-
ఈ రెండు బ్యాంక్ ఖాతాదారులకు బంపరాఫర్
ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుబడిదారులకు భద్రత ఎక్కువ, రిస్క్ తక్కువ. అందుకే పెట్టుబడి దారులు ఎఫ్డీలలో పెట్టుబడి పెట్టేందుకు మక్కువ చూపుతుంటారు. మీరు కూడా ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే, ఎఫ్డీలపై 7.75శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తూ హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్లు వడ్డీ రేట్లను పెంచాయి. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం,హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లపై నిర్దిష్ట కాలపరిమితిపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల (బిపిఎస్) వరకు పెంచింది. కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు ఫిబ్రవరి 9, 2024 నుండి అమలులోకి వస్తాయి. 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.5శాతం నుండి 7.75శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇది కాకుండా, బ్యాంక్ 18 నెలల కాలపరిమితికి వడ్డీ రేట్లను పరిమిత కాలానికి 21 నెలల కంటే తక్కువకు పెంచింది. సాధారణ పౌరులకు, వడ్డీ రేటు 7.25శాతం. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు, అదే టెన్యూర్ కాలానికి వడ్డీ రేటు 7.75శాతం అందిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీ రేట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను ఫిబ్రవరి 17, 2024 నుండి రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు సవరించింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటు 7.75శాతం అందిస్తుండగా.. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పౌరులకు సంవత్సరానికి 7.2శాతం వడ్డీని అందిస్తుంది. . సాధారణ పౌరులకు, ఫిక్స్డ్ డిపాజిట్ అత్యధిక వడ్డీ రేటు 18 నెలల నుండి 2 సంవత్సరాల టెన్యూర్ కాలానికి 7.2శాతం వరకు ఉంటుంది. మరోవైపు, సీనియర్ సిటిజన్లకు అదే టెన్యూర్ కు 7.75శాతం వడ్డీ రేట్లు అందిస్తున్నట్లు వెబ్ సైట్ లో పేర్కొంది. -
చందా కొచ్చర్ అరెస్టుపై.. సీబీఐకి కోర్టు మొట్టికాయలు!
ముంబై: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)పై బాంబే హైకోర్టు మెట్టికాయలు వేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ అరెస్ట్ అంశంలో సీబీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనే కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ అనుజా ప్రభుదేశాయ్, జస్టిస్ ఎన్. ఆర్.బోర్కర్ డివిజన్ బెంచ్ 2024 ఫిబ్రవరి 6న కొచ్చర్ దంపతుల అరెస్టును చట్టవిరుద్ధమని పేర్కొంది. జనవరి 2023లో మరొక బెంచ్ వారికి బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వును ధృవీకరించింది. కోర్టు జారీ చేసిన సంబంధిత ఉత్తర్వుల్లో.. కొచ్చర్ దంపతులను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు అందుకు తగ్గ ఆదారాల్ని చూపించలేకపోయారని, కాబట్టే సీబీఐ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని భావిస్తున్నట్లు అనూజా ప్రభుదేశాయ్, ఎన్ఆర్ బోర్కర్ల ధర్మాసనం తెలిపినట్లు వెలుగులోకి వచ్చిన కోర్టు ఉత్తర్వులు ఉన్నట్లు తెలుస్తోంది. అధికార దుర్వినియోగం తగదు ‘చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇటువంటి సాధారణ అరెస్టులు అధికార దుర్వినియోగానికి సమానం’ అని కోర్టు పేర్కొంది. కానీ కొచ్చర్ దంపతులు విచారణకు సహకరించనందున అరెస్ట్ చేశామని సీబీఐ కోర్టుకు విన్నవించుకుంది. అయితే, విచారణ సమయంలో మౌనంగా ఉండే హక్కు నిందితులకు ఉందని.. సీబీఐ వాదనను అంగీకరించేందుకు కోర్టు నిరాకరించింది. కాగా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) ప్రకారం ఏ వ్యక్తినీ తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్భంధం చేయకూడదు. విచారణ చేస్తున్న సమయంలో అలా చేస్తున్నట్ల మౌనంగా ఉండే హక్కును కల్పిస్తుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. -
ICICI Results: అంచనాలను మించిన ఐసీఐసీఐ బ్యాంక్ లాభం.. 36 శాతం వృద్ధి
దిగ్గజ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాల్ని ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. గతేడాదితో పోలిస్తే నికర లాభంలో 36 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.7,558 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి చెందినట్లు బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. స్టాండలోన్ పద్దతిలో రూ.10,261 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకుంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.31,088 కోట్ల నుంచి రూ.40,697 కోట్లకు పెరిగినట్లు ఐసీఐసీఐ వెల్లడించింది. నికర వడ్డీ ఆదాయం రూ.18,308 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.14,787 కోట్లతో పోలిస్తే 24 శాతం వృద్ధి చెందింది. అదే సమయంలో నికర వడ్డీ మార్జిన్ 4.31 శాతం నుంచి 4.53 శాతానికి పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (NPAs) 2.76 శాతం నుంచి 2.48 శాతానికి పరిమితమయ్యాయని బ్యాంక్ తెలిపింది. -
అన్ని కాలాలకూ అనువైనది.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్
కొంత కాలంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ కీలక సూచీలు ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నాయి. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు బంగారం ధరలు చెప్పుకోతగ్గంత పెరిగాయి. మార్కెట్ల గమనం పట్ల స్పష్టమైన సంకేతాలు కనిపించనప్పుడు.. అనుభవం లేని ఇన్వెస్టర్లు మార్కెట్లోకి ప్రవేశించడం కష్టమే అవుతుంది. వేర్వేరు సాధనాల్లో ఉండే అస్థిరతలు, అనుకూల అవకాశాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల ముందున్న మార్గం.. మల్టీ అస్సెట్ మ్యూచవల్ ఫండ్స్. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ మెరుగైన పనితీరుతో ముందుంది. రాబడులు ఈ పథకం 2002 అక్టోబర్లో ప్రారంభమైంది. అప్పటి నుంచి చూస్తే ఏటా 21.13 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై రాబడులను తెచ్చి పెట్టింది. గడిచిన ఏడాది కాలంలోనూ 22 శాతం రాబడిని ఇచ్చింది. ఇక మూడేళ్లలో 27 శాతం, ఐదేళ్లలో 15.73 శాతం, ఏడేళ్లలో 14.71 శాతం, పదేళ్లలో 17 శాతం చొప్పున సగటు వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. మల్టీ అస్సెట్ ఫండ్స్ విభాగం సగటు రాబడితో పోలిస్తే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ పథకం రాబడుల్లో అందనంత ఎత్తులో ఉంది. మల్టీ అస్సెట్ అలోకేషన్ విభాగం రాబడి ఏడాది కాలంలో 13.55 శాతం, మూడేళ్లలో 15.42 శాతం, ఐదేళ్లలో 9.35 శాతం, ఏడేళ్లలో 7.69 శాతం, పదేళ్లలో 9.58 శాతం చొప్పున ఉంది. 6–12 శాతం వరకు ఈ పథకమే అధిక రాబడులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దశాబ్దాల నుంచి అద్భుతమైన రాబడులను ఇవ్వడమే కాదు, పనితీరులోనూ ఎంతో స్థిరత్వం కనిపిస్తుంది. అన్ని మార్కెట్ సైకిల్స్లోనూ (ఉద్దాన పతనాలు) ఈ పథకం బలమైన పనితీరు చూపించింది. సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసి ఉంటే, గత మూడేళ్లలో 23 శాతం, ఐదేళ్లలో 21.8%, పదేళ్లలో 16.6 శాతం చొప్పున వార్షిక సగటు రాబడిని ఈ పథకం ఇచ్చి ఉండేది. పెట్టుబడుల విధానం.. మల్టీ అస్సెట్ పథకాలు ఈక్విటీ, డెట్, బంగారంలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను వైవిధ్యం చేస్తాయి. దీంతో దీర్ఘకాలంలో రిస్క్ను అధిగమించి మెరుగైన రాబడులకు అవకాశం లభిస్తుంది. ఈ మూడు విభాగాలు ఒకదానితో ఒకటి సంబంధం లేనివి. వివిధ సాధనాల్లో ర్యాలీ ప్రయోజనాలను ఈ పథకం రూపంలో సొంతం చేసుకోవచ్చు. అచ్చమైన ఈక్విటీ పథకాలు మార్కెట్ల పతనాల్లో ఎక్కువ నష్టాలను చూస్తాయి. వాటితో పోలిస్తే బహుళ సాధనాలతో కూడిన ఈ పథకంలో పెట్టుబడుల విలువ క్షీణించే రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. లంప్సమ్ (ఒకే విడత), సిప్ రూపంలో పెట్టుబడులకు ఈ పథకం అనుకూలం. మార్కెట్ల కంటే ఈ పథకమే రిస్క్లను మెరుగ్గా నియంత్రించగలదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.21,705 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీలకు 58 శాతం కేటాయించింది. 14 శాతం డెట్లో ఇన్వెస్ట్ చేసింది. రియల్ ఎస్టేట్లో 0.94 శాతం పెట్టుబడులు పెట్టింది. నగదు, నగదు సమానాల రూపంలో 33.73 శాతం కలిగి ఉంది. -
లాభాల బాటలో ఐసీఐసీఐ బ్యాంక్.. ఫలితాలు ఇలా!
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధింంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి-మార్చి(క్యూ4)లో నికర లాభం 27 శాతం ఎగసి రూ. 9,853 కోట్లకు చేరింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 30 శాతం జంప్చేసి రూ. 9,122 కోట్లకు చేరింది. ఇందుకు రుణాలపై పెరిగిన వడ్డీ రేట్లు సహకరించాయి. సమీక్షా కాలంలో నికర వడ్డీ ఆదాయం 40 శాతం దూసుకెళ్లి రూ. 17,667 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 4 శాతం నుంచి 4.9 శాతానికి బలపడ్డాయి. రుణాల్లో 19 శాతం వృద్ధి ఇందుకు దోహదపడింది. ఆదాయం సైతం అప్ గతేడాది క్యూ4లో ఐసీఐసీఐ బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 27,412 కోట్ల నుంచి రూ. 36,109 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 17,119 కోట్ల నుంచి రూ. 22,283 కోట్లకు పెరిగాయి. స్థల మొండిబకాయిలు 3.6 శాతం నుంచి 2.81 శాతానికి దిగివచ్చాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 1,068 కోట్ల నుంచి రూ. 1,619 కోట్లకు పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.34 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థలలో లైఫ్ ఇన్సూరెన్స్ నికర లాభం రూ. 185 కోట్ల నుంచి రూ. 235 కోట్లకు, సాధారణ బీమా లాభం రూ. 313 కోట్ల నుంచి రూ. 437 కోట్లకు జంప్చేశాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement