-
ఫార్మా స్టాక్స్లో మరింత అప్సైడ్
ఎన్ఎస్ఈ నిఫ్టీకి శుక్రవారం(17)తో ముగిసిన వారంలో 10,800-10,900 స్థాయిలో పలుమార్లు అవరోధాలు ఎదురయ్యాయని శామ్కో గ్రూప్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీంతో వచ్చే వారం 10,950 పాయింట్ల స్థాయిలో నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ మార్కెట్లు బలహీనపడితే.. 10,550 స్థాయిలో సపోర్ట్ లభించే వీలున్నదని చెప్పారు. ఈ స్థాయికంటే దిగువకు చేరితే 9,900 పాయింట్లను నిఫ్టీ తిరిగి పరీక్షించవచ్చని అంచనా వేశారు. ఫార్మా రంగంలో రెండు కౌంటర్లకు బయ్ రేటింగ్ను ఇవ్వగా.. పిరమల్ ఎంటర్ప్రైజెస్ను విక్రయించవచ్చునంటూ సూచించారు. మార్కెట్ల తీరు, పెట్టుబడి అవకాశాలు తదితర అంశాలపై వెల్లడించిన అభిప్రాయాలు చూద్దాం.. అటూఇటుగా కోవిడ్-19 కేసులు పెరుగుతుండటం, వ్యాక్సిన్లపై ఆశలు, ఆర్ఐఎల్ ఏజీఎం, ఇన్ఫోసిస్, విప్రో తదితర ఐటీ దిగ్గజాల ఫలితాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు హెచ్చుతగ్గులను చవిచూశాయి. కోవిడ్ సవాళ్లలోనూ ఐటీ దిగ్గజాలు ఉత్తమ పనితీరు ప్రదర్శించాయి. ట్రావెల్, ఎస్జీఏ వ్యయాలు తగ్గడం, ఫారెక్స్ లాభాలు వంటి అంశాలు మార్జిన్లకు బలమిచ్చాయి. అయితే ఇటీవల ఐటీ స్టాక్స్లో వచ్చిన ర్యాలీ కారణంగా ఈ రంగంలో పెట్టుబడులకు 10-12 శాతం కరెక్షన్ కోసం వేచిచూడటం మేలు. ఇక ఫార్మా స్టాక్స్లో స్వల్పకాలిక చలన సగటు ప్రాతిపదికన పుల్బ్యాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ రంగంలో సానుకూల ట్రెండ్ కనిపిస్తోంది. ఫార్మా రంగంలో కొన్ని కౌంటర్లు తదుపరి దశ ర్యాలీకి సిద్ధంగా ఉన్న సంకేతాలు లభిస్తున్నాయి. లుపిన్ లిమిటెడ్ ఫార్మా దిగ్గజం లుపిన్ షేరుకి రూ. 850 స్థాయిలో సపోర్ట్ లభిస్తోంది. దీంతో రూ. 980 టార్గెట్ ధరతో రూ. 890 స్థాయిలో కొనుగోలు చేయవచ్చని భావిస్తున్నాం. అయితే రూ. 850 వద్ద స్టాప్లాస్ అమలు చేయవలసి ఉంటుంది. శుక్రవారం ఎన్ఎస్ఈలో లుపిన్ రూ. 897 వద్ద ముగిసింది. అజంతా ఫార్మా వారపు చార్టుల ప్రకారం హెల్త్కేర్ కంపెనీ అజంతా ఫార్మాకు రూ. 1330 స్థాయిలో పటిష్ట మద్దతు లభిస్తోంది. ఇటీవల ఈ కౌంటర్ జోరందుకుంది. ఇది మరింత బలపడే వీలుంది. రూ. 1600 టార్గెట్ ధరతో రూ. 1440 స్థాయిలో అజంతా ఫార్మా షేరుని కొనుగోలు చేయవచ్చు. అయితే రూ. 1370 వద్ద స్టాప్లాస్ తప్పనిసరి. వారాంతాన ఎన్ఎస్ఈలో అజంతా ఫార్మా రూ. 1459 వద్ద ముగిసింది. పిరమల్ ఎంటర్ప్రైజెస్ డౌన్ట్రెండ్లో ఉన్న పిరమల్ ఎంటర్ప్రైజెస్ కౌంటర్ తాజాగా ర్యాలీ బాట పట్టింది. తద్వారా ఓవర్బాట్ పొజిషన్కు చేరింది. దీంతో రూ. 1420-1460 స్థాయిలవద్ద రెసిస్టెన్స్ కనిపిస్తోంది. వెరసి రూ. 1050 టార్గెట్ ధరతో రూ. 1360-1368 స్థాయిలలో ఈ షేరుని విక్రయించవచ్చని భావిస్తున్నాం. రూ. 1485 వద్ద స్టాప్లాస్ పెట్టుకోవలసి ఉంటుంది. శుక్రవారం ఎన్ఎస్ఈలో ఈ షేరు రూ. 1381 వద్ద ముగిసింది. -
స్టాక్స్ వ్యూ
అజంతా ఫార్మా బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.1,771 ; టార్గెట్ ధర: రూ.2,028 ఎందుకంటే: అజంతా ఫార్మాకు చెందిన దహేజ్ ప్లాంట్పై అమెరికా ఎఫ్డీఏ తొలి తనిఖీ ఈ నెలలోనే విజయవంతంగా పూర్తయింది. ఈ ప్లాంట్ నుంచి ఈ కంపెనీ ఒక అండా(అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్)ను ఎఫ్డీఏకు సమర్పించింది. ఈ అండాకు పూర్తి స్థాయి ఆమోదం 12–15 నెలల్లో రావచ్చు. చాలా ఫార్మా కంపెనీలు ఎఫ్డీఏ నుంచి గట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ కంపెనీకి చెందిన రెండు ప్లాంట్లు ఎఫ్డీఏ తనిఖీలను విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. ఎఫ్డీఏ విషయమై మధ్య కాలానికి నిబంధనల రిస్క్ స్వల్పంగానే ఉండొచ్చు. మలేరియా నిరోధించే ఔషధాల అమ్మకాలు గతంలోలాగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. నిబంధనల అడ్డంకులను ఎదుర్కొంటున్న ఇప్కా సంస్థ ఈ ఔషధాల సెగ్మెంట్లోకి మళ్లీ ప్రవేశించే అవకాశాలు లేకపోవడం, మలేరియా నివారణకు సంబంధించి గ్లోబల్ ఫండ్కు నిధులు నిలకడగా వస్తుండడం దీనికి ప్రధాన కారణాలు. కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తేవడం, ప్రస్తుతమున్న ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతుండడం, ఎన్పీపీఏ(నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ) నిర్దేశించిన ధరల కోత ప్రభావం స్వల్పంగా ఉండడం, చర్మం, కన్ను, గుండెలకు సంబంధించిన జబ్బుల నివారణ ఔషధాలతో పాటు నొప్పి నివారణ ఔషధాల సెగ్మెంట్ అమ్మకాలు కూడా బాగానే ఉండడం, ఆఫ్రికా మార్కెట్లో కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు నిలకడగా ఉండడం, మంచి అమ్మకాలు సాధించే ఉత్పత్తులను అందించడం, అమెరికా మార్కెట్లో 2–3 ఏళ్లలో కొత్త అండాల కోసం దరఖాస్తు చేయనుండడం.. ఇవన్నీ కంపెనీకి ప్రయోజనం కలిగించే అంశాలు. మూడేళ్లలో అమెరికాలో అమ్మకాలు 46 శాతం, దేశీయ ఫార్ములేషన్స్ విక్రయాలు 20 శాతం చొప్పున వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నాం. గెయిల్(ఇండియా) బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.378 ; టార్గెట్ ధర: రూ.440 ఎందుకంటే: అగ్రస్థాయి సహజ వాయు కంపెనీ. గ్యాస్ పంపిణీ, గ్యాస్ ట్రేడింగ్, గ్యాస్ ప్రాసెసింగ్, ఎల్పీజీ ఉత్పత్తి, పంపిణీ, పెట్రో కెమికల్స్ తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గెయిల్ గ్యాస్ అనే పూర్తి అనుబంధ కంపెనీ సీజీడీ వ్యాపారాన్ని నిర్వహిస్తుండగా, ఇదే వ్యాపారంలో ఉన్న ఇంద్రప్రస్థ గ్యాస్, మహానగర్ గ్యాస్ కంపెనీల్లో గెయిల్కు వాటాలున్నాయి. దేశీయంగా నేచురల్ గ్యాస్ ధరలు తక్కువగా ఉండడం, ఎల్ఎన్జీ వ్యయాలు తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల కంపెనీ గ్యాస్ ట్రాన్స్ మిషన్ వ్యాపారం బాగా ఉండొచ్చని భావిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో 100 ఎంఎంఎస్సీఎండీ(మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ పర్ డే)గా ఉన్న గ్యాస్ అమ్మకాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 106 ఎంఎంఎస్సీఎండీగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 112 ఎంఎంఎస్సీఎండీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో గ్యాస్ ట్రాన్స్మిషన్ ఇబిటా 19 శాతం వృద్ధితో రూ.3,096 కోట్లకు, గ్యాస్ ట్రేడింగ్ విభాగం ఇబిటా 1,230 కోట్లకు చేరవచ్చని అంచనా. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.806 కోట్ల నష్టాలు వచ్చిన పెట్రో కెమికల్స్వ్యాపారం టర్న్అరౌండ్ అయ్యే అవకాశాలున్నాయి. దేశీయ నేచురల్ గ్యాస్కు ధరలు తక్కువగా ఉండడం ఎల్పీజీ వ్యాపార విభాగం లాభదాయకత మెరుగుపడుతుంది. దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి పెరుగుతుండడం, ఎల్ఎన్జీకి డిమాండ్ అధికంగా ఉండడం, టారిఫ్ల సవరింపు విషయానికి సంబంధించిన కేసులో గెయిల్కు అనుకూలంగా తీర్పు రావడం... కంపెనీకి ప్రయోజనం కలిగించే అంశాలు. రెండేళ్లలో కంపెనీ ఇబిటా 24 శాతం వృద్ధితో రూ.8,115 కోట్లకు, నికర లాభం 29 శాతం చొప్పున చక్రగతి వృద్ధితో రూ.4,920 కోట్లకు పెరగవచ్చని భావిస్తున్నాం.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వరికోత మిషన్ను తరలిస్తున్న డీసీఎం బోల్తా
కారు, బైక్ ఢీ.. భర్త మృతి
ఒకదానికొకటి ఢీకొన్న మూడు కార్లు
దేవుడి విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్
మట్టి తరలిస్తున్న వారిపై కేసు
అధిక వడ్డీ ఆశచూపి మోసం
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
ఓటేసి వస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
24న కృషి విజ్ఞాన కేంద్రంలో వరి విత్తన మేళా
తప్పక చదవండి
- ఆ ఇద్దరి నామినేషన్లు రద్దు చేయాల్సిందే.. బీజేపీ డిమాండ్
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- సందీప్ లమిచానే శిక్ష రద్దు.. వరల్డ్కప్ జట్టులో చోటు?
- పెంపుడు కుక్క పెట్టిన గొడవ.. నడిరోడ్డుపైనే చితకబాదారు
- అందుకే ఓడిపోయాం!.. వరుస వైఫల్యాలు.. ఇకనైనా: సంజూ
- ఏపీలో ఓటేసుకునే స్వేచ్ఛ కూడా లేదా?
- సన్నీ లియోన్ బర్త్డేను ఎందుకు జరుపుకున్నారో చెప్పిన యువకులు
- Yadadri: ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి
- తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్కు కుంభవృష్టి హెచ్చరిక!
- ‘హలో అప్పారావ్.. ఏంటి పరిస్థితి!’
Advertisement