-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హీరోయిన్.. ఎవరో చెప్పండి చూద్దాం?
ఈమె తెలుగు ఓ హీరోయిన్. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించినప్పటికీ.. తెలుగునాట కథానాయికగా భలే గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో అదిరిపోయే క్లాసిక్ బ్లాక్బస్టర్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరికొన్ని తెలుగు చిత్రాల్లో నటించింది. దక్షిణాదిలోని అన్ని భాషల్లో దాదాపు 100కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఇప్పుడేమో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న శ్రీలీల కొత్త మూవీ) పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు మోహిని. హా.. అవును మీరు ఊహించింది కరెక్టే. తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ టైమ్ ట్రావెల్ మూవీ 'ఆదిత్య 369'. ఈ సినిమాలో నటించిన హీరోయినే ఈమె. తమిళనాడులోని తంజావుర్లో పుట్టి పెరిగిన ఈమె.. 1991లో 'ఈరమణ రోజావే' చిత్రంతో కథానాయికగా మారింది. అదే ఏడాది తెలుగులో వచ్చిన 'ఆదిత్య 369'లో హీరోయిన్గా చేసిన తర్వాత ఈమెకు బోలెడంత ఫేమ్ దక్కింది. 'ఆదిత్య 369' సినిమాతో పాటు 'డిటెక్టివ్ నారద', 'మామ బాగున్నావా', 'హిట్లర్' తదితర తెలుగు సినిమాల్లో మోహిని హీరోయిన్గా చేసింది. ఇక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో కలిపి 100కి పైగా సినిమాల్లో నటించింది. 2011లో చివరగా 'కలెక్టర్' అనే మలయాళ మూవీలో నటించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. ఇక 1999లోనే భరత్ అనే వ్యక్తిని మోహిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నాడు. అయితే చాలారోజుల తర్వాత రీసెంట్గా ఓ ఈవెంట్లో కనిపించిన మోహినిని చాలామంది గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత గుర్తొచ్చి ఈమె ఆమే కదా అని మాట్లాడుకున్నారు. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: మహేశ్ ఫ్యాన్స్తో 'గుంటూరు కారం' నిర్మాత గొడవ.. ఏం జరిగిందంటే?) -
‘ఆదిత్య 999’ సినిమాకు నేనే దర్శకత్వం వహిస్తా: బాలకృష్ణ
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం లో వచ్చిన ఆదిత్య 369 సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెల్సిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా ఆదిత్య 999 సినిమా చేయబోతున్నట్లు గతంలో బాలకృష్ణ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు మళ్లీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ఆ సినిమా సెట్స్పైకి వెళ్తుందో లేదో అనునుకున్నారు. తాజాగా ‘ఆదిత్య 999’ కచ్చితంగా ఉంటుందని బాలకృష్ణ స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది ఆదిత్య 999 చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఆ చిత్రానికి తానే దర్శకత్వం వహించబోతున్నట్లు స్పష్టం చేశాడు. యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన దాస్ కా దమ్కీ ట్రైలర్ ను హైదరాబాద్ ఏఎంబీ మాల్ లో బాలయ్య లాంఛనంగా ఆవిష్కరించారు. ట్రైలర్ చాలా బాగుందని, విజయం తథ్యమని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ప్రేక్షకులు మంచి సినిమా వస్తే తప్పకుండా ఆదరిస్తున్నారని తెలిపిన బాలకృష్ణ... దమ్కీ చిత్ర నటీనటులు, నిర్మాణ విలువలు బాగున్నాయని కితాబిచ్చారు. విశ్వక్ సేన్ తన తొలిచిత్రం నుంచి ఎంతో కష్టపడుతూ ఎదుగుతున్నాడన్న బాలకృష్ణ... విశ్వక్ సేన్ చిత్రాలు చూస్తే తన యుక్త వయస్సులో చేసిన సినిమాలు గూర్తొచ్చాయని ప్రశంసించారు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న దమ్కీని ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని విశ్వక్ సేన్ వెల్లడించారు. -
గతంలోకి వెళ్లాలనుందా..? ఈ సినిమాలు చూసేయండి..
Telugu Time Travel Movies And Web Series: భారతీయ సినీ ప్రపంచంలో అనేక రకాల సినిమాలు వచ్చాయి. అందులో ఎన్నో రకాల జోనర్లు ఉన్నాయి. అది ఏ జోనరైనా సరే ఆ జోనర్కు తగినట్టు చూపిస్తే చాలనుకుంటాడు సగటు సినీ ప్రేమికుడు. అలా ప్రేక్షకులు నచ్చే మెచ్చే జోనర్లలో ఒకటి 'టైమ్ ట్రావెల్' జోనర్. కాలంతో పాటు ప్రయాణం చేసే కథలు చాలా అరుదుగానే వస్తుంటాయి. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సినిమాలు చేయడం అంటే అంతా ఆశామాషీ కాదు. దానికి అద్భుతమైన స్క్రిప్ట్, బోలెడంత బడ్జెట్తో పాటు ప్రేక్షకుడిని కన్విన్స్ చేసేలా కూడా ఉండాలి. అందుకే చాలా తక్కువ మంది దర్శకులు మాత్రమే ఈ టైమ్ ట్రావెల్ కథలతో సినిమాలు చేశారు. నందమూరి బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369' నుంచి ఇటీవల వచ్చిన అద్భుతం సినిమా వరకు అలరించిన టైమ్ ట్రావెల్ చిత్రాలను చూద్దాం. 1 - ఆదిత్య 369 నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఆదిత్య 369 చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలోనే తొలి టైమ్ ట్రావెల్ చిత్రం. ఇందులో కృష్ణ కుమార్, శ్రీ కృష్ణదేవరాయలుగా రెండు పాత్రల్లో బాలకృష్ణ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆగస్టు 18, 1991లో విడుదలైన ఈ సినిమాకు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను హాలీవుడ్ చిత్రం 'బ్యాక్ టూ ఫ్యూచర్', హెచ్.జి. వెల్స్ రచించిన 'టైమ్ మేషీన్' పుస్తకం నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. 2 - 24 తమిళ స్టార్ హీరో సూర్య మూడు విభన్న పాత్రలతో మెప్పించిన చిత్రం 24. ఈ సినిమాను వైవిధ్య చిత్రాల దర్శకుడు కె. విక్రమ్ కుమార్ తెరకెక్కించారు. సమంత హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో వాచ్ రిపేరర్, సైంటిస్ట్, విలన్గా సూర్య అదరగొట్టారు. ఇందులో వాచ్ రూపంలో టైమ్ మేషీన్ ఉంటుంది. ఆ వాచ్ను రిపేర్ చేసే క్రమంలో టైమ్ మేషీన్ ద్వారా సూర్య గతంలోకి ప్రవేశిస్తాడు. 3- ప్లే బ్యాక్ గతం నుంచి ప్రస్తుతానికి ఒక ఫోన్ లైన్ ద్వారా కనెక్షన్ ఏర్పడితే ఎలా ఉంటుందనేదే 'ప్లే బ్యాక్' సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వద్ద పనిచేసిన హరిప్రసాద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో దినేష్, అనన్య ప్రధానపాత్రల్లో నటించారు. వీరిలో ఒకరు 1993లో బ్రతికుంటే, మరొకరు 2019 కాలంలో జీవిస్తూ ఉంటారు. అయితే 26 ఏళ్ల టైమ్ గ్యాప్ ఉన్న ఈ పాత్రల మధ్య సంబంధం ఏంటీ ? ఫోన్ కాల్స్ ద్వారా గతంలో జరిగిన సంఘటనలో మార్పు తీసుకొస్తే ప్రస్తుతం, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో అని తెలిపేదే కథ. ఈ సినిమా ప్రస్తుతం 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 4 - అద్భుతం తేజ సజ్జా, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్లో మాలిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం అద్భుతం. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న ఇద్దరు ఒక ఫోన్ కాల్తో విరమించుకుంటారు. అయితే ఇద్దరికీ ఒకే మొబైల్ నంబర్తో ఫోన్ కాల్ వస్తుండంతో ఆశ్చర్యానికి గురవుతారు. ఇలా ప్రారంభమైన సినిమా వాళ్లిద్దరూ వేరు వేరు సంవత్సరంలో జీవిస్తున్నారని తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ మూవీలో 26 సంవత్సరాలు టైమ్ గ్యాప్ ఉంటే ఇందులో ఐదేళ్ల గ్యాప్ ఉంటుంది. గతంలో జరిగిన సంఘటనలను మార్చే నేపథ్యంతో సాగుతుందీ సినిమా. ఈ చిత్రం నవంబర్ 19, 2021లో హాట్స్టార్లో విడుదలైంది. 5 - ఆ ! దర్శకుడిగా ప్రశాంత్ వర్మ తొలి చిత్రం ఆ !. సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హీరో నాని, ప్రశాంత్ తిపిర్నేని నిర్మించారు. ఇందులో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, రెజీనా కసాండ్ర, శ్రీనివాస్ అవసరాల, ప్రియ దర్శిని, మురళి శర్మ నటించగా, రెండు పాత్రలకు నాని, రవితేజ వాయిస్ ఇచ్చారు. అయితే ఈ సినిమా పూర్తి తరహా టైమ్ ట్రావెల్ చిత్రం కాదు. కానీ ఇందులో వాచ్మెన్ శివ పాత్ర సైంటిస్ట్ అవ్వాలనుకుంటాడు. సైంటిస్ట్ అయి టైమ్ మేషీన్ కనిపెట్టి ఎప్పుడూ చూడని తన తల్లిదండ్రులను కలవాలనుకుంటాడు. ఈ క్రమంలో అతని దగ్గరికి భవిష్యత్తు నుంచి పార్వతి అనే పాత్ర వస్తుంది. ఇలా ఈ పాత్రల ద్వారా టైమ్ ట్రావెల్ను చూపించాడు దర్శకుడు. అయితే పార్వతికి, శివకు ఉన్న రిలేషన్ ఏంటనేది మాత్రం సినిమాలో బెస్ట్ ట్విస్ట్. 6 - కుడి ఎడమైతే టైమ్ ట్రావెల్ జోనర్లో వచ్చిన వెబ్ సిరీస్ కుడి ఎడమైతే. అమలాపాల్, ఈశ్వర్ రచిరాజు, రాహుల్ విజయ్ నటించిన ఈ వెబ్ సిరీస్లో టైమ్ లూప్ (Time Loop) గురించి వివరించారు. ఒకే సమయంలో ఆగిపోవడం. అంటే పాత్రలు, సంభాషణలు, సంఘటనలు రిపీట్ అవుతుంటాయన్నమాట. మల్టీపుల్ స్క్రీన్ ప్లే, కొత్త తరహా కథతో ఆకట్టుకున్నాడు దర్శకుడు పవన్ కుమార్. -
బాలయ్య క్లారిటీ.. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అప్పటి వరకు ఆగాల్సిందేనా?
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ వెండితెరపై ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని గత కొన్నేళ్లుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు మోక్షజ్ఞను తెర మీద చూసేందుకు నందమూరి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ నటించిన తొలి సైన్స్ ఫిక్ష్న్ మూవీ ‘ఆదిత్య 369’ 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బాలయ్య మరో సారి ఈ చిత్ర స్వీక్వెల్ పై స్పందిస్తూ పలు ఆసక్తిర విషయాలు పంచుకున్నారు. ‘ఆదిత్య 369’ సినిమాకు సంబంధించి బాలయ్య మీడియాతో ముచ్చటించారు. అందులో.. ఈ సినిమాకు సీక్వెల్ను 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు, ‘ఆదిత్య 999 మాక్స్’ అనే టైటిల్ను ఫిక్స్ చేశామని చెప్పారు. అయితే ఇంకా దర్శకుడిని ఖరారు చేయలేదని చెబుతూ.. తాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదన్నట్లు చెప్పుకొచ్చారు. కాగా ‘ఆదిత్య 369’ చిత్రం అప్పట్లోనే ఓ రేంజ్ గ్రాఫిక్స్లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుత అందుబాటులో ఉన్న టెక్నాలజీ సహాయంతో నెవ్వర్ బిఫోర్ అనేలా ‘ఆదిత్య 999’ మ్యాక్స్ను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో మరో రెండేళ్ల సమయం పడుతుందని ఆయన తెలిపారు. దీని బట్టి చూస్తే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం.. ఇంకో రెండేళ్లు వెయిట్ చెయ్యాలని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. కాగా గతంలో బాలయ్య.. తాను నటించిన ‘ఆదిత్య 369’ సినిమాకు సీక్వెల్తో మోక్షజ్ఞ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. -
ఆదిత్య 369 @30: ఆ టైం మెషిన్కు స్ఫూర్తి ఎవరో తెలుసా?
గడియారం గిర్రున వెనక్కి తిరిగితే... ఫ్లాష్బ్యాక్లోకి వెళ్లి రావచ్చు... గిర్రున ముందుకు తిరిగితే... ఫ్యూచర్ని చూడొచ్చు. ఇంగ్లిష్ సినిమాల్లో ఇలాంటి కథలు కామన్. తెలుగు ప్రేక్షకులకూ పాస్ట్నీ, ఫ్యూచర్నీ చూపించిన ఘనత ‘ఆదిత్య 369’ది. అప్పట్లో గ్రాఫిక్స్ సౌకర్యం లేని రోజుల్లో ఇలాంటి సినిమా తీయడం అంటే చిన్న విషయం కానే కాదు. అందుకే తొలి ఇండియన్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య 369’ క్లాసిక్గా నిలిచిపోయింది. నేటి (జూలై 18)తో ఈ చిత్రానికి 30 ఏళ్లు. ఈ టైమ్ ట్రావెల్ కథ పట్టాలెక్కడానికి ముఖ్య కారణం ప్రముఖ దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. 30 ఏళ్లయిన సందర్భంగా హీరో బాలకృష్ణ – దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు – నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్.. ముగ్గురూ బాలూని తలుచుకున్నారు. ఇక ‘ఆదిత్య 369’ గురించి ఈ ముగ్గురూ ఏం చెప్పారో తెలుసుకుందాం. విమానం స్మూత్గా వెళుతోంది. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పక్క పక్క సీట్లలో కూర్చుని ఉన్నారు. ఈ ట్రావెల్ టైమ్లో ఎస్పీబీకి తన మనసులో ఉన్న ట్రావెల్ మిషన్ స్టోరీ చెప్పారు సింగీతం. ఎస్పీబీ ఎగ్జయిట్ అయి, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ని సింగీతంని కలవమన్నారు. అలా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగడానికి ఎస్పీబీ కారణం అయ్యారు. ఈ విషయం గురించి సింగీతం మాట్లాడుతూ – ‘‘ఆ రోజు నేను ఎస్పీబీగారిని కలవకపోతే ఈ సినిమా ఉండేది కాదేమో. అలాగే శ్రీ కృష్ణదేవరాయలు పాత్రను బాలకృష్ణగారు చేయకపోతే సినిమా లేదని కథ చెప్పినప్పుడే కృష్ణప్రసాద్గారు అన్నారు. అయితే టైం మెషిన్ను తాను కనిపెట్టినట్లు చెప్తున్నారని, కానీ, హెచ్జీ వెల్స్ అనే రైటర్ రాసిన ది టైమ్ మెషిన్ అనే పుస్తకం తనకు కాలేజీ రోజుల నుంచే స్ఫూర్తి అని సింగీతం అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా టీం పంచుకున్న విశేషాలు కింద వీడియోలో ఉన్నాయి. ఎస్పీబీతో బాలకృష్ణ, శివలెంక బాలకృష్ణగారికి నేను 30 నిమిషాల పాటు కథ చెబితే, ‘నాన్నగారు (ఎన్టీఆర్) కృష్ణదేవరాయలు పాత్ర చేశారు. నాకూ చేయాలని ఉంది’ అని 30 సెకన్లలో సినిమాకి ఓకే చెప్పారు. అప్పటికి ఇండియాలో తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ఆదిత్య 369’. టైమ్ మెషీన్ నేపథ్యంలో సాగే సినిమా. ఎంతో ఖర్చు, కష్టంతో కూడుకున్నది అయినప్పటికీ నిర్మించడానికి ముందుకు వచ్చారు కృష్ణప్రసాద్గారు. ప్రతి సినిమా పునః పుట్టినరోజు చేసుకుంటుంది. అయితే, ‘ఆదిత్య 369’ ప్రత్యేకత ఏంటంటే... ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటుంది. ఉదాహరణకు, ఈ మధ్య మా మనవరాలి పెళ్లి అమెరికాలో జరిగితే మేం ఇండియాలో లైవ్ లో చూశాం. ఆ తర్వాత చాలామంది ఫోన్ చేసి, ‘సార్.. మీరు ఆ రోజు ‘ఆదిత్య 369’లో టీవీలో పెళ్లి చూస్తారని చెప్పింది ఈ రోజు జరిగింది’ అన్నారు. సినిమాలో పోలీస్ స్టేషన్ను ఫైవ్ స్టార్ హోటల్లా చేశాం. అదింకా రాలేదు. ఎయిర్ ట్రాఫిక్ గురించి చెప్పాం. అదింకా రాలేదు. భవిష్యత్తులో అవన్నీ వస్తాయి. నేను ఎన్నో సినిమాలు చేశాను. అయితే అవి ఈ రోజులకు అన్వయించుకునే సినిమాలు కాదు. ఈ ఒక్క ‘ఆదిత్య 369’ను మాత్రం అన్వయించుకోవచ్చు’’ అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా విషయంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది శివైక్యమైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి గురించి. ఆయనే మా సంధానకర్త. ఇటువంటి సినిమా చేయడానికి నిర్మాతకు ధైర్యం ఉండాలి. దర్శకుడికి ప్యాషన్ ఉండాలి. హీరోకి ప్యాషన్, ధైర్యంతో పాటు దాని గురించి అవగాహన ఉండాలి. మేం ట్రెండ్ సెట్టర్స్ అనుకోండి. ఇటువంటి సినిమా ఇప్పటివరకూ మళ్ళీ రాలేదు. అప్పట్లో ‘ఆదిత్య 369’ చేసేటప్పుడు చాలామంది సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఈ సినిమాకు గుండెకాయ శ్రీ కృష్ణదేవరాయలు పాత్ర. ఈ సినిమాలో ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది. గ్రాఫిక్స్ లేని రోజుల్లో మొట్టమొదటిసారి వి.హెచ్.ఎస్ కెమెరాతో షూట్ చేసి... సినిమా నెగటివ్ మీదకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. భారతీయులు ఇటువంటి సినిమా చేయగలరని నిరూపించాం. కృష్ణ్ణప్రసాద్గారు ‘ఆదిత్య 369’ తర్వాత ఎన్నో గొప్ప చిత్రాలు చేశారు. అలాంటి నిర్మాత ఇండస్ట్రీకి అవసరం. ముందు ముందు ‘ఆదిత్య 369’కి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది’’ అన్నారు. బాలకృష్ణ, సింగీతం, శివలెంక కృష్ణప్రసాద్ శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ – ‘‘మా బేనర్లో తొలి సినిమా ‘చిన్నోడు పెద్దోడు’ విజయవంతమైన ఉత్సాహంలో ఉన్న సమయంలో బాలు (ఎస్పీబీ) అంకుల్ ‘కృష్ణా.. ఓ పెద్ద సినిమా చెయ్. నేను హీరోలతో మాట్లాడతాను’ అన్నారు. సింగీతంగారిని కలమన్నారు. కలిస్తే.. ఆయన ‘ఆదిత్య 369’ కథ చెప్పారు. టైమ్ ట్రావెలింగ్ కథ. భారతీయ తెరపై రాని కథాంశంతో సినిమా తీయడం ఒక రకమైన సాహసమని సింగీతంగారితో అన్నాను. బాలు అంకుల్ అయితే ‘భవిష్యత్తులో నువ్వు ఎన్ని సినిమాలైనా చేయవచ్చు. ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్లా నిలబడుతుంది’ అన్నారు. ఆయన ఇచ్చిన ధైర్యంతో సింగీతంగారితో ఈ సినిమా చేస్తా’ అన్నాను. కథ విని, ‘ఆదిత్య 369’ని బాలకృష్ణగారు చేయాలనుకోవడం నా అదృష్టం అనుకోవాలి. 1990లో ఈ సినిమా మొదలైంది. తొలి షెడ్యూల్ పూర్తయ్యాక పీసీ శ్రీరామ్ గారికి సుస్తీ చేసింది. దాంతో కెమెరామేన్ వీఎస్సార్ స్వామిగారితో బాలకృష్ణగారు మాట్లాడారు. అలా... వర్తమానంలో నడిచే సీన్లకు పీసీ శ్రీరామ్, శ్రీకృష్ణదేవరాయలు కాలంలో సన్నివేశాలకు వీఎస్సార్ స్వామిగారు, భవిష్యత్తును చూపించే సీన్లకు కబీర్ లాల్ ఛాయాగ్రాహ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్ర కళాదర్శకుడు పేకేటి రంగాగారికి, కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసిన సాంబ శివరావుగారికి నంది అవార్డు వచ్చింది. గౌతమ్ రాజుగారి ఎడిటింగ్, ఇళయరాజాగారి మ్యూజిక్, బాలు అంకుల్, జానకిగారు, జిక్కీ గార్ల గానం.. అన్నీ అద్భుతం. అయితే బడ్జెట్ పరంగా అనుకున్నదానికంటే పెరిగితే బయ్యర్లు సహకరించారు. వ్యాపారంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. డబ్బు సంపాదిస్తాం. కానీ, పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. ‘ఆదిత్య 369’ వల్ల నాకు వచ్చిన గౌరవం 50 ఏళ్లయినా ఉంటుంది. టాప్ 100 సినిమాల్లో ఈ సినిమా ఒకటి కావడం నా అదృష్టం’’ అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement