Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CM Jagan Speech In Puttur Public Meeting
మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్‌

సాక్షి,  చిత్తూరు జిల్లా: మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలను అమలు చేశామని.. హామీలు అమలయ్యాయో లేదో ఇంటింటికి పంపించి అడిగే సంప్రదాయం మొదలుపెట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ,59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు.‘‘వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్‌ నొక్కాడు. అక్కచెల్లెమ్మలకు నేరుగా 2 లక్షల 70 వేల కోట్లు అందించాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేని పాలన అందించాం. సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందడం గతంలో చూశారా?. ఏకంగా 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన రోజులు గతంలో చూశాం. మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మర్చాం’’ అని సీఎం చెప్పారు‘‘ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాం. పేదవాళ్లు ఆరోగ్యం బాగోలేక అప్పులపాలు కాకూడదని రూ.25 లక్షలకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. ఇంటి వద్దకే రేషన్‌, పౌరసేవలు, తలుపుతట్టి పథకాలు.. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?. రైతు భరోసా గతంలో ఉండేదా? పెట్టుబడి సాయం అందేదా?. గ్రామ సచివాలయాల్లో 600 రకాల సేవలు అందిస్తున్నాం. చంద్రబాబు పాలనలో చేసిన మంచిపని ఒక్కటైనా గుర్తొస్తుందా?. ఇలాంటి వ్యక్తి సూపర్‌ సిక్స్‌ అంటే నమ్మొచ్చా?. అవ్వాతాతల పెన్షన్‌ ఇంటికే రావాలంటే వైఎస్సార్‌సీపీకే ఓటేయండి’’ అని సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.‘‘14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబు ఏం చేశాడు?. 2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా?. చంద్రబాబు సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ అంటున్నాడు నమ్ముతారా?. ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్‌కారు ఇస్తారంట.. నమ్ముతారా?’’ అంటూ సీఎం జగన్‌ ఎద్దేవా చేశారు.ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్ జగన్ కు ఓటేస్తే .. పథకాలు కొనసాగింపు, ఇంటింటా అభివృద్ధి పొరపాటున బాబుకు ఓటేస్తే .. పథకాలు ముగింపే బాబుకు ఓటు వేయడమంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడు అక్కచెల్లెమ్మలకు నేరుగా రూ. 2 లక్షల 70 వేల కోట్లు అందించాం సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు అందడం గతంలో చూశారా ? ఏకంగా 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం మేనిఫెస్టో ను చెత్తబుట్టలో వేసిన రోజులు గతంలో చూశాం మేనిఫెస్టో కు, విశ్వసనీయతకు అర్ధం చెప్పింది మీ బిడ్డే మేనిఫెస్టో లోని 99శాతం హామీలను నెరవేర్చాం నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లు 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇంగ్లీష్ మీడియంతో పాటు ఐబీ సిలబస్ వరకు వెళ్లాం బడులు తెరిచే నాటికి విద్యాకానుక, గోరుముద్దపూర్తి ఫీజులు కడుతూ జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో 93% విద్యార్థులకు చదువులు ఇంటర్నేషనల్ యూనివర్శిటీలతో సర్టిఫైడ్ కోర్సులు అక్కచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నా వడ్డీ, చేయూత అక్కచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అక్కచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం గతంలో లేని విధంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఎన్నడూ లేని విధంగా అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్ ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమ పథకాలు రైతు భరోసాతో రైతన్నకు తోడుగా నిలిచాం రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం సకాలంలో ఇన్ ఫుట్ సబ్సిడీ, రైతన్నలకు తోడుగా ఆర్బీకే వ్యవస్థ విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం బాబు హయాంలో రైతన్నకు ఇంత మంచి జరిగిందా ? డ్రైవర్ అన్నదమ్ములకు వాహనమిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం మత్య్సకారులకు మత్య్సకార భరోసా, లాయర్ల కు లా నేస్తం జగనన్న తోడు, చేదోడు తో చిరువ్యాపారులకు తోడుగా నిలిచాం పేదవాడి వైద్యం కోసం రూ. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పేషెంట్ విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరాతో ఆదుకున్నాం గ్రామాల్లోనే ఆరోగ్య సురక్ష ఫ్యామిలీ, డాక్టర్ విలేజ్ క్లినిక్ పేదవాడి ఆరోగ్యం కోసం ఇంతగా పరితపించిన ప్రభుత్వం ఉందా ? ఏ గ్రామానికి వెళ్లినా 600 సేవలు అందించే గ్రామ సచివాలయం గ్రామాల్లోనే వాలంటీర్ వ్యవస్థ, ఆర్బీకే వ్యవస్థ గ్రామాల్లోనే ఫైబర్ గ్రిడ్, డిజిటల్ లైబ్రరీలు, విలేజ్ క్లినిక్ 14 ఏళ్లు సీఎం గా చేశానని చెప్పుకునే చంద్రబాబు ఏం చేశాడు?బాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా ? 2014 లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా ?రూ. 81,612 కోట్ల రైతు రుణమాఫీ చేస్తానన్నాడు .. చేశాడా ? రూ. 14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేశాడా ? ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు .. చేశాడా ? ఇంటింటికి జాబు .. లేదంటే నిరుద్యోగ భృతి అన్నాడు. ఇచ్చాడా ? రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు .. చేశాడా ? ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి అమ్మేశాడు సింగపూర్ ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు .. చేశాడా ? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు .. నిర్మించాడా ? చంద్రబాబు సూపర్ సిక్స్, సెవన్ అంటున్నాడు .. నమ్ముతారా ? ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తారంట .. నమ్ముతారా ?చంద్రబాబు చేసేవన్నీ మాయలు, మోసాలేఏమాత్రం ఎండను ఖాతరు చేయకుండా ఆప్యాయత, ఆత్మీయతతో వచ్చిన అందరికీ కృతజ్ఞతలుకేవలం మూడు రోజుల్లో జరగనుంది కురుక్షేత్ర మహా సంగ్రామంజరగబోయేవి ఇంటింటి అభివృద్ధిని నిర్ణయించే ఎన్నికలు14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క మంచి కానీ, ఒక్క స్కీమ్‌ గానీ గుర్తుకు వస్తుందా?అధికారం వస్తే చంద్రబాబు చేసేవన్నీ మాయలు, మోసాలే2014లో ప్రజలు చంద్రబాబు చెప్పిన మేనిఫెస్టో నమ్మి ఓట్లు వేసారుముఖ్యమైన హామీలంటూ చంద్రాబు చెప్పినవాటిలో ఏ ఒక్కటీ చేయలేదురూ.87,612కోట్ల వ్యవసాయరుణాల మాఫీ జరగలేదురూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాల మాఫీ జరగలేదుమహాలక్ష్మీ పథకం కింద రూ.25,000 బ్యాంకుల్లో వేస్తామని ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా వేయలేదుఇంటికో ఉద్యోగం, లేదా ప్రతినెలా రూ.2000 నిరుద్యోగ భృతి అని చెప్పి ఎవ్వరికీ ఇవ్వలేదు3 సెంట్ల స్థలం, కట్టుకునేందకు పక్కా ఇల్లు అని ఒక్క సెంటు స్థలం కూడా ఎవ్వరికీ ఇవ్వలేదు10వేల కోట్లతో ఏటా బీసీ సబ్‌ ప్లాన్, చేనేత, పవర్‌లూమ్‌ రుణాల మాఫీ, ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, సింగపూర్ మించి అభివృద్ధి అన్నదిఏదీ జరగలేదుఇలాంటి వాళ్లని నమ్మవచ్చా?సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ అంటున్న చంద్రబాబును నమ్మవచ్చా?గత ఎన్నికలప్పుడు చెప్పిన ఒక్క హామీ నెరవేర్చని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఇప్పుడు కొత్త హామీలతో వచ్చాడుపేదవాడి భవిష్యత్‌ మారాలంటే ఫ్యాన్‌ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి.            

KSR Comments ON TDP And Congress Guarantees That Not possible to implement
చంద్రబాబు అరువు మేనిఫెస్టో.. ఆ రాష్ట్రాల్లో పరిస్థితి ఇదే..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెలుగుదేశం కూటమి అబద్దాలకు అంతు లేకుండా పోతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఇక అసత్యాలే గత్యంతరం అన్నట్లుగా ప్రచారాన్ని పెంచాయి. టీడీపీ భారీ ఎన్నికల వాగ్దానాలు చేసినా, జనం వాటిని నమ్మడం లేదు. అందుకే లాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ పచ్చి మోసపూరిత ప్రచారానికి కూటమి దిగింది. ఫుల్ పేజీ ప్రకటనలే కాకుండా, అవే అబద్దాలతో ఈనాడు మీడియా పెద్ద ఎత్తున కథనాలు కూడా వండివార్చింది.దీనికి ఒకటే కారణం కనిపిస్తుంది. సూపర్ సిక్స్ అంటూ టీడీపీ, జనసేనలు ఇచ్చిన హామీలు అయ్యేవి, పోయేవి కాదని ప్రజలు నిశ్చితాభిప్రాయానికి రావడమే. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ, కర్నాటక వంటి రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికల సందర్భంగా దాదాపు ఇవే తరహా వాగ్దానాలు చేసి, అధికారంలోకి వచ్చినా వాటిని అమలు చేయలేక సతమతమవుతున్నాయి. ఆ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఇచ్చిన మానిఫెస్టోలలోని వాగ్దానాలతో పాటు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న నవరత్నాలలోని అంశాలను జోడించి చంద్రబాబు కాపీ మానిఫెస్టోని తయారు చేసుకున్నారు. జగన్ ఇచ్చే స్కీముల కన్నా ఇంకా ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు. అందుకు అయ్యే వ్యయం ఎంతో మాత్రం టీడీపీ చెప్పడం లేదు.ఆరు గ్యారంటీల అమలు సంగతేంటి?ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ హామీలు ఎన్ని అమలు అవుతున్నాయో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. విశేషం ఏమిటంటే హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం బీఆర్ఎస్ స్వీప్ చేస్తే, గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ స్వీప్ చేసింది. తద్వారా అవసరమైన మెజార్టీకన్నా కాంగ్రెస్‌కు కొద్దిగా ఎక్కువ సీట్లు వచ్చాయి. ఫలితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో చాలావరకు అమలు చేశామన్న అభిప్రాయం ప్రజలలో కలిగించడానికి గట్టి కృషి చేస్తున్నారు. రేవంత్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు  తదితరులు, అలాగే బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటివారు  కార్నర్ చేస్తున్నారు.నోరు జారిన రాహుల్‌కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నిర్మల్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ.. మహిళలకు  ప్రతి నెల ఇస్తామని చెప్పిన 2500 రూపాయల హామీని అమలు చేసినట్లు చెప్పారు. దీనిపై కేసీఆర్ మండిపడ్డారు. నిజానికి కాంగ్రెస్ ఇచ్చిన మానిఫెస్టోలో అనేకం ఆచరణ సాధ్యం కానివని అప్పట్లో అందరూ గుర్తించినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. అందుకు ప్రధాన కారణం కేసీఆర్‌ అనుసరించిన అహంభావ పూరిత ధోరణి అన్నది ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకుల అబిప్రాయం. పలు అబియోగాలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేలకు కూడా టిక్కెట్లు ఇచ్చి ఆయన నష్టపోయారు. అది వేరే కథ.ఏపీలో తెలుగుదేశం కూటమి  అనేక వాగ్దానాలు చేసి ప్రజలను ఓట్లు అడుగుతోంది. జనం వాటిని నమ్మకపోవడంతో కొత్తగా లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అబద్దాలను సృష్టించి టీడీపీ కేసులలో చిక్కుకుంది. అయినా వదలకుండా అదే అంశంపై ఫుల్‌ పేజీ ప్రకటనలు ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ స్త్రీలకు ఉచిత బస్ ప్రయాణం హామీని అమలు చేసింది. దీనివల్ల ఆర్టీసీకి వచ్చే నష్టాల సంగతి ఎలా ఉన్నా, అమలు వరకు  ఓకే. కాని దీని ఫలితంగా ఆటోలపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది చాలా నష్టపోయారు. మొదట వ్యక్తం అయినంత ఆశాభావ స్థితి ఇప్పుడు ఉన్నట్లు లేదు. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్లకు సబ్సీడీ వంటి స్కీములు అమలు చేసినట్లు చెబుతున్నా,ఎంతమందికి అవి అందుతున్నది చెప్పడం కష్టమే.వంద రోజుల్లో వాగ్దానాలు అమలు.. ఎన్నికల ఫలితాలు వచ్చాక డిసెంబర్ తొమ్మిదిన రైతుబంధు నిధులను ఎక్కువ చేసి మరీ చెల్లిస్తామని పీసీసీ అధ్యక్ష హోదాలో ప్రకటించారు. ఆ తేదీన చెల్లించలేదు. ఎవరైనా అడిగితే ఇప్పుడేగా ప్రభుత్వం ఏర్పడిందని కాంగ్రెస్ నేతలు దబాయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల సుడిగుండంలోకి నెట్టేసిందని చెప్పేవారు. అయినా వంద రోజుల్లో అన్ని వాగ్దానాలు అమలు చేస్తామని అనేవారు. ఆ వంద రోజులు దాటిపోయింది. కానీ చాలా వాగ్దానాలు అలాగే ఉండిపోయాయి. ఉదాహరణకు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంశం తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలలో రాజకీయ పార్టీల మధ్య వాద, ప్రతివాదాలకు  కారణం అవుతోంది.రాజీనామాల సవాల్‌మాజీ మంత్రి హరీష్ రావు ఈ హామీలు అమలు చేశారని రుజువు చేస్తే  తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాలు చేశారు.దీనికి ముఖ్యమంత్రి రేవంత్ బదులు ఇస్తూ రుణమాఫీని ఆగస్టు పదిహేనులోగా చేస్తామని, హరీష్ రాజీనామాకు సిద్దంగా ఉండాలని అంటున్నారు. నిజంగా దీనికి అయ్యే వేల కోట్లు సిద్దం చేసుకుని అమలు చేస్తే రేవంత్‌కు రైతులలో మంచిపేరే వస్తుంది. కానీ చేయలేకపోతే ఎన్నికల కోసం చెప్పినట్లవుతుంది. కేసీఆర్ రైతు బంధు ఎకరాకు  పదివేలు ఇస్తుంటే దానిని పదిహేనువేలు చేసి ఇస్తామని రేవంత్ ప్రకటించారు. కానీ  ఆ ప్రకారం ప్రభుత్వం ఇవ్వలేకపోతోంది.విమర్శల వెల్లువకొంతమందికి పాత రైతు బంధు ప్రకారం డబ్బులు జమ అయినా, కాంగ్రెస్ చెప్పినట్లు మాత్రం జరగడం లేదు. అలాగే రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు చొప్పున ఇస్తామన్నది కాంగ్రెస్ వాగ్దానం. ఏఐసీసీ ప్రకటించిన లక్ష రూపాయల సాయానికి ఇది అదనమని రాహుల్ అన్నారు. అక్కడితో ఆగకుండా 2500 రూపాయల చొప్పున స్త్రీలకు చెల్లిస్తున్నట్లు రాహుల్ చెప్పడం విమర్శలకు దారి తీసింది. కేసీఆర్‌ దీనిని అందుకుని రాహుల్ మాటల వీడియోని జనానికి వినిపించి విమర్శలు  గుప్పిస్తున్నారు.రైతుభరోసా కింద రూ.15 వేలు ఇవ్వకపోగా, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన రూ.పది వేలు కూడా ఇవ్వకుండా రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నదని, అందరికీ రైతుబంధు జమ చేశామని ఒకసారి, ఇక నాలుగు లక్షల మందికే ఇవ్వాల్సి ఉన్నదని మరోసారి చెప్తూ కాలయాపన చేస్తున్నదని బీఆర్ఎస్ చెబుతోంది.స్పష్టత ఇవ్వలేని అయోమయంఎన్నికల తరుణంలో కొంతవరకు ఈ డబ్బు వేసినట్లు తాజాగా అంటున్నారు. మరి రైతు రుణమాఫీని ఎలా చేస్తారు? ఎవరెవరికి వర్తింపజేస్తారు? విధివిధానాలేమిటి? అనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేని అయోమయం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏ ఊరి వెళ్తే ఆ ఊరి దేవుళ్లు, దేవతల మీద ఒట్టు మీద ఒట్టు పెడుతూ రైతులను నమ్మించేందుకు నానా తంటాలు పడుతున్నారని విపక్షాలు ఎద్దేవ చేస్తున్నాయి.రైతులు పండించిన పంటలకు రూ.500 బోనస్‌ హామీ బోగస్‌ ముచ్చటగా మిగిలిందని విపక్షం వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటూ ప్రియాంకాగాంధీ చేత యూత్‌ డిక్లరేషన్‌ ప్రకటింపజేసి అధికారంలోకి రాగానే మాట మార్చింది. అసలు తాము నిరుద్యోగ భృతి హామీయే ఇవ్వలేదంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుద్యోగ యువతను వెక్కిరించారు.ఒట్టుల సీఎం..రైతు రుణమాఫీపై రోజుకో దేవుడిపై ఒట్టు పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం నిర్మల్‌ జనజాతర సభలో మాట్లాడుతూ.. ఇంద్రవెల్లి అమరవీరుల సాక్షిగా ఒట్టు పెట్టారు. ఎర్రవెల్లి జనజాతరలో మాట్లాడుతూ.. జోగుళాంబ అమ్మవారి సాక్షిగా ఒట్టు పెట్టారు. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ, ఈ నెల 9 లోపు రైతు భరోసా అందజేస్తామని చెప్పారు. ఇప్పటికే ఐదు గ్యారెంటీలను అమలు చేశామని, రాబోయే రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు.ఆయన చెప్పిన దాని ప్రకారం పరిశీలిస్తే అవి అర్ధ సత్యాలేనని తేలుతుంది.వృద్దులకు పెన్షన్ నాలుగువేల రూపాయలు చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. కాని ఆ దిశగా ఇప్పటికీ అడుగులు పడలేదు.దళితులకు కేసీఆర్ పది లక్షల చొప్పునే ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే పన్నెండు లక్షల చొప్పున ఉపాది కల్పన స్కీము కింద ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. ప్రస్తుతం ఆ ఊసే రావడం లేదు.కర్ణాటకలోనూ ఇదే పరిస్థితిపలు హామీల పరిస్థితి ఇలాగే ఉంది. కర్నాటకలోను దాదాపు ఇదే పరిస్థితి ఉందని వార్తలు వస్తున్నాయి. అదికారం కోసం ఎన్నికలలో ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత కళ్లు తేలేయడం ఎక్కువ రాజకీయ పార్టీలకు అలవాటైంది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు దేశంలోనే ఒక రికార్డు సృష్టించారని చెప్పవచ్చు. 2014 ఎన్నికలలో లక్ష కోట్ల రైతుల రుణాలు, డ్వాక్ర మహిళల రుణాలు మాపి చేస్తామని చెప్పి ,చివరికి అరకొరగా చేసి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్నారు. అప్పట్లో కాపు రిజర్వేషన్‌లతో సహా  400 పైగా హామీలు ఇచ్చి,వైఎస్ ఆర్ కాంగ్రెస్ పదే,పదే,గుర్తు చేస్తోందని మానిఫెస్టోని టీడీపీ వెబ్ సైట్‌లో నుంచి తొలగించారు.వాగ్దానాల హామీ పూర్తితత్ఫలితంగా 2019 లో చంద్రబాబు ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు. అదే సమయంలో 2019లో వైఎస్సార్‌ కాంగ్రెస్ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయి తాను ఇచ్చిన నవరత్నాల వాగ్దానాలను పూర్తిగా అమలు చేయడం ద్వారా ప్రజల ఆదరణ చూరగొన్నారు. వలంటీర్లు, గ్రామ,వార్డు సచివాలయాలు, రైతు బరోసా కేంద్రాలు, వృద్దుల ఇళ్లకే పెన్షన్‌లు, చేయూత, ఆసరా, విద్యా దీవెన తదితర పెక్కు హామీలను అమలు చేసి చూపించారు.పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఉద్దానం బాదితులకు రక్షిత నీటి పథకం వంటివి నిర్మించారు.99 శాతం హామీలను తాను అమలు చేశానని, మీకు మంచి జరిగి ఉంటేనే తనకు మద్దతు ఇవ్వండని ధైర్యంగా జగన్ చెబుతున్నారు.చంద్రబాబుకు పవన్‌ సరెండర్‌అదే చంద్రబాబునాయుడు 2014 నుంచి 2019 వరకు బాగా పాలించానని, ఫలానా రకంగా వ్యవస్థలు మార్చానని, సంక్షేమం అందించానని చెప్పలేకపోతున్నారు. జగన్త న కొత్త,పాత మానిఫెస్టోలను చూపుతూ ప్రజల ముందుకు దైర్యంగా వెళ్లగలుగుతున్నారు. చంద్రబాబు అలా చేయలేకపోతున్నారు. చంద్రబాబుకు పూర్తిగా సరెండర్ అయిపోయిన పవన్ కల్యాణ్ తన పార్టీ తరపున ఒక మానిఫెస్టోని కూడా తయారు చేసుకోలేకపోయారు. టీడీపీ మానిఫెస్టోనే భుజాన వేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ అయితే టీడీపీ, జనసేనల  మానిఫెస్టోని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. చంద్రబాబు ఆచరణ సాద్యం కాని హామీలు ఇచ్చినందునే తాము ఆ మానిఫెస్టోలో భాగస్వాములు కాలేదని బీజేపీ సీనియర్ నేత యడ్లపాటి రఘునాధ బాబు తెలిపారు.చంద్రబాబువి అన్నీ అబద్దాలేప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు ఏపీలో ప్రచారం చేసినా, టీడీపీ, జనసేనల మానిఫెస్టోకి మద్దతు ఇవ్వలేదు. అసలు ఆ ప్రస్తావనే తేలేదు. ముస్లిం రిజర్వేషన్‌ల వంటి అంశాలలో టీడీపీ మానిఫెస్టోలో క్లారిటీ ఇవ్వలేకపోయింది. తెలంగాణ, తదితర రాష్ట్రాలలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్పిన బీజేపీ, ఏపీలో మాత్రం ఆ ప్రస్తావన తేకుండా జాగ్రత్తపడుతూ డబుల్ గేమ్ ఆడుతోంది. మరో వైపు జగన్ తాను గతంలో ఇచ్చిన హామీలనే కొద్దిపాటి మార్పులతో కొనసాగిస్తామని ధైర్యంగా చెప్పారు. దీంతో చంద్రబాబు ఇచ్చిన మానిఫెస్టోకి అసలు విలువ లేకుండా పోయింది. చంద్రబాబు అన్నీ అబద్దాలే చెబుతారన్న అభిప్రాయానికి ప్రజలు ఎక్కువ  శాతం వచ్చారు.అసత్యాల ప్రచారంతో రాజకీయ లబ్దితెలంగాణ, కర్నాటకలలో కాంగ్రెస్ వాగ్దానాలు అమలు చేయడం  విఫలం అవుతున్న మాదిరే ఏపీలో చంద్రబాబు కూడా అవేవి చేయలేడన్న స్పష్టమైన అభిప్రాయానికి ప్రజలు వచ్చారు. అందుకే రాష్ట్రంలొ చంద్రబాబు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద చల్లి, అసత్యాలు ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. కానీ సోషల్ మీడియా వచ్చిన ఈ రోజులలో ఏ రాష్ట్రంలో ఏమి జరుగుతున్నదో ప్రజలు తెలుసుకుంటున్నారు .దాంతో చంద్రబాబు వంటివారి పప్పులు ఉడకడం లేదు. అందుకే చివరి అస్త్రంగా అబద్దాల మీదే చంద్రబాబు, పవన్ కల్యాణ్, రామోజీ, రాధాకృష్ణలు  ఆధారపడే దైన్య స్థితికి వచ్చారు.

May 10th: ఏపీ ఎన్నికల సమాచారం

ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం.. 

Krishnamma Movie Review And Rating In Telugu
‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ

టైటిల్‌ : కృష్ణమ్మనటీనటులు: సత్యదేవ్, మీసాల లక్ష్మణ్, నందగోపాల్, కృష్ణ తేజ రెడ్డి, అతిర, అర్చన అయ్యర్‌, రఘు కుంచె తదితరులునిర్మాత: కొమ్మలపాటి కృష్ణదర్శకత్వం: గోపాలకృష్ణసమర్పణ : కొరటాల శివసంగీతం: కాలభైరవవిడుదల తేది: మే 10, 2024‘కృష్ణమ్మ’కథేంటంటే..ఈ సినిమా కథంతా 2003-2015 మధ్యకాలంలో జరుగుతుంది. విజయవాడలోని వించిపేటకు చెందిన భద్ర(సత్యదేవ్‌), కోటి(మీసాల లక్ష్మణ్‌), శివ(కృష్ణ తేజరెడ్డి) అనే ముగ్గురు అనాధలు మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు అన్నట్లుగా బతుకుతారు. ఓ కేసు విషయంలో చిన్నప్పుడే జైలుకెళ్లిన శివ..బయటకు వచ్చాక నేరాలు చేయడం తప్పని భావించి ప్రిటింగ్‌ ప్రెస్‌ పెట్టుకుంటాడు. భద్ర, కోటి మాత్రం గంజాయి దందా, చిన్న చిన్న నేరాలు చేస్తూ జీవితం గడుపుతుంటారు. వించిపేటలోనే హాస్టల్‌లో ఉంటూ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పని చేస్తున్న మీనా(అతిర)తో శివ ప్రేమలో పడతాడు. మరోవైపు భద్ర అదే కాలనీలో ఉంటున్న పద్మ(అర్చన అయ్యర్‌)తో ప్రేమలో పడతాడు. అనాధ అయిన కారణంగా భద్ర ప్రేమను పద్మ తండ్రి ఒప్పుకోరు. మరోవైపు మీనా.. భద్రను సొంత అన్నయ్యలా భావిస్తుంది. మీనా రాకతో అనాధలైన ఈ ముగ్గురికి ఓ ఫ్యామిలీ దొరుకుతంది. భద్ర, కోటి నేరాలు చేయడం మానేసి ఆటో నడుపుకుంటారు. అంతా హ్యాపీగా ఉన్న సమయంలో వీరికి అత్యవసరంగా మూడు లక్షల రూపాయలు కావాల్సి వస్తోంది. దానికి కోసం చివరగా ఓ నేరం చేద్దామనుకుంటారు. అయితే అనుకోకుండా ఈ ముగ్గురు పోలీసులకు పట్టుపడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ ముగ్గురు చేసిన నేరం ఏంటి? వీరిపై నమోదైన కేసు ఏంటి? ఈ ముగ్గురిలో ఒకరు ఎలా చనిపోయారు? ఎవరు చంపారు? సీఐ పాండా వెంకట సుబుద్ది వీరిని నమ్మించి ఎలా మోసం చేశాడు? స్నేహితుడి కోల్పోయిన భద్ర.. తన పగను ఎలా తీర్చుకున్నాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రివెంజ్‌ డ్రామా సినిమాలు తెలుగు తెరకు కొత్తకాదు. చేయని నేరానికి హీరోకి శిక్ష పడడం.. బయటకు వచ్చాకా రివెంజ్‌ తీర్చుకోవడం.. ఈ కాన్సెప్ట్‌ బోలెడు సినిమాలు వచ్చాయి. కృష్ణమ్మ కథ కూడా ఇదే. ఈ రివేంజ్‌ డ్రామాకి స్నేహబంధం యాడ్‌ చేసి..డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు గోపాల కృష్ణ. కానీ కథతో పాటు కథనం కూడా రొటీన్‌గా ఉండడంతో.. ఏదో పాత సినిమా చూశామనే ఫీలింగ్‌ కలుగుతుంది. సినిమాలో వచ్చే ట్విస్టులు ముందే ఊహించొచ్చు. రా అండ్‌ రస్టిక్‌ పేరుతో హీరోకి గెడ్డం పెంచడం.. స్లమ్‌ ఏరియాల్లో జీవించడం.. స్మగ్లింగ్‌.. ఇవన్నీ గత సినిమాల్లో చూసినట్లుగానే అనిపిస్తుంది. ఫ్రెండ్‌షిప్‌ సెంటిమెంట్‌ కూడా వర్కౌట్‌ కాలేదు. ఫస్టాఫ్‌లో అసలు కథే ఉండదు. హీరో, అతని స్నేహితుల పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత ఒకే సమయంలో ఇద్దరి ప్రేమకథలు చూపించారు. శివ పాత్ర లవ్‌స్టోరీ కాస్త ఆసక్తికరంగా అనిపించినా.. భద్ర లవ్‌స్టోరీ మాత్రం కథకి అతికినట్లుగా అనిపిస్తుంది. ఏదో హీరో అన్నాక.. హీరోయిన్‌ ఉండాలి.. ఓ లవ్‌స్టోరీ ఉండాలి అని పద్మ పాత్రను క్రియేట్‌ చేసినట్లుగా ఉంటుంది. ఆ పాత్రకి సరైన ముగింపు కూడా లేకపోవడం గమనార్హం. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకుంటే బాగుండేది. సెకండాఫ్‌లో కథంతా సీరియస్‌ మూడ్‌లో కాస్త ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఈ ముగ్గురిపై పెట్టిన దొంగ కేసు ఏంటి అనేది తెలిసిన తర్వాత కథపై ఆసక్తి సన్నగిల్లుతుంది. తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా తెలిసిపోతుంది. స్నేహితుడిని చంపినందుకు హీరో తీర్చుకునే రివెంజ్‌ కూడా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్‌ చాలా సింపుల్‌గా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..సత్యదేవ్‌ మంచి నటుడే అందులో నో డౌట్‌. కానీ ప్రతి సినిమాకు ఒకే లెవల్‌ ఎక్స్‌ప్రెషన్స్‌.. డైలాగ్‌ డెలివరీ కూడా ఒకేలా ఉండడంతో ఆయన నటనలో కొత్తదనం కనిపించడం లేదు. ఈ చిత్రంలో కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశాడు. కానీ అది పూర్తిగా వర్కౌట్‌ కాలేదు. విజయవాడ స్లాంగ్‌లో మాట్లాడానికి ట్రై చేశాడు కానీ తెరపై కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. యాక్షన్‌ సీన్స్‌లో పర్వాలేదు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. నడి రోడ్డుపై స్నేహితుడు చనిపోయినప్పుడు సత్యదేవ్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ అలా గుర్తిండిపోతుంది. ఇక హీరో స్నేహితులు కోటిగా మీసాల లక్ష్మణ్‌, శివగా కృష్ణతేజ చక్కగా నటించారు.  హీరోయిన్‌గా నటించిన అతిరా రాజ్‌కి ఇది తొలి సినిమా అయినా.. తెరపై చాలా సహజంగా నటించింది. అర్చన అయ్యర్‌ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే నటించింది. నందగోపాల్, రఘు కుంచెతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కాలభైరవ పాటలు గుర్తుపెట్టుకునేలా ఉండవు కానీ.. బీజీఎం ఓకే. ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాత విలువలు బాగున్నాయి.  

Pawan Kalyan sensational comments in an English TV channel interview
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

సాక్షి, అమరావతి/వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్న కాపు రిజర్వేషన్లతో పాటు ముస్లిం రిజర్వేషన్లు అసలు అవసరమేలేదంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ రిజర్వేషన్లనే ఆయన వ్యతిరేకిస్తూ పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంగ్లిష్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్ల అంశంలో ఇటీవల బీజేపీ జాతీయ నేతలు చేస్తున్న ప్రకట­నలకు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ పూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు కోరుకునే వారందరికీ రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమేకాదని తన మనస్సులోని మాటను కుండబద్దలు కొట్టారు. ఈ రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయ మార్గాలు గురించి ఆలోచన చేయాలన్నారు. ఆ ఇంటర్వ్యూలో సంబంధిత మీడియా ఛానల్‌ ప్రతినిధి.. ముస్లింలకు సంబంధించి బీజేపీ వైఖరి గురించి పవన్‌ను ప్రశ్నించినప్పుడు, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. కానీ, వాళ్లు (బీజేపీ) ముస్లిం రిజర్వేషన్లు అమలుచేయబోమని ఆ పార్టీ నేతలు నేరుగా చెబుతున్నారు కదా.. దానిపై మీరేమీ నిరాశ చెందడంలేదా అన్న ప్రశ్నకు పవన్‌ బదులిస్తూ.. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నేతల ప్రకటనలపట్ల తానేమీ నిరాశ, ఆందోళన చెందడంలేదని చెప్పారు. అయినా, రిజర్వేషన్ల అమలుకన్నా యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు పెంచేలా వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు.అందరికీ రిజర్వేషన్లు కూడా కుదరదు..రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్న అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నా సాధ్యమయ్యే పరిస్థితి కాదని పవన్‌ తేల్చిచెప్పారు. ప్రత్యేకంగా తమ సొంత (కాపు) కులం కూడా రిజర్వేషన్ల కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తోందన్నారు. అందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నా కుదరదని.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందని పవన్‌ గుర్తుచేశారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి సాధ్యంకానప్పుడు, ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు.జగన్‌ ఇచ్చిన వాగ్దానాలను  నెరవేర్చలేదు మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో పవన్‌ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. రాష్ట్రంలోని యువకుల గళాన్ని అసెంబ్లీలో బలంగా వినిపిస్తానన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. మైనార్టీల ప్రాథమిక హక్కులకు తాను అండగా ఉంటానని.. కాపులకు రిజర్వేషన్లను అడుగుతున్నారని, న్యాయస్థానాల్లో ఉన్న అంశాలపై తాము మాట్లాడకూడదంటూ ఇంగ్లీష్‌ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకు భిన్నంగా మాట్లాడారు. ఇక ఇక్కడ తాను పెంచి పెద్దచేసిన నాయకుడు తనపై విమర్శలు చేస్తూ తిటడం బాధ కలిగిస్తోందని పోతిన మహేష్‌ పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. అలాగే, వంగవీటి రాధా చట్టసభలకు వెళ్తానంటే తాను అండగా ఉంటానని పవన్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి, నాయకులు వంగవీటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.Video Credits: NDTV 

Am Just Convener: Jay Shah Names Man Behind Ishan Shreyas BCCI Contracts Exit
శ్రేయస్‌, ఇషాన్‌ల వేటు పడటానికి కారణం అతడే: జై షా

టీమిండియా స్టార్లు ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్ సెంట్రల్‌ కాంట్రాక్టులు కోల్పోవడానికి తాను కారణం కాదన్నాడు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా. సెలక్షన్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం మాత్రమే తన విధి అని తెలిపాడు.కాగా దక్షిణాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌.. రంజీల్లో ఆడమని బోర్డు ఆదేశించినా లెక్కచేయలేదు. ఆ తర్వాత వెంటనే ఐపీఎల్‌-2024 కోసం ముంబై ఇండియన్స్‌ క్యాంపులో చేరాడు.మరోవైపు.. శ్రేయస్‌ అయ్యర్‌ సైతం రంజీల్లో ముంబై తరఫున బరిలోకి దిగకుండా ఫిట్‌నెస్‌ కారణాలు సాకుగా చూపాడు. అయితే, ఎన్సీఏ అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. ఈ క్రమంలో తాజా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాలో ఈ ఇద్దరి పేర్లు గల్లంతయ్యాయి.ఆ తర్వాత అయ్యర్‌ ముంబై తరఫున రంజీ బరిలో దిగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికి టీ20 వరల్డ్‌కప్‌-2024 జట్టులోనూ చోటు దక్కలేదు.అతడి నిర్ణయం ప్రకారమేఈ నేపథ్యంలో ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ సెంట్రల్‌ కాంట్రాక్టులు కోల్పోయిన అంశంపై జై షా తాజాగా స్పందించాడు. ‘‘బీసీసీఐ రాజ్యాంగాన్ని గమనించండి.సెలక్షన్‌ మీటి​ంగ్‌లో చర్చించిన విషయాల గురించి మీడియాకు తెలియజేసే కన్వీనర్‌ను మాత్రమే నేను.ఆ ఇద్దరిని దేశవాళీ క్రికెట్‌ ఆడాలని నిర్ణయించిందీ.. అదే విధంగా వారు చెప్పినట్లు వినలేదని సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితా నుంచి తప్పించిందీ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్.అతడు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడమే నా పని. వాళ్లిద్దరు వెళ్లినా సంజూ శాంసన్‌ లాంటి వాళ్ల రూపంలో కొత్త ఆటగాళ్లకు చోటు దక్కింది కదా!’’ అని జై షా జాతీయ మీడియాతో వ్యాఖ్యానించాడు.అయ్యర్‌ అదుర్స్‌... ఇషాన్‌ ఫెయిల్‌కాగా ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ప్రస్తుతం ఐపీఎల్‌-2024తో బిజీగా ఉన్నారు. ముంబై ఇండియన్స్‌ తరఫున ఓపెనర్‌గా వస్తున్న ఇషాన్‌ ఇప్పటి వరకు 12 ఇన్నింగ్స్‌లో కలిపి 266 పరుగులు మాత్రమే చేశాడు.మరోవైపు కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మాత్రం 11 ఇన్నింగ్స్‌లో 280 పరుగులు చేయడంతో పాటు.. ఈ సీజన్‌లో జట్టును ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిపే పనిలో ఉన్నాడు.   చదవండి: ద్రవిడ్‌ గుడ్‌ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్‌?.. జై షా కామెంట్స్‌ వైరల్‌

AP High Court Dismiss Sunitha Petition Over YS Viveka Case
వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ

సాక్షి, అమరావతి: వైఎస్‌ వివేకా హత్య కేసులో నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, సునీత, సీబీఐ అధికారి రాంసింగ్‌కు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. వీరు వేసిన క్వాష్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్‌ చేసింది.కేసు పూర్వపరాలేంటీ? మాజీ మంత్రి వివేకానంద రెడ్డికి పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి 2021 డిసెంబర్‌లో పులివెందుల కోర్టులో ఒక ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. వివేకా హత్య కేసుకు సంబంధించి కొందరు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో అవినాష్‌ రెడ్డి, శంకర్‌ రెడ్డి, భాస్కర్‌రెడ్డి పేర్లు చెప్పాలంటూ సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ ఒత్తిడి చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపణలకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ ఒత్తిడి చేశారని ఆరోపించారు. కృష్ణా రెడ్డి ఫిర్యాదుపై పులివెందుల కోర్టు 2023 డిసెంబర్ 8న విచారణ జరిపింది. కేసు నమోదు చేసి తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సునీత, రాంసింగ్‌పై కేసులు నమోదు చేసింది. ఈ కేసును కొట్టేయాలంటూ సునీత, ఆమె భర్త రాజశేఖర్‌, ఎస్పీ రామ్‌సింగ్ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు.హైకోర్టు ఏం చెప్పింది?వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి పెట్టిన కేసును కొట్టేయాలన్న సునీత, రాజశేఖర్‌ రెడ్డి, రాంసింగ్‌ వాదనలను ఏపీ హైకోర్టు అంగీకరించలేదు. వీరు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. చదవండి : నర్రెడ్డి సునీత, రాజశేఖర్‌రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలుకృష్ణారెడ్డి ఏం చెబుతున్నారు? "వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత దంపతుల పాత్ర అనుమానస్పదంగా ఉంది. ఈ హత్య సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కుట్ర అని భావిస్తున్నాను. వారిద్దరితోపాటు శివప్రకాశ్‌రెడ్డిల తీరు సందేహాస్పదంగా ఉంది. వివేకా రెండో పెళ్లితోనే ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. రెండో భార్య షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇవ్వాలని వివేకానందరెడ్డి భావించడంతో హత్య జరిగినట్టు భావిస్తున్నాను. వివేకా లెటర్‌ను దాచిపెట్టమని ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి స్వయంగా చెప్పారు. ఆ తర్వాత కూడా అబద్ధం చెప్పాలని సునీత, రాజశేఖర్‌రెడ్డి నన్ను వేధించారు. ఈ హత్యకు కారణం ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని నాపై ఒత్తిడి తెచ్చారు. పోలీసులు, సీబీఐ అధికారులు చిత్రహింసలకు గురిచేశారు. నేను అబద్ధం చెప్పకపోతే నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుందని సునీత అన్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడం వెనుక పక్కా కుట్ర ఉంది. అవినాశ్‌రెడ్డిని ఎంపీగా గెలిపించడం కోసం చివరి వరకూ వివేకా కృషి చేశారు" అని వివేకా పీఏ కృష్ణారెడ్డి వెల్లడించారు.చదవండి : వైఎస్‌ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఇంటర్వ్యూ పూర్తి పాఠం 

Modi Comments On Pm Modi To Sharad Pawar, Uddhav Thackeray
జూన్‌ 4 తర్వాత జరిగేది ఇదే.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికల తరుణంలో ప్రధాని మోదీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌ పవార్‌), శివసేనలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్‌4 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విడుదల అనంతరం డూబ్లికేట్‌ ఎన్సీపీ, డూబ్లికేట్‌ శివసేన తమ పార్టీలను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని చూస్తున్నాయని ఎద్దేవా చేశారు.నార్త్‌ మహరాష్ట్ర నందూర్బర్‌ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ పేరును ప్రస్తావించకుండా ఆయనపై సెటైర్లు వేశారు.ఓ పెద్దాయన 40-50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఓ పెద్దాయన జూన్‌ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాల విడుదల అనంతరం.. రాజకీయ ఉనికి కోసం తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని చూస్తున్నారని అన్నారు.నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన మనసులోనకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన మనసులో తమ పార్టీలను కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే ఉందనే కదా దీనర్ధం. కాంగ్రెస్‌లో విలీనం చేసిన రాజకీయ నిరుద్యోగులుగా మిగిలే బదులు.. వచ్చి అజిత్‌ పవర్‌, ఎక్‌నాథ్‌ షిండ్‌తో చేతులు కలిపితే బాగుంటుందని ప్రధాని మోదీ సలహా ఇచ్చారు.   ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌కుఇంతకు ముందు ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో శరద్‌ పవార్‌ విలీనంపై మాట్లాడారు. రానున్న సంవత్సరాల్లో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌కు దగ్గర కానున్నాయి. అంతేకాదు తమ రాజకీయ భవిష్యత్‌ బాగుండాలంటే కాంగ్రెస్‌లోనే విలీనం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు వ్యాఖ్యానించారు. తాజా ఎన్నికల ప్రచారంలో శరద్‌ పవార్‌ విలీనం వ్యాఖ్యలపై మోదీ స్పందించినట్లు తెలుస్తోంది. 

oil cos cut 14 Percent of their workforce in six years even as their revenues nearly doubled
ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!

ప్రభుత్వ ఆయిల్‌, గ్యాస్ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన ఆరేళ్లలో ప్రభుత్వ చమురు సంస్థలు సుమారు 15,700 ఉద్యోగాలను తగ్గించాయి. వాటి శ్రామికశక్తిలో ఇది 14 శాతంగా ఉంది. ఈ ఆరేళ్ల కాలంలో ఆయా కంపెనీల ఆదాయాలు మాత్రం రెట్టింపు అయినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ వేలసంఖ్యలో ఉద్యోగులను తగ్గించడంపట్ల ఆందోళనలు నెలకొంటున్నాయి.చమురు మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం..ఉద్యోగాల కోత అన్ని విభాగాల్లో ఉంది. ప్రధానంగా నాన్-మేనేజిరియల్ ఉద్యోగాలను భారీగా తగ్గించారు. ప్రభుత్వ చమురు, గ్యాస్ కంపెనీల్లో 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 1,10,000గా ఉన్న శ్రామికశక్తి 94,300కి పడిపోయింది. ఎక్స్‌ప్లోరేషన్‌, ఉత్పత్తి, మార్కెటింగ్, రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో గడిచిన ఆరేళ్లలో 20-24% ఉద్యోగాలను తొలగించారు. రిఫైనరీల్లో మాత్రం కేవలం 3% ఉద్యోగాల కోత విధించారు. ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు 6శాతం, నాన్‌ మేనేజిరియల్‌ ఉద్యోగాలు 25 శాతం మేర తగ్గించినట్లు తెలిసింది.కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన కొత్త ఉద్యోగాలు నియమించడం, బౌట్‌సోర్సింగ్‌ కొలువులపై దృష్టిసారించడంతో రెగ్యులర్‌ స్థానాలపై వేటు పడుతున్నట్లు తెలిసింది. దాంతోపాటు శ్రామికశక్తి స్థానంలో అవకాశం ఉన్న విభాగాల్లో టెక్నాలజీ వాడకాన్ని పెంచుతున్నారు. పదవివిరమణ చేసిన ఉద్యోగులు స్థానంలో పరిమిత స్థాయిలోనే కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. ఫలితంగా కంపెనీల ఆదాయాలు పెరుగుతున్నా ఉద్యోగుల సంఖ్యలో కోతలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలాఉండగా, 2022-23 నాటికంటే ముందు ఆరు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ చమురు కంపెనీలు మూలధన వ్యయంలో భాగంగా సుమారు రూ.6.8 లక్షల కోట్లు వెచ్చించాయి.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all