-
కంటతడిపెట్టిన టీడీపీ అభ్యర్థి అమీర్ బాబు
-
కడప నగర టీడీపీలో రచ్చ..రచ్చ
కడప అగ్రికల్చర్, న్యూస్లైన్: పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీలో ఉంటూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ తాము పాల్గొం టున్నామని, అటువంటి తమకు ఇప్పుడు స్థానం లేకుండా చేస్తున్నారని కడప తెలుగు మహిళ నగర అధ్యక్షురాలు చిప్పగిరి మీనాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి కడప నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయ ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించిన డివిజన్లకు సంబంధించిన టిక్కెట్లను పార్టీ మేయర్ అభ్యర్థి బాలకృష్ణయాదవ్, పార్టీ మైనార్టీ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు అమీర్బాబులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పార్టీ కోసం కష్టించే వారిని కాదని, వలస వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు పార్టీలోకి ఎర్రతివాచి పరిచి వారికి సీట్లు అమ్ముకునే సంస్కృతిని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. కడప నగరంలోని మున్సిపాలిటీలో దళితులకు వచ్చిన రిజర్వేషన్ సీట్లలో ముక్కూమొహం తెలియని వారికి టిక్కెట్లు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు పార్టీ నగర మహిళా ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి మాట్లాడుతూ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్నాయుడుతోపాటు మిగిలిన నాయకులు కూడా కార్యకర్తల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా టిక్కెట్లు ఎలా కేటాయిస్తారని విమర్శించారు. సీఎం రమేష్నాయుడుకు కడప నగరం గురించి తెలియదని, ఇందులో జోక్యం చేసుకోవద్దని చెబుతున్నామన్నారు. పుత్తా నరసింహారెడ్డికి కడప ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పార్టీ నాయకులు వచ్చి సమాధానం చెప్పేవరకు విశ్రమించేది లేదని తెలుగు మహిళలు ప్రతిజ్ఞ చేశారు. ఈ ఆందోళనలో నగర కార్యవర్గ నాయకులు దుర్గాప్రసాద్, ఓబులమ్మ తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement