-
15లోపు..దరఖాస్తు చేసుకోండి...
రాజంపేట టౌన్ : అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (ఏఓయూ) ద్వారా బీఈడీ అభ్యసించే విద్యార్థులు మే 15వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి (ఎల్వీకే) తెలిపారు. స్థానిక అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లో శుక్రవారం ఎల్వీకే విలేకరులతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదువందల బీఈడీ సీట్లు ఉన్నాయన్నారు. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్లో మరో ఐదువందల సీట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రవేశ పరీక్ష రాసేందుకు ఓసీ విద్యార్థులు డిగ్రీలో యాబైశాతం మార్కులతో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర రిజర్వేషన్ కలిగిన విద్యార్థులు డిగ్రీలో 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ప్రవేశ పరీక్ష ఈ ఏడాది జూన్ 6వ తేదీ అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతుందన్నారు. బీఈడీలో ప్రవేశం పొందే విద్యార్థులు నేషనల్ టీచర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఎన్సీటీఈ) గుర్తింపు పొందిన డీఎడ్, టీటీసీ, ఈఎల్ఈడీ, తెలుగుపండిట్, హిందీపండిట్ వంటి డిప్లొమా కోర్సులను పూర్తి చేసి ఉండాలని తెలిపారు. ఎన్సీఈటీ గుర్తింపు పొందిన డిప్లొమా సర్టిఫికెట్లు లేని వారు బీఈడీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నా అడ్మిషన్ పొందేందుకు అనర్హులన్నారు. బీఈడీ స్పెషల్æ ఎడ్యుకేషన్లో చేరే విద్యార్థులు 50 శాతం మార్కులతో డిగ్రీ పాసై ఉంటే చాలన్నారు. అయితే ప్రవేశ పరీక్షలో ర్యాంకు తప్పని సరి అన్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు సెమిస్టర్ విధానంలో పరీక్షలు జరుగుతాయన్నారు. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్లో అంగవైకల్యం ఉన్నవారికి, అంగవైకల్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ ఏడాది ఆగస్టులో అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ఎల్వీకే తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
సంక్షేమ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
వీడియో కాన్ఫెరెన్స్లో తహసీల్దార్లను ఆదేశించిన ఇన్చార్జ్ కలెక్టర్ దివ్య ఖమ్మం జెడ్పీసెంటర్: షాదీముబారక్,కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఇన్చార్జ్ కలెక్టర్ దివ్య తహసీల్దార్లను ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై తహసీల్దార్లతో మంగళవారం నిర్వహించిన వీడియోకాన్ఫెరెన్స్లో ఆమె మాట్లాడుతూ అసైన్డ్ భూములకు సంబంధించి తహసీల్దార్లు సమర్పించిన సమచారం మేరకు భౌతికంగా క్షేత్ర స్థాయిలో తహసీల్దార్లు, సర్వేయర్లు, డీటీలు, ఆర్ఐలు తనిఖీ చేయాలన్నారు. సాదాబైనామాలకు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసినా నోటీసులు జనరేట్ చేయలేదని వెంటనే వాటి గురించి చర్యలు తీసుకోవాలన్నారు. భూదాన్ భూములకు సంబంధించి పోజిషన్ వెరిఫికేషన్ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. భూముల రిజిస్ట్రేషన్ వివరాలకు సంబంధించి సబ్రిజిస్టర్, తహసీల్దార్లు ఏకికత మ్యాన్వల్ మార్పుల చేర్పులకే వచ్చిన దరఖాస్తులను విచారణ చేసి రెవెన్యూ సేవలకు సంబంధించిన మ్యూటేషన్ను రేపు సాయంత్రంలోగా పూర్తి చేయాలన్నారు.రుణ అర్హత కార్డులకు సంబంధించి వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలను అందించడానికి అర్హులైన వారికి కార్డులు జారీ చేసేందుకు గాను తహసీల్దార్లకు ఇప్పటికే సాంకేతిక డేటాను పంపడం జరిగిందని, అందుకు అనుగుణంగా విచారణ చేసి మీసేవ ద్వారా అందిన దరఖాస్తులకు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్నారు. పౌరసరఫరాల సంస్థ ద్వారా పంపిణి చేస్తున్న రేషన్ అక్రమ రవాణా జరగకుండా ప్రతి రూట్కి ఒక రూట్ ఆఫీసర్ తప్పక ఉండాలని, రేషన్ దుకాణదారులతో సమావేశం నిర్వహించి అక్రమర వాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వీసీలో ఏజేసీ శివశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫోటోరైటప్283:మాట్లాడుతున్న ఇంచార్జి కలెక్టర్ దివ్య
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement