. టీడీపీ విజ్ఞప్తి మేరకే ఆ సడలింపులుఇక పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల సంఘం సడలింపులను సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రానా వాళ్లు చేసింది తప్పు తప్పు కాకుండా పోదన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ నిబంధనలను సడలించడంలో ఆంతర్యమేమిటని.. పోస్టల్ బ్యాలెట్ల అంశంలో దేశవ్యాప్తంగా ఒక రూలూ.. రాష్ట్రంలో మరో రూలా? ఇదెక్కడి న్యాయమంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ నిబంధనలను సడలించడం విడ్డూరంగా.. అనుమానాస్పదంగా ఉందని.. అందుకే ఆ అంశంపై న్యాయపోరాటం చేశామని సజ్జల చెప్పారు.తన శక్తి ఇంత ఉందని ఒక రౌడీ ఎలాగైతే రౌడీయిజం చేసి అందరినీ భయపెడతాడో చంద్రబాబూ కూడా బీజేపీతో పొత్తు కుదిరాక ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని అధికారులను బదిలీలు చేయిస్తూ యంత్రాంగంపై పట్టు సాధించే ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు భయపడి కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా ప్రవర్తించేందుకు అవకాశముందని.. అందుకే ఓట్ల లెక్కింపులో ఏజెంట్లను అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు.తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని.. ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తున్నామని సజ్జల గుర్తుచేశారు. గత ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న బాబు.. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి సీఈఓను బెదిరించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా కళ్లెదుట ఘోరపరాజయం కన్పిస్తుండటంవల్లే ఆయన నిశ్శబ్దంగా ఉన్నారని.. ఓటమికి మానసికంగా సిద్ధమవుతున్నారంటూ ఎద్దేవా చేశారు.కౌంటింగ్లో అప్రమత్తంగా ఉండాలి⇒ ఉదయం 6కల్లా లెక్కింపు కేంద్రం దగ్గర ఉండాలి ⇒ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల దిశానిర్దేశం ‘ఈ ఎన్నికల్లో మనం పక్కాగా గెలుస్తున్నాం.. అయినా కౌంటింగ్లో మన పార్టీ తరఫున ఏజెంట్లుగా ఉంటున్న మీరు అప్రమత్తంగా ఉండాలి’.. అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్సీపీ మళ్లీ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయబోతోందని.. వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని ఆయన చెప్పారు.ఏజెంట్లు ఉ.6 గంటలకల్లా కౌంటింగ్ హాల్ దగ్గర కచ్చితంగా ఉండాలని.. హాల్లో కౌంటింగ్ ప్రారంభం సమయం నుంచి ముగింపు దశ వరకు చాలా చురుగ్గా ఉండాలన్నారు. అదే సమయంలో సంయమనం పాటిస్తూ ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఖచ్చితంగా కౌంట్ అయ్యేలా చూస్తూ, లెక్కింపు న్యాయబద్ధంగా సజావుగా సాగేలా ప్రయత్నం చేయాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా పాజిటివ్గా పార్టీ అకౌంట్లో పడేవిధంగా జాగ్రత్త వహించాలని.. కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ తీసుకునే వరకు కూడా అక్కడ నుంచి ఎవరూ కదలొద్దన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ ద్వారా సజ్జల సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విశ్రాంత ఆర్డీఓ ప్రభాకర్రెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధులు మలసాని మనోహర్రెడ్డి, కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.
పసిడి ప్రియులకు శుభవార్త!.. మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు
జూన్ 1 నుంచి తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. ఈ రోజు (జూన్ 3) కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. కాబట్టి నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66100 (22 క్యారెట్స్), రూ.72110 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గాయి.చెన్నైలో కూడా బంగారం ధరలు రూ. 440 నుంచి రూ. 480 వరకు తగ్గాయి. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 66660 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 72720 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు ధరలు కొంత తగ్గినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66250 (10 గ్రా), 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72260 (10 గ్రా) వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గినట్లు తెలుస్తోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా గత నాలుగు రోజుల నుంచి తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు ఒక కేజీ వెండి ధర రూ. 700 తగ్గింది. కాబట్టి రూ. 93500 వద్ద ఉన్న వెండి రూ. 92800లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కేదార్ జాదవ్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కేదార్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని కొద్ది సేపటి కిందట ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 2014లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కేదార్.. 2020లో చివరిసారిగా భారత జట్టుకు ఆడాడు. కేదార్ తన ఆరేళ్ల ఆంతర్జాతీయ కెరీర్లో 73 వన్డేలు, 9 టీ20లు ఆడి 2 సెంచరీలు (వన్డేల్లో), 7 అర్దసెంచరీల సాయంతో 1611 పరుగులు చేశాడు. కేదార్ ఖాతాలో 27 వన్డే వికెట్లు కూడా ఉన్నాయి. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన కేదార్కు వైవిధ్యభరితమైన బౌలర్గా గుర్తింపు ఉంది. 39 ఏళ్ల కేదార్కు ఐపీఎల్లోనూ ఓ మోస్తరు ట్రాక్ రికార్డు ఉంది. 2010 నుంచి 2023 సీజన్ వరకు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన కేదార్.. ఐపీఎల్ కెరీర్లో 95 మ్యాచ్లు ఆడి 123.1 స్ట్రయిక్రేట్తో 4 అర్ద సెంచరీల సాయంతో 1208 పరుగులు చేశాడు. మిడిలార్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న కేదార్కు సీఎస్కే తరఫున ఆడినప్పుడు మంచి గుర్తింపు వచ్చింది. ధోని నాయకత్వంలో కేదార్ పలు మ్యాచ్ల్లో సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. దేశవాలీ క్రికెట్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించే కేదార్.. ఆ జట్టు తరఫున 87 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 186 లిస్ట్-ఏ మ్యాచ్లు, 163 టీ20లు ఆడాడు. ఇందులో 27 సెంచరీలు, 56 అర్ద సెంచరీల సాయంతో 14 వేల పైచిలుకు పరుగులు సాధించి, 65 వికెట్లు పడగొట్టాడు. Thank you all For your love and support throughout my Career from 1500 hrs Consider me as retired from all forms of cricket— IamKedar (@JadhavKedar) June 3, 20242020 ఫిబ్రవరిలో (న్యూజిలాండ్ పర్యటనలో) జాతీయ జట్టు తరఫున చివరి మ్యాచ్ ఆడిన కేదార్ 2019 వన్డే ప్రపంచకప్ ఆడిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కేదార్.. తన రిటైర్మెంట్ సందేశంలో ఇలా రాసుకొచ్చాడు. 1500 గంటల కెరీర్లో నాకు మద్దతు నిలిచి, నాపై ప్రేమ చూపిన వారందరికీ ధన్యవాదాలు. నన్ను అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్డ్గా పరిగణించండి అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు.
వైఎస్ఆర్సీపీదే గెలుపు: స్వామి పరిపూర్ణానంద
సాక్షి,సత్యసాయిజిల్లా: కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కీలక కామెంట్స్ చేశారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ 123 సీట్లు గెలుస్తుందని చెప్పారు.వైఎస్జగన్మోహన్రెడ్డి ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. హిందూపురం నియోజకవర్గంలోనూా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతోందన్నారు. నిబద్ధత గల వ్యక్తి ఆరా మస్తాన్ ఎగ్జిట్పోల్ ఫలితాల్లో చెప్పినట్లుగా ఏపీలో వైఎస్ఆర్సీపీ మరోసారి పగ్గాలు చేపడుతుందన్నారు. ప్రధానిగా మోదీ మూడోసారి, ఏపీలో సీఎంగా వైఎస్జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారని స్పష్టం చేశారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్
సాక్షి, బెంగళూరు: బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమ సీసీబీ పోలీసులు ఎదుట సోమవారం హాజరైంది. గత నెల 20న బెంగళూరు శివారులోని ఓ ఫామ్హౌస్లో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే! మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు దాదాపు వంద మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో టాలీవుడ్ నటి హేమ కూడా ఉంది. బుకాయించినా దొరికిపోయిందిఅయితే మొదట ఆ రేవ్ పార్టీకి, తనకు సంబంధం లేదని బుకాయించింది. కానీ తనకు జరిపిన రక్త పరీక్షల్లో ఆమె డ్రగ్స్ తీసుకుందని రుజువైంది. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాలంటూ హేమకు పోలీసులు రెండుసార్లు నోటీసులు పంపించగా వివిధ కారణాలు చెప్పి డుమ్మా కొట్టింది. సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులు పంపగా ఎట్టకేలకు విచారణకు హాజరైంది. ఈ క్రమంలోనే ఈమెని అరెస్ట్ చేశారు. మంగళవారం కోర్టులో హాజరు పరచనున్నారు.మాదకద్రవ్యాల విక్రయంకాగా బెంగళూరు నగరశివారులోని హెబ్బగోడిలో మే 19 రాత్రి నుంచి మే 20 తెల్లవారు జాము వరకు రేవ్ పార్టీ జరిగింది. వాసు అనే వ్యక్తి పుట్టినరోజు పేరు చెప్పి 'సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ' పేరిట పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్ ఇతర మాదకద్రవ్యాలు విక్రయించారు. పార్టీకి ప్రధాన కారకులైన నిందితులు రణధీర్, మహ్మద్ సిద్ధిఖి, వాసు, అరుణ్కుమార్, నాగబాబును పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు.చదవండి: ఉపాసన ఇంటికి చేరిన బుజ్జి.. క్లీంకార కోసం స్పెషల్ గిఫ్ట్
పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్ సందేశం
తాడేపల్లి: ఏపీలో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు(మంగళవారం) జరుగనున్న కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సందేశాన్ని పంపారు. ఈ మేరకు‘ఎక్స్’ వేదికగా సీఎం జగన్ ట్వీట్ చేశారు.‘ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను’ అని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2024
తప్పక చదవండి
- Sikkim Assembly Election Result 2024: ఎస్కేఎం శాసనసభాపక్ష నేతగా తమాంగ్
- సందట్లో సైబర్ వల
- సాగు సీజన్ షురూ
- Akhilesh Yadav: ఎగ్జిట్ పోల్స్లో విశ్వసనీయత ఎంత?
- అసెంబ్లీ పాత భవనం పునరుద్ధరణ
- జూలై–సెప్టెంబర్కల్లా లా నినో
- ఇంధనం సంరక్షణకు ‘పాట్’ పడుతున్న ఏపీ
- హిమాచల్లో సుఖు సర్కార్ సేఫ్!
- ‘ఆపరేషన్’ సిజేరియన్
- Bhupesh Baghel: పోలింగ్ తర్వాత ఈవీఎంలను మార్చేశారు
సినిమా
ఆస్పత్రిలో చేరిన టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్..!
టాలీవుడ్ నిర్మాత బండ్లగణేశ్ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. Tollywood producer Bandla Ganesh has been admitted to Apollo Hospital and is currently undergoing treatment for chest pain! pic.twitter.com/dFH5wBTMcs— Madhu (@offlinemadhu) June 3, 2024
హేమకు వైద్య పరీక్షలు.. అలా కనిపించి షాక్ ఇచ్చిన నటి!
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనే ఆమెకు పాజిటివ్ రావడంతో పోలీసులు నోటీసులిచ్చారు. మొదటిసారి అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేదు. హేమకు పోలీసులు రెండోసారి నోటీసులు పంపించగా వివిధ కారణాలు చెప్పి డుమ్మా కొట్టింది. సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులిచ్చారు. దీంతో ఇవాళ సీసీబీ పోలీసుల ఎదుట ఆమె హాజరయ్యారు. విచారణ పూర్తయిన అనంతరం హేమను పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం హేమకు ప్రభుత్వాస్పత్రిలో హేమకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే వైద్య పరీక్షలకు హేమ బురఖా ధరించి హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. ఈ కేసులో హేమను రేపు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచనున్నారు. రేవ్ పార్టీ నిర్వహణలో హేమ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..బెంగళూరు నగరశివారులోని హెబ్బగోడిలో మే 19 రాత్రి నుంచి మే 20 తెల్లవారు జాము వరకు రేవ్ పార్టీ జరిగింది. వాసు అనే వ్యక్తి పుట్టినరోజు పేరు చెప్పి 'సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ' పేరిట పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్ ఇతర మాదకద్రవ్యాలు తీసుకున్నారు. పార్టీకి ప్రధాన కారకులైన నిందితులు రణధీర్, మహ్మద్ సిద్ధిఖి, వాసు, అరుణ్కుమార్, నాగబాబును పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు.#Tollywood actress #Hema has been arrested by @CCBBangalore wen she came in Burqa to appear today after two notices in related to to Rave party which was held in #anekal, #bengaluru . Including Hema, more than 80+ people tested positive with Drug in 101 samples collected. pic.twitter.com/qxvQAUIFtx— Madhu M (@MadhunaikBunty) June 3, 2024
రఘువరన్కు భిన్నంగా వారసుడు.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
నటుడు రఘువరన్ పేరు వినగానే విలక్షణమైన పాత్రలే గుర్తుకొస్తాయి. టాలీవుడ్తో పాటు దక్షిణాది చిత్రాల్లో ప్రతినాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ చిత్రాలలోనూ రఘువరన్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. సినిమాల్లో నటించే సమయంలో నటి రోహిణిని పెళ్లాడారు. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించారు. అతనికి రిషివరన్ అనే పేరు పెట్టారు. అయితే 2004లో వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత చివరి రోజుల్లో ఆల్కహాల్కు బానిస అయిన రఘువరన్ 2008 మార్చి 19న కన్నుమూశారు.అయితే ప్రస్తుతం అతని కుమారుడు రిషి వరన్ తండ్రి బాటలోనే దూసుకెళ్తున్నాడు. 26 ఏళ్ల రిషివరన్ నటుడిగా కాకుండా సంగీతంలో రాణిస్తున్నాడు. సినిమాల్లో నటనకు బదులు రిషివరన్ సంగీత రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే అతను కొన్ని ఇంగ్లిష్ ఆల్బమ్లు రిలీజ్ చేశాడు. రఘువరన్కి సైతం సంగీతంపై కూడా చాలా ఆసక్తి ఉండేది. సినిమా అవకాశాలు పెరగడంతో నటనలో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం రిషివరన్ తండ్రిలాగే కొడుకు కూడా సంగీతంలో కొనసాగుతున్నాడు.కాగా.. గతంలో రఘువరన్ ఎంతో ఇష్టంగా కంపోజ్ చేసి, పాడిన ఆరు పాటలను ఆయన మరణం తరువాత ఓ ఆల్బమ్గా తీసుకొచ్చారు. గతంలో రజనీకాంత్ చేతులమీదుగా ఈ ఆల్బమ్ను ఆయన భార్య రోహిణి, రిషి వరన్ అందుకున్నారు. ఏది ఏమైనా రఘువరన్ విలక్షణమైన నటనతో జనం మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రఘువరన్ తన కెరియర్లో 150కు పైగా సినిమాలలో నటించారు. టాలీవుడ్లో శివ, బాషా ,పసివాడు ప్రాణం వంటి సినిమాలలో నటించి బాగానే పేరు సంపాదించిన రఘువరన్.. చివరిగా ఆటాడిస్తా సినిమాలో కనిపించారు. ఆయన మాజీ భార్య రోహిణి బాలనటిగా పరిచయమై ఆ తర్వాత కథానాయికగా, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దక్షిణాది ప్రేక్షకులను అలరించింది. ఇప్పటికీ ఆమె సినిమాల్లో కొనసాగుతున్నారు.
మరో ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2' సినిమా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా తీసిన సినిమా 'యాత్ర 2'. ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైంది. దాదాపు రెండు నెలల తర్వాత అంటే ఏప్రిల్ 12న ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు మరో ఓటీటీలో అందుబాటులోకి తీసుకొచ్చి, అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇంతకీ ఇప్పుడు ఏ ఓటీటీలోకి వచ్చిందనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా మహి వి రాఘవ తీసిన సినిమా 'యాత్ర'. మలయాళ నటుడు మమ్ముట్టి టైటిల్ రోల్ చేశారు. 2019లో రిలీజైన ఈ చిత్రం అద్భుతమైన సక్సెస్ అందుకుంది. దీనికి కొనసాగింపుగా ఇదే డైరెక్టర్ తీసిన మూవీ 'యాత్ర 2'. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ మోహన్ రెడ్డి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్.. ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేలు సంతకాలు చేసినా పార్టీ అధిష్టానం పట్టించుకోదు. ఈ క్రమంలోనేరాజశేఖర్ రెడ్డి మరణం తట్టుకోలేక కన్నుమూసిన కార్యర్తల కుటుంబాలను పరామర్శించేందుకు.. వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేస్తారు. దీన్ని ప్రొగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. దాంతో ప్రొగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగన్ వైఎస్ఆర్ పార్టీని ఏర్పాటుచేసి ఎలా ప్రజల అభిమానాన్ని పొందాడు? అన్ని అడ్డంకుల్ని ఎదుర్కొని ఏ విధంగా సీఏం అయ్యారనేది 'యాత్ర 2'లో చూపించాడు. ఇదివరకే అమెజాన్ ప్రైమ్లో ఉండగా, ఇప్పుడు ఆహా ఓటీటీలోకి కూడా వచ్చేసింది.(ఇదీ చదవండి: ప్రభాస్ ఇంటి ఫుడ్ని మర్చిపోలేకపోతున్న హీరోయిన్.. ఐదేళ్లయినా సరే)మేం ఉన్నాం, మేం విన్నాం..♟️యాత్ర 2 మీకోసం తీసుకొస్తున్నాం!🎥👉 ▶️https://t.co/4VTAeZeSe6@JiivaOfficial @mammukka #Yatra2 pic.twitter.com/c7D4BuOb6L— ahavideoin (@ahavideoIN) June 3, 2024
ఫొటోలు
Keerthi Bhatt: కాబోయే భర్తతో సీరియల్ నటి కీర్తి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
Sara Ali Khan: అంబానీ ప్రీవెడ్డింగ్.. ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న కుర్ర హీరోయిన్ (ఫోటోలు)
చిరంజీవితో 16 సినిమాల్లో నటించిన హీరోయిన్ బర్త్డే (ఫోటోలు)
అనంత్- రాధిక ప్రీవెడ్డింగ్: ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న ధోని ఫ్యామిలీ (ఫొటోలు)
AP: కౌంటింగ్కు కౌంట్డౌన్.. ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధం (ఫొటోలు)
క్రీడలు
T20 World Cup 2024: చెత్త రికార్డు సమం చేసిన శ్రీలంక
టీ20 వరల్డ్కప్ 2024 గ్రూప్-డిలో భాగంగా ఇవాళ (జూన్ 3) శ్రీలంక, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందనే అంచనాతో తొలుత బ్యాటింగ్ను ఎంచుకున్నట్లు లంక కెప్టెన్ హసరంగ టాస్ సందర్భంగా చెప్పాడు. అయితే ఈ విషయంలో హసరంగ అంచనాలు తారుమారయ్యాయి. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. 45 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. తొలుత ఓట్నీల్ బార్ట్మన్ (2-1-3-1), ఆతర్వాత కేశవ్ మహారాజ్ (4-0-22-2), అన్రిచ్ నోర్జే (3-0-6-3) లంకేయులకు దారుణంగా దెబ్బ తీశారు. నిస్సంక (3), కుశాల్ మెండిస్ (19), కమిందు మెండిస్ (11), హసరంగ (0), సమరవిక్రమ (0), అసలంక (6) దారుణంగా విఫలం కాగా.. ఏంజెలో మాథ్యూస్ (9), దసున్ షనక (9) లంకను మూడంకెల స్కోర్ దాటించేందుకు ప్రయత్నిస్తున్నారు. 14 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 61/6గా ఉంది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో శ్రీలంక ఓ చెత్త రికార్డు సమం చేసింది. టీ20 వరల్డ్కప్ పవర్ ప్లేల్లో (తొలి 6 ఓవర్లు) తమ అత్యల్ప స్కోర్ను సమం చేసింది. ఈ మ్యాచ్ పవర్ ప్లేలో శ్రీలంక వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. 2022 ప్రపంచకప్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లోనూ శ్రీలంక 24 పరుగులకే పరిమితమైంది. అయితే మ్యాచ్లో శ్రీలంక ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయింది. టీ20 ప్రపంచకప్ పవర్ ప్లేల్లో శ్రీలంక మూడో అత్యల్ప స్కోర్ 2007లో నమోదైంది. కేప్టౌన్ వేదికగా ఆసీస్తో జరిగిన మ్యాచ్లో లంకేయులు 4 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేశారు.
Hardik- Natasa: హార్దిక్ పాండ్యాతో విడాకులు: ట్విస్ట్ ఇచ్చిన నటాషా!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరగుతున్న విషయం తెలిసిందే. భార్య నటాషా స్టాంకోవిక్తో అతడికి విభేదాలు తలెత్తాయని.. విడాకులే తరువాయి అంటూ వదంతులు వ్యాపించాయి.ఇప్పటికే నటాషా కోర్టు మెట్లు ఎక్కారని.. విడాకుల కోసం దరఖాస్తు చేయడమే కాకుండా.. భరణంగా హార్దిక్ ఆస్తిలో 70 శాతం పొందనున్నారనే వార్తలు వినిపించాయి. నటాషా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పాండ్యా ఇంటిపేరును తొలగించడం.. వారి పెళ్లి ఫొటోలు కనిపించకుండా పోవడమే ఇందుకు కారణమని గాసిప్రాయుళ్లు ప్రచారం చేశారు.అయితే, తాజాగా నటాషా ట్విస్ట్ ఇచ్చారంటూ మరో ప్రచారం తెరమీదకు వచ్చింది. తమ పెళ్లి ఫొటోలను ఆమె తిరిగి ఇన్స్టా ఖాతాలో పునరుద్ధారించారని దాని సారాంశం. నిజానికి విడాకుల రూమర్ల తర్వాత కూడా హార్దిక్ పాండ్యా అకౌంట్లో వారి పెళ్లి ఫొటోలు దర్శనమిచ్చాయి. అయితే, తాజాగా నటాషా కూడా వాటిని రీస్టోర్ చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఏదేమైనా ఇంతగా వార్తల్లో నానుతున్నా ఇటు హార్దిక్ పాండ్యా గానీ.. అటు నటాషా గానీ విడాకుల అంశం ఖండించనూ లేదు. అలాగని అంగీకరించనూలేదు. అయితే, తాజాగా నటాషా తమ వివాహ బంధం పదిలంగా ఉందని చాటేలా ఫొటోలు రీస్టోర్ చేయడం విశేషం.ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా- నటాషాలపై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ‘‘సానుభూతి కోసం భలే డ్రామాలు ఆడారు. బాగానే వర్కౌట్ అయింది’’ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పాండ్యాపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. రోహిత్పై వేటు పడటాన్ని జీర్ణించుకోలేక స్టేడియం, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హార్దిక్ను ట్రోల్ చేశారు హిట్మ్యాన్ ఫ్యాన్స్. ఇక అతడి సారథ్యంలో ముంబై పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలవడంతో ట్రోలింగ్ తారస్థాయికి చేరింది.ఈ నేపథ్యంలో విడాకుల అంశం తెరమీదకు రాగా.. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు వస్తుండటంతో సానుభూతి పొందేందుకు హార్దిక్- నటాషా జోడీ నాటకాలాడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సెర్బియా మోడల్ నటాషాను పెళ్లాడిన హార్దిక్ పాండ్యాకు కుమారుడు అగస్త్య సంతానం. ప్రస్తుతం హార్దిక్ టీ20 ప్రపంచకప్-2024తో బిజీగా ఉన్నాడు.
T20 World Cup 2024: సౌతాఫ్రికాతో మ్యాచ్.. టాస్ గెలిచిన శ్రీలంక.. తుది జట్లు ఇవే..!
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 3) సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో శ్రీలంక కెప్టెన్ హసరంగ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మెగా టోర్నీకి శ్రీలంక జట్టు క్వాలిఫయర్ పోటీల ద్వారా అర్హత సాధించినప్పటికీ పేపర్పై పటిష్టంగా కనిపిస్తుంది. నేటి మ్యాచ్కు లంకేయులు ఏడుగురు బ్యాటర్లు, 4 బౌలర్ల ఫార్ములాతో బరిలోకి దిగుతున్నారు. మరోవైపు టోర్నీ హాట్ ఫేవరెట్లలో ఒకటైన సౌతాఫ్రికా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అరివీర భయంకరంగా కనిపిస్తుంది. ఆ జట్టు ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతుంది. ప్రొటీస్ బౌలింగ్ విభాగంలో కేవలం ఒకే ఒక స్పిన్నర్ (కేశవ్ మహారాజ్) ఉన్నాడు. తుది జట్లు..శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుసల్ మెండిస్(వికెట్కీపర్), కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, దసున్ షనక, వనిందు హసరంగ(కెప్టెన్), మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, నువాన్ తుషారదక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్మన్
Rohit-Kohli: ఒక్క మ్యాచ్లో ఓపెనర్లు బరిలోకి దిగితేనే ఇలా జరిగింది..!
టీ20 వరల్డ్కప్ 2024లో టీమిండియా తరఫున ఓపెనర్గా రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి బరిలోకి దిగాలని తారా స్థాయిలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు తొమ్మిది సార్లు టీమిండియా ఓపెనర్గా బరిలోకి దిగిన కోహ్లి.. రోహిత్ శర్మతో కలిసి ఒకే ఒక మ్యాచ్లో ఓపెనర్గా జత కట్టాడు. ఆ మ్యాచ్లో కోహ్లి, రోహిత్ జోడీ చెలరేగిపోయింది.2022 మార్చిలో ఇంగ్లండ్తో జరిగిన ఆ మ్యాచ్లో వీరు కేవలం 54 బంతుల్లోనే 94 పరుగులు జోడించి, భారత ఇన్నింగ్స్కు గట్టి పునాది వేశారు. టీ20ల్లో కోహ్లి అప్పటివరకు అడపాదడపా మాత్రమే ఓపెనర్గా బరిలోకి దిగాడు. ఆ సమయంలో కోహ్లి ఓపెనర్గా ఎలా రాణిస్తాడో అని అభిమానులు తెగ టెన్షన్ పడ్డారు.అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ కోహ్లి 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. అప్పటికే రెగ్యులర్ ఓపెనర్గా స్థిరపడిన రోహిత్ సైతం ఆ మ్యాచ్లో చెలరేగిపోయాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు.వీరిద్దరితో పాటు సూర్యకుమార్ యాదవ్ (32 నాటౌట్), హార్దిక్ పాండ్యా (39 నాటౌట్) కూడా విజృంభించడంతో ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ చేతులెత్తేయడంతో భారత్ ఆ మ్యాచ్లో 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.ప్రస్తుతం జరుతున్న టీ20 వరల్డ్కప్లో కోహ్లి-రోహిత్ ఓపెనర్లుగా జతకట్టాలని డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ స్కోర్ కార్డు నెట్టింట చక్కర్లు కొడుతుంది. కోహ్లి-రోహిత్ జోడీ ఒక్క మ్యాచ్లో జతకడితేనే ఈ స్థాయి విధ్వంసం జరిగింది. అదే వీరిద్దరు ప్రతి మ్యాచ్లో ఓపెనర్లు బరిలోకి దిగితే వీరిని ఆపడం సాధ్యమా అని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.ఇదిలా ఉంటే, ఐపీఎల్లో ఓపెనర్గా ఇదివరకే ప్రూవ్ చేసుకున్న విరాట్.. అంతర్జాతీయ టీ20ల్లోనూ ఓపెనర్గా అదిరిపోయే ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. విరాట్ టీ20ల్లో ఓపెనర్గా బరిలోకి దిగిన 9 మ్యాచ్ల్లో 57.14 సగటున, 161.29 స్ట్రయిక్రేట్తో 400 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2024 సీజన్లో అరివీర భయంకర ఫామ్లో (741 పరుగులతో సీజన్ టాప్ స్కోరర్) ఉన్న కోహ్లి.. రోహిత్తో పాటు ఓపెనర్గా జతకడితే ఈసారి టీమిండియా ప్రపంచకప్ గెలవడం ఖాయమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
బిజినెస్
ఎన్నికల సమయానికి సుస్థిరత సాధించిన భారత ఆర్థిక వ్యవస్థ
లోక్సభ 18వ ఎన్నికల ప్రక్రియ ముగిసే సమయానికి భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనే అంశంపై మీడియాలో సమీక్ష జరుగుతోంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 8 శాతం వృద్ధి రేటుతో 2024 ఎన్నికల సమయానికి సుస్థిరత సాధించిందని ఆర్థికవేత్తల అంచనా. ఇదే నిజమైతే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా ప్రగతి అత్యంత వేగవంతంగా సాగినట్లేనని కూడా వారు భావిస్తున్నారు.దేశంలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో నిరుద్యోగం కాస్త ఎక్కువగా ఉందనే ప్రచారం పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బాగానే వినిపించింది. ఆధునిక భారతంలో పట్టణ, నగర ప్రాంతాల్లోనే అన్ని విధాలా అభివృద్ధి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, మారుమూల ప్రాంతాల్లో వృద్ధి అంతగా లేదని కొందరు ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే, గడిచిన పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ఐదు స్థానాలు ఎగబాకి పది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అయిదో స్థానానికి చేరుకుంది. మరోసారి తమకు అధికారం అప్పగిస్తే దేశాన్ని మూడో స్థానానికి తీసుకెళతామని కూడా పాలకపక్షం ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించింది. అగ్రశ్రేణి ఇకానమీగా అవతరించినప్పటికీ తలసరి ఆదాయం విషయంలో జీ–20 దేశాల్లో ఇండియా అట్టడుగున ఉందనే విషయాన్ని పాలకులు మరువకూడదని ఆర్థిక నిపుణులు కొందరు గుర్తుచేస్తున్నారు.ప్రపంచ దేశాల ఆర్థిక బలాబలాలను మదింపు చేసి, వాటి పరపతికి సంబంధించి రేటింగ్స్ ఇచ్చే ప్రఖ్యాత సంస్థ ఎస్ అండ్ పీ గ్లోబల్ ఈ నెలలో భారత సావరిన్ రేటింగ్ పరిస్థితిని ‘సుస్థిర’ (స్టేబుల్) నుంచి ‘సానుకూల’ (పాజిటివ్)గా అంచనావేసింది. బీబీబీ–రేటింగ్ను మాత్రం మార్చకుండా మెరుగైన భవిష్యత్తు ఉన్న దేశంగా ఇండియాను పరిగణిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా విస్తరిస్తూ ముందుకు సాగడం వల్ల దాని పరపతిపై నిర్మాణాత్మక ప్రభావం ఉంటుందని ఎస్ అండ్ పీ పేర్కొంది.రిటైల్ ద్రవ్యోల్బణం ఇలా..మార్చితో పోలిస్తే దేశంలో ఏప్రిల్ నెల వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త తగ్గింది. కీలకమైన ఈ సూచిక రిజర్వ్ బ్యాంక్ లక్ష్యమైన 4%కు తగ్గకుండా కిందటి నెలలో 4.83% వద్ద నిలిచింది. వినియోగదారుల జీవన ప్రమాణాలను అధికంగా ప్రభావితం చేసే కీలకమైన ఆహార పదార్ధాల ద్రవ్యోల్బణం (ఫుడ్ ఇన్ఫ్లేషన్) మార్చితో పోలిస్తే ఏప్రిల్ నెలలో కొద్దిగా పెరిగింది (8.52% నుంచి 8.70%కు). 2023 నవంబర్ నుంచి ఫుడ్ ఇన్ఫ్లేషన్ 8%కి పైనే ఉంటోంది. సామాన్య, పేద ప్రజలకు అత్యంత కీలకమైన ఆహార పదార్థాల ధరల పెరుగుదల ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. అందుకే, సాధారణ ఎన్నికలను, పేద, దిగువ మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కారు కిందటేడాది నుంచే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి గోధుమలు, బియ్యం, ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించింది.అంతర్జాతీయ కంపెనీలకు ప్రోత్సాహకాలు21వ శతాబ్దం మొదటి పాతికేళ్ల చివరిలోకి వచ్చిన ప్రస్తుత సమయంలో నిరుద్యోగం కూడా ఇండియాకు పెద్ద సమస్యగా మారింది. దేశంలో మార్చిలో 7.4%గా ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్ నెలలో 8.1%కు పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఇకానమీ (సీఎంఐఈ) అనే ప్రైవేట్ సంస్థ అంచనావేసింది. పట్టణ ప్రాంతాల్లో 19–29 ఏళ్ల యువతలో నిరుద్యోగం 2023 చివరి మూడు నెలలతో పోల్చితే స్వల్పంగా (16.5% నుంచి 17%కి) పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అంతర్జాతీయరంగంలో ఇండియా పలుకుబడి చెప్పుకోదగ్గ రీతిలో పెరిగిందనే నిపుణులు అంచనావేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ బడా కంపెనీలను ఒక్క చైనా వైపే చూడకుండా ఇండియా రావాలని కోరుతూ ప్రోత్సాహకాలను అందిస్తానంటోంది. మొత్తంమీద భారత విదేశాంగ విధానం ఈ పదేళ్లలో చెప్పుకోదగిన విజయాలు సాధించిందని కాంగ్రెస్ పార్టీ సహా కొన్ని ప్రతిపక్షాలు అంగీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ మొదటి పక్షంలో కేంద్రంలో అధికారం చేపట్టే కొత్త ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి.-విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు.
అంబానీయా.. మజాకా! సముద్రతీరమంతా బుక్ చేసేశాడుగా!
రాధిక మర్చంట్, అనంత్ అంబానీల ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభాగంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎంతో మంది సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఇటలీలోని పోర్టోఫినోలో జరిగిన చివరి రోజు ఈవెంట్లో ప్రఖ్యాత ఇటాలియన్ టేనర్ ఆండ్రియా బోసెల్లి మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇటలీలో జరిగిన ఈ వేడుకలకు జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ వంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు సైతం హాజరయ్యారు. మొత్తం ఈ వేడుకలకు 1200 మంది అతిథులు హాజరైనట్లు సమాచారం. ఈ కార్యక్రమం కోసం అంబానీ ఏకంగా పోర్టోఫినో సముద్ర తీరం మొత్తాన్ని బుక్ చేసుకున్నారు. View this post on Instagram A post shared by yourpoookieboo(YPB) (@yourpoookieboo)అంబానీ ఫ్యామిలీ ఇటలీ సెలబ్రేషన్లకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అంబానీ ఫ్యామిలీతో పాటు.. షారుఖ్ ఖాన్, భార్య గౌరీ ఖాన్, జాన్వీ కపూర్, కియారా అద్వానీ, రణబీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా మొదలైన సెలబ్రిటీలు కూడా కనిపించారు. View this post on Instagram A post shared by yourpoookieboo(YPB) (@yourpoookieboo)
పెరిగిన టోల్ చార్జీలు.. ఈ రోజు నుంచే షురూ
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సోమవారం నుంచి 5 శాతం టోల్ పెంపును ప్రకటించింది. 2024 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావాల్సిన కొత్త టోల్ చార్జీలు సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో కొత్త రేట్లు అమలులోకి వస్తాయి.కొత్త టోల్ చార్జీలు ఈ రోజు నుంచే (జూన్ 3) అమల్లోకి వచ్చినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు పేర్కొన్నారు. కొత్త ధరలకు సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.భారతదేశంలో మొత్తం సుమారు 855 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 675 పబ్లిక్ ఫండెడ్ కాగా, మిగిలిన 180 రాయితీదారుల నిర్వహిస్తున్నారు. నేషనల్ హైవే పే రూల్ 2008 ప్రకారం.. టోల్ ఫీజుల పెంపు జరిగిందని సంబంధింత అధికారులు చెబుతున్నారు.NHAI డేటా ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో టోల్ వసూలు రూ. 50,000 కోట్లను దాటింది (నవంబర్ 2023 వరకు). టోల్ గేట్లు పెరగటం, ఫాస్ట్ట్యాగ్ వినియోగదారుల సంఖ్య ఎక్కువ కావడంతో భారీ టోల్ వసూలు జరిగింది. ఇప్పుడు టోల్ చార్జీలు 5 శాతం పెరగడంతో టోల్ వసూలు మరింత పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తోంది.
మస్క్ రూ.24వేలకోట్లు తిరిగి ఇచ్చేయాలి.. పిటిషన్ దాఖలు
టెస్లా వ్యవస్థాపకులు ఎలొన్మస్క్ ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా సంపాదించిన దాదాపు 3 బిలియన్ డాలర్లను(సుమారు రూ.24వేలకోట్లు) తిరిగి వాటాదారులకు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. మైకేల్ పెర్రీ అనే టెస్లా షేర్ హోల్డర్ ఈమేరకు అమెరికాలోని డెలావేర్ ఛాన్సరీ కోర్టులో పిటిషన్ వేశారు.అందులోని వివరాల ప్రకారం.. 2022లో టెస్లా కార్లకు భారీగానే డిమాండ్ ఉంది. కానీ నవంబర్ నెలలో కంపెనీ అంచనాల కంటే అమ్మకాలు తగ్గిపోయాయి. జనవరి 2023లో వెలువడిన నాలుగో త్రైమాసిక ఫలితాలకంటే ముందే మస్క్ చాకచక్యంగా షేర్లు విక్రయించి లాభాలు పొందారు. కంపెనీ సేల్స్ సహా ఇతర విషయాలు తెలుసుకునేందుకు మస్క్కు యాక్సెస్ ఉంటుంది. అందుకే ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా ఫలితాల ముందే షేర్లు విక్రయించారు. 2022లో మస్క్మొత్తం 7.5 బిలియన్ డాలర్లు(సుమారు రూ.62వేలకోట్లు) విలువ చేసే షేర్లను అమ్మారు. నవంబర్-డిసెంబర్లో ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా మస్క్ 3 బిలియన్ డాలర్లు(రూ.24వేలకోట్లు) లాభం పొందారు.టెస్లా సీఈఓ పదవిలో ఉన్న ఎలొన్మస్క్ నిబంధనలకు విరుద్ధంగా సంపాదించిన లాభాలను వెంటనే వాటాదారులకు తిరిగిచ్చేలా ఆదేశించాలని మైకేల్ పెర్రీ కోర్టును కోరారు. మస్క్ షేర్లను విక్రయించేలా టెస్లా డైరెక్టర్లు కూడా కార్పొరేట్ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. అయితే ఈ విషయంపై రాయిటర్స్ టెస్లాను వివరణ కోరగా ఎలాంటి స్పందన రాలేదని మీడియా కథనాల ద్వారా తెలిసింది.ఇదీ చదవండి: తగ్గిన చమురు ధరలు.. ఒపెక్ప్లస్ కూటమి ప్రభావంఇన్సైడ్ ట్రేడింగ్ అంటే..కంపెనీలో పనిచేస్తున్నవారికి రియల్టైమ్లో సంస్థ ఉత్పత్తులకు డిమాండ్ ఎలా ఉంది..ఉత్పత్తి ఎలా జరుగుతుంది..రాబోయే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అనే అంశాలపై అవగాహన ఉంటుంది. దాన్ని అసరాగా చేసుకుని అప్పటికే తమకు కంపెనీలో ఉన్న పెట్టుబడులపై నిర్ణయం తీసుకుని అక్రమంగా లాభాలు పొందుతారు.
వీడియోలు
"మళ్ళీ జగనే" ఎలక్షన్ రిజల్ట్స్ పై పరిపూర్ణానంద స్వామి రియాక్షన్
తాజ్ ఎక్స్ ప్రెస్ లో మంటలు దగ్ధమైన నాలుగు భోగీలు
కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
చంద్రబాబుకు పిక్చర్ అర్థం అయ్యింది..
చంద్రబాబుకు పిక్చర్ అర్థం అయ్యింది..
ఫ్లాష్ ఫ్లాష్ తెలంగాణ ఎలో అలెర్
పూర్తి ఆధారాలతో హేమను అదుపులోకి తీసుకున్న పోలీసులు
కఠినమైన ఆంక్షల మధ్య కౌంటింగ్
ఎగ్జిట్ పోల్స్ పై కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ రఘు రాజుపై అనర్హత వేటు
ఫ్యామిలీ
మాయిశ్చరైజర్లను ఇంజెక్ట్ చేయడం గురించి విన్నారా..?
చర్మ సంరక్షణ కోసం వివిధ రకాల మాయిశ్చరైజర్లను వాడటం గురించి విన్నాం. ఇప్పుడూ ఏకంగా ముఖానికే నేరుగా ఇంజెక్ట్ చేస్తారట. దీనివల్ల ముఖం హైడ్రేటెడ్గా ఉండి మృదువుగా కనిపిస్తుంది. పైగా ఏజ్లెస్గా కనిపిస్తుందట. స్కిన్టోన్ కూడా చాలా బాగుంటదట . అసలేంటిది? ఎలా చేస్తారు తదితరాల గురించి తెలుసుకుందాం!.ఇప్పుడూ చర్మ సంరక్షణపై విపరీతమైన అవగాహన, ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. అందుకు తగ్గట్టుగానే మార్కెట్లో బ్యూటీకి సంబంధించిన కొత్తకొత్త చికిత్సా విధానాలు వచ్చాయి. ఈ చర్మ సంరక్షణకు సంబంధించి సర్జరీలు, చికిత్సలు భారత్లో అతిపెద్ద మార్కెట్గా ఉంది. ముఖ్యంగా ఆసియ పసిఫిక్ ప్రాంతాలైన భారత్, చైనా, జపాన్లో బ్యూటీ ప్రొడక్ట్లు, చికిత్సలు మంచి ఆదాయాలు అందించే మార్కెట్. ఆ క్రమంలోనే కొత్త చర్మ సంరక్షణ ట్రెండ్ ఒకటి వచ్చింది. ఇంతకీ ఏంటీ ఇంజెక్షన్ మాయిశ్చరైజర్స్?ఇంజెక్ట్ చేసే మాయిశ్చరైజర్లను స్కిన్ బూస్టర్లుగా పిలుస్తారు. ఇవి హెలురోనిక్ యాసిడ్తో తయారు చేస్తారు. ఇది శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మానికి హైడ్రేషన్, మృదుత్వాన్ని అందిస్తుంది. సాధారణ మాయిశ్చరైజర్ల మాదిరిగా కాకుండా సూదులతో ఇంజెక్ట్ చేయడం వల్ల ఇది చర్మం పొరల్లోకి లోతుగా చొచ్చుకునిపోయి కాంతిగా ఉండేలా చేస్తుంది. అలాగే ముఖాన్ని హైడ్రేటెడ్గా ఉంచి, ముఖంపై ఉండే గీతలు, ఆకృతి సమస్యలు, వృధాప్య ముడతలను నివారిస్తుంది. చర్మాన్ని రిపేర్ చేసేలా తేమ స్థాయిని నింపుతుంది. ఇది యవ్వనపు ఛాయను అందించి, ముఖం ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. చర్మాన్ని పునరుజ్జీవింపబడేలా చేస్తుంది. మిగతా కాస్మెటిక్ చికిత్స విధానాల కంటే ఇది తక్షణ ఫలితాన్ని ఇస్తుంది. చర్మం ఆకృతిని, రంగును మెరుగ్గా ఉంచుతుంది. ముఖం ఎప్పటికీ యవ్వనంలా కనిపించాలానుకునేవారికి ఈ పద్ధతి మేలు. వృధాప్య ఛాయలను నివారించాలనుకునే వారికి, యూబైలలో ఉన్న మహిళలకు ఈ చికిత్స విధానం బెస్ట్ ఆప్షన్. ఈ ఇంజెక్ట్ మాశ్చరైజర్లు కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తాయి. దీంతో చర్మానికి మంచి బూస్టింగ్ లభించడమే గాక మేను యవ్వనంగా మారేలా పునరుజ్జీవింప చేసి ముడతలను దూరం చేస్తుంది. అయితే ఈ చికిత్సను అర్హులైన నిపుణుల పరివేక్షణలో చేయించుకోవడం ఉత్తమం. (చదవండి: ఈ డివైజ్తో కాళ్లు నొప్పులు మాయం!)
ఈ డివైజ్తో కాళ్లు నొప్పులు మాయం!
తరుచు పెద్దవాళ్లు కాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. ఈ సమస్య ఎక్కువగా రాత్రి సమయాల్లోనే వేధిస్తుంటుంది. అలాగే ఎక్కువ గంటలు నిలబడి పనిచేసే ఉద్యోగులు కూడా ఇలాంటి సమస్యనే ఫేస్ చేస్తుంటారు. ముప్పై దాటిన మహిళలు, కొంతమంది పిల్లలు తరుచుగా కాళ్లు పీకేస్తున్నాయని అంటుంటారు. అలాంటి వాళ్ల కోసం అద్భుతమైన డివైజ్వచ్చింది. దీంతో దెబ్బకు ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఈ 8 పిక్స్ లెగ్ మసాజ్ మిషాన్ అలసిన కాళ్లకు చక్కటి రిలీఫ్ని ఇస్తుంది. చిటికెలో మీ కాళ్ల నొప్పులు మాయం అవుతాయి. అరికాళ్లు, మోకాళ్లు పీకేస్తున్నట్లు ఉన్నవాళ్లకి ఈ డివైజ్ అద్భుతమైన వరం. కాళ్లకు చాలా సున్నితంగా మసాజ్ చేస్తూ మొత్తం కాళ్లకు రక్తప్రసరణ జరిగేలా చేస్తుంది. ఇది ఒకరకంగా అసౌకర్యాన్ని తెలియని ఒత్తడిని కూడా దూరం చేస్తుంది. కాళ్లు నొప్పులుగా ఇబ్బందిగా ఉంటే ఒక విధమైన అసౌకర్యంగా, ఏమయ్యిందనే టెన్షన్ ఉంటుంది. ఈ మసాజ్ మెషిన్తో ఆ సమస్యలు దూరమవ్వడమే గాక మీ కాళ్ల సమస్యలు కూడా మాయం అవుతాయి. ఈ డివైజ్ ఖరీదు రూ. 13 వేలు పైనే ఉంటుందట. (చదవండి: 'జలుబు' ఇంత ప్రమాదకరమైనదా? ఇలా కూడా ఉంటుందా..?)
సీనియర్ ఐఏఎస్ ఇంట్లో విషాదం : చందమామలాంటి కుమార్తె తిరిగి రాని లోకాలకు
భార్యభర్తలిద్దరూ ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. వీరికి అందమైన కుమార్తె. చదువులో కూడా బాగా రాణిస్తోంది. ఇంతలోనే అనూహ్య పరిణామం వారి జీవితాల్లో తీరని అగాథాన్ని నింపింది. ఉన్నత చదువులు చదువుకుని తమకు మంచి పేరు తెస్తుందనుకున్న కుమార్తె అర్థాంతరంగా తనువు చాలించిన ఘటన కలకలం రేపింది.పోలీసులు అందించిన సమాచారం మహారాష్ట్రలో ఉన్నత పదవుల్లో ఉన్నారు వికాస్రస్తోగి, ఆయన భార్య రాధికా రస్తోగి. వికాస్ రస్తోగి మహారాష్ట్ర విద్యా శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, రాధికా రస్తోగి రాష్ట్ర హోం శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. వీరికి లిపి రస్తోగి (27)అనే కుమార్తె ఉంది. ఈమె హర్యానాలోని సోనేపట్లో న్యాయశాస్త్రం చదువుతోంది అయితే పరీక్షలకు సంబంధించిన ఒత్తిడి నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ముంబైలోని అపార్ట్మెంట్లోని 10వ అంతస్తు నుంచి దూకింది. లిపిని వెంటనే జిటి ఆసుపత్రికి తరలించి నప్పటికీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదని మృతికి ఎవరినీ నిందించవద్దంటూ పేర్కొన్న సూసైడ్ నోట్ని అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు కాగా 2017లో ఇదే తరహాలో మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారులు మిలింద్, మనీషా మహీస్కర్ జంట 18 ఏళ్ల కుమారుడిని కోల్పోయారు.
మేనరికం పెళ్లి చేసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
హిందూ వివాహ వ్యవస్థలో మేనరికపు వివాహాలు సర్వసాధారణంగా చూస్తుంటాం. కుటుంబాల మధ్య సంబంధాలు నిలిచి ఉండాలనే ఆలోచనతో కొంతమంది, ఆస్తుల పరిరక్షణ కోసంమరికొంతమంది మేనత్త, మేనమామ పిల్లల మధ్య మేనరికపు వివాహాలు జరుగుతుంటాయిం. అయితే ఇలా మేనరికపు పెళ్లిళ్లు చేసుకున్న కొన్ని కుటుంబాల్లో పిల్లలు జెనెటిక్ లోపాలతో పుట్టడం లాంటివి కూడా చూస్తూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20శాతం పెళ్లిళ్లు దగ్గరి బంధువుల్లోనే జరుగుతున్నాయి. ఇలాంటి వివాహాలను వైద్య పరిభాషలో ‘కన్సాంగ్వినియస్ మ్యారెజెస్’ అంటారు. అసలు మేనరికపు పెళ్లిళ్లు చేసుకోవచ్చా? చేసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.బావ మరదలు పెళ్లి, మేనమామ మేనకోడలు పెళ్లి, ఇంకా రెండు కుటుంబాల మధ్య తరాల తరబడి కుండ మార్పిడిఅంటే వీళ్ల అమ్మాయిని, వారి అబ్బాయికి, వారి అబ్బాయిని వీరి అబ్బాయికి ఇచ్చి పెళ్లిళ్లు చేయడం. డా.శ్రీకాంత్ మిర్యాల ఎక్స్లో పోస్ట్ చేసిన వివరాలు.సాధారణంగా రక్తసంబందీకులు కాని తల్లిదండ్రులకి పుట్టే పిల్లల్లో సుమారు 2-4శాతం మందికి చిన్న లేదా పెద్ద అవకారాలు పుట్టుకతో ఉండే అవకాశాలు ఉన్నాయి. అది సాధారణం. అయితే ఈ మేనరికపు వివాహాల్లో ఇది రెట్టింపు అవుతుంది. అయితే పిల్లలు అవకారాలతో పుట్టే స్థితి పైన చెప్పిన మూడింట్లో చివరిదాంట్లో ఎక్కువ. మొదటి దాంట్లో తక్కువ. ఈ ఎక్కువ తక్కువలు పెళ్లి చేసుకున్న జంటలో భార్య భర్తల మధ్య జన్యుసారూప్యం ఎంత అన్నదానిబట్టి ఉంటుంది. బావమరదళ్ల కంటే, మేనమామ మేనకోడలి మధ్య జన్యుసారూప్యం ఎక్కువ, అలాగే కుండ మార్పిడిలో అవే జన్యువులు మాటిమాటికీ పంచుకోవడం వలన ఇంకా ఎక్కువ.ఇటువంటి వివాహాలవలన అబార్షన్లు ఎక్కువవటం, మృత శిశువులు జన్మించటం, పుట్టినపిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, గుండెలో అవకారాలు, బుద్ధిమాంద్యంతో పాటు ఇతర మానసిక సమస్యలు, మెదడు జబ్బులు, రక్తహీనత మొదలైన రకరకాల సమస్యలు చాలా ఎక్కువగా కలుగుతాయి. కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అవకారాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి కానీ పుట్టే పిల్లలందరూ అవకారాలతో పుడతారని కాదు.అయితే ఈ వివాహాలు మిగతా వివాహాల కంటే దృఢంగా ఉండటం, విడాకుల సంఖ్య తక్కువగా ఉండటం, ఆరోగ్య సమస్యలున్నప్పుడు రెండు కుటుంబాలూ సహాయపడటం మొదలైనవి లాభాలు.ఇటువంటి వాళ్లు పెళ్లిచేసుకునేముందు జెనిటిక్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. దీనిలో ఇప్పటికే కుటుంబంలో ఉన్న వంశపారంపర్య జబ్బుల్ని కనుక్కుని, అవి పుట్టే పిల్లలకి వచ్చే అవకాశం లెక్కగట్టి చెబుతారు. దాన్ని బట్టి కాల్క్యులేటెడ్ రిస్క్ తీసుకోవచ్చు. ఇప్పటివరకూ కుటుంబంలో పెద్ద సమస్యలు లేనివాళ్లు, అవగాహన ఉంటే, ప్రేమ ఉన్న బావమరదళ్ల వరకూ ఫర్వాలేదు కానీ మిగతావి సమంజసం కాదు.
న్యూస్ పాడ్కాస్ట్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి, రీప్లేస్మెంట్ మనమే.. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
మళ్లీ విజయం మనదే, ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం... ‘ఎక్స్’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు కేరళకు నైరుతి రుతుపవనాల రాక.. రెండు రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నాయకులు చల్లే బురదలోనే కమలాలు విరగబూస్తాయి.. ప్రధాని మోదీ ధీమా.. ఇంకా ఇతర అప్డేట్స్
మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్నికల్లో విపక్ష ‘ఇండియా’ కూటమి గెలిస్తే హిందువులు రెండో తరగతి పౌరులే.. ప్రధాని మోదీ ఆందోళన.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో 61.11 శాతం ఓటింగ్ నమోదు.. ఇంకా ఇతర అప్డేట్స్
దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
‘పాపం..దొంగ గారు.. ఏసీ చూడగానే ఫ్లాట్!’ కట్ చేస్తే..!
దేశంలోఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోద వుతున్నాయి. ఏసీ, ఫ్యాన్లు లేనిదే క్షణం కూడా ఉండలేని పరిస్థితి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. చోరీకి వచ్చిన ప్రబుద్ధుడు, ఎంచక్కా ఏసి వేసుకొని ఆదమరిచి నిద్ర పోయిన ఘటన, ఫోటో వైరల్గా మారింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న ఇంట్లోకి చోరీకి చొరడ్డాడో వ్యక్తి. అసలే పగలూ రాత్రి తేడా లేకుండా మండే ఎండలు పైగా పూర్తిగా మద్యం మత్తులో ఉన్న అతగాడు, ఏసీ చూడగానే మైమరిచిపోయాడు. ఏసీ ఆన్ చేసుకొని, నేలమీదే ఒక దిండు వేసుకుని హాయిగా గుర్రు కొట్టి నిద్ర పోయాడు. తెల్లవారేక ఇంటి ముందు గేటు తెరిచి ఉండడంతో వారణాసిలో విధులు నిర్వహిస్తున్న సదరు ఇంటి యజమాని డాక్టర్ సునీల్ పాండేకు సమాచారం అందించారు పొరుగువారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి చ్చింది. సంఘటనా చేరుకున్న పోలీసులు కూడా విస్తుపోయారు. చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని అలాగే గాఢనిద్రలోకి జారుకున్నాడు. చిత్రం వైరల్గా మారింది. దొంగ తనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి నిద్రపోయాడని డీసీపీ నార్త్ జోన్ ఆర్ విజయ్ శంకర్ తెలిపారు. అతణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు.
అత్తింటి వేధింపులతో గర్భిణి బలవన్మరణం
పెనమలూరు: కృష్ణాజిల్లా పెనమలూరు మండలం యనమలకుదురులో ఓ గర్భిణి బలవన్మరణానికి పాల్పడింది. వారసుడు కావాలని అత్తింటివారు వేధించడంతో కడుపులో ఉన్న ఆడబిడ్డను చంపలేక తానే ప్రాణాలు తీసుకుంది. సీఐ టి.వి.వి.రామారావు కథనం మేరకు.. యనమలకుదురు పుట్టరోడ్డుకు చెందిన కావ్యశ్రీ (19)కి రెండేళ్ల కిందట విజయవాడ కండ్రికకు చెందిన సందు శ్రీకాంత్తో(31) వివాహమైంది. శ్రీకాంత్ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. పదినెలల కిందట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కావ్యశ్రీ, ఇటీవల మళ్లీ గర్భం దాల్చింది. ఆమెకు ప్రస్తుతం ఐదో నెల. భర్త శ్రీకాంత్ నాలుగు రోజుల క్రితం కావ్యశ్రీకి విజయవాడలో స్కానింగ్ చేయించగా, ఆడపిల్ల పుడుతుందని అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో దంపతుల మధ్య గొడవ మొదలైంది. ఆడపిల్ల వద్దు, వారసుడే కావాలని కావ్యశ్రీపై భర్త శ్రీకాంత్తోపాటు అత్త వెంకటేశ్వరమ్మ, మామ లక్ష్మణరావు ఒత్తిడి తెచ్చారు. దీంతో భార్యాభర్తలు గత బుధవారం ఆస్పత్రికి వెళ్లగా, అబార్షన్ చేస్తే ప్రమాదమని డాక్టర్ హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. అయితే శ్రీకాంత్ స్నేహితుడు కానిస్టేబుల్ శ్యామ్ తన పరపతితో అబార్షన్ చేయిస్తానని చెప్పడంతో భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ మొదలైంది. అబార్షన్ చేయించుకోనని కడుపులో బిడ్డను చంపలేనని శుక్రవారం రాత్రి కావ్యశ్రీ తన భర్తకు తేల్చి చెప్పింది. శనివారం ఉదయం భార్యాభర్తలు మళ్లీ అబార్షన్ విషయమై చర్చించుకున్నారు. అనంతరం కావ్యశ్రీ స్నానానికి వెళ్తూ భర్తకు ఫోన్ ద్వారా ఓ మెసేజ్ చేసింది. ‘తాను వారసుడిని ఇవ్వలేనని,..కడుపులోని బిడ్డను చంపలేనని.. తనను ఛీదరించుకోవద్దని.. పదినెలల కుమార్తెను తన తల్లిదండ్రులే పెంచాలని..తనను క్షమించాలని’ ఆ మెసేజ్లో పేర్కొంది. కావ్యశ్రీ బాత్రూమ్ నుంచి ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కటుంబసభ్యులు, భర్త బాత్రూమ్ తలుపులు తెరిచి చూడగా వెంటిలేటర్కు కావ్యశ్రీ ఉరేసుకుని కొనఊపిరితో ఉంది. ఆమెను వెంటనే కానూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ పరిస్థితి విషమించడంతో కావ్యశ్రీ ఆదివారం ఉదయం మృతి చెందింది. మృతిరాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కావ్యశ్రీ భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యార్థినులపై కామాంధుని వల
యశవంతపుర: రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఒకచోట కామాంధుల అఘాయిత్యాలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల పెన్డ్రైవ్ సంఘటన ఒకవైపు సంచలనం సృష్టిస్తుండగా, మరోవైపు ఉడుపిలోనూ అదే మాదిరి సంఘటన బయటపడింది. వ్యాపారవేత్త శ్రేయస్ నాయక్ (25) పలువురు బాలికలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. జిల్లాలోని కుందాపుర తాలూకాలో అమావాస్యె బైలు పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. శ్రేయస్పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేయటంతో పరారయ్యారు. విద్యార్థులపై లైంగిక దాడులు జరిపి అశ్లీల వీడియోలను తీసి తన ల్యాప్లాప్లో ఉంచుకున్నట్లు బయట పడింది.ఎక్కువగా కాలేజీ విద్యార్థులను మాయమాటలు చెప్పి గత సంవత్సరం నుంచి లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఉడుపిలో హాలాడి రోడ్డులోని హెగ్గూడ్లులోని ప్రాంతానికి తీసుకెళ్లి కారులో లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన్నట్లు అరోపణలు వస్తున్నాయి. వీడియోలు తీసుకున్న నిందితుడు వాటిని చూపి తను పిలిచినప్పుడు రావాలని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఒక బాలిక అతని వల్ల గర్భవతి కూడా అయ్యింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో మే 18న పోక్సో కేసు నమోదైంది. ఆ తరువాత విచారణలో అతని అకృత్యాలు ఒక్కొక్కటే వెలుగుచూశాయి. అంతలోనే దుండగుడు పరారయ్యాడు. శ్రేయస్ అరెస్ట్కు పోలీసు బృందాలు గాలింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డా.కె.అరుణ్ ఆదివారం తెలిపారు. నర్సుపై వైద్యుని అకృత్యం ఉడుపి జిల్లాలో మరో ఘటనలో.. కుందాపుర తాలూకా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ రాబర్ట్ రెబల్పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సుపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు కుందాపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు రాబర్ట్ రెబల్ను సస్పెండ్ చేశారు. గర్భం దాల్చిన చిన్నారిదొడ్డబళ్లాపురం: అత్యాచారానికి గురైన బాలిక గర్భం దాల్చిన కేసులో ముగ్గురిని దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి పోలీసులు అరెస్టు చేసారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి మహమ్మద్ ఇక్బాల్ (26), ఫారూక్ (19), మరో మైనర్ బాలున్ని అరెస్టు చేశారు. నిందితులు కొన్ని నెలల క్రితం బాలికపై అత్యాచారం జరిపారు. బాలిక ఇప్పుడు ఆరునెలల గర్భంతో ఉండడంతో దారుణం వెలుగు చూసింది.
తుపాకీతో కాల్చుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వేదవతి (26) గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తేలిందని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారిస్తామని డీఎస్పీ రామచంద్రరావు, అర్బన్ సీఐ సుధాకర్రెడ్డి చెప్పారు. వారు తెలిపిన వివరాల మేరకు.. పుంగనూరు సమీపంలోని బింగానిపల్లెకు చెందిన వేదవతి, మదనపల్లెకు చెందిన దస్తగిరి 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదేళ్ల పాప ఉంది. దస్తగిరి పుంగనూరులోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ఫ్యాకలీ్టగా పనిచేస్తున్నారు. వేదవతి చిత్తూరు నుంచి ఏడాది కిందట అన్నమయ్య జిల్లాకు బదిలీపై వచ్చారు. రాయచోటిలోనే కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి చేతిలో ఉన్న గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని రాయచోటి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.