-
కడుపులో కల్తీ!
కర్నూలు(హాస్పిటల్): వ్యాపారులకు డబ్బు సంపాదనే ప్రదానం. ప్రభుత్వ నిబంధనలు వారికి తెలియవు. తెలిసినా పట్టించుకోరు. ఇలా చేయడం తప్పు అని చెప్పాల్సిన అధికారులు నాలుగు డబ్బులు చేతిలో పడేసరికి చూడనట్లు వెళ్లిపోతారు. ఫలితంగా ప్రజారోగ్యం గుల్ల అవుతోంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తీసుకునే ఆహారం సర్వం కల్తీమయమై కడుపు రోగాల పుట్టగా మారుతోంది. ఆహారానికి సంబంధించిన అన్ని వ్యాపారాలకు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ లైసెన్స్ మంజూరు చేయాలి. ఈ శాఖ సూచించే నియమ నిబంధనలను వ్యాపారులు తు.చ తప్పకుండా పాటించాలి. అలా పాటించని వ్యాపారులపై కేసులు పెట్టాలి. ఆహారాన్ని శ్యాంపిల్గా తీసి ల్యాబ్కు పంపించి, అందులో ఆహారం కల్తీ అయినట్లు తేలితే జైలుకు పంపించాలి. ఇవేవీ చేయకుండా సంబంధిత శాఖ జిల్లాలో మొద్దు నిద్రపోతోంది. ఈ శాఖలో కేవలం ముగ్గురు గజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టరు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో డివిజన్ పర్యవేక్షిస్తారు. వీరికి సహాయక సిబ్బంది, నాల్గవ తరగతి సిబ్బంది లేరు. పనిభారం మోయలేక కొందరు సొంతంగా జీతం ఇచ్చుకుని ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించుకుంటుంటే మరి కొందరు అధికారులు మామూళ్లకు తెగబడుతున్నారు. లైసెన్స్లు మంజూరు చేయడం దగ్గర నుంచి శ్యాంపిల్స్ తీసే విషయం వరకు మామూళ్లు దండుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. నిబంధనలకు తూట్లు పొడుస్తున్న బిర్యానీ సెంటర్లు ♦ హోటళ్లు, బిర్యానీ సెంటర్లు ఏర్పాటు చేయాలంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. లైసెన్స్ లేకపోతే తనిఖీల్లో దొరికినప్పుడు సెక్షన్ 63 ప్రకారం ఫుడ్ సేఫ్టీ కమిషన్ ద్వారా క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తారు. నేరం రుజువైతే 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా విధిస్తారు. ♦ ఆహార పదార్థాల్లో ప్రకృతి సిద్ధమైన రంగులే వాడాలి. ♦ ఆహార పదార్థాల తయారీకి టేస్టింగ్ సాల్ట్ (చైనా సాల్ట్) వాడకూడదు. రోజువారీ వాడే ఉప్పునే వాడాలి. కానీ ఈ నిబంధనలను బిర్యానీ సెంటర్ల వారు పాటించడం లేదనే విమర్శలున్నాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం అన్ని రకాల హోటళ్లలో లోపలి భాగం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. డ్రైనేజి వసతి బాగుండాలి. వంట వండే వ్యక్తి, వడ్డించే వ్యక్తులకు సంబంధిత హోటల్ యజమాని డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి చాలా చోట్ల అమలు కావడం లేదు. పెద్ద హోటళ్లు, కొన్ని రెస్టారెంట్లు మినహా మిగతా వాటిల్లో పరిశుభ్రత పాటించడం లేదు. భోజనం, టిఫిన్ల తయారీకి నాసిరకం సరుకులు, కూరగాయలు వాడుతున్నారు. మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిజ్లో ఉంచి మరుసటి రోజు విక్రయిస్తున్నారు. మాంసం సైతం ఇదే విధంగా ఫ్రిజ్లో ఉంచి వండుతున్నారు. ఈ విషయం మున్సిపల్ అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు పలుమార్లు నిర్వహించిన దాడుల్లో బహిర్గతమైంది. అధిక శాతం రోడ్డుసైడ్ వ్యాపారాలు మురుగుకాలువలు, చెత్పకుప్పల పక్కనే నిర్వహిస్తున్నా అడిగే నాథుడు కరువయ్యారు. జిల్లాలో 6వేలకు పైగా హోటళ్లు, దుకాణాలు జిల్లాలో చిన్నా పెద్దా హోటళ్లు, రెస్టారెంట్లు, డాబాలు, చాట్, నూడుల్స్ షాపులు అన్ని కలుపుకుని 6 వేలకు పైగా ఉన్నాయి. ఒక్క కర్నూలు నగరంలోనే 1500 దాకా ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఈ వ్యాపార సంస్థల ద్వారా అధికారులు ఏడాదికి 350 శ్యాంపిల్స్ సేకరించాలి. అయితే, నెలలో కేవలం 30 నుంచి 40 శ్యాంపిల్స్ తీసి చేతులు దులుపుకుంటున్నారు. ఒకవేళ తీసినా ల్యాబ్కు వెళ్లేలోగా ఆహారం కుళ్లిపోతోంది. ఫలితంగా ల్యాబోరేటరి పరీక్షల్లో కల్తీ గురించి సరైన నివేదికలు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం నడుస్తున్న చిన్న మధ్యతరగతి హోటళ్లల్లో 20 శాతానికి మించి అనుమతులు లేవన్నది బహిరంగ రహస్యం. ఆహారంలో కల్తీ ..ఇబ్బందులు ♦ పాలల్లో చిక్కదనం కోసం నాసిరకం పాలపౌడర్లు, యూరియా, పిండి, నూనె, నీళ్లు కలిపి విక్రయిస్తున్నారు. ♦ ఇనుప రజను, రంపపు పొట్టును టీ పొడిలో కలపడం వల్ల ఊపిరితిత్తులు పాడై పోయే ప్రమాదం ఉంది. ♦ జంతువుల కళేబరాల నుంచి సేకరించిన ఎముకలను బట్టీల్లో అత్యధిక ఉష్ణోగ్రతపై మరిగించి తీసిన ద్రావణాన్ని వంట నూనెల్లో కలిపి విక్రయిస్తున్నారు. దీంతో జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ♦ ఆరోగ్యకరమైన జంతువు మాంసాన్ని 24 గంటల్లోపే వినియోగించాలి. చాలా హోటళ్లలో చనిపోయిన జంతువుల మాంసాన్ని, ఎక్కువ కాలం నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయిస్తున్నారు. ♦ చికెన్, మటన్ బిర్యానీలు, తందూరి చికెన్లలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎక్కువగా హానికర రంగులు వాడుతున్నారు. ♦ నిషేధానికి గురైన క్యాట్ఫిష్లను సైతం నగరంలోని మద్దూర్నగర్, పెద్దమార్కెట్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నా అడిగే నాథుడు లేడు. ♦ మిరపకాయల్లో ఎరుపు రంగు రావడానికి సూడాన్ రంగులు వాడుతుంటారు. పసుపులో మెటానిల్ ఎల్లో అనే పదార్థాన్ని కలుపుతారు. వీటిని వంటలో వినియోగిస్తే క్యాన్సర్ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆహారాన్ని వండే సమయంలోనూ వండిన నూనెనే మళ్లీ మళ్లీ కాచి వండుతున్నారు. దీంతో క్యాన్సర్, అల్సర్లు వచ్చే ప్రమాదముంది. ♦ చిన్న చిన్న హోటళ్లు, కర్రీపాయింట్లలో వేడి వేడి కూరలు, పప్పు, సాంబారు వంటి ఆహార పదార్థాలు పల్చటి పాలిథిన్ కవర్లలో వేసి ఇస్తున్నారు. పదార్థాల వేడికి ప్లాస్టిక్ కరిగిపోయి తిన్న తర్వాత అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ♦ షుగర్ లెస్ స్వీట్లలో అధికంగా సాక్రిన్ వాడుతుండటంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ♦ అల్లం, వెల్లుల్లి పేస్టులలో ఆలుగడ్డ, ఉల్లిగడ్డ పేస్ట్ను కలుపుతున్నారు. ♦ అన్ని రకాల పండ్లను ఆకర్షణీయంగా కనిపించేందుకు కార్బైడ్తో హానికారక రంగులు, జిగురు యథేచ్ఛగా వాడుతున్నారు. దీంతో కాలేయ సమస్యలు, కడుపునొప్పి, నిద్రలేమి, కిడ్నీ వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. -
షాగౌస్ హోటల్లో తనిఖీలు
రాయదుర్గం: ఆహారాన్ని కల్తీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. రాయదుర్గం ఠాణాకు సమీపంలో ఉండే షాగౌస్ హోటల్ నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. వివరాలు ఇలా ఉన్నా యి. సోషల్ మీడియాలో ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు తనిఖీలకు ఆదేశించారు. జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్ మూర్తిరాజు, వెస్ట్జోన్ వెటర్నీ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వకీల్, సర్కిల్–11 ఏఎం హెచ్ఓ డాక్టర్ రవికుమార్, డాక్టర్ రంజిత్ హోటల్కు చేరుకుని ఆహార పదార్థాలను పరిశీలించారు. శాంపిల్స్ను సేకరించి నాచారంలోని స్టేట్ ఫుడ్ లేబరేటరీకి పంపించారు. అనంతరం హోటల్ యజమానులకు నోటీసులు జారీ చేశారు. కాగా, తాము 25 ఏళ్లుగా హోటల్ బిజినెస్లో ఉన్నామని, 15 సార్లు ఉత్తమ హోటల్ అవార్డులను స్వీకరించామని హోటల్ యజమాని రబ్బానీ విలేకరులతో పేర్కొన్నారు. తమ ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు సృష్టించిన ఈ వదంతులను నమ్మవద్దని కోరారు. తమ హోటల్పై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ప్రసార మాధ్యమాలపై సైబర్ క్రైం విభాగంలోనూ, రాయదుర్గం ఠాణాలోనూ ఫిర్యాదు చేశామన్నారు. నగరంలోని పలు హోటళ్ల యజమానులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కాగా, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడిచే కబేళాల నుంచి మాత్రమే మాంసాన్ని కొనుగోలు చేయాలని షాగౌస్ హోటల్ నిర్వామకులను వెటర్నిటీ సెక్షన్ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు మరో నోటీసు కూడా జారీ చేశారు. అంతేకాకుండా గ్రేటర్ పరిధిలోని అన్ని హోటళ్లకు ఇలాంటి నోటీసులే జారీ చేస్తామని తెలిపారు. మాంసం కొనుగోళ్లకు సంబంధించి జీహెచ్ ఎంసీ అధికారులు జారీ చేసిన నోటీసు ఇదే...
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement