-
‘అమ్మానాన్న ఊరెళితే’ మూవీ ఐటమ్ సాంగ్ స్టిల్స్
-
ఇలాంటి పాత్ర చేయడం ఇదే ప్రథమం : సోనీ అగర్వాల్
‘‘టైటిల్కి తగ్గట్టే పూర్తి వినోదాత్మకంగా ఉంటుందీ సినిమా. యువతరమే లక్ష్యంగా చేసిన ఈ చిత్రంలో సోనీ అగర్వాల్ ఓ ప్రత్యేక పాటతో పాటు, కథను మలుపు తిప్పే ఓ సన్నివేశంలో పాల్గొన్నారు. ఆమె పాత్ర సినిమాకే హైలైట్. సెన్సార్ పూర్తయింది. ఈ నెలాఖరులో సినిమాను విడుదల చేస్తాం’’ అని అంజి శ్రీను చెప్పారు. ఆయన దర్శకత్వంలో సిద్దార్థ్వర్మ, విజయ్, మధు, తేజ, సాయిభవానీరాజు, మహి, శిల్పశ్వి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘అమ్మానాన్న ఊరెళితే’. ‘7/జి బృందావన కాలనీ’ ఫేం సోనీ అగర్వాల్ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ చిత్రానికి వీరవెంకట దుర్గాప్రసాద్ అనగాని, నాగమణి అనగాని నిర్మాతలు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోనీ అగర్వాల్ మాట్లాడుతూ -‘‘చాలా భిన్నమైన కథాంశంతో రూపొందిన సినిమా ఇది. ఇందులో నేను చేసిన ఐటమ్సాంగ్ చాలా కొత్తగా ఉంటుంది. ఇలాంటి పాత్ర చేయడం ఇదే ప్రథమం. మంచి టీమ్తో కలిసి పనిచేసినందుకు హ్యాపీ’’ అన్నారు. యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. -
‘అమ్మ నాన్న ఊరెళితే’ మూవీ ప్రస్ మీట్
-
‘అమ్మానాన్న ఊరెళితే’ స్టిల్స్
-
యువతే లక్ష్యంగా...
సిద్దార్థ్వర్మ, విజయ్, మధు, తేజ, సాయిభవానీరాజు, మహి, శిల్పశ్వి ప్రధాన పాత్రధారులుగా, రూపొందిన చిత్రం ‘అమ్మానాన్న ఊరెళితే’. ‘7/జి బృందావన కాలనీ’ ఫేం సోనియా అగర్వాల్ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ చిత్రానికి అంజి శ్రీను దర్శకుడు. వీరవెంకట దుర్గాప్రసాద్ అనగాని, నాగమణి అనగాని నిర్మాతలు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ- ‘‘యువతను లక్ష్యంగా చేసుకొని కుటుంబ ప్రేక్షకులు మెచ్చే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. పనిచేసిన అందరూ చక్కగా సహకరించారు. వచ్చే నెల రెండోవారంలో కానీ, మూడో వారంలో కానీ సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. యువతకు కావాల్సిన సందేశంతో ఈ చిత్రం రూపొందిందని సహ నిర్మాత సత్యనారాయణ అన్నారు. ఇంకా యూనిట్ సభ్యులు మాట్లాడారు. -
యువత తప్పు దోవ పడితే..!
యువత భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న ప్రధాన అంశాలను ఇతివృత్తంగా తీసుకుని జక్కుల నాగేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘అమ్మా నాన్న ఊరెళితే..?’. అంజి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్దార్ధ్వర్మ, విజయ్, మధు, తేజ, శిల్పాస్విత ముఖ్య తారలు. ఓ ప్రత్యేక పాటను సోనియా అగర్వాల్ చేశారు. ఈ పాట సినిమాకి హైలైట్గా నిలుస్తుందని దర్శకుడు తెలిపారు. వచ్చే నెల 5న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘యువత తప్పుదోవ పట్టడానికి చాలా కారణాలున్నాయి. కానీ, ఒక్క సినిమాలో అన్నింటినీ చెప్పలేం. అందుకే ప్రధాన అంశాలను తీసుకుని ఈ సినిమా చేశాం. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ఇది. అత్యధిక థియేటర్లలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: సలామ్, అశోక్, నిర్మాణ సారథ్యం: గాజుల ఖాదర్ భాషా. -
అమ్మా నాన్న ఊరెళితే?
ఈ రోజుల్లో యువత అభివృద్ధి చెందడానికి ఎన్ని మార్గాలున్నాయో, అథోగతి పాలవ్వడానికి అన్ని మార్గాలున్నాయి. యువత భవితపై అధిక ప్రభావం చూపిస్తున్న కొన్ని అంశాలను నేపథ్యంగా తీసుకుని ఈ సినిమా చేశామంటున్నారు దర్శకుడు అంజి శ్రీను. సుజాత ఆర్ట్స్ పతాకంపై జక్కుల నాగేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘అమ్మా నాన్న ఊరెళితే..?’. ‘7/జి బృందావనకాలనీ’ ఫేమ్ సోనియా అగర్వాల్ ఇందులో ప్రత్యేక పాత్ర చేయడం విశేషం. నిర్మాత మాట్లాడుతూ -‘‘యువతకు నచ్చే కథాంశమిది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని ఏకకాలంలో విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: కె.వి.రాజు, పాటలు: పోతుల రవికిరణ్, శ్రీరాం తపస్వీ, సంగీతం: మున్నాకాశి, ఖాదర్, సహనిర్మాతలు: సలామ్, అశోక్.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
లోక్సభ ఎలక్షన్స్.. నామినేషన్ దాఖలు చేసిన మిసా భారతి
అన్న రెండోసారి సీఎం గ్యారంటీ
ప్రముఖ కమెడియన్ మంచి మనసు.. ఏకంగా లక్షల సాయం
పోలింగ్ ఏజెంట్ పై టీడీపీ మూకల దాడి
ఓటు హక్కు వినియోగించుకున్న టాలీవుడ్ ప్రముఖులు
మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
చాబహర్ పోర్ట్ నిర్వహణకు ఒప్పందం
Election 2024 Voters Selfie Photos: మన ఓటే మన భవిత.. కదలండి (ఫొటోలు)
ప్రశాంతంగా ఓటు వెయ్యండి మంచి చేసే వారికే ఓటు వెయ్యండి
బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement