-
నలుగురి జీవితాల్లో అశోక దీపం
అతడు జీవితాన్ని ఎంత ఆరాధించాడో తెలియదు కానీ, చనిపోతూ ఆరిపోతున్న దీపాలకు ఆరో ప్రాణమయ్యాడు. అతడు అతడ్ని ఎంతగా ప్రేమించాడో తెలియదు గానీ, నలుగురికి పునర్జన్మ ప్రసాదించి ప్రాణానికి అసలైన అర్థం చెప్పాడు. కళ్ల ముందు తిరుగుతున్న బిడ్డ కుప్పకూలిపోతే.. మరణానికి చేరువైతే.. కూలబడి కూర్చోకుండా కన్నీటిని దిగమింగుతూనే కొడుకు అవయవాలను దానంచేసి ఆదర్శమూర్తులుగా నిలిచారు ఆ తల్లిదండ్రులు. కన్నీటికే కన్నీరు తెప్పించే ఈ విషాద గాథ గుంటూరు నెహ్రూనగర్లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు నెహ్రూనగర్ తొమ్మిదో లైనుకు చెందిన సూరగాని శివలక్ష్మయ్య, గోవర్ధన లక్ష్మికి ఇద్దరు సంతానం. పెద్దకుమారుడు మహేష్కుమార్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమారుడు అశోక్కుమార్ (25) అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆర్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు. కుమారులిద్దరూ మంచి భవిష్యత్తు పొందడం ఆ తల్లిదండ్రులకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. కానీ, ఇంతలోనే విధి వక్రించింది. గత మంగళవారం తమ చిన్న కుమారుడు నిద్రలోనే పెద్దగా గురకపెడుతూ అపస్మారక స్థితిలోకి చేరు కున్నాడు. భయాందోళనతో ఆస్పత్రికి తీసుకువెళ్లిన ఆ తల్లిదండ్రులు చేదువార్త విన్నారు. అశోక్ కోమాలోకి వెళ్లిపోయాడని డాక్టర్లు స్పష్టం చేశారు. అయితే, మెరుగైన వైద్యం కోసం తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించారు. నాలుగు రోజుల అనంతరం శస్త్ర చికిత్సల వల్ల స్పందన లేదని, అశోక్ బ్రెయిన్డెడ్ అయ్యాడని అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఉబికి వస్తున్న కన్నీటిని దిగమింగుకుని అవయవదానానికి ముందుకొచ్చారు ఆ తల్లిదండ్రులు. ఈ క్రమంలో జీవన్ దాన్ను ఆశ్రయించారు. జీవన్ దాన్లో అప్పటికే అవయవాల కోసం నమోదు చేసుకున్న వారి జాబితాను అనుసరించి అశోక్ అవయవాలను దానం చేశారు. ఆదివారం వేకువజామున ఈ అవయవ దాన ప్రక్రియను మణిపాల్ వైద్యులు పూర్తిచేశారు. లివర్, ఒక కిడ్నీ మణిపాల్ ఆస్పత్రిలోని ఇద్దరు రోగులకు అమర్చగా, కళ్లు శంకర్ కంటి ఆస్పత్రికి, మరొక కిడ్నీ ఆయుష్ ఆస్పత్రికి అందజేశారు. తాను చనిపోతూ నలుగురిలో తిరిగి జీవించాడు అశోక్. ఈ సందర్భంగా అశోక్ తల్లిదండ్రులు మాట్లాడుతూ అవయవ దానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పడం విశేషం. - తాడేపల్లి రూరల్ -
అప్పుడే నూరేళ్లు నిండాయా... నాన్నా
అనంతపురం మెడికల్ : లేయ్ నాన్న లేయ్ కాలేజ్కి పోదువు..లేయప్పా...ఎంత పనై పోయిందయ్యా అంటూ అశోక్కుమార్ తండ్రి రామాంజనప్ప బోరున విలపించాడు. చెట్టంత కొడుకు కళ్ల ముందే చచ్చిపోయాడ్ సార్...ఇంతకన్నా ఘోరం ఏముంటుందా.. వ్యవసాయం చేసుకుంటూ కష్టపడి చదివించుకుంటున్నాం. అంతలోనే నూరేళ్లు నిండిపోయాయయ్యా...అంటూ కన్నీరుమున్నీరుగా రోధించడం అందరినీ కలచి వేసింది. మడకశిర-పెనుకొండ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన వారిలో ఇద్దరు అనంతపురం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. క్షతగాత్రులలో ఏడుగురిని మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి తీసుకువచ్చారు. వీరిలో ఆనందపురానికి చెందిన రామాంజప్ప కుమారుడు అశోక్ కుమార్(17), మావుటూరుకు చెందిన సిద్దప్ప కుమారుడు గంగాధర్(18) మృతి చెందారు. బండ్లపల్లికి చెందిన కదిరప్ప కుమారుడు అశోక్కుమార్(18)ను మెరుగైన చికిత్స కోసం నేత్ర ఐ కేర్ నిర్వాహకులు గాంధీ తన అంబులెన్స్లో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మావుటూరుకు చెందిన సుబ్బయ్య కుమారుడు శివశంకర్(17), రొద్దంకు చెందిన పతిమన్న కుమారుడు జీ కొండయ్య(32), మేకలపల్లికి చెందిన రామాంజి కూతురు రాధ(16), రొద్దం మండలం గొబ్బరపల్లికి చెందిన అంజినప్ప కుమారుడు వెంకటేశులు(17) స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా క్షతగాత్రులు, వారి బంధువులతో ఎమర్జెన్సీ వార్డు కిక్కిరిసిపోయింది. మరోవైపు రోగుల ఆర్తనాదాలతో వార్డు మార్మోగింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, ఆర్ఎంఓ డాక్టర్ పద్మావతి, క్యాజువాలిటీ ఇన్చార్జ్ డాక్టర్ శివకుమార్ రోగులకు దగ్గరుండి సేవలందించారు. 20 మంది హౌస్సర్జన్లు, 20 మంది స్టాఫ్నర్సులు, ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థినిలు శ్రమించారు. ఆక్సిజన్ను అందిస్తూ ఎప్పటికప్పుడు పల్స్ను గమనించి సేవలందించారు. తహశీల్దార్ షేక్ మహబూబ్ బాషా, ఆర్ఐ రవిశంకర్ రెడ్డి పరిస్థితిని అడిగి తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపారు. -
ఆత్మీయ స్పర్శే అండ!
రోజుకో పల్లెలో రైతుమిత్ర సమావేశాలతో రైతుకు భరోసా, ఆత్మగౌరవం విప్లవాత్మక వ్యవసాయ విస్తరణ నమూనాకు పన్నెండేళ్ల క్రితమే శ్రీకారం చుట్టిన అశోక్కుమార్ రైతు ఆత్మహత్యల నివారణకు ఇదే రాచబాట అంటున్న అప్పటి జగిత్యాల ఏవో చుట్టూ అందరూ ఉన్నా నికరంగా తనకంటూ ఎవరూ లేని వాడు రైతన్న. అందరూ అన్నదాత అని.. దేశానికి వెన్నెముక అని.. రైతే రాజు అని గొప్ప గొప్ప మాటల రొద మధ్యలో.. కుప్పలు తెప్పలుగా అప్పుల దిగుబడినిస్తున్న కన్నీటి సేద్య క్షేత్రంలో దిక్కుతోచని అభిమన్యుడవుతున్నాడు సగటు రైతన్న. అసలు.. రైతుకు సంబంధించి ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వ పథకాలను రైతుల దగ్గరకు చేర్చే యజ్ఞ క్రతువును నిర్వహించాల్సిందెవరు? ఉన్న ఊళ్లోనే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లున్న రైతులను సంఘటిత శక్తిగా మార్చే జీవ చైతన్యాన్నివ్వగలిగేదెవరు? ఎదురీతలో అలసిసొలసిన రైతు మదిలో జీవితేచ్ఛ కొండెక్కకుండా కాపాడే ఆత్మీయ భరోసానివ్వగలిగేదెవరు? ఎవరు?? ఎవరు..??? అనుదినం అన్నదాతల బలవన్మరణాలను మౌనంగా వీక్షిస్తున్న పౌరసమాజానికి ఇవి శేష ప్రశ్నలే. కానీ, దన్నపనేని అశోక్కుమార్కు మాత్రం కాదు..! విప్లవాత్మక వ్యవసాయ విస్తరణ నమూనా అమలు ద్వారా బడుగు రైతుకు క్షేత్రస్థాయిలో బతుకు భరోసా ఇవ్వడం ఎలాగో పుష్కరం కిందటే ఆయన రుజువు చేశారు! ఎందుకంటే.. ఈ ప్రశ్నలకు ఆయన పుష్కరకాలం కిందటే విజయవంతంగా ఆచరణాత్మక సమాధానాలు వెతికినవాడు! పల్లెను, రైతును గుండెల నిండుగా ప్రేమతో బాధ్యతనెరిగిన మండల వ్యవసాయాధికారిగా వినూత్న పథకాలను అమల్లోకితేవడం ద్వారా తెలుగునాట వ్యవసాయాభివృద్ధి చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ముంచుకొచ్చిన కరువు రైతుల బతుకులను నిలువునా మింగేస్తుంటే.. రైతు గురించి ఎన్నో వట్టిమాటలు చెబుతున్న మనం వ్యవసాయ సంక్షోభం పరిష్కారానికి వాస్తవానికి చేస్తున్నదేమిటి? అని మండల వ్యవసాయాధికారులను, నాయకులను నిలదీసి ప్రశ్నిస్తున్నారాయన. కరీంనగర్ జిల్లా సారంగపూర్ మండలం నాగనూర్ లచ్చక్కపేటలో 60 ఏళ్ల క్రితం జన్మించిన అశోక్కుమార్ వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. 1976లో అచ్చంపేట(మహబూబ్నగర్) సమితి వ్యవసాయాధికారిగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2000-2002 మధ్యకాలంలో కరీంనగర్ జిల్లా జగిత్యాల మండల వ్యవసాయాధికారిగా పనిచేస్తూ రైతు జనాభ్యుదయం కోసం విశిష్టమైన నిర్మాణాత్మక కృషి చేశారు(ఆయన బదిలీ తర్వాత పరిస్థితి మళ్లీ మామూలే అయింది). వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ డెరైక్టర్గా రెండేళ్ల క్రితం రిటైరైన అశోక్కుమార్.. విజిలెన్స్ ప్రత్యేకాధికారిగా, ప్రస్తుతం మెదక్ జిల్లా (తెలంగాణ సీఎం కేసీఆర్ నియోజకవర్గం)గజ్వేల్ ప్రాంతీయాభివృద్ధి ప్రాధికార సంస్థలో వ్యవసాయ విభాగాధిపతిగా సేవలందిస్తున్నారు. శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలోని 30 జగిత్యాల మండల గ్రామాల్లో చేపట్టిన పనులివి.. ఆయన మాటల్లోనే.. రోజుకో ఊళ్లో రైతుల సమావేశమే ముఖ్యం: జగిత్యాల మండల వ్యవసాయాధికారిగా పల్లెలకు వెళ్లి రైతులతో మమేకమై ప్రణాళికాబద్ధంగా పనిచేయడం వల్ల వారి జీవితాలు బాగుపడ్డాయి. మండల కేంద్రంలో రైతు సంక్షేమ మండలి, దానికి అనుబంధంగా ప్రతి గ్రామంలో రైతుమిత్ర సంఘం ఏర్పాటు చేశారు. ప్రతి నెలా నిర్దిష్ట తేదీన ఉదయం 8 గంటలకు ఆరోజు ఆదివారమైనా, పండగైనా సరే రైతులతో సమావేశమయ్యేవాణ్ణి. అందరితోనూ కరచాలనం చేయడం, ఎవరు ఆలశ్యంగా వచ్చినా జరిమానా, అందరూ నేలమీదే కూర్చోవడం.. ఇవీ నిబంధనలు. తక్కువ ఖర్చుతో కూడిన వ్యవసాయంతోపాటు ఐకమత్యం, క్రమశిక్షణ, మంచి అవగాహన-ఆలోచన- ఆచరణ భావనలకు అక్కడేపునాది పడింది. రెండు, మూడు నెలలు టంచనుగా సమావేశాలు జరిగేటప్పటికి.. రైతులందరికీ ఇది ఆధారపడదగిన వేదిక అని అర్థమైంది. రైతుమిత్ర సంఘం పిలుపు ఇచ్చింది అంటే తూ.చ. తప్పకుండా అమలవ్వాల్సిందే అన్నంతగా క్రమశిక్షణ వచ్చింది. సొంత విత్తనం తయారు చేసుకోవడం, కాంప్లెక్స్ ఎరువులు కొనుక్కోవడం కన్నా సొంతంగా తయారు చేసుకోవడం, తగుమాత్రంగా ఎరువులు, పురుగుమందులు వాడటం, పచ్చిరొట్ట ఎరువులతో భూసారం పెంచడంతో సాగు వ్యయం తగ్గింది. పొలం గట్ల మీద, ఇళ్ల దగ్గర టేకు మొక్కలు నాటించడంతో రైతుకు పచ్చని భవిష్య నిధి ఏర్పడింది. రైతు గుర్తింపుకార్డులు: ఒకసారి రైతు మిత్ర సమావేశంలో నేను నా గుర్తింపు కార్డు చూపించాను. రైతులు మాకూ గుర్తింపుకార్డు కావాలన్నారు. అప్పుడు సంఘం తరఫున బ్యాడ్జిలు చేయించి ఇచ్చాం. బ్యాంకుల్లో, ఇతర ఆఫీసుల్లో రైతులపై గౌరవం పెరిగింది. పనులు చకచకా అయ్యేవి. రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. రైతు నుంచి వినియోగదారునికి: ధాన్యం, పప్పుధాన్యాలను నేరుగా అమ్మడం కన్నా బియ్యం, పప్పులుగా ఆడించి అమ్మితే ఎక్కువ ఆదాయం వస్తుందని రైతులకు నచ్చజెప్పాం. జగిత్యాల రైతు బజారులో స్టాల్ పెట్టి ఒక ఏడాది వెయ్యి క్వింటాళ్ల బీపీటీ బియ్యం, పప్పులను రైతులే స్వయంగా అమ్మారు. ఎకరానికి రూ. 8 వేల వరకు అదనపు ఆదాయం వచ్చింది. వినియోగదారులకు కూడా చౌకగా నాణ్యమైన బియ్యం అందుబాటులోకి వచ్చాయి. అప్పటి వ్యవసాయ శాఖ కమిషనర్ అజేయ కల్లం ప్రశంసలు అందిన తర్వాత కొండంత బలం వచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూడలేదు. మండల వ్యవసాయాధికారి అంటే రైతులకు పెద్ద అధికారి కిందే లెక్క. ఆయన పెద్ద దిక్కువంటి వాడు. వ్యవసాయాధికారికే కాదు స్థానిక నాయకులకూ బాధ్యతలు అప్పగించి, విజయవంతంగా రైతును ఒంటరితనం నుంచి, వ్యాపారుల దోపిడీ నుంచి, అవినీతి నుంచి విముక్తం చేసి.. పల్లెల్లో ఆశావహమైన జీవన వాతావరణాన్ని నిర్మించాం. వీటన్నిటికీ ఆత్మీయతను పంచే రైతు మిత్ర సమావేశాలే పునాది అయ్యాయి! నా జన్మధన్యమైంది! జనగామ రైతులతో గొప్ప అనుబంధం ఏర్పడింది. ఒక తరం నన్ను మర్చిపోదు. పన్నెండేళ్లు గడచినా అక్కడి రైతులు ఇప్పటికీ ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అది మామూలు ప్రేమ కాదు. నా జన్మ ధన్యమైంది. జీవితానికి అదే తృప్తి. రైతుల ఆశీర్వాదం వల్లనే ఇంత సంతోషంగా ఉన్నా. జనగామ అనుభవంతోనే రైతుబాట, పల్లెనిద్ర వంటి పథకాలను రూపొందించాం. మండల వ్యవసాయాధికారులు ఆ విధంగా పనిచేస్తే రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉండదు. లేదంటే పదేళ్లలో వ్యవసాయం చేసేవాళ్లు మిగలరు. ఆత్మహత్యలు, కరువు వున్నా డబ్బు తీసుకోకుండా ఒక్క ఆఫీసులో పనులు జరుగుతున్నాయా? లంచగొండి సిబ్బందిని, వారిని కంట్రోల్ చేయని వారిని ‘నిర్భయ’ మాదిరి చట్టంతో శిక్షించాలి. - డి. అశోక్కుమార్ (88866 14808), గజ్వేల్ ప్రాంతీయాభివృద్ధి ప్రాధికార సంస్థ, మెదక్ జిల్లా -
మావోయిస్టులకు మనుగడ లేనట్టే
మన్యంలో మావోయిస్టులు ఇక మనుగడ సాగించలేరని జిల్లా ఎస్పీ కె.ప్రవీణ్, చింతపల్లి డీఎస్పీ ఈ.జి.అశోక్కుమార్ అన్నారు. సోమవారం చింతపల్లి వచ్చిన ఎస్పీ దళసభ్యులను హతమార్చిన గిరిజనులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీలో మావోయిస్టుల చర్యల వల్ల గిరిజనులు పలు విధాలుగా నష్టపోయారన్నారు. కొన్నేళ్లుగా మావోయిస్టులపై తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అవకాశం కోసం ఎదురుచూశారన్నారు. సాగులలో గిరిజనులు తిరగబడినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. ఫలితంగానే ఈరోజు బలపంలో మావోయిస్టులను గిరిజనులే స్వచ్ఛందంగా హతమార్చారన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతమయ్యే అవకాశముందని పేర్కొన్నారు. బూజుపట్టిన సిద్ధాంతాలను కోసం పనికిమాలిన పోరాటాలు చేయకుండా ఇప్పటికైనా మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని లేకుంటే ప్రజలే సరైన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ ప్రసాద్, ఎస్ఐ తారకేశ్వరరావు పాల్గొన్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ మావోయిస్టుల చర్యలకు నిరసనగా సోమవారం చింతపల్లిలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. బలపంలో మావోయిస్టులు హతమార్చిన సంజీవరావు మృతదేహంతో ఈ ర్యాలీని నిర్వహించారు. ఆధ్యాత్మిక భావంతో మాలలు వేసుకొని పూజ లు చేస్తున్న గిరిజనులను అన్యాయంగా హతమారుస్తున్నారంటూ గిరిజనులు వాపోయారు. మావోయిస్టుల ఆగడాలను ఇక ముందు సాగనీయబోమని ప్రతీనబూనారు. మృతుల బంధువులతో పోలీస్స్టేషన్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. వారిని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున జనం తరలివచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement