-
ఆ వైద్యులను తొలగించండి..
- ఏపీ ముఖ్యమంత్రి పేషీనుంచి వైద్య శాఖకు ఆదేశాలు -బోధనాసుపత్రులకు సర్క్యులర్ జారీచేసిన డీఎంఈ హైదరాబాద్ అనధికారికంగా సెలవుపెట్టి నెలల తరబడి డ్యూటీలకు రాకుండా ఉండే వైద్యులను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పేషీ ఉత్తర్వులు జారీచేసింది. ఏడాది పాటు సెలవులో ఉన్న వైద్యులను ఒక్కరిని కూడా ఇకపై ఉద్యోగంలో ఉంచాల్సిన అవసరం లేదని తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే నర్సింగ్హోంలలో పనిచేస్తున్నారని, ప్రైవేటు క్లినిక్లు నడుపుతున్నారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో విచారణ జరిపించి 600 మందికి వైద్యులకు చార్జ్మెమోలు జారీచేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో వైద్యుల్లో కలకలం మొదలైంది. ముఖ్యమంత్రి పేషీనుంచి వచ్చిన ఆదేశాలతో వైద్య విద్యాశాఖలో తొలి కసరత్తు మొదలైంది. మంత్రి పదే పదే వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఒత్తిళ్లు తెస్తున్న నేపథ్యంలో సోమవారం వైద్య విద్యాసంచాలకుల కార్యాలయం నుంచి అన్ని బోధనాసుపత్రులకు, వైద్య కళాశాలలకు సర్క్యులర్ జారీఅయింది. ఇప్పటి వరకూ అనధికారిక సెలవులో ఉన్న వైద్యుల జాబితా ఇవ్వాలని, వారిని తక్షణమే తొలగించేందుకు చర్యలు చేపడతామని సర్క్యులర్లో పేర్కొన్నట్టు తెలిసింది. తాజాగా పునర్విభజనలో కమల్నాథన్ కమిటీకి ఆప్షన్లు ఇవ్వని వారిని కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తాజా లెక్కల ప్రకారం 30 మందికి పైగా గత ఏడాదిగా అనధికారిక సెలవులో ఉన్నారని, వారిని తొలగించే అవకాశాలున్నట్టు సమాచారం. అలాంటి వైద్యులు ఏదైనా వినతులు ఇచ్చినా వాటిని పరిగణనలోకి తీసుకోకూడదని కూడా సర్కారు ఆదేశించినట్టు తెలిసింది. రెండు మూడు రోజుల్లో వైద్యవిధానపరిషత్, డెరైక్టరేట్ ఆఫ్ హెల్త్ విభాగాల నుంచి కూడా వైద్యులపై చర్యలకు ఆదేశాలు వెళ్లనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. -
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు!
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఆస్పత్రుల నిర్వహణ, కుటుంబ సంక్షేమ శాఖ, ఏపీ వైద్య విధానపరిషత్, ఆయూష్, డెరైక్టరేట్ ఆప్ కాలేజీ ఎడ్యుకేషన్, ట్రామా కేర్, డయాలిసిస్ విభాగాలు ఉన్నాయి. వీటిలో అన్ని కేంద్రాల్లోనూ పేదలు ఉచితంగా వైద్యం పొందవచ్చు. అయితే ఆ పరిస్థితి ఎక్కడా లేదు. దీంతో చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి చేతి చమురు వదిలించుకుంటున్నారు. జిల్లా వైద్యఆరోగ్య శాఖ పరిధిలో 18 క్లస్టర్లు ఉండగా.. వీటి పరిధిలో 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 423 సబ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో పలు పీహెచ్సీలు వసతుల సమస్యను ఎదుర్కొంటున్నాయి. వీటిలో పని చేస్తున్న 46 మంది వైద్యులు ఉన్నత చదువులకు వెళ్లిపోగా.. వారి స్థానాలు భర్తీ చేయలేదు. దీంతో 46 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులులేక, ఇన్చార్జీలతోనే నడుస్తున్నాయి. నర్సింగ్ సిబ్బంది కొరత ఉంది. సుమారుగా 42 మందిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వేసినా నియామాకాలు జరగలేదు. ల్యాబ్ టెక్నీషన్లు, ఫార్మాసిస్టుల కొతర వెంటాడుతోంది. 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ల్యాబ్లకు నోచుకోలేదు. ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధిలో రెండు ఏరియా, 12 కమ్యూనిటీ ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో సైతం స్పెషలిస్టుల కొరత ఉంది. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో వివిధ విభాగాలకు చెందిన స్పెషలిస్టులు కనీసం 12 మంది ఉండాల్సి ఉండగా ఆ పరిస్థితి లేదు. దీంతో రోగులు వైద్యానికి నోచుకోవడం లేదు. ప్రధానంగా సర్జన్లు, మెడికల్, డెంటల్, గైనిక్, ఈఎస్టీ, ఎముకలు తదితర విభాగాల వైద్యులు ఉండాల్సిన్నా వీరి నియామాకాలు జరగలేదు. 104,108 సేవలు ఏడాదిగా సక్రమంగా అందడం లేదు. ప్రాణదాతగా పేరున్న 108 వాహనాలు నాలుగు మూలకు చేరాయి. మిగిలిన వాటికి డీజల్ కొరతతో అరకొర సేవలు అందిస్తున్నాయి. ఇక 104 వాహనాల విధులు మారాయి. 18 క్లస్టర్లకి వాహనాలను సమకూర్చినప్పటికీ నిధుల లేమితో సతమతమవుతున్నాయి. దీంతో ఈ వాహనాలను అధికారులు వారి అవసరాలకు వాడుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతలకు వెళ్లి మందులిచ్చే సేవలు సంవత్సరంగా నిలిచిపోయాయి. ‘ఆయూష్’ను పట్టించుకోలేదు ఆయూష్ విభాగాన్ని ప్రభుత్వం పట్టించుకుంటున్నట్టు లేదు. పదేళ్లుగా పది పడకల ఆయూష్ ఆస్పత్రి నిర్మాణం కోసం జిల్లా వాసులు పోరాడుతున్నా ప్రయోజనం లేదు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రలో యూనాని, ఆయుర్వేదిక్, హోమి యో, నేచురోపతి వైద్యులు ఉండాలని గతంతో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ విషయాన్ని నేటి పాల కులు పక్కన పెట్టారు. దీంతో ఈ విభాగం ద్వారా అరకొరగానే సేవలు అందుతున్నాయి. రిమ్స్ తీరేవేరు జిల్లాకే తలమానికమైన రిమ్స్ ఆస్పత్రి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచింది. ఇక్కడ అన్నీ సమస్యలే. పేరుకే మెడికల్ కళాశాల. సూపర్ స్పెషాలిటీ వైద్యం మాత్రం ఆందుబాటులో లేదు. ప్రమాదకర వ్యాధైనా, ప్రమాదం జరిగి వచ్చిన ఇక్కడ వైద్యం అందడు. చిన్నపాటి రోగమైన విశాఖపట్నం రిఫర్ చేయాల్సిందే. రోజూ సుమారుగా ఏడు వందల ఓపీ ఉన్న ఈ ఆస్పత్రిలో న్యూరో సర్జన్, కార్డియాలజీ, ఇతర విభాగాలకు చెందిన సూపర్ స్పెషాలిటీ వైద్యులు లేరు. కొన్ని విభాగాలకు విశాఖపట్నం నుంచి అప్పుడప్పుడు వస్తుంటారు. ప్రస్తుత ం 142 మంది వైద్యులు ఉన్నా, ఇంకా కొరత ఉంది. స్టాప్ నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బది కొరత వేధిస్తోంది. దీనికి తోడు ఇక్కడ పని చేసే వైద్యులు, కిందిస్థాయి సిబ్బంది సైతం విశాఖ నుంచే రాకపోకలు సాగిస్తుండడంతో ఇక్కడ వైద్యం గగనంగా మారింది. డయాలసిస్ కేంద్రాల కొరత ఉద్దానం ప్రాంతంతో కిడ్నీ రోగులు అధికంగా ఉన్నారు. వారి కోసం రిమ్స్లో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే ఈ కేంద్రంపై ఒత్తిడి ఎక్కువగా ఉంది, టెక్కలి, సోంపేటల్లో వీటిని ఏర్పాటు చేయాలని ఐదేళ్లుగా ఆ ప్రాంతాలకు చెందిన ప్రజలు కోరుతున్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో కిడ్నీ రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. అవసాన దశలో ట్రామాకేర్ ట్రామాకేర్ కూడా అవసాన దశకు చేరుకుంది. రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారిని కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు ఆస్పత్రులకు పరిమితమయ్యాయి. టెక్కలి ఏరియా ఆస్పత్రి, శ్రీకాకుళంలోని రిమ్స్లో ఈ విభాగాలు నడుస్తున్నాయి. ఈ కేంద్రాల నిర్వహణకు సైతం ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement