-
రాజకీయ విలువలు వీడి...
సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చి.. స్వీయ ప్రయోజనాలే పరమావధిగా.. అధికార దాహంతో వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన ముగ్గురు జిల్లా నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీగా ఎన్నికైన జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, ఆదిరెడ్డి అప్పారావులు.. అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. టీడీపీ ప్రలోభాల వలలో పడి.. దానికి అభివృద్ధి ముసుగు తొడిగి.. ఓటేసిన తమను వంచించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫిరాయించే ముందు.. వైఎస్సార్సీపీతో దక్కిన పదవులకు రాజీనామా చేయాలనే నైతికతను కూడా పాటించకపోవడం.. విలువలను తుంగలో తొక్కడమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. టీడీపీలో తమను తొక్కేస్తున్నారని చెబుతూ ఈ ముగ్గురు నేతలూ అప్పట్లో వైఎస్సార్సీపీలోకి వచ్చారు. పెద్దపీట వేసి, పదవులు ఇచ్చిన ఆ పార్టీని కాదని.. ఆ ముగ్గురు నేతలూ మళ్లీ అదే సైకిల్పై సవారీ చేస్తున్న తీరు చూసి జనం విస్తుపోతున్నారు. గోరంట్లతో విభేదాలు తప్పవా? ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు భార్య వీరరాఘవమ్మ గతంలో టీడీపీ హయాంలో రాజమహేంద్రవరం మేయర్గా పని చేశారు. ఆమె పదవీ కాలం పూర్తయ్యాక అప్పారావు టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వచ్చారు. జిల్లా నుంచి ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన తొలి నాయకుడు ఆయన. ఈ పదవీ కాలం ఇంకా రెండేళ్లుంది. అయినప్పటికీ ఎమ్మెల్సీని చేసిన వైఎస్సార్సీపీని కాదని, అదురూ బెదురూ లేకుండా సైకిలెక్కేశారు. ఎమ్మెల్సీ పదవికి మించిన గౌరవం,∙హోదా ఆయనకు అక్కడ లభించాయా అంటే అవేమీ కనుచూపు మేరలో కూడా అక్కడ కనిపించడం లేదు. అప్పారావుపై భగ్గుమనే రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలోనే ఉన్నారు. ఆయన అక్కడుండగా టీడీపీలో అప్పారావుకు రాజకీయ భవిష్యత్తు ఒక భ్రాంతేనని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఫిరాయించడానికి ముందే వైఎస్సార్సీపీ ద్వారా లభించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలన్న నైతికత ఉన్నత విద్యావంతుడైన అప్పారావుకు లేకపోవడాన్ని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. తనవెంట 6 వేల మంది వచ్చారని అప్పారావు చెబుతున్నారు. వారిలో ఆయన వద్ద అప్పులు తీసుకున్నవారే ఎక్కువగా ఉన్నారని పలువురు అంటున్నారు. వాస్తవంగా ఒకరిద్దరు మాత్రమే కొద్దోగొప్పో ప్రభావంతమైన ద్వితీయ శ్రేణి నేతలున్నారని, మిగిలినవారి పరిస్థితి తమకు తెలియనిది కాదని గోరంట్ల వర్గం అంటోంది. అప్పారావు పునరాగమనంతో తమకు కొత్తగా కలిసివచ్చేదేమైనా ఉందంటే అది పార్టీలో అంతర్గత కుమ్ములాటలేనని తమ్ముళ్ల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. జగ్గంపేటకే పరిమితమైన జ్యోతుల మరో ఫిరాయింపు నేత∙జ్యోతుల నెహ్రూ. రాష్ట్ర మంత్రి కావాలన్నది ఆయన చిరకాల కోరిక. గతంలో టీడీపీలో ఉన్న సమయంలో ఆ పదవి ఆయనకు రానివ్వకుండా మంత్రి యనమల రామకృష్ణుడు అడ్డుపడ్డారు. నెహ్రూ వెంట తిరిగేవారిని ఎవరినడిగినా ఈ మాట చెబుతారు. తన రాజకీయ ఎదుగుదలకు యనమల ఆటంకంగా మారారన్న ఉద్దేశంతో నెహ్రూ.. అప్పట్లో టీడీపీని వీడి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. ఆ పార్టీ అదృశ్యమైన తరువాత వైఎస్సార్సీపీలో చేరారు. అటువంటిది మళ్లీ టీడీపీలోకి ఎలా వెళ్లారో అర్థం కావడం లేదని ఆయన అభిమానులే అంటున్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందని నెహ్రూ అనుచరులు కొందరు చెబుతూంటారు. కానీ, ‘సైకిల్’ ఎక్కాక ఈ నాలుగు నెలల్లో నియోజకవర్గానికి ఏం సాధించారనే ప్రశ్నకు వారివద్ద సమాధానం లేదు. వాస్తవానికి ఈ నాలుగు నెలల్లో కనబరిచింది అధికార దర్పమే. పోలవరం కాలువను ఆనుకుని నిరుపేదల ఇళ్లస్థలాలు, పక్కా ఇళ్లు సాధించలేకపోయారని స్థానికులు మండిపడుతున్నారు. మరోపక్క నెహ్రూ చిరకాల కోరిక అయిన మంత్రి పదవిపై కనీస గ్యారంటీ లభించలేదనే చెబుతున్నారు. వైఎస్సార్సీపీలో ఉండగా పార్టీ జిల్లా పగ్గాలతో పాటు అసెంబ్లీలో పార్టీ ఉపనేతగా తన వాణి వినిపించే నెహ్రూ.. టీడీపీలోకి ఫిరాయించాక జగ్గంపేటకే పరిమితమైపోవాల్సి వచ్చిందని అనుచరగణం ఆవేదన చెందుతోంది. కుమారుడికి దక్కని జెడ్పీ చైర్మన్ గిరీ వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు జెడ్పీ ప్రతిపక్ష నేతగా పని చేసిన జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్కు టీడీపీలో చేరితే జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. నెహ్రూకు మంత్రి పదవి, కుమారుడికి జెడ్పీ చైర్మన్ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని అప్పట్లో చెప్పుకున్నారు. చివరికి వీటిలో ఏ ఒక్కటీ ఇంతవరకూ వారికి దక్కనేలేదు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టిక్కెట్టుపై ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా వరుపుల సుబ్బారావు గెలుపొందారు. ఆయన ఎక్కడ కనిపించినా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘సుబ్బన్నా’ అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. గౌరవంగా చూసేవారు. ఎంతోమంది నేతలను కాదనుకుని ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్మోహన్రెడ్డి టిక్కెట్టు ఇచ్చి సుబ్బారావును ఎమ్మెల్యేను చేశారు. అటువంటి సుబ్బారావు కూడా టీడీపీ ప్రలోభాలతో పార్టీ ఫిరాయించడంపై విమర్శలు వస్తున్నాయి. విలువలకు కట్టుబడి.. ఈ ముగ్గురితో పోలిస్తే రాజకీయాల్లో జూనియర్లు, తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వంతల రాజేశ్వరి, దాడిశెట్టి రాజాలు.. అధికార టీడీపీ నుంచి అనేక ప్రలోభాలు వచ్చినా తప్పటడుగు వేయకుండా నిలిచారు. వీరిద్దరూ తమ నియోజకవర్గాల్లో అధికార పార్టీ నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా వైఎస్సార్సీపీకే కట్టుబడి నిలవడం విశేషం. -
రహదారులపై..రణభేరి
సాక్షి, కాకినాడ :దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులే కాదు, జిల్లా పరిధిలో నడిచే బస్సులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్సులే కాదు.. భారీ వాహనాలు.. ఆటోలు.. కార్లతో పాటు చివరకు ద్విచక్ర వాహనాలు కూడా ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి. కొన్నిచోట్ల పాదచారులు కూడా అడుగు తీసి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. అయినా ఎక్కడా ఏ ఒక్కరూ చిన్నపాటి అసహనానికి గురి కాలేదు. సామాన్య ప్రజలు సైతం తమ ఇబ్బందులను సుతరాము ఖాతరు చేయక సమైక్యాంధ్ర పరిరక్షణకు వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన రహదారుల దిగ్బంధానికి మనస్ఫూర్తిగా మద్దతునిచ్చారు.సమైక్యాంధ్ర పరిరణే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ కొనసాగిస్తున్న ఉద్యమంలో భాగంగా చేపట్టిన జాతీయ రహదారుల రెండు రోజు ల దిగ్బంధం కార్యక్రమానికి జిల్లా ప్రజల నుంచి అనూహ్య స్పం దన లభించింది. కనీవినీ ఎరుగని రీతిలో 48 గంటల పాటు జరిగి న ఆందోళన కార్యక్రమాల్లో జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా కదం తొక్కిన పార్టీ శ్రేణులు రహదారులను దిగ్బంధం చేశారు. అక్కడూ వంటావార్పులు..సహపంక్తి భోజనాలు చేశారు. జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారులు-16, 216తో పాటు అన్ని రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో ఉద్యోగులు కార్యాలయాలకు సకాలంలో చేరుకోలేకపోయారు. ప్రయాణికులు గమ్యానికి చేరుకోవడానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. పార్టీ శ్రేణులు కొన్ని చోట్ల మండుటెండలోనే రోడ్లపై పడుకొని నిరసన తెలపగా, మరికొన్ని చోట్ల రోడ్లకు అడ్డంగా ఇటుకలతో గోడలు కట్టి నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై ఆటాపాటా.. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమండ్రి కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్కుమార్ల ఆధ్వర్యంలో లాలా చెరువు వద్ద ఎన్హెచ్-16ని గంటన్నర పాటు దిగ్బంధించారు. రోడ్డుపైనే వాలీబాల్, ఖోఖో ఆడి నిరసన తెలిపారు. మూడు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి. ఆదిరెడ్డి, బొమ్మన సహా 23 మందిని పోలీసులు అరెస్టు చేశారు.సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ సుంకర చిన్ని, సమైక్య ఉద్యమం అర్బన్ పర్యవేక్షకులు ఆర్.వి.వి. సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. సమైక్య ఉద్యమం మొదలై వందరోజులైన సందర్భంగా రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి, నగరఅధికార ప్రతినిధి కానుబోయిన సాగర్ సహా వందమంది మహిళా కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం దీక్షల ముగింపు సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో రాజానగరం మండలం సూర్యారావుపేట వద్ద ఎన్హెచ్-16ని, రాజమండ్రి- భద్రాచలం రోడ్డుపై బూరుగు పూడి జంక్షన్ను దిగ్బంధించారు. ఆమెతో పాటు పలువుర్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించి, అనంతరం విడిచిపెట్టారు. యువనాయకుడు జక్కంపూడి గణేష్ తదితరులు పాల్గొన్నారు. మండుటెండలో రోడ్డుపై పడుకుని.. జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో వందలాదిమంది కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం వద్ద ఎన్హెచ్-216ని దిగ్బంధించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా రోడ్డుపైనే సుమారు గంటపాటు పడుకొని నిరసన తెలిపారు. రోడ్డుకిరువైపులా ఆయిల్ ట్యాంకర్లు పెట్టి రాస్తారోకో చేయడంతో పాదచారులను కూడా వెళ్లనివ్వలేదు. వేణు సహా 250 మందిని పోలీస్లు అరెస్టు చేశారు. చేనేత విభాగం జిల్లా కన్వీనర్ పంపన రామకృష్ణ, పార్టీ కాకినాడ నగర కన్వీనర్ ఆర్వీజేఆర్ కుమార్, కర్రి సత్యనారాయణ పాల్గొన్నారు. అమలాపురంలో ఎర్రవంతెన వద్ద ఎన్హెచ్-216ని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, అమలాపురం పార్లమెంటు నియో జకవర్గ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు, మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావుఅ ఆధ్వర్యంలో దిగ్బంధించారు. నేతలతో పాటు 55 మందిని అరెస్ట్ చేసి పూచీకత్తుపై విడిచి పెట్టారు. పార్టీ కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ మట్టా మురళీకృష్ణ పాల్గొన్నారు. దిండి- చించినాడ వంతెనపై మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తదితరుల ఆధ్వర్యంలో ఎన్హెచ్-216ని దిగ్బంధించడంతో ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు స్తంభించాయి. కో ఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, మత్తి జయప్రకాష్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో గొల్లప్రోలు వద్ద ఎన్హెచ్-216ని దిగ్బంధించారు. దొరబాబుతో సహా 35 మందిని అదుపులోకి తీసుకొని అనంతరం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. ఇటుకలతో గోడ కట్టి.. మాజీ ఎమ్మెల్యే, నియోజక వర్గ కో-ఆర్డినేటర్ వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో రౌతులపూడిలో కోటనందూరు రహదారిని దిగ్బంధం చేశారు. రోడ్డుపైనే వంటావార్పు చేశారు. రోడ్డుకు అడ్డంగా గోడగా ఇటుకలను పేర్చి నిరసన తెలిపారు. పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్కుమార్ ఆధ్వర్యంలో నీలాద్రిరావు పేట, మల్లేపల్లి, గండేపల్లి, గోకవరంలలో ఎన్హెచ్-16ని దిగ్బంధించారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో కడియపులంక పూల మార్కెట్ వద్ద సుమారు 300 మందికి పైగా పార్టీ కార్యకర్తలు ఎన్హెచ్-16ని దిగ్బంధించారు. ముమ్మిడివరం పోలీస్స్టేషన్ ఎదుట 216 జాతీయ రహదారిని సుమారు గంటన్నర సేవు దిగ్బంధించారు. రోడ్డుపైనే వంటావార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గుత్తుల సాయి, నాయకులు భూపతిరాజు సుదర్శనబాబు, డీసీసీబీ మాజీ డెరైక్టర్ పెయ్యిల చిట్టిబాబు పాల్గొన్నారు. నేతలతో పాటు వందమందిని అరెస్ట్ చేసి అనంతరం సొంత పూచీకత్తుపై విడిచి పెట్టారు. ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీను ఆధ్వర్యంలో జొన్నాడ వద్ద జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్రాజు, సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు. మామిడికుదురు మండలం నగరంలో తాటిపాక మినీ రిఫైనరీ ఎదురుగా 216 జాతీయ రహదారిని వందలాదిమంది దిగ్బంధించారు. అక్విడెక్టుపై బైఠాయింపు పి.గన్నవరంలో డొక్కా సీతమ్మ అక్విడెక్టుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమాల్లో పి.గన్నవరం కో ఆర్డినేటర్లు విప్పర్తి వేణుగోపాలరావు, మందపాటి కిరణ్కుమార్, కొండేటి చిట్టిబాబు, రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ పాల్గొన్నారు. పెద్దాపురం కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు గొంచాల జంక్షన్ వద్ద కాకినాడ- సామర్లకోట రహదారిని దిగ్బంధించారు. నేతలతో పాటు 300 మందిని అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. యువనాయకుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో సీతానగరం వద్ద రాజమండ్రి-సీతానగరం రహదారిపై రాస్తారోకో చేశారు. అనపర్తి నియోజకవర్గ నాయకులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో బిక్కవోలు కెనాల్ రోడ్ వంతెనపై రాస్తారోకో చేశారు. వేమగిరి నుంచి కాకినాడ వైపు వెళ్లే ఈ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రంపచోడవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్, నియోజక వర్గ పరిశీలకులు కర్రి పాపారాయుడుల ఆధ్వర్యంలో ఐ.పోలవరం జంక్షన్ వద్ద రాజమండ్రి, భద్రాచలం-రహదారిని దిగ్బంధించారు. రోడ్డుపైనే వంటావార్పు చేసి సహపంక్తి భోజనాలు చేశారు. జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ తదితరులు పాల్గొ న్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ సభ
వేద విజ్ఞానం కలిగిన భూమి భారత్
కాంగ్రెస్లో మున్సిపల్ కౌన్సిలర్ల చేరిక
పేదల సంక్షేమానికి పెద్దపీట
కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం
ఓటేసిన ఆర్వో
ధాన్యం దిగదు.. లారీ కదలదు
● జనసంద్రంగా ఐబీ చౌరస్తా ● మంచిర్యాలలో రోడ్షో
నేడు నీట్
డీఏవోగా సురేఖ బాధ్యతల స్వీకరణ
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement