-
విద్వేషమే భాషగా..
సంపాదకీయం వానాకాలం వచ్చేసరికి కప్పల బెకబెకలు వినిపించినట్టు ఎన్నికల సీజన్లో నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలు హోరెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం ఎన్ని హెచ్చరికలు చేసినా లక్ష్యపెడుతున్న దాఖలాలు కనబడవు. దొరికిపోయిన నాయకులు తామన్న దానిలో తప్పేమున్నదని లేదా అననేలేదని దబాయిస్తుంటే... రోజుకొకరు కొత్తగా ఆ జాబితాలో వచ్చి చేరుతున్నారు. పర్యవసానాలు ఏమైనాగానీ మతం పేరునో, ప్రాంతంపేరునో ఓటర్లను రెచ్చగొట్టాలి... తాము అత్యధిక మెజారిటీతో నెగ్గి అందలాలు అధిరోహించి తరించాలన్నది ఇలాంటి నేతల లక్ష్యంగా కనబడుతున్నది. ముజఫర్నగర్ మత విద్వేషాలతో నెత్తురోడి, ఈనాటికీ వేలాదిమంది సహాయ శిబిరాల్లో చస్తూ బతుకుతూ కాలం వెళ్లదీస్తుంటే బీజేపీ నేత అమిత్ షా ఆ ప్రాంతానికెళ్లి అక్కడి జాట్ కులస్తులను ఉద్రేకపరుస్తూ మాట్లాడతారు. ‘ఇది పగ, పరువుకు సంబంధించిన అంశం. నిద్రాహారాలు లేకుండా బతకొచ్చు. కానీ, అవమానానికి గురైతే బతకలేం. అందువల్లే ప్రతీకారం తీర్చుకోవాల’ంటూ రెచ్చగొడతారు. ‘కార్గిల్ యుద్ధంలో దేశం విజయం సాధించిందంటే అందుకు కారణం హిందూ సైనికులు కాదు...ముస్లిం జవాన్లే’నని ఎస్పీ నేత ఆజంఖాన్ మరోచోట మాట్లాడతారు. ‘హిందువులు నివసించే ప్రాంతాల్లో ముస్లింలు ఆస్తులు కొనుగోలు చేయకుండా నిరోధించాలి. ఇలా కొనుగోలు చేయడానికి ప్రయత్నించేవారిని రాళ్లతో, టైర్లతో, టమాటాలతో ఎదుర్కోండి’ అని విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా పిలుపునిస్తారు. ‘మోడీకి ఓటేయనివారు పాకిస్థాన్కు పోవాలి. అలాంటివారిని ద్రోహులుగా పరిగణించాలి’అని బీజేపీ బీహార్ నేత గిరిరాజ్ సింగ్ చెబుతారు. ‘మోడీని ఖండఖండాలుగా నరుకుతాన’ని యూపీకి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి బీరాలు పోతాడు. ఈ జాడ్యం బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీలాంటి పార్టీలకే కాదు...ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి కూడా సోకినట్టు కనబడుతోంది. ఆ పార్టీ నాయకురాలు షాజియా ఇల్మీ ఇంకో అడుగు ముందుకేశారు. ‘ముస్లింలు ప్రతిసారీ సెక్యులర్గా ఉండిపోతున్నారు. తమకు నచ్చిన పార్టీకి, నాయకులకు ఓటేస్తున్నారు. ఈసారి అలా కాదు...వారు కూడా మతతత్వవాదులుగా మారాలి. తమ మతంవారికే ఓటేయాలి’ అని నూరిపోయడానికి ప్రయత్నిస్తూ వీడియోకు చిక్కారు. తాను ముస్లిం గనుక, పోటీలో ఉన్నాను గనుక తనకు ఓటేయమని చెప్పడం ఆమె ఉద్దేశం కావొచ్చు. ఇప్పుడున్న పార్టీలన్నీ అధికారం కోసం నానా గడ్డీ కరుస్తున్నాయని, తాము వారందరికీ భిన్నంగా ఉంటామని హామీ ఇచ్చిన ఆప్ సైతం ఇలాంటి ధోరణుల్లోనే కొట్టుకుపోతున్నదని ఆమె ప్రసంగాన్ని గమనిస్తే అర్ధమవుతుంది.షాజియా మాటలతో విభేదిస్తున్నామని చెప్పిన ఆప్ ఆమెపై చర్య మాత్రం తీసుకోబోమని చెప్పింది. ఈ ప్రసంగాలన్నిటికీ వీడియో ఆధారాలున్నాయి. అవి యూట్యూబ్ వంటి మాధ్యమంలో ఎప్పటికప్పుడు అందుబాటులోకొస్తున్నాయి. అయినా కొందరు నేతలు తమ గొంతును అనుకరించి విషయాన్ని మార్చేశారని ఆరోపిస్తున్నారు. మరికొందరు ‘అందులో తప్పేముంద’ని దబాయిస్తున్నారు. ఇంకొందరు తమ మాటల్లోని అంతరార్ధం వేరని సమర్ధించుకునే ప్రయత్నంచేస్తున్నారు. ఇలాంటి ప్రసంగాలు తన దృష్టికొచ్చినప్పుడు ఎన్నికల సంఘం స్పందిస్తున్నది. విద్వేషాన్ని రెచ్చగొడుతున్న నేతలకు నోటీసులు జారీచేసి సంజాయిషీ కోరుతున్నది. వారు ఇచ్చే జవాబు తర్వాత ఒక హెచ్చరికలాంటిది చేసి అక్కడితో ఆ వ్యవహారానికి ముగింపు పలుకుతున్నది. మరోపక్క ఆ తరహా నేతలపై ఎఫ్ఐఆర్లు దాఖలవుతున్నాయి. నేర శిక్షాస్మృతికింద కేసులు నడుస్తున్నాయి. ఎన్నో ఏళ్లు గడిచాక చివరకు అలాంటి కేసులు వీగిపోతున్నాయి. బహుశా అందువల్లే కావొచ్చు... కొందరు ఏం మాట్లాడేందుకైనా జంకడం లేదు. ఏమవుతుందిలే అనే భరోసాతో ఉంటున్నారు. ఈ పరిస్థితి మరికొందరు నాయకులకు ప్రేరణనిస్తున్నది. తాను మాట్లాడినదానిలో తప్పేమున్నదని షాజియా ఇల్మీ అనడం ఇందుకే. ఎన్నికల నియమావళికి చట్టబద్ధత ఉన్నట్టయితే, ఎన్నికల సంఘం వెనువెంటనే చర్య తీసుకోగలిగితే ఈ పరిస్థితి ఉండదు. అసలు ఇలా విద్వేషపూరిత ప్రసంగాలు చేసే నేతలపై చర్య తీసుకునేందుకు రాజ్యాంగంలోని 324వ అధికరణ ఎన్నికల సంఘానికి అధికారమిస్తున్నది. ఈ అధికరణకింద సంబంధిత పార్టీకి ఉండే జాతీయ పార్టీ హోదాను రద్దు చేయడం లేదా దాని గుర్తింపును రద్దుచేయడంవంటి చర్యలు తీసుకోవచ్చు. కానీ, ఇంతవరకూ ఎన్నికల సంఘం ఈ అధికారాన్ని వినియోగించలేదు. మరోపక్క ఈ తరహా ప్రసంగాలపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చునో చెప్పమని ఈమధ్యే లా కమిషన్ను సుప్రీంకోర్టు కోరింది. భిన్న మతాలు, కులాలు ఉన్న మన దేశంలో ఈ విద్వేషపూరిత ప్రసంగాలు ఎంతటి చేటు తీసుకురాగలవో నిరూపించడానికి ఎన్నెన్నో ఉదంతాలున్నాయి. ఈ అనుభవాల దృష్ట్యా నైనా కదలిక రావాలి. విద్వేషాలను, ఉద్రేకాలను రెచ్చగొడుతున్నవారి సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఈ విషయంలో ఇక ఉపేక్షించడం మంచిది కాదు. పార్టీలన్నీ నోరు పారేసుకునే అలవాటున్న నేతలను గుర్తించి నియంత్రించాలి. ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమైన వెంటనే ఆ మేరకు ప్రతి పార్టీ హామీ పత్రాన్ని అందజేసేవిధంగా నిబంధన విధించాలి. ఈ విషయంలో ఎలాంటి ఉల్లంఘన జరిగినా ఎన్నికల సంఘం కఠిన చర్యకు పూనుకోవాలి. ప్రజలు సైతం వదరుబోతు నాయకులను, పార్టీలనూ తిరస్కరించేలా ఎన్నికల సంఘం ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపట్టాలి. అప్పుడు మాత్రమే విద్వేష ప్రసం గాలను అదుపుచేయడం సాధ్యమవుతుంది. ప్రశాంత వాతావరణాన్ని ధ్వంసంచేస్తున్నవారినుంచి సమాజానికి రక్షణ లభిస్తుంది. -
ముస్లిం సైనికుల వల్లే గెలిచాం
కార్గిల్ యుద్ధంపై ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు నోటీసు జారీచేసిన ఎన్నికల కమిషన్ తన వ్యాఖ్యల్లో తప్పు ఏముందని ప్రశ్నించిన ఖాన్ న్యూఢిల్లీ/ఘజియాబాద్: సమాజ్వాదీ పార్టీ నేత ఆజంఖాన్ ‘కార్గిల్’ వ్యాఖ్యలపై బుధవారం పెను దుమారం రేగింది. ఎన్నికల సంఘం ఆయనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత గెలుపునకు ముస్లిం సైనికులే కారణమని మంగళవారం ఆజంఖాన్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కాంగ్రెస్, బీజేపీ, జేడీ(యు) సహా పలు పార్టీలు విరుచుకుపడ్డాయి. ఆజం వ్యాఖ్యలు సైనికుల సాహసాలను కించపరిచేలా ఉన్నాయని బీజేపీ విమర్శించింది. ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం. మతపరమైన రాజకీయాలకు నిదర్శనమని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మండిపడ్డారు. సైన్యాన్ని మతపరంగా విభజించడం తగదని, ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవడం ఈసీ పరిధిలోని అంశమని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ పేర్కొన్నారు. సమాజ్వాదీ మాత్రం ఈ అంశంపై ఆచితూచి స్పందించింది. సమాజంలో ఓ వర్గాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వారు అనుభవించే బాధను ఖాన్ చెప్పాలనుకున్నారని పేర్కొంది. మరోవైపు తన వ్యాఖ్యలపై ఇంత దుమారం రేగినప్పటికీ, ఖాన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన వ్యాఖ్యల్లో తప్పు ఏముందని, వాటిపై ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నారని ప్రశ్నించారు. ఆజంఖాన్కు ఈసీ నోటీసు... ఆజంఖాన్ ‘కార్గిల్’ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఎన్నికల కమిషన్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీచేసింది. నిబంధనలు అతిక్రమించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో 11వ తేదీ సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- భారత సంతతి శాస్త్రవేత్తకు ‘షా’ అవార్డ్
- భూతల్లి పై ఒట్టేయ్...
- ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్లో..?
- పేటీఎంకు పెరిగిన నష్టాలు
- Lok Sabha Election 2024: కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు
- పాలస్తీనా స్వతంత్ర దేశం
- సోనియాను ఏ ప్రాతిపదికన, ఎలా పిలుస్తారు? : జి.కిషన్రెడ్డి
- విమానంలో స్టాండింగ్
- ఇబ్రహీం రైసీకి ఇరాన్ వీడ్కోలు
- ‘పంటల బీమా’కి రూ.3 వేల కోట్లు
Advertisement