-
మోర్ స్టోర్లో కల్తీ బియ్యం కలకలం
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్లోని మోర్ సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన బియ్యంలో కల్తీ వచ్చాయని, ఆరోగ్య సమస్యలు తలెత్తాయని వినియోగదారుడు సోమవారం ఆందోళనకు దిగాడు. కరీంనగర్లోని విద్యానగర్కు చెందిన కర్నె శ్యాంసన్ కథనం ప్రకారం. జ్యోతినగర్లోని మోర్సూపర్ మార్కెట్లో శ్యాంసన్ ఇటీవల 25 కిలోల బియ్యం కొనుగోలు చేశాడు. అవి తిన్నప్పటి నుంచి పిల్లలు కడుపునొప్పి వస్తుందని తరచూ అంటున్నారని తెలిపారు. సోమవారం శ్యాంసన్ కుమారుడికి తీవ్రంగా కడుపునొప్పి రావడంతో అన్నాన్ని పరిశీలించిగా కల్తీ జరిగిందని గుర్తించారు. నేరుగా సూపర్మార్కెట్కు వెళ్లి నిర్వాహకులను నిలదీశాడు. పెద్ద ఎత్తున జనం గుమిగూడడంతో విషయం తెలుసుకున్న టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని ఫుడ్సేప్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫుడ్సేప్టీ అధికారి రాజేంద్రనాథ్ సూపర్మార్కెట్కు వచ్చి వినియోగదారుడు శ్యాంసన్ నుంచి వివరాలు సేకరించారు. అనంతరం సూపర్ మార్కెట్లోని బియ్యం షాంపిల్స్ సేకరించుకొని వెళ్లారు. పరీక్ష నిమిత్తం ల్యాబ్కు పంపించి కల్తీ జరిగిందని తెలితే కేసు నమోదు చేస్తామని తెలిపారు. -
పైన ఫైన్.. లోపల రేషన్
హన్మకొండటౌన్, న్యూస్లైన్ : సన్నబియ్యం అమ్మకాల పేరిట ప్రజలను మోసం చేసే వ్యాపారుల ముఠా ఒకటి నగరంలోకి ప్రవేశించింది. ట్రైసిటీలోని పలు కాలనీల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేసిన ఈ ముఠా ఇప్పటికే పలువురిని మోసం చేసినట్లు తెలిసింది. తక్కువ ధరకు సన్నబియ్యం అందిస్తామంటూ ట్రాక్టర్, ఆటో ట్రాలీలపై బస్తాలను వేసుకుని ప్రచారం చేసి రేషన్ బియ్యం అంటగడుతూ పలువురు దొరికిన కాడికి దోచుకెళ్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మార్కెట్లో సన్నరకం బియ్యం క్వింటాల్కు రూ.4500 నుంచి రూ.5వేలకు పైగా ధర పలుకుతోంది. అయితే రూ.5వేల ధర ఉన్న సన్నాలను తాము రూ.3500లకే ఇస్తామంటూ కొంతమంది ముఠా సభ్యులు ఇటీవల నగరవాసులకు గాలం వేస్తున్నారు. మార్కెట్కు వెళ్లకుండా తమ ఇంటి వద్దనే తక్కువ ధరకు మేలురకం బియ్యం తీసుకోవచ్చని భావిస్తున్న మహిళలు నకిలీ బియ్యం ముఠా మాటలను నమ్ముతున్నారు. అయితే తమను అనుమానంగా చూస్తున్న ఉద్యోగులు, మహిళలకు నమ్మకం కుదిర్చేందుకు వ్యాపారులు తమ సెల్ నెంబర్ కూడా ఇచ్చి వెళ్తున్నారు. ఇంత తక్కువ ధరకు ఎలా బియ్యం అమ్ముతున్నారని ప్రశ్నిస్తే ధాన్యం తక్కువ ధర ఉన్నప్పుడు వేలాది క్వింటాళ్లలో తాము కొనుగోలు చేశామని, స్టాక్ పెట్టిన సమయం గడిచిపోవడంతో బియ్యం పాడైపోతున్నాయని.. మిల్లర్లు తమకు కమీషన్పై విక్రయించాలని అప్పగించినట్లు నమ్మబలుకుతారు. దీంతో అనుమానం నివృత్తి కావడంతో పలువురు క్వింటాళ్ల కొద్ది బియ్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో బుధవారం హన్మకొండ కుమార్పల్లి మార్కెట్ సమీపంలో నివాసముంటున్న ముగ్గురు మహిళలు సుమారు రూ.25వేలకు పైగా చెల్లించి బియ్యం కొనుగోలు చేసి నష్టపోయారు. వీరిలో ఒకరు మూడు క్వింటాళ్లు, మరో ఇద్దరు రెండు క్వింటాళ్ల చొప్పున బియ్యం తీసుకున్నారు. కొనుగోలు సమయంలో బియ్యం బస్తాల నుంచి షాంపిల్ చూపించినప్పుడు సన్నరకం ఉన్నాయని, తర్వాత బస్తాలను విప్పి చూస్తే లోపల దొడ్డురకం రేషన్ బియ్యం ఉన్నాయని బాధితులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఈ ముఠా నగరంలోని పలు ప్రాంతాల్లో పలువురిని మోసం చేసినట్లు తెలుస్తోంది. కాగా, మోసానికి గురైన వారు వ్యాపారులు ఇచ్చిన సెల్నంబర్ను పట్టుకుని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ నంబర్కు డయల్ చేయగా అది కాకినాడ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా నిర్ధారణ అయింది. తక్కువ ధరకు బియ్యం ఇస్తామని అన్నప్పుడే ఫిర్యాదు చేస్తే తాము వచ్చి చర్యలు తీసుకునే వారమని పోలీస్ అధికారులు చెప్పినట్లు బాధితులు తెలిపారు. ఇప్పటికైనా తక్కువ ధరకు బియ్యం విక్రయిస్తామని ఎవరైనా అంటే తమకు సమాచారం అందించాలని వారు చెప్పారు. కాగా, మార్కెట్లో ధరలు మండిపోతున్న ప్రస్తుత సమయంలో తక్కువ ధర కు బియ్యం కొనుగోలు చేసి మోసపోవద్దని పోలీస్ అధికారులు నగరవాసులను హెచ్చరిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఛాంపియన్గా శ్రీలంక
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement