-
ఈ ఓడ ఏ ఇంధనంతో నడుస్తుందో తెలుసా? పర్యావరణానికి ఎంతో మేలు!
ఎరువుగా ఉపయోగించే అమోనియాను వాహనాలకు ఇంధనంగా ఉపయోగించే పద్ధతి మొదలైంది. అమెరికాలోని బ్రూక్లిన్కు చెందిన ‘అమోగీ’ సంస్థ ఇదివరకే అమోనియాతో నడిచే ట్రక్కు, ట్రాక్టర్లను విజయవంతంగా రూపొందించింది. ఇటీవల అమోనియా ఇంధనంగా నడిచే ఓడను కూడా ఈ సంస్థ రూపొందించింది. ఇదీ చదవండి: ఈ స్మార్ట్ వాచ్ సూపర్! 12 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఇంకా మరెన్నో కళ్లుచెదిరే ఫీచర్లు! నార్వేకు చెందిన ‘యారా క్లీన్ అమోనియా’ సంస్థ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న ‘గ్రీన్ అమోనియా’ను వాడుకుని నడిచే వాహనాలను ‘అమోగీ’ సంస్థ తయారు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల పూర్తిగా అమోనియానే ఇంధనంగా ఉపయోగించుకుని ప్రయాణించే ఓడను రూపొందించింది. అమోనియాను ఇంధనంగా ఉపయోగించుకోవడం వల్ల పర్యావరణంలోకి కర్బన ఉద్గారాల విడుదల పూర్తిగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విద్యుత్ వాహనాల వినియోగానికి తగిన వెసులుబాటు లేని ప్రాంతాల్లో అమోనియాతో నడిచే వాహనాలు అద్భుతంగా ఉపయోగపడతాయని వారు చెబుతున్నారు. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
కుప్పకూలిన అమ్మోనియం ప్లాంట్
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఎరువుల కర్మాగారంలో నిర్మాణంలో ఉన్న అమ్మోనియా ప్లాంట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ప్లాంట్ వద్ద ఉన్న 8 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు శిథిలాల కింద ఇంకా కార్మికులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇంటిప్స్
దుమ్ముకొట్టుకుపోయిన ఉడెన్ ఫర్నీచర్ను శుభ్రపరచాలంటే అమ్మోనియా ద్రావకం కలిపిన నీటిని మెత్తని క్లాత్తో అద్దుకొని, తుడవాలి. నాన్జెల్ టూత్పేస్ట్, బేకింగ్ సొడా రాసి తడి క్లాత్తో రబ్ చేస్తే ఉడెన్ ఫర్నీచర్ పై మరకలు తొలగిపోతాయి. మరకలపై వంట నూనె, ఉప్పు రాసి పదిహేను నిమిషాల తర్వాత మెత్తని క్లాత్తో రబ్ చేసినా ఫర్నీచర్ పాలిష్చేసినట్టు కొత్తగా మెరుస్తుంది. ఒక చిన్న గిన్నెలో కాఫీ పొడిని వేసి టేబుల్, అల్మారా సొరుగులు, కబోర్డ్స్ లోపల ఒక రాత్రంతా ఉంచితే, దుర్వాసన తగ్గుతుంది.యాంటిక్ ఫర్నీచర్ మీద మరకలు, దుమ్ము పోవాలంటే ముందుగా హెయిర్ డ్రయ్యర్ని ఉపయోగించాలి. డస్ట్ అంతా పోయిన తర్వాత నాన్జెల్ టూత్పేస్ట్ను రాసి, తడి క్లాత్తో తుడవాలి. -
రామగుండం యూరియా ప్లాంటుకు పూర్వవైభవం
న్యూఢిల్లీ: యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే చర్యలను కేంద్రం చేపట్టింది. మూతపడిన ప్రభుత్వ రంగ యూరియా కర్మాగారాల పునరుద్ధరణకు పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించింది. రామగుండం, తాల్చేర్లలో మూతపడిన యూరియా ప్లాంట్లను రూ.10 వేల కోట్ల పెట్టుబడితో పునరుద్ధరించే ప్రతిపాదనలను గత వందరోజుల్లో ఆమోదించామని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ గురువారం మీడియాకు తెలిపారు. సింద్రిలోని మరో మూతపడిన ప్లాంటు పునరుద్ధరణ యత్నాలు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. అస్సాంలోని బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ (బీవీఎఫ్సీఎల్) ప్రాంగణంలో యూరియా - అమోనియా ప్లాంటును కొత్తగా నిర్మించే యత్నాల్లో ఉన్నట్లు వివరించారు. ఇంత భారీ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్లు చేయడం గత దశాబ్దంలో ఇదే ప్రథమమని అన్నారు. గత పదేళ్లలో దేశంలో ఒక్క ఎరువుల ప్లాంటును కూడా నిర్మించలేదని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ కలలను సాకారం చేసేందుకు జగదీశ్పూర్-హల్దియా గ్యాస్ పైప్లైన్ నిర్మాణంపై పెట్రోలియం మంత్రితో ఇప్పటికే రెండుసార్లు చర్చించానని అనంత్కుమార్ వెల్లడించారు. -
టపాసుల మోతతో పెరిగిన వాయు కాలుష్యం
సాక్షి, సిటీబ్యూరో : దీపావళి మతాబులు నగర పర్యావరణానికి పొగబెట్టాయి. పీల్చే గాలిలో అసలు ఉండకూడని అమ్మోనియా మోతాదు శ్రుతి మించింది. నగరంలోని ప్రతి క్యూబిక్ మీటరు గాలిలో 200 మైక్రోగ్రాములు దాటకూడని కాలుష్య కారక ధూళికణాలూ అనూహ్యంగా పెరిగాయి. ఫలితంగా నగరవాసుల్లో శ్వాసకోశ భాగాలన్నింటినీ అమ్మోనియా ఇబ్బందులు కలిగించింది. శ్వాసకోశాలను ఉక్కిరి బిక్కిరి చేసింది. సిటీజన్ల కళ్లను తీవ్రంగా మండించింది. పలు శ్వాసకోశ వ్యాధులకు కారణమైంది. కాగా క్యూబిక్ మీటరు గాలిలో 5 మైక్రోగ్రాములు దాటకూడని అమ్మోనియా అత్యధికంగా జూపార్క్లో 175, ఉప్పల్లో 120, జీడిమెట్లలో 101 మైక్రోగ్రాములుగా నమోదవడం కలకలం సృష్టిస్తోంది. మరోవైపు పలు ప్రాంతాల్లోని పీల్చే గాలిలో ధూళికణాలు (పీఎం10), సూక్ష్మ ధూళి రేణువులు (టీఎస్పీఎం) మోతాదు కూడా పరిమితి మించి పెరిగింది. వీటితోపాటు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి మూలకాల మోతాదు కూడా భారీగా పెరగడంతో ముక్కుపుటాలు అదిరిపోయాయి. సిటీజన్ల కళ్లు, ఊపిరితిత్తులు, శ్వాసకోశాలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. అబిడ్స్, పంజగుట్ట, కేబీఆర్పార్క్, చిక్కడపల్లి, కూకట్పల్లి, లంగర్హౌస్, మాదాపూర్, ఎంజీబీఎస్, నాచారం, రాజేంద్రనగర్, సైనిక్పురి, శామీర్పేట్, ప్యారడైజ్, చార్మినార్, జూపార్క్, బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, జీడిమెట్ల.. తదితర ప్రాంతాల్లో వాయు కాలుష్య తీవ్రత అత్యధికంగా నమోదైనట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి లెక్కతేల్చింది. ఆయా ప్రాంతాల్లో దీపావళికి ముందు, పండుగ రోజు వాయు కాలుష్యాన్ని లెక్కించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాలను మించి వాయు కాలుష్యం నమోదు కావడం పట్ల పర్యావరణ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా వాయుకాలుష్యం గతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరగడం గమనార్హం. అమ్మోనియా మోతాదు మించిన వివిధ ప్రాంతాలివీ... (క్యూబిక్ మీటరు గాలికి మైక్రోగ్రాముల్లో..) ప్రాంతం అమ్మోనియా మోతాదు ప్యారడైజ్ 71 చార్మినార్ 74 జూపార్క్ 175 బాలానగర్ 84 ఉప్పల్ 120 జూబ్లీహిల్స్ 64 జీడిమెట్ల 101
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement