-
అమ్మ మినరల్ వాటర్
సాక్షి, చెన్నై : అమ్మ మినరల్ వాటర్ క్యాన్ పథకానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. తొలి విడతగా చెన్నైలోని పేద కుటుంబాలకు రోజుకు 20 లీటర్ల చొప్పున శుద్ధీకరించిన నీటిని అందించనున్నారు. ఉచితంగా 20 లీటర్ల క్యాన్ల ద్వారా ఈ నీటిని పంపిణీ చేయడానికి నిర్ణయించారు. అయితే, ఎన్నికల నేపథ్యంలో ఈ పథకం అమల్లోకి వచ్చేనా అన్న ప్రశ్న బయలు దేరింది. రాష్ట్రంలో తాగు నీటి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే. కొన్ని జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మినహా తక్కిన పట్టణ, నగరాల్లో శుద్ధీకరించ బడ్డ వాటర్ క్యాన్ల మీద ప్రజలు ఆధార పడక తప్పడం లేదు. ఇక, రాజధాని నగరం చెన్నై , సబర్బన్లలో ప్రతి ఇంటా శుద్ధీకరించ బడ్డ నీటిని ఉపయోగించుకోవాల్సిందే. కొన్ని ఇళ్లల్లో వాటర్ ప్యూరిఫైలు ఉన్నా, మిగిలిన వాళ్లు వాటర్ క్యాన్లను కొనుగోలు చేస్తూ వస్తున్నారు. దీంతో నగర, శివారుల్లో కోకొల్లలుగా మినరల్ వాటర్ క్యాన్ల పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. 20 లీటర్ల క్యాన్ నీటిని రూ. ముప్పైకి పైగానే విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవలి కాలంగా అమ్మ నినాదంతో సరికొత్త పథకాలను ప్రవేశ పెడుతూ వస్తున్న ప్రభుత్వం, తాజాగా వాటర్ క్యాన్ల మీద దృష్టి పెట్టింది. అమ్మ పేరుతో ఇన్నాళ్లు అమల్లోకి వచ్చిన పథకాలన్నీ రాయితీతో, చౌక ధరతో కూడుకున్నది. అయితే, తాజాగా అమ్మ ఉచిత మీటర్ వాటర్ క్యాన్ల పథకం అమల్లోకి తెచ్చేందుకు ఆగమేఘాలపై అధికార వర్గాలు ఉరకలు తీస్తున్నాయి. ఇందుకు తగ్గ ఆదేశాలను శనివారం సీఎం జయలలిత అధికారులకు జారీ చేశారు. అయితే, ఎన్నికల నగారా తేదీ సమీపిస్తున్న సమయంలో పనులు త్వరితగతిన ముగిసేనా, ఈ పథకం ఏ మేరకు అమల్లోకి వస్తుందో అన్న ప్రశ్న సర్వత్రా బయలు దేరి ఉన్నది. ఇక, ఇది వరకే అమ్మ మినరల్ వాటర్ పేరిట లీటరు బాటిల్ రూ. పదికి విక్రయిస్తున్న విషయం తెలిసిందే. అమ్మ ఉచిత మినరల్ వాటర్: సీఎం జయలలిత జారీ చేసిన ఆదేశాల మేరకు అమ్మ మినరల్ వాటర్ పథకం ప్రకటనను సమాచార శాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో సురక్షిత మంచినీరు ప్రజలకు అందించడం లక్ష్యంగా తమ ప్రభుత్వం ఉమ్మడి తాగు నీటి పథకాలను రూ. 7324 కోట్లతో అమలు చేసి ఉన్నదని వివరించారు. అలాగే, మరో రూ. 6602 కోట్లతో మరికొన్ని పథకాల పనులు సాగుతున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం తాగునీటి అవసరాలను పరిగణలోకి తీసుకుని పేద , మధ్యతరగతి వర్గాలకు శుద్ధీకరించ బడ్డ నీటిని 20 లీటర్ల క్యాన్ల ద్వారా అందించేందుకు నిర్ణయించామని ప్రకటించారు. తొలి విడతగా చెన్నైలో ఈ పథకం అమల్లోకి తీసుకొచ్చేందుకు తగ్గ ఏర్పాట్లును వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించినట్టు పేర్కొన్నారు. చెన్నైలో ఎంపిక చేసిన వంద ప్రదేశాల్లో , గంటకు రెండు వేల లీటర్ల నీటి శుద్ధీకరణ లక్ష్యంగా ఒక్కో కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. స్మార్ట్ కార్డుల ద్వారా ఉచితంగా ఈ నీటి క్యాన్లను పొందేందుకు తగ్గ ఏర్పాట్లు వేగవంతం చేయనున్నామన్నారు. అర్హులైన వారికి స్మార్ట్ కార్డుల పంపిణీకి చర్యలు తీసుకోనున్నట్టు సూచించారు. ఒక్కో కుటుంబానికి రోజుకు 20 లీటర్ల వాటర్ క్యాన్ అందించనున్నట్టు పేర్కొన్నారు. అంతకు ముందుగా సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో వెనుకబడిన తరగతులు, మైనారిటీ విభాగం నేతృత్వంలో రూ. 66 కోట్లతో నిర్మించిన హాస్టళ్లను సీఎం జయలలిత వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించారు. -
అమ్మ... అమ్మ... అమ్మ... అమ్మ
అమ్మ అమ్మా మాయమ్మ అమ్మంటేనే నీవమ్మా.... అంటూ తమిళ తంబిలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధ్యక్షురాలు, పురచ్చితలైవి కుమారి జయలలితను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గత ఏడాది అత్యంత తక్కువ ధరకే ఇడ్లీ, సాంబారు అన్నం, పొంగల్ అంటూ ఆమె ప్రారంభించిన 'అమ్మ క్యాంటీన్' పథకం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో జయలలిత అదే బాటలో పయనిస్తూ...'అమ్మ కూరగాయల మార్కెట్', 'అమ్మ మినరల్ వాటర్' పథకాన్ని కూడా ప్రారంభించారు. ఆ పథకాలు తమిళనాట ప్రజలను మరింత దగ్గర చేసింది. దీంతో జయలలిత ఇప్పుడు అమ్మ మెడికల్ షాపులను ప్రారంభించారు. దాదాపు 15 ఏళ్ల నుంచి అమ్మ అని పిలిపించుకుంటున్న జయలలిత ఈ 'అమ్మ కాన్సెఫ్ట్'తో తమిళనాడు ప్రజల మనసులు 'చోరీ' చేసింది. అమ్మ కాంటీన్ ప్రారంభంతోనే జయలలిత అదృష్టం సునామీలా సుడి తిరిగింది. అందుకే తమిళనాట ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 39 లోక్సభ స్థానాలకు గాను 37 స్థానాలను కైవసం చేసుకుంది. తమిళనాడు రాష్ట్రం అవతరించిన తర్వాత ఒక పార్టీ ఇన్ని లోక్సభ స్థానాలను జయలలిత కైవసం ఇదే మొదటిసారి. అంత 'అమ్మ' చలవే అని పలువురు అభిప్రాయపడ్డుతున్నారు. అందుకే అమ్మకు తమిళ ప్రజలు ఓట్లు గుద్ది పారేశారు. దేశవ్యాప్తంగా మోడీ హావా నడుస్తున్నా... బీజేపీతో పాటు ఏఐఏడీఎంకే ప్రధాన ప్రత్యర్థి పార్టీ డీఎంకే సోదిలో లేకుండా పోయాయి. ఇప్పుడు ఇంకే అమ్మ పథకం వస్తుందో అని తమిళ నాట ప్రజలు అతృతతో ఎదురు చుస్తున్నారు. అమ్మ ఇలా 'అమ్మ' కాన్సెఫ్ట్తో ముందుకు దూసుకుపోతే వచ్చే రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో ఏఐఏడీఏంకే విజయ ఢంకా మోగించడం ఖాయమని తమిళనాట తీవ్రంగా చర్చ జరుగుతుంది. -
నిన్న అమ్మ క్యాంటిన్.. నేడు అమ్మ మినరల్ వాటర్!
చెన్నై తమిళనాడు ముఖ్యమంత్రి జే జయలలిత 'అమ్మ మినరల్ వాటర్' పేరుతో మరో కొత్త పథకాన్ని చెన్నైలో ప్రారంభించారు. ఇటీవల జయలలిత 'అమ్మ క్యాంటిన్' ప్రారంభించిన సంగతి తెలిసిందే. అమ్మ మినరల్ వాటర్ పథకం ద్వారా ప్రజలకు 10 రూపాయలకే లీటర్ మంచినీటిని అందించనున్నారు. గుమ్మడిపొండి వద్ద ట్రాన్స్ పోర్ట్ డిపార్డ్ మెంట్ ఏర్పాటు చేసిన మూడు లక్షలు లీటర్ల కెపాసిటి గద వాటర్ ప్లాంట్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమిళనాట కొత్త పథకాన్ని ఆరంభించారు. తొలి మినరల్ బాటిల్ ను రవాణా శాఖ మంత్రి వీ సెంథీల్ బాలాజీ వద్ద జయలలిత కొనుగోలు చేశారు. అమ్మ క్యాంటిన్ పథకం కోసం ఏర్పాటు చేసిన సహకార దుకాణాల్లో కూరగాయలు, బియ్యంతోపాటు మినరల్ వాటర్ ను కూడా అందించేందుకు జయలలిత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమ్మ మినరల్ వాటర్ ను బస్ స్టేషన్లతోపాటు దూర ప్రాంతాలకు ప్రయాణించే బస్సుల్లో కూడా విక్రయిస్తామన్నారు. అమ్మ క్యాంటిన్ లో ఇడ్లీ ఒక్క రూపాయి, పొంగల్, సాంబార్, లెమన్ రైస్ ఐదు రూపాయలకు, పెరుగు అన్నం 3 రూపాయలకు అందిస్తున్న సంగతి తెలిసిందే.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
- మాటలతో మూటలు
- అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి: హరీశ్రావు
- ప్రపంచంతో పోటీపడేలా కొత్త పారిశ్రామిక పాలసీలు
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
Advertisement