Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Exit Polls 2024: Rewind 2019 Exit Polls Details
ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు: అంచనాలకు మించి ఆనాడు..

జూన్‌ 4వ తేదీనాటి ప్రజాతీర్పు కోసం యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. మరీ ముఖ్యంగా ఏపీ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల ఫలితాల హ్యాష్‌ ట్యాగులు ఎక్స్‌(పూర్వపు ట్విటర్‌)లో ట్రెండ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం వెలువడబోయే ఎగ్జిట్‌ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చా నడుస్తోంది. ఇక.. 2019 ఏపీ సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల నాటి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు.. 2019 మే 23వ తేదీ వెలువడ్డ ఫలితాలతో పోలిస్తే.. ఆ అంచనాలు ఎంత వరకు ఫలించాయో పరిశీల్తిస్తే.. 2019 మే 19 సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. వాటిల్లో ఎక్కువ సర్వే సంస్థలు లోక్‌సభ, అసెంబ్లీ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపించాయి. ఒకటి రెండు సర్వే సంస్థలు తప్పించి.. లోక్‌సభ స్థానాల్లో 20కి దగ్గర్లో వస్తాయని ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పింది. వాటిల్లో.. 👉లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 18 నుంచి 20 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్‌ అంచనా వేసింది. టీడీపీ​కి 4 నుంచి 6 సీట్లు రావొచ్చని తెలిపింది.👉 ఆరా మస్తాన్‌ సర్వే ప్రకారం వైఎస్సార్‌సీపీకి 20 నుంచి 24 ఎంపీ సీట్లు రావొచ్చని తెలిపింది. టీడీపీకి 1 నుంచి 5 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది.👉 టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల ప్రకారం వైఎస్సార్‌సీపీకి 18 సీట్లు టీడీపీకి 7 సీట్లు రావొచ్చని అంచనా.👉 న్యూస్‌ 18- ఐపీఎస్‌ఓఎస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైఎస్సార్‌సీపీకి 13 నుంచి 14 సీట్లు వస్తాయి. టీడీపీ 10 నుంచి 12 సీట్లు దక్కించుకుంటుంది.లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనా.. అంతకు మించే ఫలించింది. 25 స్థానాలకుగానూ 22 పార్లమెంట్‌ స్థానాలను కైవసం చేసుకుని విజయ దుందుభి మోగించింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుందని, అలాగే ఏపీ ఎన్నికల్లో తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీకి అధికార వియోగం తప్పదని తేల్చాయి. ఇక పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. 👉 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 133 నుంచి 135 వరకు సీట్లు వస్తాయని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌(సీపీఎస్‌) అంచనా వేసింది. టీడీపీకి 37 నుంచి 40 స్థానాలు దక్కే అవకాశముందని పేర్కొంది. జనసేన పార్టీకి ఒక స్థానం రావొచ్చని తెలిపింది.👉 వైఎస్సార్‌సీపీకి 112, టీడీపీ 59, జనసేనకు 4 అసెంబ్లీ స్థానాలు వస్తాయని పీపుల్స్‌ పల్స్‌ సర్వే వెల్లడించింది. వైఎస్సార్‌సీపీకి 18 నుంచి 21 లోక్‌సభ స్థానాలు గెల్చుకునే అవకాశముందని తెలిపింది. టీడీపీకి 4 నుంచి 6 సీట్లు దక్కనున్నాయని అంచనా కట్టింది. జనసేనకు ఒక స్థానం రావొచ్చని తేల్చింది.👉 ఆరా మస్తాన్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీకి 126 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలింది. టీడీపీ 47, జనసేన పార్టీకి 2 స్థానాలు వచ్చే అవకాశముందని వెల్లడించింది.👉 వీడీపీ అసోసియేట్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైఎస్సార్‌సీపీకి 111 నుంచి 121 సీట్లు వస్తాయి. టీడీపీకి 54 నుంచి 64 స్థానాలు దక్కుతాయి. జనసేనకు 4 సీట్లు వచ్చే అవకాశముంది.👉 ఐపల్స్‌ సర్వే ప్రకారం వైఎస్సార్‌సీపీకి 110 - 120, టీడీపీకి 56 - 62, జనసేన పార్టీ 0 - 3 స్థానాలలో విజయం సాధిస్తాయి.👉 కేకే సర్వే ప్రకారం వైఎస్సార్‌సీపీ 130 - 135, టీడీపీ 30 - 35, జనసేన పార్టీ 10 - 13 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి👉 మిషన్‌ చాణక్య సర్వే ప్రకారం వైఎస్సార్‌సీపీ 98 స్థానాల్లో, టీడీపీ 58 స్థానాల్లో, జనసేన పార్టీ 7 స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధిస్తారని అంచనా వేశారు. ఇక్కడా ఆ అంచనాలు మించాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకుగానూ 151 సీట్లు సాధించి.. చరిత్ర సృష్టిస్తూ సీఎం జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ అధికారాన్ని కైవసరం చేసుకుంది. మరి ఈసారి ప్రతిపక్షం కూటమిగా పోటీ చేసింది. వైఎస్సార్‌సీపీ సంక్షేమ పాలన నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. చూద్దాం.. సాయంత్రం రాబోయే ఎగ్జిట్‌ ఫలితాలు ఎలా ఉంటాయో!.

Minister Jogi Ramesh Satirical Comments On Chandrababu Foreign Tour
బాబు.. దోచుకుంది దాచుకునేందుకు విదేశాలకు వెళ్లావా?: జోగి రమేష్‌

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్‌. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు.కాగా, మంత్రి జోగి రమేష్‌ శనివారం మీడియాతో​ మాట్లాడుతూ..‘చంద్రబాబు విదేశీ పర్యటన మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మొదట హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లారని అన్నారు. ఆ తర్వాత అక్కడ్నుండి‌ ఎక్కడకు వెళ్లారు?. వైద్యం కోసం అమెరికా వెళ్లాడని ఎల్లోమీడియా రాసింది. అబ్బే ఆయన అమెరికా రాలేదని ఆయన పార్టీ నేతలే అన్నారు. అసలు ఇంత రహస్యంగా ఎందుకు వెళ్లారు? ఎక్కడకు వెళ్లారు?. చంద్రబాబుకు ప్రచార పిచ్చి బాగా మురిదిపోయింది.ఈ రహస్య పర్యటన వెనుక‌ కారణం ఏంటి?. దోచుకున్న డబ్బుని దాచుకోవటానికి వెళ్లారా?. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలి. ఏ దేశం వెళ్లినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు.. ఈసారి ఎందుకు ఫోటోలు కూడా పంపలేదు?. అసలు ఈ పది రోజులు ఎక్కడకు వెళ్లారో ఎందుకు చెప్పటం లేదు?. ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన పర్యటన గురించి ప్రజలకు అవసరం. మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లండన్ వెళ్తాడని టైంతో సహా మేము చెప్పాం. మరి చంద్రబాబు పర్యటనపై ఎందుకంత గోప్యత?. ఇప్పటికైనా చంద్రబాబు పర్యటన వివరాలను ప్రజలకు వివరించాలి.అవినీతిపరుడైన ఏబీ వెంకటేశ్వరరావును టీడీపీ నేతలు అక్కున చేర్చుకున్నారు. దేవినేని ఉమా సహా అందరూ వెళ్లి అవినీతిపరుడిని సత్కరించారు. ఈరోజు వచ్చే ఎగ్జిట్ పోల్స్ దెబ్బకి టీడీపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. నాలుగో తేదీన ఫలితాలు చూసిన తర్వాత చంద్రబాబుకు మూర్చ వస్తుంది. ఆ రోజున కూటమి కుదేలవుతుంది. వైఎస్సార్‌సీపీ​ శ్రేణులంతా సంబరాలకు సిద్ధం కావాలి. పండుగ వాతావరణంలో సంబరాలు జరుపుకోవాలి. సీఎం జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవ్వాలని పిలుపునిస్తున్నాం’ అంటూ కామెంట్స్‌ చేశారు.

T20 World Cup Records And Main Points
T20 World Cup 2024: పొట్టి ప్రపంచకప్‌ విశేషాలు, రికార్డులు

2007లో అరంగేట్రం చేసిన పొట్టి ప్రపంచకప్‌ ఎనిమిది సీజన్ల పాటు విజయవంతంగా సాగి తొమ్మిదో సీజన్‌వైపు అడుగులు వేస్తుంది. భారతకాలమానం ప్రకారం రేపటి నుంచి పొట్టి ప్రపంచకప్‌ తొమ్మిదో ఎడిషన్‌ ప్రారంభమవుతుంది. వెస్టిండీస్‌, యూఎస్‌ఏ వేదికలు ఈ మెగా టోర్నీ జరుగనుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏ-కెనడా జట్లు తలపడనున్నాయి.తొమ్మిదో ఎడిషన్‌ వరల్డ్‌కప్‌ ప్రారంభ నేపథ్యంలో ఈ టోర్నీ విశేషాలు, రికార్డులపై ఓ లుక్కేద్దాం. ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే టీ20 ప్రపంచకప్‌ ఇప్పటివరకు ఎనిమిది సీజన్ల పాటు సాగింది. టోర్నీ అరంగేట్రం సీజన్‌లో (2007) టీమిండియా విజేతగా నిలువగా.. పాకిస్తాన్‌ (2009), ఇంగ్లండ్‌ (2010), వెస్టిండీస్‌ (2012), శ్రీలంక (2014), వెస్టిండీస్‌ (2016), ఆస్ట్రేలియా (2021), ఇంగ్లండ్‌ (2022) ఆతర్వాత ఎడిషన్లలో విజేతలుగా అవతరించాయి.రెండేళ్లకు ఓసారి జరిగే ఈ టోర్నీకి కోవిడ్‌, ఇతరత్రా కారణాల వల్ల మధ్యలో ఐదేళ్లు (2016-2021) బ్రేక్‌ పడింది. టీ20 ప్రపంచకప్‌లో ఈ సీజన్‌ నుంచే రికార్డు స్థాయిలో 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ ఎడిషన్‌లో ఇంగ్లండ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఇంగ్లండ్‌ బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ జట్లు అత్యధికంగా రెండు సార్లు టైటిల్‌ను అందుకున్నాయి. డారెన్‌ సామీ వెస్టిండీస్‌కు విజయవంతంగా రెండు సార్లు టైటిల్‌ను అందించాడు.టోర్నీలో అత్యధిక పరుగుల రికార్డు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (1141) పేరిట ఉండగా.. అత్యధిక వికెట్ల రికార్డు షకీబ్‌ అల్‌ హసన్‌ (47) ఖాతాలో ఉంది. కెనడా, ఉగాండ, యూఎస్‌ఏ జట్లు తొలిసారి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి.టోర్నీ బ్యాటింగ్‌ రికార్డులు..అత్యధిక పరుగులు- విరాట్‌ కోహ్లి (1141)అత్యధిక స్కోర్‌- బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (123)అత్యధిక సగటు- విరాట్‌ కోహ్లి (81.50)అత్యధిక స్ట్రయిక్‌రేట్‌- సూర్యకుమార్‌ యాదవ్‌ (181.29)అత్యధిక సెంచరీలు- క్రిస్‌ గేల్‌ (2)అత్యధిక హాఫ్‌ సెంచరీలు- విరాట్‌ కోహ్లి (14)అత్యధిక సిక్సర్లు- గేల్‌ (63)ఓ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు- విరాట్‌ (319)టోర్నీ బౌలింగ్‌ రికార్డులు..అత్యధిక వికెట్లు-షకీబ్‌ (47)అత్యధిక బౌలింగ్‌ సగటు- హసరంగ (11.45)అత్యధిక స్ట్రయిక్‌రేట్‌- హసరంగ (11.8)అత్యుత్తమ గణాంకాలు- అజంత మెండిస్‌ (6/8)సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు- హసరంగ (16)జట్ల రికార్డులు..అత్యధిక టీమ్‌ టోటల్‌-శ్రీలంక (260/6)అత్యల్ప టోటల్‌- నెదర్లాండ్స్‌ (39)భారీ విజయం- శ్రీలంక (కెన్యాపై 172 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Katy Perry delivering a mesmerizing performance at the pre wedding celebrations
అనంత్‌-రాధికల ప్రీవెడ్డింగ్‌ వేడుకలో కాటిపెర్రీ పెర్ఫార్మెన్స్

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాప్ సెన్సేషన్ కాటి పెర్రీ చేసిన లైవ్ పెర్ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పెర్రీ సిల్వర్‌కలర్‌లో శరీరాన్ని హత్తుకుని ఉండే దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకుంది. తనతోపాటు ఈ ఈవెంట్‌లో పాల్గొన్న తన ట్రూప్‌ తెల్లటి దుస్తులు ధరించి వేడుకలో పాల్గొన్న సెలబ్రిటీలను అలరించారు.ముఖేశ్‌ అంబానీ కుమారుడు అనంత్‌-రాధికల రెండో ప్రీవెడ్డింగ్‌ వేడుకలు మే 29న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. క్రూయిజ్‌షిప్‌లో జరిగే ఈ వేడుకలో దాదాపు 900 మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్‌కు సుమారు 4,380 కిలోమీటర్లమేర క్రూయిజ్‌ ప్రయాణం సాగుతుంది.అనంత్‌ అంబానీ-రాధిక మొదటి ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఈ ఏడాది మార్చినెలలో ఘనంగా జరిగాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖులు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో మెటా ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, గ్లోబల్ పాప్ స్టార్ రిహన్న వంటి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ముకేశ్ అంబానీ తన కుమారుడు, కోడలు ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేసినట్లు ఫోర్బ్స్ గతంలోనే నివేదించింది.ఇదీ చదవండి: భారీగా తగ్గనున్న ఎలక్ట్రానిక్‌ వాహన ధరలు.. ఎంతంటే..సంప్రదాయ హిందూ వైదిక ఆచారాల ప్రకారం ఈ జంట ముంబైలో జులై 12న వివాహం చేసుకోనుంది. జులై 12 శుక్రవారం రోజున శుభ వివాహ వేడుకతో పెళ్లి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జులై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్, జులై 14 ఆదివారం రోజు జరిగే మంగళ్ ఉత్సవ్, వివాహ రిసెప్షన్‌తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.Katy Perry performing Firework at Cannes tonight! pic.twitter.com/MafEP3OJGP— Katy Perry Today (@todaykatyp) June 1, 2024

Pune Porsche Case: Mother of Accused Teen Arrested By Police
పుణే ఘటనలో అదిరిపోయే ట్విస్ట్‌

ముంబై: మహారాష్ట్ర పుణెలో ఓ టీనేజర్ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసి ఇద్దరి మృతికి కారణమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతూ.. రోజుకొక అరెస్ట్‌తో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా టీనేజర్‌ను తప్పించేందుకు అతని కుటుంబం చేసిన ప్రయత్నాలు విస్తుగొల్పుతున్నాయి. తాజాగా ఈ కేసులో టీనేజర్‌ తల్లిని కూడా అరెస్ట్‌ చేశారు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు. విచారణ కోసం పిలిచిన ఆమెను.. శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు పోలీసులు. బ్లడ్ టెస్ట్ సమయంలో నిందితుడి రక్త నమూనాలు బదులుగా తనవి ఇచ్చినందుకే ఆమెను అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించారు. ప్రమాదం సమయంలో తన కుమారుడు తాగలేదని నిరూపించేందుకు ఆమె తన రక్తనమూనాలు ఇచ్చినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన రోజు ఫోరెన్సిక్‌ విభాగం అధిపతి డాక్టర్‌ తావ్‌డే, నిందితుడి తండ్రి ఫోన్‌లో మాట్లాడుకున్నారని.. నిందితుడి రక్త నమూనాలను మార్చేందుకు భారీ నగదుతో డీల్‌ కుదిరిందని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ క్రమంలోనే టీనేజర్ తల్లి శాంపిళ్లను బ్లడ్‌ టెస్ట్‌కు ఇచ్చినట్లు తేలింది. రక్త నమూనాలు ఇచ్చిన తర్వాత ఆమె ఆచూకీ లేకుండా పోయారు. అలాగే కొద్దిరోజుల క్రితం ఒక వీడియో సందేశం విడుదల చేసిన ఆమె.. తన కుమారుడిని రక్షించాలంటూ కన్నీరుపెట్టుకోవడం గమనార్హం. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు, శాంపిల్స్‌ను మార్చిన ఆరోపణలపై ఈ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు కోర్టుముందు ప్రవేశపెట్టనున్నారు. పుణే పోర్షే కారు కేసులో ఇప్పటికే నిందితుడి తండ్రి, తాత కూడా అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసును తనమీద వేసుకోమని తమ డ్రైవర్‌ను ఒప్పించేందుకు యత్నించారని, అతడు అంగీకరించకపోవడంతో కిడ్నాప్‌ చేసి ఒత్తిడి తీసుకొచ్చారన్న ఆరోపణలు వారిద్దరి అరెస్టుకు కారణమయ్యాయి. నేరాన్ని కప్పిపుచ్చేందుకు ఆ కుటుంబం పలువురు అధికారుల్ని ప్రలోభపెట్టేందుకు యత్నించడమూ దర్యాప్తులో వెలుగు చూసింది.

Do not Run Away: Amit Shah Mocks Congress Over Exit Poll Boycott
ఓడిపోతామని తెలిసి పారిపోతున్నారు: కాంగ్రెస్‌పై అమిత్‌ షా సెటైర్లు

న్యూఢిల్లీ: శనివారంతో ఏడు దశల లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియ‌నుంది. నేటి సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడనున​న్నాయి. ఈ క్రమంలో ఎగ్జిట్‌ పోల్స్‌ చర్చలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే కాంగ్రెస్‌ నిర్ణయంపై అధికార బీజేపీ సెటైర్లు వేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతున్నామని కాంగ్రెస్‌ పార్టీకి ముందే తెలిసిందని విమర్శలు గుప్పించింది. అందుకే మీడియాకు, ప్రజలకు ముఖం చూపించలేక పారిపోతున్నారని మండిపడింది. ఎగ్జిట్ పోల్ డిబేట్‌లకు దూరంగా ఉండబోతున్నామంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా చేసిన ప్రకటనపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఆ పార్టీ ప్రధాన వ్యూహకర్త, కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఓటమిని అంగీకరించినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు.ఈ మేరకు అమిత్ షా ‘ఎక్స్’ వేదికగా .. ‘భారీ ఓటమి ఎదురవ్వబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీకి తెలుసు. మీడియా, ప్రజలకు ఏం ముఖం చూపిస్తారు? అందుకే కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్‌కు దూరంగా పారిపోతోంది. కాంగ్రెస్ పార్టీ పారిపోవద్దు. ఓటమిని ఎదుర్కొని ఆత్మపరిశీలన చేసుకోవాలని నేను చెప్పదలచుకున్నాను’’ అని పేర్కొన్నారు.దేశంలో పురాతన పార్టీగా ఉన్న కాంగ్రెస్ చిన్న పిల్లల్లా ప్రవర్తించడం తగదని జేపీ నడ్డా విమర్శించారు, . తాను ఆడుకునే బొమ్మను ఎవరో లాగేసుకున్న తీరుగా హస్తం పార్టీ ధోరణి ఉందని, ప్రతిపక్షాల్లో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ నుంచి ఒక నిర్దిష్ట స్థాయి పరిపక్వతను ఆశిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తాయనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్‌కు దూరంగా జరుగుతోందని ఆయన అన్నారు.

Lok Sabha Elections 2024 Phase 7 Voting Live Updates
లోక్‌సభ ఎన్నికల తుది దశ: 11 గంటల వరకు పోలింగ్‌ శాతం ఎంతంటే?

Lok Sabha Election 2024 Phase 7 Updates..👉ఎన్నికల వేళ విషాదం.. మనోరంజన్‌ సాహో మృతిఓడిషాలో బింజర్‌హర్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌-157లో బూత్‌ లెవన్‌ ఆఫీసర్‌ మనోరంజన్‌ సాహో మృతిచెందారు. ఎన్నికల విధుల్లోనే ఆయన మరణించినట్టు కలెక్టర్‌ నిఖిల్‌ పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. Odisha | One BLO (Block Level Officer), Manoranjan Sahoo (58) of booth no-157 under Binjharpur Assembly Constituency of Jajpur district died while on election duty: Collector & DM cum DEO, Nikhil Pavan Kalyan#LokSabhaElections2024— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన నటుడు ఆయూష్‌మాన్‌ ఖురానా. ఛండీగఢ్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓటు వేశాడు. ఈ సందర్భంగా అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.#WATCH | Actor Ayushmann Khurrana shows the indelible ink mark on his finger after voting at a polling booth in Chandigarh.He says, "I came back to my city to cast my vote and exercise my right...Mumbai recorded a very low voter turnout this time but we should cast our… pic.twitter.com/7UTPNGCMl1— ANI (@ANI) June 1, 2024 👉ఓటుపై అవగాహన కోసం వినూత్న ప్రయోగం.. యూపీకి చెందిన ఓ వ్యక్తి గుర్రంపై కుషీనగర్‌ పోలింగ్‌ బూత్‌కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఈ సందర్భంగా అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తాను 2012 నుంచి ఎలాంటి ఎన్నికలు జరిగినా గుర్రంపై వచ్చి ఓటు వేస్తున్నట్టు తెలిపాడు. #WATCH | To create voter awareness, a man arrives on a horse at a polling station to cast his vote in Kushinagar, Uttar PradeshHe says, "In the 2012, 2017 & 2022 Assembly elections and 2014 & 2019 Lok Sabha polls also I had arrived on horse to cast my vote." pic.twitter.com/Qw2vlivoM1— ANI (@ANI) June 1, 2024 👉ఓటు హక్కు వినియోగించుకున్న బెంగాల్‌ బీజేపీ నేత దిలీప్‌ ఘోష్‌.#WATCH | On clash during Lok Sabha elections in West Bengal today, BJP leader & MP Dilip Ghosh says, "...TMC is doing al this due to fear of losing, but voting will be completed." pic.twitter.com/VNFPikOiGR— ANI (@ANI) June 1, 2024👉ఓటు వేసిన శిరోమణి అకాళీదల్‌ నేత బిక్రమ్‌ సింగ్‌ మజితియా. 👉 ఓటు హక్కు వినియోగించుకున్న రేఖా పాత. బసిర్‌హట్‌లోని పోలింగ్‌ బూత్‌లో​ ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రేఖా. #WATCH | North 24 Parganas, West Bengal: BJP Lok Sabha Candidate from Basirhat, Rekha Patra shows her inked finger after casting her vote for #LokSabhaElections2024TMC has fielded Haji Nurul Islam from Basirhat. pic.twitter.com/eNN5bg4OkI— ANI (@ANI) June 1, 2024 👉 11 గంటల వరకు 26.30 పోలింగ్‌ శాతం నమోదు. ఢిల్లీ:7వ విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాల్లో 57 నియోజకవర్గాల పరిధిలో ఉదయం 11 గంటల వరకు నమోదయిన పోలింగ్ శాతం 26.30బీహార్(8)-24.25ఛండీఘడ్(1)-25.03హిమాచల్ ప్రదేశ్(4)-31.92జార్ఖండ్(3)-29.50ఒడిస్సా(6)-22.64పంజాబ్(13)-23.91ఉత్తరప్రదేశ్ (13)- 28.02పశ్చిమ బెంగాల్( 9)-28.10 👉ఓటు వేసిన హిమాచల్‌ సీఎం సుఖ్‌విందర్‌ సింగ్‌ సుఖూ. హర్మీర్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓటు వేశారు. #WATCH | Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu casts his vote at a polling station in Hamirpur for the seventh phase of #LokSabhaElections2024 pic.twitter.com/c7zzjs6SnO— ANI (@ANI) June 1, 2024 👉ఎన్నికల్లో ఓటు వేసిన బీహార్‌ సీఎం నితిశ్‌ కుమార్‌. భక్తియార్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఆయన వేశారు.#WATCH | Bihar CM Nitish Kumar leaves after casting his vote at a polling booth in Bakhtiyarpur. #LokSabhaElections2024 pic.twitter.com/2qogPy72zU— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన జమ్మూ కశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా. యూపీలోని గాజీపూర్‌లో వేశారు. #WATCH | Uttar Pradesh | Jammu and Kashmir Lieutenant Governor Manoj Sinha casts his vote for #LokSabhaElections2024 in Mohanpura village, Ghazipur. pic.twitter.com/LV5N4AoNjU— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన శిరోమణి అకాళీదల్‌ ప్రెసిడెంట్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌, ఎస్‌ఏడీ నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌. ఫిరోజ్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో వీరు ఓటు వేశారు. #WATCH | Sri Muktsar Sahib, Punjab: Shiromani Akali Dal (SAD) leader Harsimrat Kaur Badal casts her vote at a polling booth in Badal village under the Firozpur Lok Sabha constituency SAD has fielded Nardev Singh Bobby Mann from this seat. BJP has fielded Gurmit Singh Sodhi,… https://t.co/BhwLlKUElF pic.twitter.com/FGxN45jioQ— ANI (@ANI) June 1, 2024 👉పోలింగ్‌ వేళ బెంగాల్‌లో ఉద్రిక్తతలు..సౌత్‌ పరగాణా-24లో పోలింగ్‌ బూత్‌ వద్ద ఉద్రిక్తకర పరిస్థితులు. ఈవీఎంలు, వీవీప్యాట్స్‌ను మురికి కాల్వలో పడేసిన దుండగులు. VIDEO | Lok Sabha Elections 2024: EVM and VVPAT machine were reportedly thrown in water by a mob at booth number 40, 41 in Kultai, South 24 Parganas, #WestBengal. (Source: Third Party)#LSPolls2024WithPTI #LokSabhaElections2024 pic.twitter.com/saFiNcG3e4— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 ఓటు వేసిన పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, రవిశంకర్‌ ప్రసాద్‌. VIDEO | Lok Sabha Elections 2024: Punjab CM Bhagwant Mann interacts with media after casting vote.#LSPolls2024WithPTI #LokSabhaElections2024(Full video available on PTI Videos - https://t.co/dv5TRARJn4) pic.twitter.com/1YxNaPwBQ5— Press Trust of India (@PTI_News) June 1, 2024 VIDEO | Lok Sabha Elections 2024: "I hope there will be record voting. I am confident that the excitement in the seventh phase will be more that what we have witnessed in the last six phases of elections. There will be bumper voting and then later bumper victory," says Anurag… pic.twitter.com/RbDCOPjfY4— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 ఓటు హక్కు వినియోగించుకున్న కంగనా రనౌత్‌. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.VIDEO | Lok Sabha Election 2024: "I want to appeal to everyone to exercise their Constitutional rights and participate in this festival of democracy," says actor and BJP candidate from Himachal Pradesh's Mandi seat Kangana Ranaut (@KanganaTeam) after casting vote.… pic.twitter.com/7womwYt3xV— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 ఓటు వేసిన బీజేపీ నేత తరుణ్‌చుగ్‌. పంజాబ్‌లో అమృత్‌సర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. VIDEO | Lok Sabha Elections 2024: "We have been given the right by the Constitution to choose who will rule for the next five years and who will decide the country's strategies. We should all exercise this right. I am feeling very proud and happy that I have come here along with… pic.twitter.com/zSElxK3PEd— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 తొమ్మిది గంటల వరకు 11.31 శాతం పోలింగ్‌ నమోదు.. ఢిల్లీ:చివరి విడతలో భాగంగా లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాల్లో 57 నియోజకవర్గాల పరిధిలో ఉదయం 9 గంటల వరకు నమోదయిన పోలింగ్ శాతం 11.31బీహార్(8)-10.58ఛండీఘడ్(1)-11.64హిమాచల్ ప్రదేశ్(4)-14.35జార్ఖండ్(3)-12.15ఒడిస్సా(6)- 7.69పంజాబ్(13)-9.64ఉత్తరప్రదేశ్ (13)- 12.94పశ్చిమ బెంగాల్( 9)- 12.63 👉 ఓటు హక్కు వినియోగించుకున్న హిమాచల్‌ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా. గోరఖ్‌పూర్‌లో ఓటు వేసిన శుక్లా. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. #WATCH | Uttar Pradesh: After casting his vote in Gorakhpur, Himachal Pradesh Governor Shiv Pratap Shukla says, "I have cast my vote today. All the voters should cast their votes today and vote for a government that can carry forward development work..."#LokSabhaElections2024 pic.twitter.com/WFVlID9xh3— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు వేసిన లాలూ ఫ్యామిలీ. సరన్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రబ్రీదేవీ, ఆర్జేజీ అభ్యర్థి రోహిణీ ఆచార్య. #WATCH | Bihar: RJD chief Lalu Prasad Yadav, Rabri Devi and their daughter & party candidate from Saran Lok Sabha seat Rohini Acharya leave from a polling booth in Patna after casting their vote. #LokSabhaElections2024 pic.twitter.com/LTmGnXM4BH— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు వేసిన సిక్కిం గవర్నర్‌ లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య. యూపీలో వారణాసిలోని రామ్‌నగర్‌లో ఆచార్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | Uttar Pradesh | Sikkim Governor Lakshman Prasad Acharya says, "I am happy to take part in this festival of democracy. I think that voting is a duty along with being a constitutional right and everyone should perform their duty and exercise their right..." https://t.co/qwNLm28hP9 pic.twitter.com/V2EMlKNxMu— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ క్రికెటర్‌, ఆప్‌ ఎంపీ హర్బజన్‌ సింగ్‌. జలంధర్‌లోని పోలింగ్‌ బూత్‌ ఓటు వేసిన బజ్జీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. ఓటు వేయడం మన బాధ్యత అని కామెంట్స్‌ చేశారు. #WATCH | Punjab: Former Indian cricketer and AAP Rajya Sabha MP Harbhajan Singh casts his vote at a polling booth in Jalandhar#LokSabhaElections2024 pic.twitter.com/Ph55BxqFbp— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రవి కిషన్‌. గోరఖ్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌ వేసిన రవి కిషన్‌, ఆయన కుటుంబ సభ్యులు. #WATCH | Uttar Pradesh: BJP MP and candidate from Gorakhpur, Ravi Kishan & his wife Preeti Kishan cast their votes at a polling booth in the constituency. The Gorakhpur seat sees a contest amid BJP's Ravi Kishan, SP's Kajal Nishad and BSP's Javed Ashraf.#LokSabhaElections2024 pic.twitter.com/bTC51NMa3E— ANI (@ANI) June 1, 2024 👉ఓటు హక్కు వినియోగించుకున్న యూపీ సీఎం యోగి ఆద్యితనాథ్‌. గోరఖ్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసిన యోగి. గోరఖ్‌పూర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో రవి కిషన్‌. #WATCH | Uttar Pradesh Chief Minister Yogi Adityanath casts his vote at a polling booth in Gorakhnath, Gorakhpur.The Gorakhpur seat sees a contest amid BJP's Ravi Kishan, SP's Kajal Nishad and BSP's Javed Ashraf. #LokSabhaElections2024 pic.twitter.com/2Ao7uC7slU— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా #WATCH | BJP national president JP Nadda cast his vote at a polling booth in Bilaspur, Himachal Pradesh. His wife Mallika Nadda also cast her vote here. #LokSabhaElections2024 pic.twitter.com/7XZC3pU2zw— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు వేసిన ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా..👉 ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన రాఘవ్‌ చద్దా.. #WATCH | After casting his vote for the seventh phase of #LokSabhaElections2024, AAP MP Raghav Chadha says, "Today is the grand festival of India...Every vote by the citizen will decide the direction & condition of the country...I request everyone to exercise their right to… pic.twitter.com/tBqPTEdBci— ANI (@ANI) June 1, 2024 👉 చివరి దశలో 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. Voting for the seventh - the last - phase of #LokSabhaElections2024 begins. Polling being held in 57 constituencies across 8 states and Union Territories (UTs) today.Simultaneous polling being held in 42 Assembly constituencies in Odisha. pic.twitter.com/BkcIZxkmYC— ANI (@ANI) June 1, 2024 👉 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్‌ ప్రారంభమైంది. 👉 కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌పాటు బీహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. 👉 వీటితో పాటు ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం పోలింగ్‌ కొనసాగుతోంది. అంతేకాకుండా బీహార్‌లో ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో ఒకటి, బెంగాల్‌లో ఒకటి, హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉపఎన్నిక జరుగుతోంది.👉 చివరి విడతలోని 57 లోక్‌సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ 32, యూపీఏ 9 సీట్లు దక్కించుకున్నాయి. మిగతా స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. అంటే సగానికి పైగా ఎన్డీయే సిట్టింగ్‌ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్‌ 19న ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన ఆరు దశల్లో 486 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యింది. కాగా మొత్తం ఏడు దశల్లోని 543 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు, 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ జూన్‌ 4న ప్రారంభం కానుంది. అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ జూన్‌ 2న ప్రారంభమవుతుంది.

How much cholesterol is needed?
కొలెస్ట్రాల్‌ ఎంత అవసరం? ఎంతకు మించరాదు?

ఆధునిక కాలంలో మనం అనుసరించే జీవనశైలి వల్ల, తినే ఆహారం వల్ల రకరకాల జబ్బులను కొని తెచ్చుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య అంతకంతకూ హెచ్చుతూనే ఉంది. హృదయ సంబంధ వ్యాధులకు ప్రధానంగా ఆహార పదార్థాలతోపాటు కొలెస్ట్రాల్‌ స్థాయులు ఎక్కువ ఉండటమూ ఒక కారణం. ఇంతకూ కొలెస్ట్రాల్‌ శరీరానికి అవసరమేనా? ఇది ఎంత ఉండాలి, ఎంతకంటే ఎక్కువ ఉంటే ప్రమాదం అనే విషయాల గురించి తెలుసుకుందాం.శరీరంలో కొవ్వు పెరగడంలో ఎల్‌డిఎల్‌ది ప్రధాన బాధ్యత. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారిలో ఎల్‌డిఎల్‌ స్థాయి 70 మిల్లీ గ్రాము/డిఎల్‌ కంటే తక్కువ ఉండాలని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ దీనినే మంచి కొలెస్ట్రాల్‌ అని అంటారు. హెచ్‌డిఎల్‌ రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్‌ను తొలగించి, కాలేయానికి పంపిస్తుంది. ఇక్కడ కొలెస్ట్రాల్‌ విచ్ఛిన్నం అవుతుంది. హెచ్‌డిఎల్‌ స్థాయి తక్కువగా ఉందంటే, గుండె రక్తనాళాల వ్యాధి ప్రమాదం పెరుగుతున్నట్లు భావించాలి. గుండె΄ోటుకు బలమైన కారణం ఎల్‌డిఎల్‌ పెరగడం కన్నా హెచ్‌డిఎల్‌ తగ్గడమే. హెచ్‌డిఎల్‌ పురుషుల్లో 40 ఎంజి/ డిఎల్, మహిళల్లో 50 ఎంజి/డిఎల్‌ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని ప్రతిరోజు వంటల్లో ఉపయోగించడం వల్ల కొలెస్ట్రాల్‌ సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే గ్రీన్‌ టీ రోజు తాగడం వల్ల కూడా చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో΄ాటు హెచ్‌డీఎల్‌ స్ధాయిని కూడా పెంచుకునే వీలుంది.ఇక ధనియాలు.. ఈ గింజల్లో ఫోలిక్‌ యాసిడ్, విటమిన్‌ ఏ, బీటా కెరోటిన్, విటమిన్‌ సి వంటివి ఉండటం వల్ల కొలెస్ట్రాల్‌ ప్రభావం తగ్గుతుంది. వీటిని రోజు నేరుగా తినడం అలవాటు చేసుకుంటే మంచిది. మెంతులు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని నేరుగా తినలేము. ఎందుకంటే ఇవి రుచికి చిరు చేదుగా అనిపిస్తాయి. అందువల్ల నానబెట్టుకుని తింటే మంచిది. ఇక చివరిగా ఉసిరి. ఇది కొలెస్ట్రాల్‌ సమస్యకు చక్కని పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏదైనా సమస్య రాకముందే ఇలాంటివి అలవాటు చేసుకుంటే మంచిదని.. చక్కని ఆరోగ్యాన్ని పోందవచ్చని కూడా చెబుతున్నారు.మాంసాహారం పూర్తిగా మానేయాలి. శాకాహారంలో వేపుడు కూరలు తినరాదు. వీటి బదులు ఫైబర్‌ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే కొబ్బరి, వేరుశనగలు, నువ్వులు వంటివి తీసుకోవడం వల్ల వీటిలో ఫైబర్‌తోపాటు ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది మన శరీర నిర్మాణానికి అవసరం.చెడు కొలెస్ట్రాల్‌ ఉంటే..?శరీరంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తపోటు, ఊబకాయం, గుండె పోటు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు, కిడ్నీ, మెదడుకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయి. మరి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?అన్ని విషయాల్లో మంచి, చెడూ ఉన్నట్లే.. కొవ్వుల్లోనూ మనకు మేలు చేసేవి, చెడు చేసేవి ఉన్నాయి. చెడు కొవ్వుల్ని ఎల్‌డీఎల్‌ అని, మంచి కొవ్వుల్ని హెచ్‌డీఎల్‌ అని పిలుస్తారు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ తక్కువగా/అదుపులో ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. మరి మన వంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ తగ్గడానికి ఏం తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా?చెడు కొవ్వు తగ్గడానికి...ఉప్పు తగిన మోతాదులో తీసుకోవాలి ∙ఎల్‌డీఎల్‌ అనే చెడు కొవ్వులు.. డెసిలీటర్‌కు 70 మిల్లీ గ్రాములకు మించకూడదు మధుమేహం ఉన్నవాళ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధాలు తీసుకోవడం తప్పనిసరి. అ΄ోహలను పక్కనపెట్టి వైద్యుల సూచనలను తప్పక ΄ాటించాలి ∙మంచి కొలెస్ట్రాల్‌ . డెసిలీటర్‌కు 40 మిల్లీగ్రాములు ఉండేలా చూసుకోవాలి ∙ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్త పడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ∙తిండిని అదుపులో ఉంచుకోవాలి. వరి, గోధుమ బదులు తృణ ధాన్యాలు, సిరి ధాన్యాలు తింటే కూడా చెడు కొలెస్ట్రాల్‌ బాగా తగ్గుతుంది. అలాగే పళ్ళు, పచ్చి కూరలు తురుముకొని పెరుగులో వేసుకుని తినండి. కీర దోసకాయలు, కారట్, బీట్రూట్, దోసకాయలు, బూడిద గుమ్మడి, సొరకాయ వంటివి తురుముకొని లేదా మిక్సర్‌ లో వేసి పెరుగులో కలిపి తీసుకుంటే మంచిది.పాలకు బదులు పెరుగు, మజ్జిగ తీసుకోండి. పంచదార పూర్తిగా మానేసి తాటి బెల్లం, బెల్లం లేదా తేనె కొద్ది మోతాదులో తీసుకోండి.రోజూ ఉదయం మొలకలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సలాడ్, పండ్లు తీసుకోండి. ఇలా 30 రోజులు చేయండి. ఉదయం రెండు కిలోమీటర్ల నడక, ్ర΄ాణాయామం చేయాలి.

Keerthy Suresh In Talks With Ajith's Good Bad Ugly Movie
శ్రీలీల కాదు ఆ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేశ్?

తమిళ స్టార్ హీరో అజిత్‌ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. 'విడాముయర్చి' షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో రిలీజ్ తేదీపై ప్రకటన ఇవ్వనున్నారు. మరోవైపు తెలుగు బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తీస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కూడా చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై అంచనాలు పెంచేసిందని చెప్పొచ్చు. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.(ఇదీ చదవండి: గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి మూవీ రివ్యూ)షూటింగ్‌ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమై, తొలి షెడ్యూల్‌ కూడా పూర్తి చేసుకుంది. ఇందులో హీరోయిన్‌గా తొలుత శ్రీలీల పేరు వినిపించింది. కానీ ఇప్పుడు ఆ ప్లేసులో కీర్తి సురేశ్ నటించబోతుందని అంటున్నారు. మరి ఇద్దరు హీరోయిన్లకు చోటుందా? లేదా కీర్తి సురేశ్‌నే తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే కీర్తీసురేశ్‌ ఖాతాలో మరో భారీ చిత్రం పడినట్లే.(ఇదీ చదవండి: 'భజే వాయువేగం' సినిమా రివ్యూ)

CM Jagan Arrived From Foreign Tour Grand Welcome From YSRCP
ముగిసిన సీఎం జగన్‌ విదేశీ పర్యటన

కృష్ణా, సాక్షి: ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా ఆయన రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ దగ్గర సీఎం జగన్‌కు ఘన స్వాగతం లభించింది. ఎంపీలు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. పార్టీ కేడర్‌ పెద్ద ఎత్తున తరలివచ్చింది. అక్కడి నుంచి నేరుగా ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. 👉ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండిఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మే నెల 17వ తేదీన సీఎం జగన్‌ విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. లండన్, స్విట్జర్లాండ్‌ దేశాల్లో కుటుంబసమేతంగా ఆయన పర్యటించారు. పదిహేను రోజుల తర్వాత తిరిగి ఇవాళ స్వదేశానికి విచ్చేశారు. జూన్‌ 4వ తేదీన ఏపీకి జడ్జిమెంట్‌ డే. ఈ నేపథ్యంలో నేడో, రేపో ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement