-
‘బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే రేవంత్ ప్రభుత్వం కూలిపోతుంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమని హెచ్చరించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అలాగే, తాము గేట్లు ఎత్తితే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదంటూ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, ఏలేటి మహేశ్వర్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వసూళ్ల చిట్టా మా దగ్గర ఉంది. హైదరాబాద్ డబ్బులు దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ వినియోగిస్తోంది. రంజిత్ రెడ్డిపై గతంలో రేవంత్ చేసిన ఆరోపణలు ఏమయ్యాయి. అప్పుడు రంజిత్ రెడ్డి అవినీతి చేశారని చెప్పిన రేవంత్ ఇప్పుడు ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయాలని ఎలా అడగతారు?. రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడండి ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. మా పార్టీ గేట్లు ఎత్తితే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. నితిన్ గడ్కరీ వద్దకు వెళ్లి షిండే పాత్ర పోషిస్తానని కోమటిరెడ్డి అన్నది వాస్తవం. అయితే, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై ఎవరికీ నమ్మకం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయనతో లేడు అంటూ కామెంట్స్ చేశారు. -
శాసనసభ బీజేపీ పక్షనేతగా ఏలేటి మహేశ్వర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో బీజేపీ నేతగా ఏలేటి మహేశ్వర్రెడ్డి నియమితులయ్యారు.మహేశ్వర్రెడ్డిని బీజేపీఎల్పీ నేతగా నియమిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శాసనసభ పక్ష ఉపనేతలుగా పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి నియామకం అయ్యారు. శాసనమండలి పక్షనేతగా ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డిని నియామకం అయ్యారు. కాగా మహేశ్వర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన విదితమే. 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన. 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించించగా ఇందులో గోషామహల్ నుంచి రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, సిర్పూర్ కాగజ్నగర్ నుంచి పాల్వాయి హరీష్బాబు, నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ నుంచి రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ నుంచి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ నుంచి రాకేశ్ రెడ్డి, కామారెడ్డి నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి గెలిచారు. ఇందులో రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి మినహా మిగతా వారందరూ తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారే. -
‘రేవంత్ పోషించాల్సింది పెద్ద కొడుకు పాత్ర.. కోడలు పాత్ర కాదు’
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి పోషించాల్సింది కోడలు పాత్ర కాదని, పెద్ద కొడుకు పాత్ర అని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్షుడి ఒంటెద్దు పోకడల కారణంగానే ఇన్ని సమస్యలు వస్తున్నాయని, అవసరమైతే పార్టీ కోసం ఆయన ఓ మెట్టు దిగిరావాలని అన్నారు. సీనియర్ నేతలతో సమన్వయం చేసుకుంటే పార్టీలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం గాంధీభవన్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పదవుల్లో ఉన్న నాయకులు అందరినీ సమన్వయం చేసుకుంటే అపార్థాలుండవని, కానీ పార్టీ విభేదాలను కోడళ్ల పంచాయితీతో పోలిస్తే మాత్రం పార్టీ చిన్నాభిన్నం అవుతుందని పేర్కొన్నారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, ఏదో ఒక రోజు మాజీ కావాల్సిందేనని, పార్టీ పదవుల్లో ఉన్నప్పుడు మాత్రం అందరినీ కలుపుకొని పోవాలని సూచించారు. పార్టీ కోవర్టుల గురించి ప్రతిసారీ చర్చకు రావడం బాధాకరంగా ఉందని, ఈ విషయంలో సీనియర్ నేత దామోదర రాజనర్సింహ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానన్నారు. ప్రతి నాయకుడు కోరుకునేది ఆత్మగౌరవమేనని, ఆత్మాభిమానానికి మించింది ఏమీ ఉండదని చెప్పారు. రానున్నది ఎన్నికల సమయమని, ఈ సమయంలో చేయాల్సింది పార్టీ కమిటీల్లో బలప్రదర్శన కాదని, ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు, ఎన్నికల్లో బలప్రదర్శన చేసేందుకు సిద్ధం కావాలని సూచించారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో తమ ఆవేదన చెప్పుకుంటామని మహేశ్వర్రెడ్డి వెల్లడించారు. -
రామారావు పార్టీ మారితే నేను మారతానా?
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారుతున్నానని ప్రచారం జరిగిన ప్రతిసారీ తాను ఖండిస్తూ వివరణ ఇచ్చుకోవాల్సి రావడం బాధాకరంగా ఉందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ మారాల్సిన అవసరం లేదని, ఏదైనా సమస్య ఉంటే హైకమాండ్తో మాట్లాడి పరిష్కరించుకునే చనువు, అవకాశం తనకున్నాయని అన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు రామారావు పార్టీ మారితే నాపై కూడా అదే ప్రచారం చేయడం సమంజసంగా లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రామారావుకు సీనియర్ నేత కె.జానారెడ్డి, ఎమ్మెల్యే హరిప్రియకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇప్పించారు. అయినా వారిద్దరూ పార్టీ మారారు. అలా అని జానారెడ్డి, రేవంత్రెడ్డి కూడా పార్టీ మారుతారని అనుమానిస్తారా?’అని ఏలేటి ప్రశ్నించారు. కాంగ్రెస్ పారీ్టలోకి ఎల్లో, పింక్, ఆరెంజ్ పారీ్టల నుంచి వచి్చనవారు ఉన్నారని, వారిలో ఎవరు తనపై కుట్రలు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేస్తున్నవారికి పొగబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పారీ్టనేనని, పార్టీ అంతర్గత విషయాల గురించి బహిరంగంగా మాట్లాడబోనని ఏలేటి స్పష్టం చేశారు. -
రైతుల ప్రథమ శత్రువు సీఎం కేసీఆర్
నేరడిగొండ(బోథ్) ఆదిలాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ప్రథమ శత్రువని డీసీసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. మండలంలోని వడూర్లో గురువారం ఆత్మహత్య చేసుకున్న రైతు గాదె రవి కుటుంబ సభ్యులను శుక్రవారం ఆయన పరామర్శించి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబానికి రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. రైతుల పక్షాన నిలబడి పోరాడేది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలను వీడకపోతే గతంలో చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. 2015 నుంచి నేటివరకు అతివృష్టి, అనావృష్టితో పంటలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. విశ్వాసం కోల్పోయిన కేసీఆర్ రైతుబంధు పథకం పేరుతో రైతులను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతుల ఉసురు తగలక మానదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షలు రైతు రుణమఫీని ఏకకాలంలో చేస్తామన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలా ప్రణాళికలు రూపొందించి రైతుల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీని ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి జాదవ్ అనిల్కుమార్, బోథ్ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు మల్లెపూల సత్యనారాయణ, నాయకులు షబ్బీర్ అహ్మద్, ఆదుముల్ల భూషన్, ఫయ్యాజ్, సుభాష్గౌడ్, భీంరెడ్డి, సదానందం, రాజశేఖర్రెడ్డి, ఎండి సద్దాం, తదితరులు ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాధ్యత నాది
కాంగ్రెస్లో పలువురి చేరిక
త్వరగా నిద్రలేవమన్నందుకు చెరువులో దూకి ఆత్మహత్య
జిల్లా ఉండన్నా? పోవన్నా..?
రేపు బాన్సువాడకు రాజ్నాథ్సింగ్ రాక
దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్సే
సకాలంలో పనులు పూర్తి చేయాలి
నేడు సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో
తప్పనిసరిగా ఓటు వేయాలి
11న ప్రియాంకా గాంధీ సభ
తప్పక చదవండి
Advertisement