-
అనీ బిసెంట్ భారత్ ఎందుకు వచ్చారు?
బ్రిటీష్ సోషలిస్ట్, థైసోఫిస్ట్, మహిళా హక్కుల న్యాయవాది, హోమ్ రూల్ కార్యకర్త, భారతీయ జాతీయవాద ప్రచారకురాలు అనీ బిసెంట్ ప్రపంచంలో అనేక విధాలుగా గుర్తింపు పొందారు. ఐరిష్ మహిళ అయినప్పటికీ ఆమె జీవితంలో అనేక సైద్ధాంతిక మార్పులు వచ్చాయి. మొదట్లో క్రైస్తవ మతంలోని కొందరి చెడులను బహిర్గతం చేశారు. తరువాత ఆమె భారతదేశపు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితురాలయ్యారు. అనీ బిసెంట్ 1847 అక్టోబర్ 1న లండన్లో జన్మించారు. తండ్రి వైద్యుడైనప్పటికీ ఆయనకు గణితం, తత్వశాస్త్రంపై ఆసక్తి ఎక్కువ. ఆమె తల్లి ఐరిష్ కాథలిక్ మహిళ. ఆమె ఐదేళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది. చిన్నతనంలోనే ఫ్రాన్స్, జర్మనీ వెళ్లే అవకాశాన్ని దక్కించుకుంది. ఆమె 17 సంవత్సరాల వయస్సులో తన తల్లి వద్దకు తిరిగి వచ్చింది. 20 ఏళ్ల వయసులో రెవరెండ్ ఫ్రాంక్ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. అయితే అతనితో సైద్ధాంతిక విభేదాల కారణంగా వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగలేదు. ఇద్దరు పిల్లలు పుట్టాక 26 ఏళ్లకే భర్తకు విడాకులు ఇచ్చి, రచనా వ్యాసంగాన్ని చేపట్టారు. 1989లో ఆమె థియోసఫీ భావజాలం వైపు మొగ్గు చూపారు. మార్క్సిజం నుండి ఆస్తికవాదం వైపు మళ్లారు. థియోసాఫికల్ సొసైటీలో సభ్యురాలిగా చేరి, ప్రపంచమంతటా థియోసాఫీని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ సమయంలో ఆమెకు భారతదేశానికి వెళ్లాలనే కోరిక కలిగింది. 1893లో భారతదేశానికి వచ్చిన ఆమె చెన్నైలో థియోసాఫికల్ సొసైటీ ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పారు. దీనిని థియోసాఫికల్ సొసైటీ అడయార్ అని పిలుస్తారు. ఇది కూడా చదవండి: 375 ఏళ్లకు బయటపడిన 8 వ ఖండం ఏది? -
1893లో భారతదేశమే నా ఇల్లు అన్న విదేశి మహిళ
‘‘నేను 1893లో భారతదేశానికి వచ్చాను. అప్పటి నుంచి ఇదే నా ఇల్లు. ఇక్కడ నేను గడిపిన జీవితమంతా ఈ పురాతన దేశం పూర్వకాలంలో అనుభవించిన స్వాతంత్య్రాన్ని తిరిగి సాధించి పెట్టడానికే పాటుపడ్డాను.’’ అన్నారామె. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి మహిళ ఎవరో గుర్తుందా? ఆమె ఒక బ్రిటిష్ వనిత. దేశ చరిత్రలో కీలకమైన సమయంలో1917 నాటి కలకత్తా సమావేశాలకి ఆమె అధ్యక్షత వహించారు. (కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ సరోజినీ నాయుడు). ఆమె పేరు అనిబీసెంట్. ఐరిష్ మూలాలు ఉన్న ఈ బ్రిటిష్ వనిత భారతదేశానికీ, స్వాతంత్య్రోద్యమానికీ, సమాజానికీ చేసిన సేవ చిరస్మరణీమయమైనది. స్వాతంత్య్రోద్యమ కాలంలో బాలగంగాధర తిలక్, లజపతిరాయ్, మహమ్మదలీ జిన్నా, గాంధీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, సరోజినీనాయుడులకు ఉన్నంత ఖ్యాతి, ఆకర్షణ అనిబీసెంట్కు కూడా ఉండేవి. ఆనాడు కాంగ్రెస్ సభ్యత్వం కంటే, అనిబీసెంట్ స్థాపించిన హోంరూల్ లీగ్కు ఎక్కువ సభ్యత్వం ఉండేది. ఎందరో మహామహులు ఆమె నాయకత్వంలో పనిచేశారు. అనిబీసెంట్ ఒక విప్లవ వనిత. పేదరికంలో పుట్టి పెరిగారు. ఐదో ఏటనే తండ్రి మరణించారు. ఆడబిడ్డను పెంచలేక ఆమె తల్లి తనకు తెలిసిన వారికి ఇచ్చి పోషణ ఏర్పాటు చేసింది. అలాంటి వాతావరణంలో ఉన్నా, ఆమె తనదైన ఆలోచనా విధానాన్ని నిర్మించుకున్నారు. మత విశ్వాసాల గురించి పల్లెత్తు మాట అన్నా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్న కాలంలో ఆమె తన క్రైస్తవ మత విశ్వాసాలను, మతాధికారుల పాత్రను ప్రశ్నించారు. పైగా ఆమె భర్త క్రైస్తవ పురోహిత వర్గానికి (ఆంగ్లికన్ చర్చి) చెందినవారు. అనిబీసెంట్ (అక్టోబర్ 1,1847–సెప్టెంబర్ 20, 1933)ను ప్రపంచంలో విశిష్ట మహిళగా చరిత్రకారులు గౌరవిస్తారు. బ్రిటిష్ జాతిలో రాజకీయ సంస్కరణల కోసం, స్త్రీల హక్కుల కోసం ఆమె పోరాడారు. ఐర్లాండ్కు మాత్రమే కాదు, భారతదేశానికి కూడా స్వయం పాలన అవసరమేనని ఇంగ్లండ్ పాలన మీద చట్టబద్ధమైన ఉద్యమం నడిపారామె. లౌకికవాదం, కార్మికుల హక్కులు, మహిళల హక్కులు, కుటుంబ నియంత్రణ, నిరుద్యోగం ఇవన్నీ కూడా ఆమె చేసిన పోరాటాలలో భాగాలుగా కనిపిస్తాయి. దీనికి తోడు ఆమె మంచి రచయిత్రి. మంచి రచయితలు మంచి వక్తలు కారన్న అపప్రథను వమ్ము చేస్తూ గొప్ప వక్తగా కూడా పేరెన్నికగన్నారు. ఆమె కుటుంబ నియంత్రణ మీద ఉద్యమం ప్రారంభించి, ఫేబియన్ సోషలిస్టుగా పనిచేసి, చివరికి దివ్యజ్ఞాన సమాజం దిశగా ప్రయాణించారు. దివ్య జ్ఞాన సమాజం గురించి ప్రపంచమంతటా తిరిగి ప్రచారం చేసే క్రమంలోనే ఆమె 1893లో భారత్ వచ్చారు. ఇక్కడి స్వాతంత్య్రోద్యమం పట్ల సానుభూతి పెంచుకుని, పోరాటంలో పాల్గొన్నారు. ఇక్కడి ప్రజల కష్టాలను తన కష్టాలుగా భరించారు. కడ ఊపిరిని ఈ గడ్డ మీదే విడిచిపెట్టారు. ఆమె అసలు పేరు అనీ ఉడ్. లండన్లోని క్లాఫామ్లో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు. తండ్రి ఐదో ఏటనే మరణించారు. ఆపై తల్లి ఒక భోజనశాల ఏర్పాటు చేసి జీవనం సాగించారు. కూతురుని సరిగా పెంచలేక ఇలాన్ మేరియట్ అనే తన స్నేహితురాలికి అప్పగించారామె. మేరియట్ పెంపకం నిజంగానే అనిబీసెంట్కు వరమైంది. మంచి విద్య చెప్పించారామె. ఐరోపా అంతా చూపించారు. అప్పుడే అనిబీసెంట్ భవిష్యత్తుకు సంబంధించిన చిత్రం రూపుదిద్దుకుంది కూడా. 19వ ఏట అనిబీసెంట్ ఫ్రాంక్ బీసెంట్ అనే ఒక చర్చి మత గురువును పెళ్లి చేసుకుంది. కానీ వివాహం తరువాత పాత ఆలోచనలకు తోడు రాజకీయాల మీదకు ఆమె దృష్టి మళ్లింది. అందులోను ఐరిష్ రాడికల్స్తో ఆమె పని చేయడం ఆరంభించింది. ఇంకా ఆమెలోని రచయిత్రిని కూడా ఆ ఆలోచనలు తట్టి లేపాయి. కథలు, వ్యాసాలు రాయడం ఆరంభించారు. ఇద్దరు పిల్లలకు తల్లయింది. వారు– మాబెల్ బిసెంట్ స్కాట్, ఆర్ధర్ డిగ్బి బిసెంట్. కానీ కుటుంబ నియంత్రణ గురించి ఆమె పుస్తకం రాయడంతో తీవ్రంగా ఆగ్రహించిన భర్త పిల్లలు ఆమె వద్ద పెరగడం సరికాదన్న వాదన తీసుకువచ్చి, విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. అలా వారిద్దరు 1873లో వేరైపోయారు. నిజానికి ఆంగ్లికన్ చర్చికి సంబంధించిన భర్త ఆలోచనలను, అసలు ఆ మత సిద్ధాంతాలను కూడా అనిబీసెంట్ ప్రశ్నించడం మొదలుపెట్టినప్పటి నుంచే ఆ కాపురం బీటలు వారడం మొదలయింది. కాయకష్టం చేసుకునే కుటుంబాల వారు ఎక్కువ మంది పిల్లలను కనడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని అనిబీసెంట్ వాదించారు. పరిమిత కుటుంబంతోనే అలాంటి కుటుంబాలు ఆనందంగా జీవిస్తాయని కూడా ఆమె సూచించారు. నిజానికి ఈ అంశంతో రాసిన పుస్తకంతో రచయిత్రిగా అనిబీసెంట్ పేరు ఇంగ్లండ్లో ప్రతి ఇంటిలోను మారుమోగింది. కానీ ఈ పుస్తకం మీద చర్చి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్త నుంచి విడిపోయాక చర్చి మీద విమర్శను తన వ్యాసాల ద్వారా మరింత ఉధృతం చేశారామె. మత ప్రమేయం లేని రాజ్యాన్ని ఆమె ఆకాంక్షించారు. కానీ ఆమె భర్తకు విడాకులు మాత్రం ఇవ్వలేదు. చివరికంటా శ్రీమతి బిసెంట్గానే ఆమె ఉండిపోయింది. అనిబీసెంట్ రాజకీయ చింతన సోషలిస్టు సంస్థల సాహచర్యంతో విస్తరించింది. కార్మికోద్యమంలో పనిచేసినప్పుడు కొద్దికాలం మార్క్స్ భావాలను కూడా విశ్వసించారు. ఐరిష్ హోమ్ రూలర్స్తో ఏర్పడిన అనుబంధం ఆ చింతనకు మరింత పదును తెచ్చింది. ఈ ప్రభావాలతోనే ఐర్లండ్ రైతుల కష్టాలను ఏకరువు పెడుతూ, అక్కడి భూస్వాములను ఆమె విమర్శించేవారు. అప్పట్లోనే ‘బ్లడీ సండే’ ఉదంతం జరిగింది. అందుకు ఆమె ప్రత్యక్ష సాక్షి. నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా ఇంగ్లండ్ యువతరం ట్రఫాల్గర్ కూడలి దగ్గర నిరసన ప్రదర్శన చేశారు. 1887లో జరిగిన ఈ ప్రదర్శన సందర్భంగా జరిగిన హింసలో పదుల సంఖ్యలో యువకులు చనిపోయారు. వందలాది మందిని అరెస్టు చేశారు. తరువాత హఠాత్తుగా ఆమె పూర్తిగా ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లారు. 1889లో దివ్యజ్ఞాన సమాజంలో సభ్యురాలిగా చేరారు. ఆ సంస్థను భారత్లో విస్తరించేందుకే ఆమె 1893లో వచ్చారు. ఇది ఆమె జీవితంలో మరో మలుపు. దేశ ప్రజల మధ్య ఐక్యత లేకుండా స్వాతంత్య్రం సాధ్యం కాదనేది ఆమె గ్రహించిన గొప్ప వాస్తవం. ఉద్యమంలో మమేకం కావడం ఆరంభించిన తరువాత ఒక గొప్ప విషయాన్ని ఆమె ఆంగ్లేయుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు కూడా. భారత్ స్వయం పాలన కోరుతోంది. వాళ్లకి కావలసింది మీ పాలనలో అలంకారప్రాయంగా ఉండే పదవులు కాదు. మీ పాలనాయంత్రాంగంలో మిగిలిపోవడం అంతకంటే కాదు అని ఆమె తెగేసి చెప్పారు. భారతదేశంలో బ్రిటిష్ పాలనను అదుపులో పెట్టాలంటే హిందువులు, ముస్లింల మధ్య ఐక్యత కూడా అవసరమని ఆమె వాస్తవంగానే భావించారు. అలాంటి ఐక్య వాతావరణం మొదటిసారి 1916లో కనిపించింది. ఆ సంవత్సరంలో లక్నోలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం– హిందూ ముస్లిం ఐక్యతకు తొలిసారిగా జరిగిన నిజమైన ప్రయత్నం వల్లనే. అప్పుడు ఎంఏ జిన్నా ముస్లింలీగ్ అధ్యక్షులు. లీగ్, కాంగ్రెస్ కలసి పనిచేసే విధంగా జిన్నా ఒక ఒప్పందాన్ని చేయించారు. ఆ చెలిమిని కొనసాగించడానికి రెండు మూడు సంవత్సరాలు జాతీయ నాయకులంతా విశేషంగా పాటు పడ్డారు. అలాంటి సందర్భంలోనే 1917లో, కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశాలకు అనిబీసెంట్ను అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. భారతదేశంలో ఆమె మూడు ప్రధాన పాత్రలు నిర్వహించారు. ఒకటి జాతీయ కాంగ్రెస్తో కలసి పనిచేయడం. రెండు దివ్యజ్ఞాన సమాజం అండగా ఆధ్యాత్మిక, ధార్మిక కార్యకర్త. మూడు విద్యా వ్యాప్తి. కాంగ్రెస్తో పనిచేసినప్పుడు భారతీయులలో రాజకీయ చైతన్యానికి సంబంధించిన కోణం ఏ విధంగా ఉండాలో ఆలోచించారామె. పాలనలో భారతీయులకు పరిమిత ప్రమేయమా? లేక స్వయం పాలనా? వీటిలో ఆమె స్వయంపాలన వైపు మొగ్గు చూపారు. కానీ ఆమె సమకాలీనులైన మితవాద కాంగ్రెస్ నాయకులు భారతీయులకు కొన్ని హక్కుల దక్కితే చాలునన్న ఆలోచనకే పరిమితమయ్యారు. అది కూడా చట్టబద్ధమైన రీతిలో విన్నపాలు, వినతులతో సాధించుకోవాలన్నదే మితవాదుల దృక్పథం. వీరిని పూర్తిగా వ్యతిరేకించినవారు అతివాదులు. తిలక్ అందులో ముఖ్యుడు. ఒకదశలో అనిబీసెంట్ తిలక్తో కలసి హోంరూల్ లీగ్ ఉద్యమాన్ని నడిపారు. దీనికే ఆమెను మద్రాస్లో ఇంటర్న్మెంట్కు గురి చేశారు. ఆమెకు స్వేచ్ఛ కల్పించడం కోసం మొత్తం భారతదేశమే బ్రిటిష్ ప్రభుత్వం మీద ఉద్యమం సాగించింది. ఆ క్రమంలో హోంరూల్ లీగ్లోకి వచ్చిన వారే మోతీలాల్, చిత్తరంజన్దాస్, జిన్నా తదితరులు. తరువాత గాంధీజీ ఈ సంస్థను కాంగ్రెస్తో కలసి పనిచేసే విధంగా ఒప్పించారు. దివ్యజ్ఞాన సమాజం భారతీయ సమాజం మీద వేసిన ముద్ర అసాధారణమైనది. దాదాపు మూడున్నర దశాబ్దాల కాలం అనిబీసెంట్ దివ్యజ్ఞాన సమాజం అధ్యక్ష హోదాలో కొనసాగారు. పలు చోట్ల ఆ సంస్థ పాఠశాలలను నిర్వహించేది. మద్రాస్లో సెంట్రల్ హిందూ స్కూల్, నేషనల్ హైస్కూల్, వసంత మహిళా కళాశాల ఆమె స్థాపించినవే. అలాగే వైద్యశాలలను కూడా ఏర్పాటు చేసేది. దివ్యజ్ఞాన సమాజం తరఫున ఒక విశ్వ గురువును ప్రతిష్టించేందుకు కూడా ఆమె ప్రయత్నించారు. అప్పటికి ఆమె హిందూ మతాన్ని స్వీకరించారు. జిడ్డు కృష్ణమూర్తిగారిని ఆ విశ్వగురువు పీఠం మీద అధిష్టింపచేయాలన్నది ఆమె ఆకాంక్ష. కానీ అందుకు ఆయన నిరాకరించడం విశేషం. భారతదేశంలో ఇప్పటికీ ప్రతిష్టాత్మకంగా భావించే కాశీ విశ్వవిద్యాలయం స్థాపనలో మదన్ మోహన మాలవీయకు అని బీసెంట్ పూర్తి సహాయ సహకారాలు అందించారు. తరువాత బీహెచ్యూ ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది కూడా. 1933లో అనిబీసెంట్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మద్రాస్ నగరంలోని అడయార్లోనే దివ్యజ్ఞాన సమాజం ఆశ్రమంలోనే తుది శ్వాస విడిచారు. అక్కడే ఆమె పార్ధివదేహాన్ని పూడ్చి పెట్టారు. అడియార్ నది ఒడ్డున ఉండే దివ్యజ్ఞాన ఆశ్రమంలో మర్రిచెట్టు ఒక అద్భుతం. విస్తీర్ణంలో దీనికి ప్రపంచ ఖ్యాతి ఉంది. ఈ చెట్టు కిందే అని బీసెంట్ ఎందరినో సమావేశ పరిచింది. ఆ చెట్టు నీడన ఆమె ఏర్పాటు చేసిన తేనీటి విందులకు రాజకీయవేత్తలు, కవులు, కళాకారులు, స్త్రీజనోద్ధారకులు, సంస్కర్తలు హాజరయ్యేవారు. నిజం చెప్పాలంటే ఆ మహా మర్రి వలెనే అనిబీసెంట్ కీర్తి కూడా భారతీయ సాంస్కృతిక జీవనంలో, రాజకీయ ఉద్యమాలలో పరుచుకుని ఉంది. ∙డా. గోపరాజు నారాయణరావు అనిబీసెంట్ -
భరతమాత దత్తపుత్రిక
సామ్యవాదం అనేది ఓ గొప్ప ఆదర్శనీయ సిద్ధాంతం. మనుషులు స్వార్థపరులైన చోట దాన్ని సాధించడం, ఆచరించటం అసాధ్యం. - అనిబిసెంట్ అనిబిసెంట్... సామ్యవాది, మహిళా హక్కుల ఉద్యమవాది, రచయిత, దివ్యజ్ఞాన సమాజ నేత., హోంరూల్ ఉద్యమకారిణి... అన్నింటినీ మించి భారతదేశ స్వాతంత్య్రానికి పోరాడిన బ్రిటిష్ వనిత. బానిసలుగా నలుగుతున్న భారతీయులకు విముక్తి కలిగించాలని కంకణం కట్టుకున్న అనిబిసెంట్... భిన్న సంస్కృతులకు నిలయమైన భారతా వనిలో స్థిరపడాలని నిర్ణయించుకోవడమే కాదు... తుది శ్వాస వరకు భారత దేశంలోనే ఉన్నారు. లండన్లో ఓ మధ్య తర గతి కుటుంబంలో అనీ వుడ్ 1847 అక్టోబర్ 1న జన్మించారు. తల్లి ఎమ్లీ మోరీస్, తండ్రి విలియం వుడ్. ఆమె ఐదు సంవత్సరాల వయస్సులో తండ్రిని కోల్పోయింది. అప్పటినుంచి తల్లి ఎమిలీ మోరిస్ ‘హారో స్కూల్’ బాలల వసతి గృహం నిర్వహిస్తూ కుటుంబ భారాన్ని మోసేది. కుటుంబాన్ని పోషించలేక ఎమిలీ మోరిస్ తన కూతురు అనిబిసెంట్ను స్నేహితురాలైన మారియెట్కు అప్పగించింది. అనిబి సెంట్కు సమాజం పట్ల బాధ్యత, స్త్రీ స్వాతంత్య్రం పట్ల అవగాహన కల్పిం చింది మారియెట్. చిన్న వయస్సులోనే అనిబిసెంట్ ఐరోపా అంతటా పర్యటించింది. అక్కడ ఆమెకు రోమన్ క్యాథలిక్ మతం పట్ల అభిరుచి ఏర్పడింది. తల్లి కోరికపై అనీ తన 19వ ఏట ఫాదర్ ఫ్రాంక్ బిసెంట్ని వివాహమాడి, అనిబిసెంట్గా మారారు. వివాహా నంతరం భర్తతో స్పర్థలు వచ్చి విడిపో వడం.. తల్లి మరణించడంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. కుటుంబ జీవితానికి పూర్తిగా దూరమైన ఆమె తన మిగతా జీవితాన్ని మానవ సేవలో గడపాలని నిర్ణయించుకున్నారు. 1880లో హెలెనా బ్లావట్స్కీని కలుసుకున్న తరువాత ఆమె ఆసక్తి సామ్యవాదం నుంచి దివ్యజ్ఞానం వైపు మళ్లింది. ఆమె దివ్యజ్ఞాన సమాజంలో సభ్యత్వం స్వీకరించి మంచి ఉపన్యాసకురాలిగా పేరు తెచ్చుకుంది. దివ్యజ్ఞాన సమాజం బాధ్యతలలో భాగంగా ఆమె భారతదేశం వచ్చారు. 1970లో దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. పెళ్లైన తర్వాత అనిబిసెంట్ 1874లో ఇంగ్లాండ్లోని నేషనల్ సెక్యులర్ సొసైటీ అనే సంస్థలో చేరారు. లా అండ్ రిపబ్లిక్ లీగ్ను స్థాపించి పోలీసుల అత్యాచారాలకు బలైన మహిళల తరఫున పోరాటం చేశారు. భారత దేశంలో అడుగుపెట్టిన అనిబిసెంట్ కేవలం దివ్యజ్ఞాన సమాజ కార్యక్రమాలకే పరిమితం కాకుండా పలు చైతన్య కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించారు. దేశంలో ప్రో యూనియన్ స్థాపించి కార్మికుల కోసం పోరాడారు. 1897 లోనే భారత జాతీయ కాంగ్రెస్కు తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. 1898 జూలై 7 విద్యాసౌధాన్ని స్థాపించి, అది అలహాబాద్ విశ్వ విద్యాలయ సంస్థగా ఎదిగేందుకు కృషి చేశారు. 1914లో మెదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అయిన సమయంలో హోంరూల్ లీగ్ ద్వారా భారత స్వాతంత్య్రోద్యమంలో సహకరించారు. 1916లో భారత స్వాతంత్య్రేచ్ఛను ప్రతిబింబించే హోం రూల్ ఉద్యమానికి నాయక త్వం వహించారు. అనిబిసెంట్ తన జీవితకాలం వివిధ ఉద్యమాల్లో, చైతన్య కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక చర్చల్లో చురుకుగా పాల్గొన్నారు. నేషనల్ సెక్యులర్ సొసైటీ(ఎన్ఎస్ఎస్)లో, దివ్య జ్ఞాన సమాజంలో ఆమె ఉపన్యాసాలకోసం శ్రోతలు ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఫెబియన్ సొసైటీ, మార్క్సిస్టు సోషల్ డెమొక్రటిక్ ఫెడరేషన్లో జరిగే అన్ని సమావేశాల్లోనూ ఆమె ప్రధానవక్త. మరోవైపు వివిధ రకాల యూనియన్ల కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరించే వారు. 1888లో బ్లడీ సండే ప్రదర్శనలో, లండ న్ మ్యాచ్ గర్ల్ప్ సమ్మెలో పాల్గొన్నారు. వారణాసిలో కేంద్ర హిందూ కళాశాల (1898) స్థాపించడానికి ఎంతగానో సహయపడ్డారు. అలాగే 1922 హైదరాబాద్(సింధ్) నేషనల్ కొలేజియెట్ బోర్డు ముంబైలో స్ధాపించడానికి కారణమయ్యారు. ఇలా అన్ని రకాలుగా సమాజంలోని బడుగు బలహీన వర్గాల చైతన్యం కోసం పోరాడిన అనిబిసెంట్ 1933 సెప్టెంబర్ 20న మద్రాసులోని అడయార్లో తుదిశ్వాస విడిచారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
Advertisement