-
దేశానికి ముగ్గురు ప్రధానులను అందించిన యూనివర్శిటీ ఏది?
దేశంలో ప్రతిష్టాత్మక యూనివర్శిటీలు ఎన్నో ఉన్నాయి. వీటిలో చదువుకున్నవారు ఉన్నత స్థానాలకు చేరుతుండటాన్ని మనం చూస్తుంటాం. అయితే దేశంలోని ఆ విశ్వవిద్యాలయం మనకు ముగ్గురు ప్రధానమంత్రులను, రాష్ట్రపతిని అందించింది. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ యూనివర్సిటీకి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశానికి ముగ్గురు ప్రధాన మంత్రులను అందించిన ఘనత ఈ యూనివర్శిటీకే దక్కుతుంది. మాజీ ప్రధానులు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, గుల్జారీలాల్ నందాలు తమ ఉన్నత విద్యను ఇక్కడే కొనసాగించారు. దేశంలోని నాలుగు పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటైన అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 27,28 తేదీలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగనుంది. ఇందుకోసం వర్సిటీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. యూనివర్సిటీలో పూర్తిస్థాయి విద్యార్థుల సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి. దీనిలో 1996 నుంచి ఇప్పటివరకు ఇక్కడ విద్యనభ్యసించినవారు పాల్గొననున్నారు. దీనిలో పాల్గొనేందుకు 1,100 మంది విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మాయో భవనం అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని పురాతన భవనం. ఇందులో ఇంతకుముందు మయో కాలేజీ నడిచేది. ఇది కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. అయితే 1887 సెప్టెంబర్ 23న అలహాబాద్ విశ్వవిద్యాలయం స్థాపన తర్వాత, ఇక్కడ సైన్స్ ఫ్యాకల్టీ విభాగం ఏర్పడింది. ఇక్కడ భౌతిక శాస్త్రానికి సంబంధించి జరిగిన పలు పరిశోధనలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలకు ప్రత్యేక ప్రయోగశాలలు ఉన్నాయి. పూర్వ విద్యార్థుల సమ్మేళనం నేపధ్యలో అన్ని విభాగాలను అలంకరించారు. ఈ యూనివర్శిటీ విద్యార్థి రాజకీయాల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ యూనివర్శిటీలో చదువుకున్న నారాయణ్ దత్ తివారీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన అలహాబాద్ యూనివర్సిటీ నుంచే తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. -
యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తతలు..పలువురికి గాయాలు
లక్నో: అలహబాద్ యూనివర్సిటీ తీవ్ర హింసాత్మకంగా మారింది. సెక్యూరిటీ గార్డు, విద్యార్థుల మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో ఇరువురు ఘర్షణకు దిగడంతో యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థులు రాళ్లు రువ్వడం, మోటారు సైకిళ్లుకు నిప్పంటించడం వంటివి చేశారు. ఈ ఘర్షణలో ఇరువురు తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, విద్యార్థులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. యూనివర్సిటీలో ఫీజుల పెంపు విషయమై నెలల తరబడి నిరసన జరుగుతోంది. అందులో భాగంగా ఓ విద్యార్థి నాయకుడు క్యాంపస్లోని బ్యాంకుకు వెళ్లాలనుకున్నాడు. ఐతే గార్డు అందుకు అనుమతించ లేదు. దీంతో వాగ్వాదం ఏర్పడి అది కాస్త ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: జవాన్లకు ఆ పదం ఉపయోగించకూడదు! రాహల్పై విదేశాంగ మంత్రి ఫైర్) -
అలహాబాద్ వర్సిటీ వీసీ రాజీనామాకు ఆమోదం
న్యూఢిల్లీ: అలహాబాద్ వర్సిటీ వీసీ రతన్ లాల్ హంగ్లూ రాజీనామాకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్చార్డీ) వెల్లడించింది. అనేక అవక తవకలకు పాల్పడ్డారంటూ ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని రాష్ట్రపతి ఆదేశించారని పేర్కొంది. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు హెచ్చార్డీ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లోని కల్యాణి వర్సిటీ వీసీగా ఉన్న సమయంలోనూ హంగ్లూ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. -
అలహాబాద్ యూనివర్సిటీ వీసీ రాజీనామా
లక్నో: అలహాబాద్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ రతన్ లాల్ హంగ్లూ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి, లైంగిక వేధింపుల ఫిర్యాదులను సరిగా పరిష్కరించలేదనే ఆరోపణల నడుమ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఆయన.. తీవ్ర పని ఒత్తిడి కారణంగానే తాను వైస్ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. 'నేను రాజీనామా చేసిన విషయం వాస్తవమే. నాకు వ్యతిరేకంగా వచ్చే ఆరోపణలు, ఫిర్యాదుల్లో నిజంలేదని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. నిరాధారమైన ఆరోపణలతో.. అకారణంగా తరచూ విచారణలు చేపడుతుండడంతో విసుగుచెంది రాజీనామా చేస్తున్నాను' అని హంగ్లూ పేర్కొన్నారు. ఇతరుల ప్రలోభాలకు లోనుకాకుండా, ఒత్తిడిని తట్టుకుంటూ నిజాయితీగా తన విధులు నిర్వర్తించానని హంగ్లూ ఈ సందర్బంగా తెలిపారు. అయితే హంగ్లూ పనితీరును తప్పుబడుతూ గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే. అలహాబాదు విశ్వవిద్యాలయంలో 2016 నుంచి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు చుట్టుముట్టడంతో హంగ్లూ పనితీరుపై నిఘా పెరిగింది. ఈ క్రమంలోనే.. యూనివర్సిటీ విద్యార్థినులు ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదులను సరిగా పరిష్కరించలేదంటూ గతవారం జాతీయ మహిళా కమిషన్ అతనికి వ్యతిరేకంగా సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే.. 'తనపై వచ్చిన ఆరోపణలను సీబీఐ ఎదుట నిరూపించండి. ఆ తర్వాత హైకోర్టులో తేల్చండి' అంటూ హంగ్లూ వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా కాలేజీలో తనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేసేవారిని మాఫీయాగా అభివర్ణించడంతో ఆయన వైఖరిని తప్పుబడుతున్నారు. యూనివర్సిటీలో 1,200 మంది నియామకాలు జరగాలి. నేను అక్కడ ఉంటే, ఇతరులు సిఫార్సులు, అభ్యర్థనలు స్వీకరించను. కేవలం అభ్యర్థి మెరిట్ ప్రాతిపదికన మాత్రమే వెళ్తానని, మాఫియా నుంచి ఆర్డర్లు ఎంతమాత్రం తీసుకోనని ప్రకటించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి కాబట్టే రాష్ట్రపతి కార్యాలయం రెండు సార్లు ఫైల్ను వెనక్కిపంపిందని హాంగ్లూ అన్నారు. తనపై వస్తున్న లైంగిక ఆరోపణలకు సంబంధించి చట్టపరమైన సహాయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే విషయమై డిసెంబరు 26న జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరై, తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. కాగా ప్రొఫెసర్ హంగ్లూ 2015 నుంచి అలహాబాద్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమితులైనారు. అంతకుముందు పశ్చిమ బెంగాల్లోని కళ్యాణి యూనివర్సిటీలో వీసీగా విధులు నిర్వర్తించారు. -
బీజేపీకి మళ్లీ షాక్.. మరో వర్సిటీ ఎన్నికల్లో ఓటమి
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీకి ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. ఆ పార్టీకి చెందిన అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీకి వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే జేఎన్యూ, హెచ్సీయూ వంటి విశ్వవిద్యాలయాల్లో జరిగిన స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన ఆ పార్టీ అనుబంధ సంస్థ తాజాగా అలహాబాద్ యూనివర్సిటీలో జరిగిన ఎన్నికల్లో కూడా ఓటమిని చవిచూసింది. సమాజ్వాది పార్టీకి చెందిన సమాజ్వాది చత్ర సభ(ఎస్సీఎస్) భారీ విజయాన్ని ఖాయం చేసుకుంది. రాష్ట్ర ఎన్నికల్లో ఊహించని విధంగా మట్టి కరిచిన ఆ పార్టీ తిరిగి విద్యార్థి ఎన్నికల రూపంలో పెద్దమొత్తంలో విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం ఐదు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీ ఒకే సీటును అది కూడా జనరల్ సెక్రటరీని దక్కించుకోగా ఎస్సీఎస్ మాత్రం అధ్యక్ష, ఉపాధ్యక్షపదవితోపాటు మరో రెండు కీలక పదవులను తన ఖాతాలో వేసుకుంది. 2015లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఏబీవీపీ 4 స్థానాలను సొంతం చేసుకుంది. తాజా ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎస్సీఎస్ తరుపున బరిలో నిలిచి విజయం సాధించిన అధ్యక్షుడు అవినాష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇది అందరు విద్యార్థుల విజయం అని చెప్పారు. కాగా, గురుదాస్పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement