-
‘ఆత్మనిర్భర్ భారత్కు డిఫెన్స్, ఏరోస్పేస్ కీలక పిల్లర్స్’
గాంధీనగర్: ఆత్మనిర్భర్ భారత్కు రక్షణ, ఏరోస్పేస్ రంగాలు ముఖ్యమైన పిల్లర్స్ అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్లో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన మోదీ.. వడోదరలో సీ-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును రూ.22వేల కోట్ల వ్యయంతో టాటాల భాగస్వామ్యంతో ఎయిర్బస్ సంస్థ చేపడుతోంది. విమానయాన రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు ఇది దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా మోదీ పేర్కొన్నారు. ‘భారత్ను ఆత్మనిర్భర్గా తీర్చిదిద్దటంలో డిఫెన్స్, ఏరోస్పెస్ రంగాలు ముఖ్యమైన రెండు పిల్లర్స్గా మారనున్నాయి. 2025 నాటికి దేశ రక్షణ రంగ తయారీ 25బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఉత్తర్ప్రదేశ్, తమిళనాడులో ఏర్పాటు చేసిన డిఫెన్స్ కారిడార్లు అందుకు దోహదపడుతాయి. భారత రక్షణ ఏరోస్పేస్ రంగంలో ఇంతపెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి. బీజేపీ అధికారంలోకి వచ్చాక కీలక ఆర్థిక సంస్కరణలు చేపట్టాం. దానివల్లే తయారీ రంగంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయి. విమానయాన రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న మూడు దేశాల్లో త్వరలోనే భారత్ చోటు సంపాదిస్తుంది.’అని మోదీ వెల్లడించారు. ఐరోపాకు చెందిన ఎయిర్బస్ సంస్థ ఇతర దేశాల్లో సీ-295 విమానాలను తయారు చేయడం ఇదే తొలిసారి. భారత వాయుసేనలో సేవలందిస్తున్న అవ్రో-748 రవాణా విమానాల స్థానంలో, ఎయిర్బస్కు చెందిన సీ-295 రవాణా విమానాలను ప్రవేశపెట్టాలని గత ఏడాది సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 56 విమానాలు అందించేందుకు ఎయిర్బస్తో రూ.21,935 కోట్లతో ఒప్పందం కుదిరింది. 2023 సెప్టెంబరు నుంచి 2025 ఆగస్టు మధ్య 16 విమానాలను ఫ్లై-అవే కండీషన్లో ఎయిర్బస్ భారత్కు అందజేస్తుంది. మిగిలిన 40 విమానాల తయారీ, అసెంబ్లింగ్ను టాటా గ్రూప్నకు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ దేశీయంగా చేపడుతుంది. తొలి దేశీయ తయారీ రవాణా విమానం 2026 సెప్టెంబరులో అందుబాటులోకి రావొచ్చని సమాచారం. ఇదీ చదవండి: గుజరాత్లో రూ.22వేల కోట్ల మెగా ప్రాజెక్ట్.. ఎయిర్బస్ సీ-295 తయారీ -
కొత్త అణుకేంద్రం నిర్మిస్తున్న పాక్!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ కొత్త అణు కేంద్రాన్ని నిర్మిస్తోందని పాశ్చాత్య రక్షణ నిపుణులు అనుమానిస్తున్నారు. అణ్వాయుధాల నిల్వలనూ పెంచుకుంటోందని ప్రపంచం భావిస్తోంది. ‘ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్’ అనే ఉపగ్రహం తీసిన చిత్రాలను పరిశీలించిన నిపుణులు.. ఇస్లామాబాద్కు 30 కి.మీ దూరంలోని కహుటాలో యురేనియం సంబంధ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతోందని భావిస్తున్నారు. ‘ఉగ్రవాదం’పై భారత్ ప్రతిపాదనకు నో మార్గరీటా ఐలాండ్(వెనుజులా): ఉగ్రవాదంపై పోరాటానికి ఓ క్రియాశీల బృందాన్ని ఏర్పాటు చేయాలన్న భారత ప్రతిపాదనను పాక్ తిరస్కరించింది. మార్గరీటా ఐలాండ్లో జరుగుతున్న 17వ అలీనోద్యమ (నామ్) శిఖరాగ్ర సదస్సులో భారత్ ఈ ప్రతిపాదనను పాక్ ముందుంచింది. సదస్సులో దాదాపు ఏకాభిప్రాయం వచ్చినా పాకిస్తాన్ మాత్రం వ్యతిరేకించింది.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
వేలుకు సిరాచుక్క
ఎమ్మెల్యేలకు పరీక్ష!
గీతకార్మికుడికి గాయాలు
ప్రశాంత పోలింగ్కు పటిష్ట బందోబస్తు
పార్లమెంటు ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
● మూడు నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ ● సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ● పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి బదావత్ సంతోష్
ఓటెత్తాలి..!
ఎన్నికల విధుల్లో ఎన్సీసీ కేడెట్లు
ఎన్నికల విధుల్లో.. ఎస్సై సోదరులు
మండుటెండల్లో గాలివాన బీభత్సం
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఈసారి యూట్యూబ్ హవా!
- టీడీపీలో భయాందోళనలు
- పోటెత్తిన ఓటర్లు
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement