-
అయోధ్యపై సత్వర విచారణకు నో
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసును సత్వరమే చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును సత్వరమే విచారించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూవివాదం అంశంపై విచారణను జనవరిలో చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో సత్వర విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. అయోధ్య భూవివాదం విషయంలో సత్వర విచారణ చేపట్టాలని కోరుతూ అఖిల భారత్ హిందు మహాసభ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ‘అయోధ్య వివాదం విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించిన అప్పీళ్లన్నీ జనవరిలో ధర్మాసనం ముందుకు రానున్నాయి. అప్పటి వరకు సత్వర విచారణ చేపట్టలేం’అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వొకేట్ సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. అయోధ్య అంశం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సత్వరమే విచారణ చేపట్టాలని సుప్రీంను కోరారు. ఇక అఖిల భారత్ హిందూ మహాసభ తరఫున లాయర్ బరుణ్ కుమార్ సిన్హా వాదనలు వినిపించారు. -
'ఐటెం గాల్స్ ను వేశ్యలుగా ప్రకటించండి'
జింద్(హర్యానా): మహిళలు జీన్స్ ధరించకుండా నిషేధం విధించాలని అఖిల భారత్ హిందూ మహాసభ డిమాండ్ చేసిన మరుసటి రోజే... అదే సంస్థ ప్రధాన కార్యదర్శి నవీన్ త్యాగి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించే వారిని వేశ్యలుగా ప్రకటించాలని పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు వెళ్తామని ఓ విలేకరితో చెప్పారు. ' ఈ విషయంపై మా నాయకులతో చర్చిస్తున్నాం. ఐటెం గాల్స్ ను సుప్రీంకోర్టు వేశ్యలుగా ప్రకటిస్తే సమాజం వారిని బహిష్కరిస్తుంది' అని వ్యాఖ్యానించారు. కురుచ దస్తులు ధరించి సినిమాల్లో కలిపించే ఐటెంగాల్స్, హీరోయిన్లను వేశ్యలుగా పరిగణించాలని త్యాగి పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు వెళ్లే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. తమ న్యాయవాదులతో మాట్లాడుతున్నందున ఈ విషయాన్ని ఇప్పుడే బహిరంగంగా వెల్లడించలేనని అన్నారు. పొట్టి బట్టలు వేసుకుని సినిమాల్లో తైతక్కలాడడం వల్లే మహిళలపై ఘోరాలు పెరుగుతున్నాయని త్యాగి అభిప్రాయపడ్డారు. పాఠశాలలు, కాలేజీల్లో ఆడపిల్లలకు డ్రెస్ కోడ్ ఉండాలని సెల్ ఫోన్లు వాడకుండా నిషేధం విధించాలని అఖిల భారత్ హిందూ మహాసభ సోమవారం డిమాండ్ చేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement