-
కర్ణాటక దూకుడు.. తెలంగాణ కలవరం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాలను వీలైనంత ఎక్కువగా ఎగువనే తోడేయాలని దూకుడు ప్రదర్శిస్తున్న కర్ణాటక ప్రభుత్వం...ఆల్మట్టి ప్రాజెక్టు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్మట్టి ఎత్తు పెంపుతో దక్కే 130 టీఎంసీల నీటిని వినియోగంలోకి తెచ్చేందుకు చేపట్టిన తొమ్మిది ఎత్తిపోతల పథకాలకు కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించినా వాటిని వచ్చే ఏడాదికల్లా ప్రారంభించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఈ పథకాల్లో పెరిగిన అంచనా వ్యయాలకు ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ముంపు అంశాన్ని పరిష్కరించే చర్యలను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇవన్నీ వచ్చే ఏడాది నుంచి వీలైనంత నీటిని తోడే లక్ష్యంగానే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అప్రమత్తం కాకుంటే అంతే సంగతి... కృష్ణా జలాలకు సంబంధించి బచావత్ అవార్డుకు విరుద్ధంగా 65 శాతం డిపెండ బులిటీలో నీటి కేటాయింపులు చేసిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్...కర్ణాటకకు అప్పటికే ఉన్న 734 టీఎంసీల కేటాయింపును 911 టీఎంసీలకు పెంచడం తెలిసిందే. ఇదే సమయంలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల ఎత్తు నుంచి 524.256 మీటర్లకు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. నిజానికి ఆల్మట్టిలో 129 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 173 టీఎంసీల నీటి వినియోగానికి వీలుంది. బ్రిజేశ్ తీర్పు అమల్లోకి వస్తే నిల్వ సామర్థ్యం 130 టీఎంసీలకు పెరగనుంది. అయితే ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండటంతో తీర్పు అవార్డు కాలేదు. అయినప్పటికీ అప్పర్ కృష్ణా స్టేజ్–3లో భాగంగా 130 టీఎంసీలను వినియోగంలోకి తెచ్చేలా రూ. 17,207 కోట్లతో 9 ఎత్తిపోతల పథకాలకు కర్ణాటక ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులకు భారీ ముంపు ఉండటం, నిర్వాసితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో గత నెలలో కేంద్ర పర్యావరణ అనుమతి కోసం కర్ణాటక ప్రయత్నించగా అక్కడ చుక్కెదురైంది. ఈ పథకాలకు సీడబ్ల్యూసీ అనుమతి, హైడ్రాలజీ క్లియరెన్స్ తప్పనిసరంటూ ఎన్విరాన్మెంట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) పర్యావరణ అనుమతులను తిరస్కరించింది. రాజకీయ లాబీయింగ్ మొదలు... పర్యావరణ అనుమతులు లభించనప్పటికీ పట్టువీడని కర్ణాటక సర్కారు... ఇటీవలే 9 ఎత్తిపోతల పథకాలకు అనుమతుల కోసం కేంద్రం వద్ద రాజకీయంగా లాబీయింగ్ మొదలు పెట్టింది. మరోవైపు ఎత్తిపోతల పథకాల కొత్త అంచనా వ్యయాలు, భూ పరిహార అంశాలపైనా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గత బుధవారం సమావేశమైన కర్ణాటక కేబినెట్ గతంలో వేసిన అంచనాను రూ. 17,602 కోట్ల నుంచి రూ. 51,148.94 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ప్రాజెక్టు పరిధిలో 1.33 లక్షల ఎకరాల భూసేకరణ, నిర్వాసితుల భూ పరిహారం కోసం ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అక్టోబర్ 30 నాటికి పరిహార అంశాలన్నీ తేల్చేలా కమిటీకి బాధ్యతలు అప్పగించింది. ఇవన్నీ పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగిరం చేసే భాగంలో జరుగుతున్నవేనని నీటిపారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రానికి కలవరమే... కర్ణాటక కేబినెట్ సమావేశం అనంతరం ఆ రాష్ట్ర జలవనరుల మంత్రి ఎంబీ పాటిల్ మాట్లాడుతూ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో ఉన్న అన్ని పిటిషన్లు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పరిష్కారమవుతాయని, వచ్చే ఏడాది నుంచి నీటి వినియోగం ఉంటుందని పేర్కొన్నారు. ఇది రాష్ట్రాన్ని కలవరపెట్టే అంశమే. ఈ నేపథ్యంలో దిగువన ఉన్న తెలంగాణ, ఏపీ రాష్ట్రాల రాజకీయ పెద్దలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల వర్గాలు సూచిస్తున్నాయి. లేకుంటే ఎగువ నీటిపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి తప్పదని హెచ్చరిస్తున్నాయి. -
ఆల్మట్టికి రోజుకు 6 టీఎంసీలు
60 వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహాలు సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని ఆల్మట్టి ప్రాజెక్టులోకి నీటి ప్రవాహాలు పుంజుకున్నాయి. గురువారం నాటికి రోజుకు 6 టీఎంసీల చొప్పున 64 వేల క్యూసెక్కుల మేర నీరు వచ్చిచేరుతోంది. దీంతో ప్రాజెక్టు మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత నీటి నిల్వ 129 టీఎంసీలకు గాను 58.6 టీఎంసీలకు చేరింది. ప్రవాహాలు పెరగడంతో 27,720 క్యూసెక్కుల నీటిని దిగువ నారాయణపూర్కు వదులుతున్నారు. దీంతో నారాయణపూర్కు 10,735 క్యూసెక్కుల మేర ప్రవాహం ఉండటంతో అక్కడ 37.64 టీఎంసీల నిల్వకు 15.87 టీఎంసీల నిల్వ ఉంది. ఇక తుంగభద్రకు సైతం ప్రవాహాలు పెరిగాయి. దీనికి 15,464 క్యూసెక్కుల మేర నీరు చేరుతోంది. ప్రస్తుతం ఎగువ కర్ణాటకలో మంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరో 15 రోజుల తర్వాత దిగువ జూరాలకు ప్రవాహాలు మొదలయ్యే అవకాశముంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement