-
పెళ్లి వద్దన్నందుకు ప్రాణం తీశాడు!
దమ్మపేట: పెళ్లి వద్దన్నందుకు అమ్మాయి ప్రాణాలే తీశాడో ఉన్మాది! ఆమె విద్యావలంటీర్గా పనిచేస్తున్న స్కూలుకు వెళ్లి మరీ గొంతులో కత్తితో పొడిచి చంపాడు. అప్పటివరకు తలుపులు వేసుకొని బిక్కుబిక్కుమంటూ అన్న కోసం ఎదురుచూసిన ఆ యువతి.. ఆ అన్న కళ్లముందే విలవిల్లాడుతూ ప్రాణాలొదిలింది. యువతి నిండుప్రాణాలను బలిగొన్న ఉన్మాది కూడా అక్కడే పురుగుల మందు తాగి చనిపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట శివారులోని నెమలిపేటలో శనివారం ఈ దారుణం చోటుచేసుకుంది. పెళ్లి నిరాకరించినందుకే.. కుక్కునూరుకు చెందిన ఊటుకూరు శ్రీనివాసరావు అశ్వారావుపేటలో నివాసముంటూ ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిషత్ కార్యాలయంలో యూడీసీగా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె ప్రవళిక(22) నెమలిపేట ప్రాథమిక ఏకోపాధ్యాయ పాఠశాలలో విద్యా వలంటీర్గా పనిచేస్తోంది. కుక్కునూరుకే చెందిన వనమా వెంకటేశ్వరరావు కొడుకు శ్రీనివాసరావు హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ రెండు కుటుంబాల మధ్య దూరపు బంధుత్వం ఉంది. ప్రవళ్లికను తన కొడుక్కి ఇచ్చి వివాహం చేయాలని వెంకటేశ్వరరావు కుటుంబీకులు గతంలో ఆమె తల్లిదండ్రులను అడిగారు. అయితే ఇప్పట్లో పెళ్లి చేసే ఆలోచన లేదని వారు చెప్పారు. తర్వాత ప్రవళ్లికకు అశ్వారావుపేటకు చెందిన మరో యువకుడితో వివాహం నిశ్చయమైంది. దీంతో తనతో పెళ్లికి నిరాకరించిన ప్రవళికను చంపాలని శ్రీనివాసరావు నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారమే.. శనివారం నెమలిపేటలో ప్రవళిక పనిచేస్తున్న పాఠశాలకు శ్రీనివాసరావు వచ్చాడు. ముందుగా ఆమెతో మాటామాటా కలిపాడు. తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. అతడి ప్రవర్తనతో భయపడిపోయిన ప్రవళిక పాఠశాల గదిలోకి వెళ్లి గడియ పెట్టింది. వెంటనే తన సోదరుడు ప్రేమ్కుమార్కు ఫోన్ చేసి శ్రీనివాసరావు వచ్చి బెదిరిస్తున్న విషయాన్ని చెప్పింది. దీంతో వెంటనే అతడు నెమలిపేట చేరుకున్నాడు. కిటికీలో నుంచి సోదరుడిని చూడగానే తలుపు తెరిచి పరిగెత్తే ప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న శ్రీనివాసరావు ఆమె జుట్టు పట్టుకుని వెంట తెచ్చుకున్న కత్తితో గొంతులో బలంగా పొడిచాడు. ప్రేమ్కుమార్ బైక్ దిగి వచ్చేలోపే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ వెంటనే పురుగుల మందుతాగి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గొంతు నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రవళిక విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలింది. దాడికి ముందు శ్రీనివాసరావు ప్రవళికతో ఘర్షణ పడ్డాడు. పాఠశాల వెనుక వైపు ఆమె చేతి గాజులు పగిలి ఉండటం, వెంట తెచ్చుకున్న కొత్త కత్తిని అక్కడే ఓపెన్ చేసిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. విగతజీవిగా పడి ఉన్న ప్రవళికను చూసిన సోదరుడు, తండ్రి, మిత్రులు బోరున విలపించడం అందరినీ కలచివేసింది. సంఘటనా స్థలాన్ని అశ్వారావుపేట సీఐ రవికుమార్ పరిశీలించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన గడువు
► వీవీ పోస్టులకు వెయ్యికి పైగా దరఖాస్తులు ► జిల్లాలో 236 పోస్టులు ► నేడు, రేపు సర్టిఫికెట్ల పరిశీలన ► 8న మెరిట్ జాబితా ∙10న తుది దశ ఎంపిక ► 12న పాఠశాలల్లో చేరిక సాక్షి, నిర్మల్: విద్యావాలంటీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. ప్రభుత్వ వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో పూర్తిస్థాయిలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారన్న వివరాలు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఇంకా అందలేదు. అయితే ఒక్క నిర్మల్ మండలం పరిధిలోనే చివరి రోజు 300లకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా వెయ్యి మందికిపైగా దరఖాస్తు చేసుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ 12న పాఠశాలల్లో చేరేలా... జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,011 ఉండగా సుమారు 1.15 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాలో 236 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 162 ఎస్జీటీ, 74 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అందులో ఉన్నాయి. విద్యావాలంటీర్ల ద్వారా ఆ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ఈ నెల మొదట్లో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్ 2 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించారు. సోమవారంతో గడువు ముగిసింది. వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవడంతో సంఖ్య పరంగా విద్యాశాఖకు ఇంకా వివరాలు అందలేదు. కాగా మంగళ, బుధవారాల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరుగనుంది. ఈ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తుతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు 3 పాస్పోర్టు సైజ్ఫొటోలతో సంబంధిత ఎంఈవో కార్యాలయాల్లో సంప్రదించాలని విద్యాశాఖ అధికారులు తెలుపుతున్నారు. జూన్ 8న తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. 9న ఆ జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. జూన్ 10న తుది సెలక్షన్ జాబితాను విడుదల చేస్తారు. 12న పాఠశాలల పునఃప్రారంభం రోజు వీవీలు విధుల్లో చేరాల్సి ఉంటుంది. గతంలో ఆలస్యం ప్రభుత్వం ప్రతీ విద్యాసంవత్సరం ఆలస్యంగా విద్యావాలంటీర్ల నియామకాలు చేపట్టేది. దీంతో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నచోట విద్యార్థులకు సరైన బోధన జరగక నష్టపోయే పరిస్థితులు ఉండేవి. ప్రతీ ఏడాది జూలై, ఆగస్టు నెలల వరకు నియామక ప్రక్రియ జరగకపోవడంతో మూడు నెలల పాటు విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడేది. ఈ ఏడాది జూన్ మాసం వరకు డీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించనప్పటికీ ఇంకా దానికి సంబంధించిన నోటిఫికేషనే విడుదల చేయలేదు. మరో వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండా జూన్లోనే వీవీ నియామకాలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో తాత్కాలిక పద్ధతిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఉపాధ్యాయుల కొరత సమస్యకు తాత్కాలికంగా ఉపశమనం కలగనుంది. విద్యావాలంటీర్లకు గతేడాది రూ.8వేల చొప్పున చెల్లించగా, ఈ విద్యాసంవత్సరం నెలకు రూ.12 వేలు చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పలువురు టీటీసీ, బీఈడీ పట్టాఉన్న నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా యూనిట్గా రోస్టర్ పాయింట్ జిల్లా యూనిట్గా మండలం వారీగా రోస్టర్ పాయింట్ను సిద్ధం చేశాం. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మంగళ, బుధవారాల్లో సంబంధిత ఎంఈవోల వద్ద సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరుకావాలి. జూన్ 12వ తేదీలోగా వీవీ పోస్టులను భర్తీ చేస్తాం. – ప్రణీత, డీఈవో
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా
- కౌంటింగ్లో అప్రమత్తత అవసరం
- రోహిణి తీవ్రత లేనట్టే!
- 'గోరుముద్ద'కు తాజ్ రుచులు
- సాగుకు చక్కనైన సాయం
- రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి
- తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా
- వన సంపదకు పెద్ద ఆపద!
- 18అడుగుల ఎత్తులో ఆర్ఆర్ఆర్!
- స్ట్రాంగ్ రూమ్కు బ్యాలెట్ బాక్సులు
Advertisement