-
అభయహస్తం.. బంద్..!
హన్మకొండ అర్బన్: ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ విషయంలో లబ్ధిదారుల అర్హత వయస్సు 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించడంతో జిల్లాలో వేలాది మందికి కొత్తగా ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే సమారు 40వేల మంది వరకు కొత్తగా అర్హత సాధిస్తారని అధికారులు ప్రాథమికంగా అంచనా సైతం వేశారు. దీంతో లబ్ధిదారుల వాటాతో పెన్షన్ అందుకునే అభయహస్తం పథకం ఇకపై పూర్తిగా రద్దుకానుంది. సెర్ప్ వెబ్సైట్లో సంబంధిత సమాచారం పూర్తిగా తొలగించడం ఇందుకు బలం చేకూర్చుతోంది. అయితే అభయహస్తం పథకంలో లబ్ధిదారుల వాటా, ప్రభుత్వం వాటా మొత్తం రూ.కోట్లలో జమై ఉన్నది. వీటిని సభ్యులకు ఎలా చెల్లిస్తార్న విషయంలో అయోమయం నెలకొంది. ఆసరా పథకంలో అభయహస్తం పెన్షన్ కోసం లబ్ధిదారులు ఒక్కొక్కరు రోజుకు ఒకరూపాయి చొప్పున నెలకు రూ.30 చెల్లిస్తే ప్రభుత్వం అంతే మొత్తంలో జమచేసేది. సభ్యుల వయస్సు 60 ఏళ్లు నిండగానే వారికి ప్రతినెలా రూ.500 పెన్షన్ చెల్లించేది. గతంలో ఆసరా పెన్షన్ అర్హత వయస్సు 65 సంవత్సరాలుగా ఉన్నందున అభయహస్తం పెన్షన్ ఐదు సంవత్సరాలు ముందుగా అందేది. ప్రసుతం ఆసరా అర్హత వయస్సు 57 సంవత్సరాలకు చేయడంతో ఈ పథకం కంటే ఆసరా పథకం ద్వారా ఎలాంటి చెల్లింపులు లేకుండా నేరుగా ఈ ఏడాది మార్చి నెల నుంచి రూ.2016 అబ్ధిదారులకు అందనున్నాయి. 2009 సంవత్సరంలో మొదలు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2009 సంవత్సరంలో ఐకేపీ పెన్షన్, బీమా పథకం పేరుతో అభయహస్తం పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. సంఘాల్లోని పేద మహిళలకు అన్ని విధాలుగా ఉపయోగ కరంగా ఉండడంతో ఈ పథకంలో పెద్ద సంఖ్యలు సభ్యులుగా చేరారు. వయస్సు 60 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వడం, వారి కుటంబాలకు బీమాతో భరోసా కల్పించడం, పిల్లల చదువులకు ఆర్థికంగా అండగా ఉండటం పథకం ముఖ్య ఉద్దేశంగా ఉండేది. బీమా ఉపకారం కూడా.. ఈ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా సభ్యత్వాలు, వాటా ధనం చెల్లింపులు నిలిపి వేయడంతో అనధికారికంగా పథకం రద్దయినట్లు సంఘాల వారు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆసరా పథకంతో పెన్షన్ పెద్ద మొత్తంలో వస్తున్నప్పటికీ బీమా, ఉపకార వేతనాలు వంటివి మాత్రం మహిళా సంఘాలు కోల్పోయే అవకాశం ఉందని సభ్యులు అంటున్నారు. ఈ పథకం కొంత మార్పులతో అమలు చేస్తామని గతంలో ప్రభుత్వం చెప్పినా అలాంటి చర్యలు కార్యరూపం దాల్చలేదు. వాటా ధనం సంగతి..? అభయహస్తం పథకంలో 18 సంవత్సరాలు నిండిన వారు చేరారు. వారు నెలకు రూ.30 చెప్పున వాటా ధనం చెల్లిస్తూ వచ్చారు. పథకం ప్రారంభం నుంచి ఉన్న ఒక్కో మహిళ ఇప్పటివరకు(అంటే సుమారు 10 ఏళ్ల కాలంలో)తన వాటా ధనంగా రూ.3600 చెల్లించి ఉంటుంది. అంతే మొత్తంలో ప్రభుత్వం జమచేసింది. అంటే ఒక్కో మహిళ పేరుతో రూ.7200 జమ అయిఉంటాయి. ఈ డబ్బులు తిరిగి చెల్లిస్తారా.. చెల్లిస్తే ఏ విధంగా ఇస్తారనే విషయంలో స్పష్టత రావలసి ఉంది. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 3.74 లక్షల మంది ఉండగా వీరిలో సుమారు 18వేల మంది పెన్షనర్లు. ఒక్కొక్కరికి రూ.7200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఏలా వస్తుందనే విషయమై సంఘాల సభ్యుల్లో కొంత ఆందోళన నెలకొంది. అలాగే పథకానికి సంబంధించిన క్లైములు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అయితే జిల్లా అధికారులకు మాత్రం ఈ పథకం అమలు, రద్దు విషయంలో ఎలాంటి «అధికారిక సమాచారం అందలేదని అంటున్నారు. పైసలిస్తలేరు.. అభయహస్తం పైసలు ఇస్తలేరు. 60 సంవత్సరాలు నిండిన మహిళలకు అండగా ఉండాలని వైఎస్ 2009 సంవత్సరంలో చేపట్టిన అభయహస్తం పథకాన్ని ఇచ్చిండ్లు.. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేసింది. గతంలో నెలకోసారి తప్పకుండా క్రమం తప్పకుండా అభయహస్తం పథకం ద్వారా పెన్షన్ మంజూరయ్యేది. ఇప్పుడు ఆరునెలలకోసారి కూడా రాట్లేదు. అధికారులు, ప్రభుత్వం జర పట్టించుకోవాలె. పింఛన్ అందించాలి. – కొయ్యడ మల్లికాంబ, పరకాల -
ఫిరాయింపుదారులు రాజీనామా చేయాలి: చాడ
కరీంనగర్: పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారు పదవులకు రాజీనామా చేయాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. టీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన ఆసరా పథకం పింఛన్ దారులను ఆందోళనకు గురిచేసేలా ఉందని అన్నారు. -
ఒక్క అర్హుడ్ని కూడా వదలం... : కేసీఆర్
మహబూబ్నగర్ : అర్హులందరికీ పెన్షన్లు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆసరా' పథకాన్ని శనివారం ఆయన మహబూబ్నగర్ జిల్లా కొత్తూరులో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుందన్నారు. అర్హులైనవారికి పింఛన్లు రాకుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. 'ఒక్క అర్హుడ్ని కూడా వదలం...ఒక్క అనర్హుడ్ని రానీవ్వం' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలు పెన్షన్లపై తమాషా చేశాయని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. 30ఏళ్ల వారికి కూడా వృద్ధాప్య పింఛన్లు ఇచ్చారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. గతంలో అనర్హులకు ఇచ్చిన పింఛన్లు రద్దు చేస్తామని ఆయన తెలిపారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఇకపై రేషన్ కార్డుపై రూపాయికి కిలో చొప్పున మనిషికి ఆరుకిలోలు బియ్యం అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అర్హులైనవారి రేషన్ కార్డులు తొలగించే ప్రసక్తే లేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేస్తామని కేసీఆర్ తెలిపారు. గ్రామీణ రోడ్లకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement