-
సినిమాలో రాణి మిస్సయింది.. కానీ
సినిమాలో రాణి మిస్సయ్యింది కానీ నిజ జీవితంలో మాత్ర రాణి తనకే దక్కిందంటున్నారు బాలీవుడ్ ‘అల్లావుద్దీన్ ఖిల్జీ’ రణ్వీర్ సింగ్. ‘స్టార్ ప్లస్’ వారు నిర్వహించిన స్టార్ స్క్రీన్ అవార్టుల కార్యక్రమంలో ‘పద్మావతి’ చిత్రంలో చేసిన ఖిల్జీ పాత్రకు గాను ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్నారు రణ్వీర్ సింగ్. పెళ్లైన తరువాత అందుకున్న తొలి అవార్డ్ కావడంతో కాస్తంతా ఉద్వేగానికి గురయ్యారు రణ్వీర్. అంతేకాక ఈ అవార్డ్ను తన భార్య దీపికకు అంకితమిచ్చారు రణ్వీర్ సింగ్. ఈ సందర్భంగా రణ్వీర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నాకు రాణి లభించలేదు.. కానీ నిజ జీవితంలో రాణి దొరికింది. బేబీ థాంక్యూ.. ఈ ఆరేళ్లలో నేను ఎన్నో సాధించాను.. ఎందకంటే నువ్వు ఎల్లపుడు నాతోనే ఉన్నావు కాబట్టి. ధన్యవాదాలు’ అంటూ వేదిక మీద భార్యను పొగడ్తలతో ముంచెత్తారు. View this post on Instagram " BABY I LOVE YOU "😍😍😍,,Yasssss we know 😭😭😭😭Ranveer's speech in #starscreenawards 🖤 . Look at @vickykaushal09 😭😭 . #deepveer #deepveeraddict #mrandmrsbhavnani #starscreenawards #couplegoals #cutest😍😍 @deepveer_addict_ 🖤 A post shared by #DeepVeer ❤❤ (@deepveer_addict_) on Dec 16, 2018 at 10:16am PST -
‘ఖిల్జీని చూస్తే అజంఖాన్ గుర్తొచ్చాడు’
రాయ్పూర్: సమాజ్వాదీ పార్టీ నాయకుడు అజంఖాన్ను ఉద్దేశించి మాజీ ఎంపీ జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మావత్ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను చూస్తే తనకు అజంఖానే గుర్తొచ్చాడని ఆమె వ్యాఖ్యానిం చారు. ‘‘అజంఖాన్ను నేను సోదరునిగా భావించాను. కానీ అతను నాపై ప్రతీకారం తీర్చుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నించాడు’ అని రాయ్పూర్లో వ్యాఖ్యానించారు. -
ఖిల్జీని చూస్తే అతనే గుర్తుకొచ్చాడు: నటి
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ఎంపీ, ప్రముఖ నటి జయప్రద కొంతకాలం కిందటివరకు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సమాజ్వాదీ పార్టీ తరఫున రాంపూర్ నియోజకవర్గం నుంచి ఆమె రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఆమె ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొనసాగుతున్న సమయంలో సొంత పార్టీ ఎస్పీ సీనియర్ నేత ఆజంఖాన్ నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నారు. ఎన్నికల సమయంలో తన పట్ల దుష్ప్రచారం చేస్తున్నారని కూడా అప్పట్లో ఆరోపించారు. తాజాగా ‘పద్మావత్’ సినిమా చూస్తే ఆనాటి జ్ఞాపకాలు ఆమెను వెంటాడినట్టు ఉన్నాయి. అందుకే ‘పద్మావత్’ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను చూస్తే తనకు ఆజంఖాన్ గుర్తుకువచ్చాడని, ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నప్పుడు అతను తనను ఎంతోగానే వేధించాడని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆజంఖాన్ను ఖిల్జీతో పోల్చారు. -
‘వెళ్లొస్తా’ అని ... ఎంతకూ రాడే?
హైద్రాబాద్ వచ్చిన కొత్తలో ఇక్కడి భాష నాకు వింతగా తోచింది. నేను చిన్నప్పటి నుంచి ఉర్దూ చదివినవాడిని. రాసిన వాడిని. ఇక్కడి ఉర్దూ రాత భాషలోని కొన్ని పదాలు నాకు తెలిసిన ఉర్దూ సాహిత్యంలో ఎక్కడా తారసపడలేదు. పాత తరాల సాహిత్యం చదివిన తర్వాత ‘యురేకా’ అన్పించింది! ఇక్కడ బాగా ప్రాచుర్యంలో ఉన్న ‘దేజావొ’ లాంటి పదాలు మా పంజాబీలకు చిరపరిచితమైనవే! ఈ మతలబు తెలుసుకునేందుకు చరిత్రలోకి కాస్త తొంగి చూడాల్సిందే! దక్కన్ తరంగాలు! ముస్లింల దండయాత్ర వలన మాత్రమే దక్కనీ రూపొందలేదు. జైనులు-బౌద్ధులు-శైవులు-వైష్ణవులు-తమ విశ్వాసాల ప్రచారాల్లో భాగంగా ద్రవిడ ప్రాంతానికి శతాబ్దాలుగా వచ్చేవారు. ఇక్కడి వారు అక్కడికీ! వీరికి, మహారాష్ట్ర-కర్ణాటక-తెలంగాణ ప్రాంతాలు ఉత్తర-దక్షిణ భారతాల సంగమస్థలిగా ఉండేది. సూఫీలు,గురునానక్ దక్షిణ ప్రాంతాలను సందర్శించారు. ఈ సంగమం వలన ఏర్పడిన భాష దక్కనీ. ముస్లింలు అందరూ సూఫీలు కారు. సూఫీలందరూ ముస్లింలు కారు! దక్కనీలో జైన చరిత్ర కావ్యాలు రాశారు. దక్కన్ పీఠభూమి పరిసరాల్లోని అనేక భాషాప్రవాహాలను కలుపుకుని దక్కనీ (దక్షిణాది భాష) ఆవిర్భవించింది. బహమనీల ప్రత్యేకత! అల్లావుద్దీన్ ఖిల్జీ దేవగిరిపై దాడి చేసిన నేపథ్యంలో అతడు, అతడి సైన్యం వెంట తెచ్చిన పర్షియన్ భాష పంజాబ్తో సంగమించింది. ఖిల్జీ దాడి తర్వాత నూరేళ్లకు 1295 ప్రాంతంలో కొత్తభాషగా ఢిల్లీకీ పరిచయమైంది. సింధునది ప్రాంతానికి వచ్చిన సైనికులు (ఉర్దు) మాట్లాడే భాష కాబట్టి (హిందీ)గా మారింది. ఈ నేపథ్యంలో 1327లో తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చాడు. మహారాష్ట్రలోని నాసిక్-నాందేడ్ మధ్యలోని దేవగిరిని దౌలతాబాద్ అన్నాడు. దక్కన్ పీఠభూమికి చెందిన దౌలతాబాద్కు రాచకుటుంబీకులు, ఉన్నతాధికారులు, చేతివృత్తుల వారు, దాదాపు 500 మంది సూఫీలు ఢిల్లీ నుంచి చేరారు. తమ భాషనూ ఇక్కడకు తెచ్చారు. 1347లో స్థానిక ప్రభువులు తుగ్లక్కు ఎదురు తిరిగి బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఈ నేపథ్యంలో బహమనీలు ఉత్తరాది వారితో ఎటువంటి సంబంధం, పోలిక వద్దనుకున్నారు. భాష విషయంలో కూడా! అలా ఉత్తరాది ఉర్దూతో సంబంధం లేకుండా దక్షిణాది ఉర్దూ పరిణామం మొదలైంది! స్థానిక భాషలైన మరాఠీ-తెలుగు-కన్నడ పదాలను చేర్చుకుంది. ‘హవ్-నక్కొ-కైకొ’ మరాఠీ నుంచి చేరాయి. ‘జాకే ఆతుమ్’ ఉర్దూకు తెలుగు కంట్రిబ్యూషన్! ఉత్తరాది ఉర్దూలో ఈ వాడుక లేదు! ఈ విషయం నేను స్వానుభవంతో చెబుతున్నా! ఆంధ్రుడైన మా ఉన్నతాధికారి ఒకరు ‘వెళ్లొస్తా’ అని వెళ్లాడు. ఎంతకూ రాడే? చాలాసేపు వెయిట్ చేశా. ‘ఆయన వెళ్తున్నా అన్నారు, మళ్లీ వస్తా అనలేదు’ అని మా దగ్గర పనిచేసే వ్యక్తి చెప్పాడు! ప్రజల నాల్కలపై జీవించిన రాజు! ఫిరోజ్ షా, బుర్హానుద్దీన్ జనమ్, ఖురేషీ బిద్రీ, గవాసీ, వజాహీ, కులీ కుతుబ్షా వంటి కవులు తమ సాహిత్యంతో దక్కనీని సారవంతమూ చేశారు. హైద్రాబాద్ నగర వ్యవస్థాపకుడు ఐదవ కులీకుతుబ్షా పర్షియాలో దక్కనీలో గొప్ప కవితలు రాశారు. ఆయన సాహిత్యంలో వివిధ భారతీయభాషల పదాలున్నాయి! నేటికీ ప్రాచుర్యంలో ఉన్న భాగ్యనగర నిర్మాత కులీకుతుబ్షా కవిత (యూట్యూబ్లో ఇక్బాల్ బానో తదితరుల స్వరాలు పరవశింపజేస్తాయ్) పియా బాజ్ /ప్యాలా పియా జాయెన పియా బాజ్ ఎక్ తిల్ / జియా జాయె న ప్రేయసి లేకుండా పాత్రికలో మధువును తాగలేను ప్రేయసి లేకుండా ఒక్క శ్వాస అయినా తీసుకోలేను కతె పియా బిన్ / సుబురి కరూ కెహ జాయె అమ్మా / కియా జాయొ న’’పియా బాజ్ ’’ తాళమంటావు ప్రేయసి దూరమైనా చెప్పడం తేలికే అమ్మా బతకడమే కష్టం నహీ ఇష్క్ జిస్ / వొ బడా కూడ్ హై కథీ ఉస్ సె మిల్ / బెసియ జాయె న ’’పియా బాజ్ ’’ ప్రేమించలేని వాడు మహా క్రూరుడు ప్రేయసి లేకుండా జీవించే వాడెంత క్రూరుడొ కుతుబ్షా న దె/ ముఝ్ దివానె కొ పంద్ దీవానె కొ కుచ్ / పంద్ దియా జాయె న ’’పియా బాజ్ ’’ కుతుబ్షా ప్రేయసిలేని పిచ్చివాడు తర్కాలేల పిచ్చివాడికి హితవచనాలు చెప్పరాదు కదా ప్రెజెంటర్ : పున్నా కృష్ణమూర్తి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
అల్లూరికి అర్ధ శతాబ్దం
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement