-
సొల్యూషన్ లేని ‘అలియాస్’ సమస్య
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో అలియా స్(పేరు మార్పిడి) సమస్య చిక్కుముడిగా మారింది. ఈ సమస్య కారణంగా సంస్థ వ్యాప్తంగా సుమా రు వెయ్యి మందికి పైగా కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు రావడం లేదు. ఏళ్ల తరబడి కా ర్యాలయం చుట్టూ తిరిగినా పని జరగక, స్పౌస్లకు పెన్షన్ రాక అవస్థ పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. మరోపక్క కార్మికుల సమస్యలు తెలిసినప్పటికీ గుర్తింపు సంఘం నాయకులు ఆ వైపుగా దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏమిటీ సమస్య? సింగరేణి సంస్థలో కార్మికులు అవసరమైన సందర్భాల్లో నియమ నిబంధనలు పక్కనపెట్టి... వచ్చిన వారిని వచ్చినట్లుగా నియమించారు. నిబంధనలన్నీ కచ్చితంగా అమలు చేస్తే ఎవరూ రారనే భావనతో అధికారులు ఈ నిర్ణయం తీసుకోగా, ఉద్యోగం వస్తుందనే ఆశ, కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందనే భావనతో చాలామంది మారు పేర్లతో చేరారు. ఈ ప్రక్రియలో అటు అధికారులు.. ఇటు కార్మికుల తప్పిదం కూడా ఉందన్నది నిర్వివాదాంశం. ఉద్యోగం చేరాక రెండేళ్లకు కార్మికులను పర్మనెంట్ చేయడం పరిపాటి. కనీసం అప్పుడైనా కార్మికుల పూర్తి వివరాలు సేకరించి సరైన పేర్లతో పర్మనెంట్ చేయాల్సి ఉన్నా.... ఆనా టి సింగరేణి రిక్రూట్మెంట్ సెల్, విజిలెన్స్, ఇంటిలిజెన్స్ విభాగాల అధికారులు పట్టించుకోలేదు. స్వయంగా సీఎం చెప్పినా అంతే 2018 ఎన్నికల తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక సీఎం కేసీఆర్ శ్రీరాంపూర్ ఏరియాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ సమస్యపై మాట్లాడారు. కార్మికులకు సంబంధించి రికార్డుల్లో పేర్లు మార్చి, వారసత్వ ఉద్యోగాల ద్వారా కుటుంబాలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అక్కడికక్కడే ప్రక్రియను వేగవంతం చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ఇది జరిగి ఐదేళ్లు కావొస్తున్నా ప్రక్రియ పూర్తికాకపోవడంతో సుమారు వేయి మంది కార్మికులు కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. అధికారులు శ్రద్ధ కనబర్చకపోవడంతో ఉద్యోగుల పేర్లు మార్చకపోగా, ఇంటి పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, ఇతరత్రా సమాచారం తప్పుగా నమోదవుతోంది. దీంతో పెన్షన్లు మంజూరు కాక, అర్హులైన కార్మికుల్లో కుటుంబీకులకు వారసత్వ ఉద్యోగాలు లభించక నానా అవస్థలు పడుతున్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా నిర్ణయం తీసుకుంటాం: బలరామ్ సింగరేణి డైరెక్టర్(పా) ఎన్.బలరామ్ను ఈ విషయమై వివరణ కోరగా... బోర్డ్ డైరెక్టర్ల సమావేశంలో చర్చించి, న్యాయపరమైన చిక్కులు రాకుండా త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కార్మికుల పూర్తి వివరాల సేకరణ విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఉద్యోగులకు ఆదేశాలు జారీచేస్తామని చెప్పారు. -
ఇదిగో.. విమానాన్ని నడపగల రోబో..
-
ఇదిగో.. విమానాన్ని నడపగల రోబో..
- బోయింగ్ సిములేటర్ను విజయవంతంగా నడిపి, సేఫ్గా ల్యాండ్ చేసిన రోబోట్ - అరోరా ఫ్లైట్ సైన్సెస్-అమెరికన్ ఆర్మీ సంయుక్త పరీక్ష విజయవంతం మానసాస్: విమానయాన చరిత్రలో అద్భుతాలు ఆవిష్కతమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు. ఇప్పటికే ఎన్నెన్నో పనులు చేస్తోన్న రోబోలు విమానాలను నడపగలిగే సామర్థ్యాన్నికూడా సొంతం చేసుకున్నాయి. శాస్త్రవేత్తలు అభివృద్ధిచేసిన అలియాస్ అనే రోబో.. భారీ బోయింగ్ ఫ్లైట్ సిములేటర్(అనుకరణ యంత్రం)ను నడపడమేకాదు, సురక్షితంగా ల్యాండ్ చేసింది కూడా! రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా ప్రఖ్యాత అరోరా ఫ్లైట్ సైన్సెస్ సంస్థ, అమెరికన్ ఆర్మీ సంయుక్తంగా వర్జీనియాలో నిర్వహించిన పరీక్షలు విజయవంతం అయ్యాయి. సిములైటర్లో రోబోట్ విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేసిన విషయాన్ని అరోరా సంస్థ ప్రతినిధులు బుధవారం ప్రపంచ మీడియాకు వెల్లడించారు. అలియాస్(ALIAS-- Aircrew Labour In-Cockpit Automation System)గా వ్యవహరించే రొబోటిక్ వ్యవస్థపై అరోరా సంస్థ గత కొన్నేళ్లుగా పరిశోధనలు నిర్వహిస్తోంది. ఆమేరకు అవసరమయ్యే నిధులను అమెరికన్ రక్షణ శాఖ అందిస్తోంది. అలెక్సా వాయిస్ కమాండ్ మాదిరిగా శబ్ధరూపంలోని ఆదేశాలను గుర్తించడం, స్పీచ్ సింథసిస్ విధానంలో మాట్లాడుతూ పైటల్, కమాండ్ కంట్రోల్ సెంటర్లతో సంభాషణలు సాగించడం, పరిస్థితులకు అనుగుణంగా స్పందించడం, విజువల్ ఇన్పుట్స్ను స్వీకరించడం తదితర పనులెన్నింటినో అలియాస్ చేయగలదని అరోరా సంస్థ ప్రతినిధి జాన్ విస్లర్ తెలిపారు. కొద్ది నెలల కిందటే సెన్సా 208, డీహెచ్సీ-2 అనే తేలికపాటి విమానాలను అనుకరణ విధానంలో నడిపిన అలియాస్ రొబో.. ఇప్పుడు ఏకంగా భారీ బోయింగ్-737ను విజయవంతంగా (సిములేటర్పై) నడపటం విశేషం. ఈ పరీక్షలు విజయవంతం కావడంతోత్వరలోనే ఈ రోబోలతో నిజం విమానాలను నడిపింపజేయాలని సైంటిస్టులు భావిస్తున్నారు. ఆ పరీక్షలు కూడా సక్సెస్ అయిన పిదప రోబోలు పైలట్ హోదాలో రవాణా, ప్రయాణికుల విమానాలను నడిపిస్తాయనడంలో సందేహంలేదు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మెట్ గాలా-2024 ఈవెంట్లో మెరిసిన సెన్సేషనల్ బ్యూటీ మోనా పటేల్.. ఫోటోలు
BRS ఓటమిపై కేసీఆర్ మనసులో మాట
కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ తప్పు మాది కాదు: కేసీఆర్
డల్లాస్లో నాట్స్ ఆధ్వర్యంలో నృత్య, నట శిక్షణా శిబిరం
ఫోన్ ట్యాంపరింగ్ పై కేసీఆర్ కీ కామెంట్స్
మోదీ గెలుస్తే పెట్రోల్, డీజిల్ ధరలు..400 +..!?
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?
శ్రీసిటీ.. ఇది సిరుల సిటీ: రవి సన్నా రెడ్డి
సీఎం జగన్ కాన్వాయ్ విజువల్స్
ఎన్నికలకు ముందే ఏ స్థాయిలో కుట్రలంటే.. : సీఎం జగన్
తప్పక చదవండి
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement