-
చక్రి కుటుంబానికి నిర్మాత సాయం
సాక్షి, హైదరాబాద్ : లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వివిధ వర్గాల పేదలను ఆదుకునేందుకు సామాజిక బాధ్యతగా అనేక సంస్థలు సేవలు అందిస్తూ స్ఫూర్తినిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘కోవిద సహృదయ ఫౌండేషన్’ అరుదైన సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఆ సంస్థ వ్యవస్థాపకురాలు, సినీ కాస్ట్యూమ్ డిజైనర్, నిర్మాత డాక్టర్ అనూహ్యా రెడ్డి ఆధ్వర్యంలో గత నెల రోజులుగా నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు, కోడిగుడ్లు, ప్యాకేజ్డ్ ఆహారాన్ని పేదలకు అందజేస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం దివంగత సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మోహిత్, వారి తల్లి మణికొండలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలియడంతో వారికి రెండు నెలలకు సరి పడా మందులు, నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా అనుహ్యా రెడ్డి మాట్లాడుతూ.. ‘సాయం అందించినందుకు చాలా సంతోషంగా ఉందని మహిత్ అన్నారు. కానీ తనకు ఒక పని ఇప్పించాలని కోరారు. దీంతో నేను కరోనాపై ఓ ట్యూన్ చేయాలని మహిత్ను కోరాను. మహిత్ది చాలా మంచి మనసు’ అని తెలిపారు. మహిత్ మాట్లాడుతూ.. తన పనిని చూసి ఎంకరేజ్ చేయాలని కోరారు. తను ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు చేశానని చెప్పారు. ఓ సోదరిగా అనుహ్యా రెడ్డి ఇచ్చిన భరోసా తన హృదయాన్ని కదిలించిందని తెలిపారు. అలాగే కృష్ణానగర్ , మూసాపేట్ ప్రాంతాల్లోని 150 మంది ట్రాన్స్ జెండర్లకు అవసరమైన నిత్యావసర వస్తువులు, ఆర్థిక సహాయం చేశారు. -
కల్యాణం జరిపిస్తాం రండి
హిమాయత్నగర్: వివాహం చేసుకునేందుకు ఆర్థిక స్థోమత లేని అభాగ్యులకు ‘కోవిధ సహృదయ ఫౌండేషన్’ చేయూతనందిస్తోంది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ నెలలో వంద జంటలకు ఉచితంగా వివాహాలు చేసేందుకు సిద్ధమైనట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ జి.అనూహ్యరెడ్డి తెలిపారు. గురువారం హిమాయత్నగర్లో ఆమె మాట్లాడుతూ.. బలహీనవర్గాల వారి కి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. వధూవరులకు సంబంధించిన ఇరువర్గాల వారు మాట్లాడుకుని అంతా సిద్ధం అనుకుంటే తాము నిర్వహిం చే సామూహిక పద్ధతిలో ఈ వివాహాలను జరిపిస్తామన్నారు. 100 జంటలకు వివాహా లు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నా మ న్నారు. పెళ్లి ఖర్చులన్నీ తామే భరిస్తామన్నారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ఇరువర్గాల వారికి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. వివరాలకు 86885 18655, 88850 03969లకు ఫోన్ చేసి ఈ నెల 25లోపు పేర్లు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. -
‘అనూహ్య’ తీర్పు
సర్వత్రా హర్షం దోషి చంద్రభాన్కు ఉరిశిక్ష ఖరారు చేసిన కోర్టు ప్రజల మనోభావాలకు అద్దం పట్టిన తీర్పు తాము అనుకున్న తీర్పే ప్రకటించారన్న అనూహ్య తల్లిదండ్రులు గారాబంగా పెంచుకున్న కూతురు కసాయి చేతిలో చిక్కుకుని దారుణ హత్యకు గురైతే ఆ కుటుంబ సభ్యుల క్షోభ వర్ణనాతీతం. చేయి పట్టుకు నడిచిన కూతురు ఊరు కాని ఊరులో హత్యకు గురికావడం.. ఫిర్యాదు చేస్తే పోలీసుల నుంచే ఈసడింపులు ఎదురవటంతో ఆ తండ్రి పడిన బాధ వర్ణనాతీతం. ఎట్టకేలకు కోర్టు తీర్పుతో ఆ.. వేదనకు, ఆవేదనకు కాస్తంత ఊరట. ఎస్తేరు అనూహ్య కేసులో దోషిగా నిర్ధారించిన చంద్రభాన్కు కోర్టు ఉరి శిక్ష విధిస్తూ తీర్పునివ్వటం సమాజంలో ఇలాంటి మానవ మృగాలకు హెచ్చరికలా ఉందని సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మచిలీపట్నం : దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఎస్తేరు అనూహ్య హత్య కేసులో నిందితుడికి ముంబై సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం కోర్టు వెలువరించిన తీర్పు ప్రజల మనోభావాలకు అద్దం పట్టినట్లుగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు. తాము పైకి చెప్పకున్నా తామనుకున్న తీర్పును కోర్టు ప్రకటించిందని అనూహ్య తల్లిదండ్రులు జోనాథన్ ప్రసాద్, జ్యోత్స్న తెలిపారు. అయినా తమ కుమార్తె జ్ఞాపకాలు తమను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఆ కన్నీళ్లకు వెలకట్టేదెవరు? తమతో కలిసి క్రిస్మస్ పండుగ చేసుకుని ఉద్యోగం నిమిత్తం ముంబై వెళ్లేటప్పుడు.. నాన్నా పెళ్లి సంబంధాలు చూడండని, తాను వేసుకునే పెళ్లి గౌను ఇలా ఉండాలని చెప్పి వెళ్లిన ఒకటి, రెండు రోజుల తరువాత ఆమె విగత జీవిగా మారితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. పోలీసులు సహకరించకున్నా బంధువుల సాయంతో సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా కుమార్తె ఆచూకీని కనుగొన్న ఆ తండ్రి కన్నీళ్లకు వెలకట్టలేం. ఆ కుటుంబానికి జరిగిన లోటు పూడ్చలేనిది. మచిలీపట్నానికి చెందిన శింగవరపు ఎస్తేరు అనూహ్య (25) ముంబైలో దారుణ హత్యకు గురి కావడం, పోలీసులు నిందితుడి ఆచూకీని కనుగొనడం, సాక్ష్యాలు సేకరించటం, 2500 మందిని విచారించడం, తాజాగా దోషిగా నిర్ధారించిన చంద్రభాన్కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించడం తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి. -
అనూహ్య కేసులో రేపు శిక్ష ఖరారు
సాక్షి, ముంబై: తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో దోషి చంద్రబాన్కు శిక్ష ఖరారును ముంబై సెషన్స్ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదావేసింది. దీంతో ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు శుక్రవారం వెలువడే అవకాశముంది. 2014 జనవరి అయిదో తేదీన లోకమాన్య తిలక్ (కుర్లా) టర్మినస్ నుంచి అదృశ్యమైన ఎస్తేర్ అనూహ్య 2014 జనవరి 16వ తేదీన కంజూర్మార్గ్ -భాండూప్ మధ్యలో శవమై తేలిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన చంద్రబాన్ సానప్ అలియాస్ లౌక్యాను మంగళవారం కోర్టు దోషిగా నిర్ధారించింది. దీంతో బుధవారం చంద్రబాన్కు కోర్టు శిక్ష ఖరారు చేస్తుందని భావించారు. అయితే ఈ కేసుకు సంబంధించి సెషన్స్కోర్టులో బుధవారం ఉదయం సుమారు 11.30 గంటల నుంచి ఇరు పక్షాల తుది వాదనలు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రభుత్వ న్యాయవాది రాజన్ ఠాక్రే తన వాదనను విన్పించారు. అనూహ్య హత్య కేసులో దోషిగా నిర్ధారణ అయిన చంద్రబాన్కు మరణశిక్ష విధించాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాన్ ఉద్దేశపూర్వకంగానే క్రూరంగా అనూహ్యను హత్య చేసినట్టు పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో గతంలో హైకోర్టులతోపాటు సుప్రీం కోర్టు మరణశిక్షలు విధించినట్టు తెలిపారు. అయితే నిందితుడు తన తప్పు తెలుసుకుని మారాలనుకుంటున్నాడని, శిక్ష తగ్గించాలని డిఫెన్స్ న్యాయవాది ప్రకాష్ సలసింగ్కర్ వాదించారు. ఇరు పక్షాల వాదనలను విన్న అనంతరం సెషన్కోర్టు న్యాయమూర్తి వీవీ జోషి 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం అనూహ్య బంధువైన అరుణ్కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ఇంత త్వరగా కోర్టు నిందితున్ని దోషిగా ప్రకటిస్తూ తీర్పునివ్వడం ఆనందం కలిగించిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దోషికి మరణశిక్ష విధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. -
22 నెలలు!
ఎస్తేరు అనూహ్య హత్య కేసు కొలిక్కి.. టాక్సీ డ్రైవర్ చంద్రభానే దోషి ముంబై కోర్టు తీర్పుతో బందరులో కలకలం మచిలీపట్నం : బందరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీరు అనూహ్య (23) హత్యకేసులో చిక్కుముడి వీడింది. 22 నెలల అనంతరం ఈ కేసులో ముంబై కోర్టు తీర్పు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు నిందితుడిగా అనుమానిస్తున్న టాక్సీ డ్రైవర్ చంద్రభాన్నే దోషిగా తేల్చారు. బుధవారం అతడికి శిక్షను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నానికి చెందిన శింగవరపు జోనతాన్ ప్రసాద్ కుమార్తె ఎస్తేరు అనూహ్య ముంబైలోని టీసీఎస్ కార్యాలయంలో ఇంజినీరు. ఆమె 2013 డిసెంబరులో క్రిస్మస్ వేడుకలు జరుపుకొనేందుకు బందరు వచ్చారు. 2014 జనవరి నాలుగున విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ముంబై బయలుదేరి వెళ్లారు. అక్కడి ఎల్టీటీ స్టేషన్లో రైలు దిగిన ఆమెను ట్యాక్సీ డ్రైవర్ చంద్రభాన్ మాయమాటలు చెప్పి వెంట తీసుకువెళ్లాడు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. జనవరి 16వ తేదీన బాండూస్లోని ఈస్ట్రన్ ఎక్స్ప్రెస్ రహదారి సమీపంలో అనూహ్య మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం అనంతరం 18వ తేదీన మృతదేహాన్ని మచిలీపట్నం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత అనూహ్య హత్యకేసులో నిందితులను శిక్షించాలని కోరుతూ పెద్దఎత్తున ఉద్యమాలు జరిగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో 22 నెలల తర్వాత ఈ హత్యకేసులో చంద్రభాన్ను ముంబై కోర్టు దోషిగా నిర్ధారించింది. శిక్ష.. భయం గొలిపేలా ఉండాలి ముంబై కోర్టు తీర్పు నేపథ్యంలో అనూహ్య తండ్రి జోనతాన్ ప్రసాద్ మంగళవారం బందరులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం కలిగించడం వల్లే పోలీసులు స్పందించారని తెలిపారు. 22 నెలల్లో దోషిని నిర్ధారించడం న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచిందన్నారు. నిందితుడు చంద్రభాన్కు కోర్టు విధించే శిక్ష నేరప్రవృత్తి ఉన్న వారికి భయం గొలిపేలా ఉండాలని సూచించారు. మీడియా, ప్రజాప్రతినిధుల సహకారం వల్లే తన కుమార్తె హత్య కేసు ఓ కొలిక్కి వచ్చిందన్నారు. ముంబైకి చెందిన జోన్-7 డీసీపీ వెంకట్పాటిల్ దర్యాప్తు అంశాలను తనకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేవారని వివరించారు. - జోనతాన్ ప్రసాద్, అనూహ్య తండ్రి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement