-
యుద్ధభూమిలో ఆంబర్ వేట!
జురాసిక్ పార్క్ సినిమా గుర్తుందా...? ఎన్నడో అంతరించిపోయిన రాక్షస బల్లులు మళ్లీ పుట్టుకొస్తాయి దీంట్లో! చెట్ల జిగురులో ఇరుక్కుపోయిన అవశేషాల నుంచి డీఎన్ఏను వేరు చేయడం.. దాన్నుంచి పూర్తిస్థాయి జంతువును సృష్టించడం చిత్రం ఇతివృత్తం! సినిమా.. అందులోని కాల్పనిక టెక్నాలజీ విషయాలన్నీ కాసేపు పక్కనపెడితే... ఆ జిగురు కథ మాత్రం ఎంతో ఆసక్తికరం.. ఇప్పుడదో లాభసాటి వ్యాపారం.. అంతేనా... కానేకాదు.. మన పొరుగుదేశం మయన్మార్లో బోలెడంత ఘర్షణకూ ఇదే కారణమవుతోంది! చిన్నప్పుడు మీ పుస్తకాలకు అట్టలేసుకునేందుకు జిగురు వాడారా? ఇప్పుడైతే ఫెవికాల్ లాంటివి వచ్చేశాయి గానీ.. ఓ మూడు దశాబ్దాల క్రితమైతే.. చెట్ల వెంబడి పడి.. సొంతంగా జిగురు సేకరించుకోవాల్సిందే. వేపచెట్టు జిగురు కంటే తుమ్మ బంక చాలా గట్టిదన్న నమ్మకం.. తుమ్మచెట్టు ఎక్కడుందో వెతుక్కోవడం.. కాండం, కొమ్మలపై గాట్లు పెట్టి జిగురు వచ్చేందుకు వేచి ఉండటం.. ఆపై దాన్ని మురిపెంగా సేకరించుకొచ్చి.. దాచుకుని కొంచెం కొంచెం వాడుకోవడం.. ఇదీ పాతకాలపు అనుభవాలు. పొరుగుదేశం మయన్మార్లో కొంతమంది ఇప్పటికీ ఇలాగే జిగురు సేకరిస్తున్నారు. కాకపోతే అది ఇప్పుడున్న చెట్లకు కాసింది కాదు. ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నాటిది. అన్ని పరిస్థితులనూ తట్టుకుని గడ్డకట్టిపోయినవి. ఇంగ్లిష్ పేరు ఆంబర్. ముదురు పసుపు రంగులో లేదంటే కొంచెం ఎరుపు రంగులో గాజు మాదిరిగా పారదర్శకంగా ఉండే ఈ ఆంబర్ను సేకరించడం లాభసాటి వ్యాపారమే. జిగురు మాత్రమే ఉంటే నగల్లో వాడతారు. అందులో ఏవైనా ఇతర పదార్థాలు కలసి ఉన్నా.. క్రిమి, కీటక, జంతు అవశేషాలున్నా.. ధర ఎక్కువవుతుంది. రాక్షస బల్లుల అవశేషాల్లాంటివి ఉంటే ఒక్కో ఆంబర్ ముక్క లక్ష డాలర్లు అంటే సుమారు 70 లక్షల రూపాయలు ఖరీదు చేసినా ఆశ్చర్యం లేదు. కొత్త కేంద్రం మయన్మార్... ఆంబర్ చరిత్ర ఘనమైందే. ఒకప్పుడు చైనా పాలకులు దీన్ని నగల్లో విరివిగా వాడేవారు. గ్రీస్తోపాటు కొన్ని ఇతర యూరోపియన్ దేశాల్లోని కొన్ని చర్చిల్లోనూ విస్తృతస్థాయిలో దీన్ని వినియోగించారనడానికి ఆధారాలు ఉన్నాయి. అయితే తాజాగా మయన్మార్ ప్రాంతంలో బయటపడుతున్న ఆంబర్ మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న కచిన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బయటపడుతూండటం ఒక విశేషమైతే.. ఇటీవలే అక్కడ రాక్షస బల్లి రెక్క అవశేషం పూర్తిస్థాయిలో ఉన్న ఓ ముక్క వెలుగుచూడటం ఇంకో విశేషం. సుమారు పదికోట్ల ఏళ్ల క్రితం నాటి ఆంబర్లు కచిన్కు కొంచెం దూరంలో ఉన్న మయిట్కైనా ప్రాంతంలో బయటపడుతున్నాయని.. కొన్నింటిలో క్రిమికీటకాలు పూర్తిస్థాయిలో నిక్షిప్తమై ఉండటం పురాతత్వ శాస్త్రవేత్తలను విపరీతంగా ఆకర్షిస్తోందని అంటున్నారు చైనా యూనివర్సిటీ శాస్త్రవేత్త లిడా జింగ్. మూడేళ్ల క్రితం రాక్షస బల్లి తోకతో కూడిన ఆంబర్ను మయన్మార్ నుంచి చైనాకు తీసుకొచ్చింది ఈయనే. అంతర్యుద్ధంతో శాస్త్రవేత్తల అధ్యయనానికి ఇబ్బందులు కోట్ల ఏళ్లక్రితం నాటి జీవజాతుల గురించి అధ్యయనం చేసే పాలియో ఎంటాలజిస్ట్లకు ఆంబర్లోని అవశేషాలు ఎంతో ఉపయోగపడతాయి. అయితే ప్రపంచం మొత్తమ్మీద వాణిజ్యస్థాయిలో ఆంబర్ను వెలికితీస్తున్న ఏకైక ప్రాంతం కచిన్ కావడం.. స్థానికులు కచిన్ స్వాతంత్య్రం కోసం సైన్యంతో పోరాడుతూండటం వీరికి సమస్యలు సృష్టిస్తోంది. ఆంబర్ను అమ్ముకుని తమ ఉద్యమానికి ఆర్థిక దన్ను సమకూర్చుకోవాలన్నది తిరుగుబాటుదారుల ఉద్దేశం. ఇది సైన్యానికి సుతరామూ ఇష్టం లేదు. ఈ అంతర్యుద్ధం కారణంగా ఇప్పటికే లక్ష మందికి పైగా సామాన్యులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోగా.. ఆంబర్ గనుల పరిసరాల్లోని వారు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడం మంచిదని సైన్యం ఒత్తిడి చేస్తోంది. ఫలితంగా ఈ ప్రాంతాలకు వెళ్లడం, ఆంబర్ గనుల్లో భూగర్భ ప్రాంతాలను పరిశీలించడం సాధ్యం కావడం లేదని పరిశోధకులు అంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొని రాక్షస బల్లుల అవశేషాల కోసం అక్బర్ఖాన్ లాంటివారు కొందరు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి అరుదైన ఆంబర్ వేటకు మించిన థ్రిల్ ఇంకోటి లేదని అక్బర్ఖాన్ అంటారు. -
పరారైన వేటగాళ్లు ఒంగోలులో..
♦ ఓ భూస్వామి ఇంట ఆశ్రయం ♦ ఏడుగురికి ఇద్దరు సహాయకులు ♦ ముగ్గురి లొంగుబాటు, పరారీలో మిగిలిన వారు ♦ కరీంనగర్, హైదరాబాద్లో గాలిస్తున్న ప్రత్యేక బృందాలు సాక్షి, భూపాలపల్లి: రోజుకో మలుపు తిరుగుతున్న దుప్పుల వేట కేసులో ప్రధాన నిందితులు ఏపీలో ఓ భూస్వామి ఇంట ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులు లొంగిపోగా మిగిలిన ఆరుగురు పరారీలో ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ అడవుల్లో దుప్పులను వేటా డిన కేసుకు సంబంధించి తొమ్మిది మందిపై పోలీసు శాఖ అభియోగం మోపింది. అయితే, కేసులో కీలక పాత్ర పోషించిన ఏ 4 నింది తుడు అక్బర్ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నా డు. ఘటన జరిగిన తర్వాత ఐదు రోజుల పాటు అతను మహదేవపూర్లో స్వేచ్ఛగా తిరిగాడు. పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో గత శుక్రవారం రాత్రి నలువాల సత్యనారాయణ, అస్రార్ఖాన్, ఖలీముల్లా ఖాన్లు లొంగిపోయారు. వీరి లొంగుబాటు వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించి అక్బర్ ఖాన్ ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మహదేవపూర్ ప్రాంతంలో దగ్గరి సంబంధా లున్న ఒంగోలుకు చెందిన భూస్వామి వద్దకు వీరు చేరుకున్నట్లు తెలుస్తోంది. మూడు బృందాలు దుప్పులను వేటాడి చంపిన నిందితులను పట్టుకునేందుకు పోలీసుశాఖ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఫజల్ మహ్మద్ ఖాన్ కోసం ఓ బృందం హైదరాబాద్ లో గాలిస్తుండగా గోదావరిఖని, సెంటినరీ కాలనీకి చెందిన నిందితుల కోసం మరో బృం దాన్ని ఏర్పాటు చేశారు. మున్నా అనే నింది తుడి కోసం ఇంకో బృందం గాలిస్తోంది. పోలీసు రికార్డుల్లో ఏ 1 నిందితుడు సత్యనారాయణతో పాటు అతని బంధువు వేటలో పాల్గొన్నట్లుగా పేర్కొన్నారు. అదే నంబరుతో అనేక ఇళ్లు.. సంఘటనస్థలంలో లభించిన ఫజల్ మహ్మద్ఖాన్ ఆధార్కార్డు ప్రకారం అతని అడ్రసు 10–3–292, విజయనగర్ కాలనీ, హైదరాబాద్గా ఉంది. ఈ కాలనీలో ఓ పాఠ శాల పక్కన ఇదే నంబరుతో పదుల సంఖ్యలో ఇళ్లు ఉండటం గమనార్హం. పోలీసులు ఇందు లో ఏ ఇంటికి వెళ్లారు... అసలు ఫజల్ మహ్మద్ ఖాన్ను అదుపులోకి తీసుకున్నారా లేదా అనేది తేలడం లేదు. చౌటుప్పల్లో జింకపిల్ల మార్చి 23న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావి గ్రామం దగ్గర హైవే టోల్గేట్ సమీప పొలాల్లో గాయంతో తిరుగుతున్న జింకపిల్లను రైతులు పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగిం చారు. 25న జింకపిల్ల చనిపోయింది. మహదేవపూర్ అడవుల్లో మార్చి 19న ఐదు వన్యప్రాణులను చంపగా ఇందులో రెండు దుప్పుల కళేబరాలను అటవీ శాఖ అధికా రులు పట్టుకున్నారు. మిగిలిన వన్యప్రాణు లతో ఏటూరునాగారం మీదుగా హైదరాబా ద్కు వేటగాళ్లు పారిపోయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వెళ్లే క్రమంలో వీరు జింకపిల్లను మార్గమధ్యలో విడిచి వెళ్లారా అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో అమ్జద్ అరెస్ట్? దుప్పుల వేటలో పాల్గొన్నాడనే అనుమానం తో మహదేవపూర్కు చెందిన అమ్జద్ను హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అమ్జద్ కొన్నేళ్లుగా హైదరాబాద్ లో ఏసీ మెకానిక్ గా జీవనం సాగిస్తున్నాడు. అక్బర్ఖాన్కు సన్నిహితుడిగా పేరున్న అమ్జద్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వేటగాళ్లను త్వరలోనే పట్టుకుంటాం అటవీశాఖ విజిలెన్స్ డీఎఫ్వో రాజశేఖర్ మహదేవపూర్: దుప్పులవేట సంఘటనలో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి వేటగాళ్లం దరినీ పట్టుకుంటామని అటవీశాఖ విజిలెన్స్ డీఎఫ్వో రాజశేఖర్ చెప్పారు. మహదేవపూర్ లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. వేటగాళ్లు దుప్పులను వేటాడిన పంకెన అడవుల్లోని సంఘ టన స్థలాన్ని పరిశీలించి ఆనవాళ్లు సేకరించా మని, వేటగాళ్ల ముఠాలో చాలామంది ఉన్న ట్లుగా ప్రజలు సమాచారమిచ్చారని చెప్పా రు. ప్రధాన నిందితుడు అక్బర్ఖాన్ను అరెస్టు చేస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. వేటగాళ్లలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోందని, హైదరాబాద్, కరీంనగర్, సెంటినరీకాలనీ, మహదేవపూర్, సూరారం గ్రామాలకు చెం దిన వారు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నట్లు విచారణలో తెలుస్తోందని పేర్కొ న్నారు. మహదేవపూర్లోని తెనుగువాడలో నెన్నెల గట్టయ్య బంధువు ఇంట్లో గట్టయ్య తో పాటు మున్నా షల్టర్ తీసుకున్నారన్న సమాచారంతో సోదాలు నిర్వహించామని, తమ రాకను ముందుగానే గమనించిన ఇంటి యజమాని ఆనవాళ్లను మాయం చేసి నట్లు అనుమానాలున్నాయని పేర్కొన్నారు. గట్టయ్య ఇంటివద్ద విచారణ జరుపుతున్న సమ యంలో ఆయన భార్యకు వచ్చిన ఫోన్కాల్ డాటాను సేకరించేందుకు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని, అలాగే ఆదివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాల యంలోని కారు గట్టయ్య ఇంటి సమీపంలో లభించడంతో దానినీ అధీనంలోకి తీసుకున్నట్లు రాజశేఖర్ వివరించారు. వేటగాళ్లకు సహకరిస్తున్న ఇంటి దొంగలపై దృష్టిసారిస్తామని హెచ్చరించారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
జగన్ ప్రభుత్వంలోనే బ్రాహ్మణులకు గుర్తింపు
ముస్లింలపై కూటమి కుట్ర
ఆ ఇంటికి నవరత్నాలే జీవనాధారం
నేడు పిఠాపురానికి సీఎం జగన్
కూటమిలో కుమ్ములాట
ఆర్ట్స్ కళాశాలలో సర్టిఫికెట్ కోర్సులు
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడి
ఓటమి భయంతో దాడులకు తెగబడుతున్న టీడీపీ
గాండ్ల, తెలుకుల, దేవతెలుకులకు సముచిత స్థానం
మద్యం అక్రమ రవాణాపై కేసులు
తప్పక చదవండి
- టీ20లలో సరికొత్త చరిత్ర.. బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
- నీతో ప్రచారం చేస్తే నా ఓటమి ఖాయం... కేశినేని చిన్ని
- కొత్త కారు కొన్న అమర్ దీప్, తేజస్విని.. ధర ఎంతో తెలుసా?
- పశ్చిమలో వెంకన్న సైలెంట్.. అనుచరుల ఆగ్రహం
- కుప్పంలో టీడీపీ గూండాయిజం
- HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
- 'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement