-
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో తొక్కిసలాట.. 31 మంది మృతి
బ్రజ్జావిల్లే: కాంగో ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్లో అపశ్రుతి చొటుచేసుకుంది. ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 31 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. కాంగో రాజధాని బ్రజ్జావిల్లేలోని ఓర్నానో స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్ను అధికారులు నిర్వహించారు. నవంబర్ 14 నుంచి ర్యాలీ జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం వేలాది మంది యువత ర్యాలీకి హాజరయ్యారు. యువత గుంపులుగా రావడంతో పరిస్థితిని సిబ్బంది అదుపు చేయలేకపోయారు. దీంతో ఒకరిపై మరొకరు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడినట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ఇదీ చదవండి: బందీల విడుదలకు హమాస్తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం -
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
ఖమ్మం: సైన్యంలో నియామకాలకు సంబంధించి అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైంది. ఈనెల 8వ తేదీ వరకు ర్యాలీ జరగనుండగా, రాష్ట్రవ్యాప్తంగా రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు హాజరుకానున్నారు. శుక్రవారం తెల్లవారుజామున పోటీలు ప్రారంభించారు. తొలి రోజు 1,225 మంది అభ్యర్థులకు 926 మంది హాజరయ్యారు. వీరిలో వైద్య పరీక్షలకు 329 మంది అర్హత సాధించారు. పోటీలను కలెక్టర్ వీపీ గౌతమ్, ఆర్మీ అధికారి దాస్, డీవైఎస్వో టి.సునీల్కుమార్రెడ్డి పర్యవేక్షించారు. కాగా, అభ్యర్థులకు వసతి సౌ కర్యం కలి్పంచినట్లు చెబుతున్నా.. అవగాహన క ల్పించకపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు రహదారుల వెంటే సేదదీరాల్సి వచ్చింది. -
నేటి నుంచి ఖమ్మంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
ఖమ్మం స్పోర్ట్స్: సైన్యంలో నియామకాల కోసం అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ శుక్రవారం నుంచి ఖమ్మం జిల్లాకేంద్రంలో జరగనుంది. సర్దార్ పటేల్ స్టేడియంలో ఎనిమిది రోజులపాటు సాగే ర్యాలీలో రాష్ట్రవ్యాప్తంగా రాతపరీక్షలో అర్హత సాధించిన 7,397 మంది అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇందుకోసం స్టేడియంలో చేసిన ఏర్పాట్లను కలెక్టర్ వీపీ గౌతమ్, కల్నల్ కీట్స్దాస్ గురువారం పర్యవేక్షించారు. మొదటిదశ పరీక్షలో ఉత్తీర్హులైనవారు అడ్మిట్ కార్డుతోపాటు కావాల్సిన సరి్టఫికెట్లు తీసుకుని నిర్ణీత తేదీలోనే రావాలని సూచించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం ఖమ్మం రైల్వేస్టేషన్, బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. -
నరసరావుపేటలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంలో భాగంగా నరసరావుపేటలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఆదివారం నిర్వహించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రతీ అభ్యర్థి ఉద్యోగ అర్హత సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ఉద్యోగ నియామక ప్రక్రియ కోసం జిల్లా అధికార యంత్రాంగం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం రాత్రికే పలు జిల్లాల నుంచి నిరుద్యోగ యువత పెద్దఎత్తున స్టేడియానికి చేరుకున్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్, కల్నల్ పునీత్, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం కె.వినాయకం తదితరులు పాల్గొన్నారు. -
నూతన పద్ధతిలో ఆర్మీ రిక్రూట్మెంట్
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ఆర్మీలో వివిధ పోస్టులకు నియామకాలకు నూతన పద్ధతిని ప్రవేశపెట్టారు. అగ్నివీర్లో భాగంగా జూనియర్ కమిషన్ ఆఫీసర్స్ నుంచి ఇతర ర్యాంకుల అధికారుల నియామకాలకు మార్చి నుంచి నూతన పద్ధతిని అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టర్ కల్నల్ వినయ్కుమార్ బుధవారం ఇక్కడ వివరించారు. ఆర్మీలో వివిధ పోస్టులకు ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదలైందని, మార్చి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నూతన విధానం ప్రకారం తొలిసారిగా ఆన్లైన్ ద్వారా ఆర్మీలో వివిధ పోస్టులు/ర్యాంకులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. అభ్యర్థులు రూ.250 ఫీజుతో పాటు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుల స్క్రూటినీ అనంతరం ఆన్లైన్లోనే రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్ష అడ్మిట్ కార్డులను 10 నుంచి 14 రోజుల్లో అభ్యర్థి చిరునామాకు పంపిస్తామన్నారు. ఆన్లైన్ టెస్ట్ దేశంలో 176 ప్రాంతాల్లో నిర్వహిస్తామని, అభ్యర్థి ఎంచుకున్న ప్రాంతానికి వెళ్లి పరీక్ష రాసుకోవచ్చని చెప్పారు. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. ఇందులో అర్హత సాధించిన వారిని వైద్య పరీక్షలకు పిలుస్తామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విశాఖపట్నంలో జరుగుతుందని చెప్పారు. అభ్యర్థులు www.ojinindinarmy.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు హెల్ప్డెస్క్ నెంబరు 7996157222 లో సంప్రదించవచ్చన్నారు. ఈ సమావేశంలో రిక్రూట్మెంట్ మెడికల్ ఆఫీసర్ మేజర్ జీఎస్ రంద్వా తదితరులు పాల్గోన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement