-
15లోపు..దరఖాస్తు చేసుకోండి...
రాజంపేట టౌన్ : అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (ఏఓయూ) ద్వారా బీఈడీ అభ్యసించే విద్యార్థులు మే 15వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి (ఎల్వీకే) తెలిపారు. స్థానిక అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లో శుక్రవారం ఎల్వీకే విలేకరులతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదువందల బీఈడీ సీట్లు ఉన్నాయన్నారు. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్లో మరో ఐదువందల సీట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రవేశ పరీక్ష రాసేందుకు ఓసీ విద్యార్థులు డిగ్రీలో యాబైశాతం మార్కులతో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర రిజర్వేషన్ కలిగిన విద్యార్థులు డిగ్రీలో 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ప్రవేశ పరీక్ష ఈ ఏడాది జూన్ 6వ తేదీ అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతుందన్నారు. బీఈడీలో ప్రవేశం పొందే విద్యార్థులు నేషనల్ టీచర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఎన్సీటీఈ) గుర్తింపు పొందిన డీఎడ్, టీటీసీ, ఈఎల్ఈడీ, తెలుగుపండిట్, హిందీపండిట్ వంటి డిప్లొమా కోర్సులను పూర్తి చేసి ఉండాలని తెలిపారు. ఎన్సీఈటీ గుర్తింపు పొందిన డిప్లొమా సర్టిఫికెట్లు లేని వారు బీఈడీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నా అడ్మిషన్ పొందేందుకు అనర్హులన్నారు. బీఈడీ స్పెషల్æ ఎడ్యుకేషన్లో చేరే విద్యార్థులు 50 శాతం మార్కులతో డిగ్రీ పాసై ఉంటే చాలన్నారు. అయితే ప్రవేశ పరీక్షలో ర్యాంకు తప్పని సరి అన్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు సెమిస్టర్ విధానంలో పరీక్షలు జరుగుతాయన్నారు. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్లో అంగవైకల్యం ఉన్నవారికి, అంగవైకల్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ ఏడాది ఆగస్టులో అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ఎల్వీకే తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
అంబేడ్కర్ వర్సిటీ అడ్మిషన్ల గడువు 8 వరకు పెంపు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, డిగ్రీ కోర్సుకు గతంలో ఈ నెల 20ని చివరితేదీగా ప్రకటించగా విద్యార్థుల సౌకర్యార్థం ఈ గడువును సెప్టెంబర్ 8 వరకూ పొడిగించామని యూనివర్సిటీ విద్యార్థి సేవా విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ ఎల్.విజయ కృష్ణారెడ్డి తెలిపారు. శనివారం స్థానిక సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిగ్రీలో చేరేందుకు విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని, రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులు దరఖాస్తు ప్రింటు తీసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో ఎంపిక చేసుకున్న అధ్యయన కేంద్రాలకు వెళ్లి పరిశీలన చేయించుకోవాలని సూచించారు. పీజీ, డిప్లొమా కోర్సులకు కూడా తమ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రెండు బైక్లు ఢీ.. ఇద్దరికి గాయాలు
వరుస చోరీలతో భయాందోళన
ఎన్నికల విధుల సమస్యల పరిష్కారంపై హామీ
గంజాయితో ముగ్గురు యువకుల అరెస్ట్
సుభలయలో కార్డన్సెర్చ్
● జూన్ 4 కోసం అందరి ఎదురుచూపులు ● కాళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల లక్ష్మణరావు
వైభవంగా అశ్వవాహన సేవ
‘ప్రతి బోటుకు జీపీఎస్ తప్పనిసరి’
కౌంటింగ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి
మనదేపెత్తనం
తప్పక చదవండి
- రాష్ట్రీయ గీతం.. రెండు వెర్షన్లలో
- వారణాసిలో వార్ వన్ సైడే
- ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
- సన్న వడ్లపై సర్కార్ సన్నాయి నొక్కులు
- ‘పట్టభద్రులపై’ పట్టు కోసం!
- ఆక్వాలో అగ్రగామిగా ఏపీ
- మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
- ఇక సులభంగా సేంద్రీయ ధ్రువీకరణ
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
Advertisement